యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు

ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని

సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.

గాయపడిన కాకి చుట్టూ
జాతిప్రేమ గొంతు చించుకుంటుంది
తేనెటీగల సమష్టి ప్రేమబంధం
నెనరింకిన నాలుకలమీద తీపి సంతకం చేస్తుంది

అప్పటికే నిద్ర లేచిన మా పెద్దది మాత్రం
చిరిగిన యూనిఫామ్ లోనుండి వెక్కిరిస్తున్న పేదరికాన్ని
కిక్కురు మనకుండా పిన్నీసుతో కుట్టేసుకుని
కళ్ళల్లో కాంతిపుంజాల్ని వెలిగించుకుంటుంది!

నీటిలో లీనమై కరగిన పంచదార విశదముగా పానకమునంతా వ్యాపించి రుచికర పేయమౌను. ఆ రుచి నోటికే తప్ప చేతికందదు, కనులకు అగుపడదు. లోకంలో ఆత్మవస్తువును తెలుసుకున్న మనిషి మితమైన దేహప్రకృతిని వదలి, అందరిలో, అన్నిటిలో చక్కెర పానకం కలిసిపోయినట్లు కనబడక, చేతికి చిక్కక, తన తీపిని మాత్రమే నోటికి అందించే విధంగా లోకానికి మిత్రుడవ్వాలి.

ప్రపంచం అనేది స్వతంత్రంగా ఉన్న సత్యం కాదు. అది చైతన్యంపై పడిన ప్రతిబింబం మాత్రమే. ‘దాని నీడయే ఈ జగత్తు’ అనగా అదే. నీడకు స్వంతంగా ఉనికి లేదు. నీడ ఉండాలంటే ఒక వస్తువు, కాంతి ఉండాలి. ఈ చైతన్యసత్త్వము అన్నియెడల ఉండి మనకు కనబడక ఎందుకు గూఢంగా ఉన్నది?

నక్షత్రాలు కనపడినంత కాలం
చూస్తూ ఉండు
ఒకరోజు నీకూ నక్షత్రాలకీ మధ్య
దట్టమైన ధూళిమేఘం
చిరస్థావరం కట్టుకోవచ్చు