కన్నీటి చుక్కల్లో కథలు ఎవరికీ వినబడవు
గాలికెగిరిపోతున్న కొత్త కొత్త ఆశలు
విరిగిన స్వప్నాలను దాచుకున్న చిరునవ్వు
మనసులోని మాట కోసం కొట్టుకులాడతాయి

నిన్న బడికి రానోళ్ళంతా
ఒక లైను కట్టుండ్రి అంటే
‘మా అమ్మను మా నాయిన కొట్టిండని’
రెక్కలు ముడుచుకున్న పిచ్చుకపిల్లలెక్క
కండ్లు నలుచుకుంట చేతులు చాపుతది

రత్నాన్ని గమనించండి. రత్నం ఒకటి, దాని మెరుపు మరొకటి అని చెప్పలేము. మెరుపులేని రత్నం సాధారణ రాయిలాగే కనిపిస్తుంది. రత్నత్వాన్ని వ్యక్తపరచేది దాని కాంతి. కాంతిని రత్నం నుండి విడదీయలేము; రత్నాన్ని కాంతి లేకుండా నిర్వచించలేము. రెండుగా చెప్పబడుతున్నా, అవి వాస్తవానికి విడదీయరాని ఏకస్వరూపమే.

ప్రాణంలేని యంత్రాలతో నింపిన కాంక్రీటు కీకారణ్యం
కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం
స్మార్ట్ ఫోన్ తెరపై వెచ్చదనం వెతుక్కునే
అస్థిపంజరం!

గతంలో నాలో ఏముండేదో..
ఇప్పుడది లేని శూన్య స్థానాన్ని
శబ్ద రాహిత్యం అల్లుకుంది
ప్రేమ రాహిత్యం పట్టుకుంది
రిక్త చైతన్యం చుట్టుకుంది

తమిళ మూలంతో పాటుగా అవినేని భాస్కర్ అందించిన సంయుక్త మాయ కవితల తెలుగు అనువాదాలు. కాశీ నగరపు వీధులు, గంగానది అలలపై సాగే జీవితపు లోతులను ఈ కవితలు అన్వేషిస్తాయి.

ఇప్పటికీ ఒక నరం ఇంకా ప్లెక్ట్రమ్ కోసం
ఎదురు చూస్తూ ఆవిరినాపుకుంటూ
ఇప్పుడే ఒక తార తెగి ఆకసానికెగిసి టాటా కొడుతూ
కమాను రజను తగిలి ఖస్సుమన్న వయొలిన్

తృణ సస్య తరులందు యినుము కనకములందు
మణి సికత శిలలలో శుని హరిణములలో
గుణ శక్తి వైవిధ్య మనువంశికత నేర్పు
మనకు నన్యోనతను – మంకుతిమ్మ

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు

ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని

సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.