అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రిక యుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేక పోయేది.
శీర్షికలు సమీక్షలు
అరవై వరకూ వ్యాసాలున్న ఈ సంపుటి మురళీధరరావుగారి సారస్వతప్రేమ, పరిశోధన, పాండిత్యం అనే మూడు నదులు సంగమించిన ప్రయాగ. ఆయన 15 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ, సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లముల సాహిత్యాలతో పాటు పలు ప్రపంచభాషా సాహిత్యాల చరిత్రలను కూలంకషంగా, తపస్సువంటి అధ్యయనం చేశారు.
మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. వాక్యం చలువరాయి అయితే, కవిత ఒక చల్లని ఇల్లు. పాఠకులు ఎంతసేపైనా సేదదీరగల అద్భుతమైన సృజనాత్మకత ఈమె సొంతం.
తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది.
భార్గవి చెప్పిన తన చదువు కథలో కేవలం ఒక చదువరిగా మొదలైన ఆమె ప్రయాణం మాత్రమే కాక ఉత్తమ సాహిత్య ప్రేమికురాలిగా, విశ్లేషకురాలిగా ఎదిగిన క్రమాన్ని గమనించవచ్చు.
. కన్నడంలో ‘మంకుతిమ్మన కగ్గ’ వెలువబడి ఎనిమిది దశాబ్దాలే దొర్లినవి. అయినా ఇలాంటి మహాగ్రంథం కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న తెలుగునాట సాహితీప్రియులకి అందలేదంటే అది ఉభయభాషల బాంధవ్యానికే తీరని తలవంపు.
తెలుగువారికి, మధుమేహం గురించి తెలుసుకోవడానికి ఈ పుస్తం ఒక వరం. మూర్తిగారు అన్నీ కూలంకషంగా చర్చించారు, అసలు మధుమేహం అంటే ఏమిటి అని మొదలుపెట్టి, క్లోమగ్రంథి ఎలా పనిచేస్తుంది, మధుమేహంలో రకాలు, అది మనకి వచ్చాక కలిగే లక్షణాలు, వచ్చినట్టు నిర్ధారించి కనుక్కోవడానికి చేసే పరీక్షలు, ఇన్సులిన్ నిరోధకత, మధుమేహం వచ్చేముందు పూర్వదశ ఎలా ఉంటుంది, మధుమేహం దారిలో పెట్టడానికి లేదా కంట్రోల్ చేయడానికి ఏయే మందులు ఉన్నాయి, అవి ఎవరికి ఎలా పనిచేస్తాయి, ఎవరు వాడకూడదు అనేవన్నీ 35 ఛాప్టర్లుగా విడగొట్టి చెప్పారు.
కథలన్నీ జీవితాలనుంచి నడుచుకుంటూ వచ్చాయి కాబట్టి నిజాయితీగా ఉంటాయి. లోతైన పరిశీలనా దృష్టి ఉండటంతో దాదాపు అన్ని కథలలోనూ తాత్వికత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
బంగారానికి తావి అబ్బినట్టు, ఒక వృక్షశాస్త్రం చదువుకున్న వ్యక్తికి, ఆ శాస్త్రంపట్ల ఇచ్ఛుకత ఉన్న వ్యక్తికి, అదృష్టవశాత్తు వృత్తిపరంగా కూడా తాను చదువుకున్న జ్ఞానాన్ని ఉపయుక్తం చేసుకోగలిగే వెసులుబాటు కలిగి ఉండటం ఒక గొప్ప వరం.
‘‘భగవంతుడా! నువ్వు స్త్రీగా మారితే నా బాధ అర్థం అవుతుంది’’ అనుకుంటుంది.
నేను కవినీ కాదు, విమర్శకుడినీ కాదు; కేవలం ఓ సామాన్య పాఠకుడిని. ముకుంద రామారావు గారి “అదే ఆకాశం: అనేక దేశాల అనువాద కవితలు,” గ్రంథాన్ని సమీక్షించడానికి ఎందుకు సాహసించానంటే, ఈ పుస్తకంలో అనేక దేశాల కవితలు అందమైన తెలుగులో ఉన్నాయి; రోర్టీ అన్నట్లు వాటిని నెమరేసుకుంటే దగ్గరి స్నేహితులతో గడిపినట్లే.
“సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలుగా అయ్యాయంటే, రెండు సమస్యలు. ఒకటి కాదన లేవు. రెండు నిరూపించ లేవు.” ఈ నవలాకథనానికి మూలసూత్రం అదే.
పరహితం, లోకహితమే కాకుండా సన్నిహిత మిత్రులకి సదా శ్రేయోభిలాషిగా ఉండే విద్యార్థి గారు 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు!
