మా ఊళ్ళో సాయిబులు పెద్దమ్మ, పెద్దనాన్నల సంతానంతో పెళ్ళి సంబంధాలు నెరపడం చూసి మా అమ్మమ్మ బుగ్గలు నొక్కుకొనేది. అయితే, ఉత్తరభారతీయులు మనం మేనమామ, మేనత్త కొడుకు, కూతుళ్ళతో మేనరికపు పెళ్ళిళ్ళు జరపడం చూసి అంతే ఆశ్చర్యపోతారు.

సినిమా పత్రికలంటే కేవలం సినిమా తారల ముచ్చట్లకే అని కాకుండా అప్పుడు కినిమాలో ‘మీ విజ్ఞానం’ అనే పేరుతో పాఠకులు అడిగిన సినిమా రంగపు టెక్నిక్స్ గురించిన ప్రశ్నలకి సమాధానాలిచ్చే శీర్షిక ఎంతో ప్రాచుర్యం పొందింది.

జేబున్నీసా ఔరంగజేబుకు ప్రియమైన కూతురు. రాజకీయ విషయాలలో ఆమెను సంప్రదించేవాడు. ఆమె తన పెద తండ్రి దారా షికోయొక్క ప్రభావము, ప్రోత్సాహము వలన కవిత్వము వ్రాయడానికి ఆరంభించినది. ఆమెకు అరబీ, పారసీక భాషలలో ప్రావీణ్యత ఎక్కువ. తన తండ్రి ఔరంగజేబ్‌వలె ఆమె భావాలు సంకుచితము కావు.

పహాడీ హిందూస్తానీ రాగమే కాని, కర్నాటక విద్వాంసులు కూడా లలితగీతాల్లో ఈ పహాడీ రాగం వినిపిస్తూ ఉంటారు. బాలమురళి పాడిన అష్టపది రమతే యమునా, వోలేటి పాడిన గడచేనటే సఖీ వగైరాలు ఇందుకు ఉదాహరణలు.

ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.

బాలమురళి సంగీతంలో తాను కూర్చిన వివిధ గాన ప్రక్రియలని సూర్యకాంతి అనే పుస్తకంగా ప్రచురించారు. ఇందులో కేవలం సాహిత్యమే కాకుండా ప్రతీ రచనకీ స్వరాలు కూడా ఇచ్చారు.

కొన్ని మాండలికాలలో ఎనమండుగురు, తొమ్మండుగురు అన్న వాడకం ఉన్నా, ఆధునిక తెలుగు భాషలో ‘ఎనిమిది’ కీ ఆపై సంఖ్యలకీ మనుష్యార్థంలో ‘మంది’ చేర్చడమే ప్రమాణం. ప్రాచీన భాషలో ‘పదుగురు’ అన్న ప్రయోగం ఉండేది.

ముగ్గులను రెండు రకాలుగా వేయవచ్చును – ఒకటి చుక్కలు పెట్టి ముగ్గులు వేయడము, మరొకటి చుక్కలు లేకుండా రంగులు నింపి వర్ణచిత్రాలుగా వేయడము.

స్పష్టమైన తర్కం, పద్ధతీ ఏర్పడి ఉన్న లౌక్యపు వ్యవహారాలకు నాయకత్వం వహించటమే ఇంత కష్టమైతే, శిధిలావస్థలో ఉన్న కాల్పనిక సృజన ఆవిష్కరణను నిర్వహించటం, అంటే సాంస్కృతిక నాయకత్వం వహించటం ఇంకెంత కష్టతరమైన పని అయిఉంటుంది?

నవంబర్ 1952 కినిమా సంచికలో అప్పటి సినీరంగంలో పైకొస్తున్న హాస్యనటులు రేలంగి, జోగారావు, బాలకృష్ణ, పద్మనాభం తమ తొలి అనుభవాలను వివరించారు.

సినీ పరిశ్రమలో పోస్టర్లు, పాటల పుస్తకాలు, కరపత్రాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసినదే. ప్రతి వారికీ వీటి గురించి గొప్ప జ్ఞాపకాలే వుంటాయని అనుకుంటున్నాను.

“ఒక్కా ఓ చెలియా, రెండూ రోకళ్ళు, మూడు ముచ్చిలక” అంటూ మనలో కొంతమంది అంకెలు గుర్తు పెట్టుకోవడానికి చిన్నప్పుడు నేర్చుకొన్న పాట! ఇంతకీ మూడుకు ముచ్చిలకకు ఉన్న సంబంధం ఏమిటి?

భానుమతి నిశ్చయం వాస్తవరూపం దాల్చే దారి ఏదీలేదు. తాను పెళ్ళాడ గోరుతున్నట్టు భానుమతి రామకృష్ణకు ఎట్లా చెబుతుంది? “నాకు నిన్ను చేసుకోవాలని లేదు” అని అతడంటే?…

సృజన అనుభవంలో, అభిరుచిలో కేవలం ఇతరుల మెప్పు మీదే ఆధారపడని ఏ తోవ తమదో స్థిరంగా అనుభవం లోకి రాక, కవిలోనూ పాఠకునిలోనూ కూడా అపరిపక్వమైన అభిరుచే మంకుతనం, మేకపోతు గాంభీర్యంగా, లేదంటే పరస్పరం పెట్టుడు సామరస్యం, సుహృద్భావంగా వ్యక్తమౌతాయి.

తరవాతి కాలంలో భీమ్‌సేన్‌జోషీ పాటకచేరీ చేసే పద్ధతి చాలా బావుండేది. ఏనాడైనా ఆయనకు అభిమానుల్లో అన్ని వయసులవాళ్ళూ కనబడేవారు.

తిక్కన సుకవిత్వ లక్షణాల్లో ఒకటిగా ‘పలుకులపొందు’ ను పేర్కొన్నాడు. కవి భావవ్యక్తీరణకు ఏవి అనువైన మాటలు, పదబంధాల్లో ఏమాటలు కలిస్తే ఇది సాధ్యమౌతుంది అనేది ప్రతిభావంతుడైన సత్కవికి మాత్రమే తెలుస్తుంది.

వేటూరి పాటకి ప్రాణం శబ్దం. తొలిపాట నుంచి చివరి వరకు దీన్ని అతను విడవలేదు. అర్థాన్ని గురించి పెద్ద పట్టింపులు లేవు గాని శబ్దాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. ఆశుపరిధిలో కూడ శబ్దవిన్యాసాలు చక్కగా కనిపిస్తాయి. వేటూరే ఒక సభలో చెప్పిన ఒక ఉదంతం దీనికి మంచి తార్కాణం.