ప్రాణంలేని యంత్రాలతో నింపిన కాంక్రీటు కీకారణ్యం
కలిసున్నా కనిపించని కంచెలతో కట్టిన ఏకాంత ద్వీపం
స్మార్ట్ ఫోన్ తెరపై వెచ్చదనం వెతుక్కునే
అస్థిపంజరం!

గతంలో నాలో ఏముండేదో..
ఇప్పుడది లేని శూన్య స్థానాన్ని
శబ్ద రాహిత్యం అల్లుకుంది
ప్రేమ రాహిత్యం పట్టుకుంది
రిక్త చైతన్యం చుట్టుకుంది

తమిళ మూలంతో పాటుగా అవినేని భాస్కర్ అందించిన సంయుక్త మాయ కవితల తెలుగు అనువాదాలు. కాశీ నగరపు వీధులు, గంగానది అలలపై సాగే జీవితపు లోతులను ఈ కవితలు అన్వేషిస్తాయి.

ఇప్పటికీ ఒక నరం ఇంకా ప్లెక్ట్రమ్ కోసం
ఎదురు చూస్తూ ఆవిరినాపుకుంటూ
ఇప్పుడే ఒక తార తెగి ఆకసానికెగిసి టాటా కొడుతూ
కమాను రజను తగిలి ఖస్సుమన్న వయొలిన్

తృణ సస్య తరులందు యినుము కనకములందు
మణి సికత శిలలలో శుని హరిణములలో
గుణ శక్తి వైవిధ్య మనువంశికత నేర్పు
మనకు నన్యోనతను – మంకుతిమ్మ

యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు

ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని

సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.

గాయపడిన కాకి చుట్టూ
జాతిప్రేమ గొంతు చించుకుంటుంది
తేనెటీగల సమష్టి ప్రేమబంధం
నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది

అప్పటికే నిద్ర లేచిన మా పెద్దది మాత్రం
చిరిగిన యూనిఫామ్ లోనుండి వెక్కిరిస్తున్న పేదరికాన్ని
కిక్కురు మనకుండా పిన్నీసుతో కుట్టేసుకుని
కళ్ళల్లో కాంతిపుంజాల్ని వెలిగించుకుంటుంది!

నీటిలో లీనమై కరగిన పంచదార విశదముగా పానకమునంతా వ్యాపించి రుచికర పేయమౌను. ఆ రుచి నోటికే తప్ప చేతికందదు, కనులకు అగుపడదు. లోకంలో ఆత్మవస్తువును తెలుసుకున్న మనిషి మితమైన దేహప్రకృతిని వదలి, అందరిలో, అన్నిటిలో చక్కెర పానకం కలిసిపోయినట్లు కనబడక, చేతికి చిక్కక, తన తీపిని మాత్రమే నోటికి అందించే విధంగా లోకానికి మిత్రుడవ్వాలి.