స్త్రీవాద దృక్పథం కలిగిన కవిత్వానికి, స్త్రీల అనుభవాల్ని మాత్రమే చిత్రించే కవిత్వానికి, అలాగే స్త్రీవాదమని కొందరు పురుషపుంగవులు చేస్తున్నటువంటి male voyeuristic attitudes కు తేడా తెలియకుండా ఉన్న ఈ రోజుల్లో, సుధామురళి లాంటి కొందరు స్త్రీలు కంకణం కట్టుకొని, “ఇది మా శరీరం, ఇదీ మా భావన, ఇదీ మా యాతన”ని వారి శారీరక స్పృహను సామాజిక స్పృహకు సకారాత్మకంగా సమాజంలో ఉపయోగించేలా తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతో అభిలషనీయం.
పద్యం ఇట్లాగే మొదలవ్వాలన్న నిబంధనను ఇష్టపూర్వకంగా అతిక్రమించటంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. లోలోపల సుడులు తిరిగే ఒక భావధార ఎట్లా ఉబికివస్తే అట్లా ఆ వాక్యపు చిటికెన వేలు పుచ్చుకొని పిల్లాడిలా హాయిగా నడక ప్రారంభిస్తాడు. మనం కూడా ఆ హాయితనంలో బుడుంగున మునిగిపోయి, కవిత పొడవునా పరుగులు తీస్తాం.
రవిశంకర్ మన మధ్యే తిరుగుతున్న మన కవి. ఈయనకు ఏటిపుట్టేడాదీ మనకు దైనందినంగా తోచే సాధారణమైన అనుభవాలు – నిద్ర లేవడం, ఇంట్లో భార్యాబిడ్డలను చూసుకోవడం, బయట ప్రకృతిని గమనించడం వంటివి – పునరాలోచించాల్సిన అనుభవాలై మమత్వం వాటిని పెనవేసి అనుభూతులై మిగిలాయి. ఇలా నిజాయితీగా రాసి తన కవిత్వం మీద తాను నిలబడగలిగిన కవి విన్నకోట రవిశంకర్.
పట్నం వాసనలు తెలియని మారుమూల పల్లెటూరు. మంచు కురుస్తున్నపుడు శరద్వెన్నెల జల్లుల్లో ఎక్కడో దూరాన విరిసిన చుక్కల ఆకాశం రాల్చిన మరీపల్చని కాంతుల్లో, మెత్తని ఇసుక నేల మీద పక్క పరుచుకుని రాత్రికాబోతుందనగానే మాటుమణిగే ఊరు. అటువంటి ఏగ్రామంలోనో ఉన్నామని భావించి ఈ ‘ఊరు’ కథలు చదవాలి.
పురుగులూ పిట్టలూ ఆకులూ బస్సులూ మనుషులూ అన్నిటినీ- అలవాటైపోయిన కళ్ళు రసహీనంగా చూపించే ఈ రోజువారీ ప్రపంచాన్ని- మళ్ళీ కొత్తగా పరికించి చూడటం. ఆ సౌందర్య స్పృహతో, అది అందించిన సంతోషంతో తబ్బిబ్బవడం. ఈ “బంగారు తండ్రి” అట్లాంటి పొంగుని మళ్ళీ మన లోగిళ్ళలోకి తెచ్చే ముచ్చటైన పొత్తం.
చుట్టూ ఉన్న అశాంతినీ, విధ్వంసాన్నీ, బాధనూ చూపిస్తూనే వాటినుండి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలు కంటాడు. వాక్య నిర్మాణం, నేపథ్య చిత్రన చాలా అందంగా కవిత్వంలా ఉంది. దాదాపు అన్ని కథల్లో చిన్న కథలు, ఫ్లాష్ బ్యాక్ కథలున్నాయి. అసలు కథకంటే అవి ఓ మెట్టు పైనే ఉన్నాయి. కొన్ని కథలు చదివినప్పుడు పక్కనే కూచుని ఎవరో కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఆ కథ చెప్పే ఒడుపు, దానికి అమరిన శైలి, జారిపోనీయకుండా పొదివిపట్టుకున్న ఆశావహమైన కలల వెలుగు, ఈ పుస్తకపు బలాలు.
సుమారు అన్ని కథల్లో జానపద గాథల సరళి, చిన్నపిల్లల ఊహల వైఖరి దర్శనమిస్తాయి. పిల్లలనూ పెద్దలనూ సమానంగా అలరించే కథలు ఇవి. అనువాదం అంత పరిపూర్ణంగా లేకపోయినా కథల బలం కారణంగా అంతగా అది ఇబ్బందిని కలిగించదు. బాలసాహిత్యాన్ని రాస్తున్న తెలుగు రచయితలు ఈ పుస్తకాన్ని చదవితే వారికి లాభం కలుగుతుందని ఈ సమీక్షకుని అభిప్రాయం. దీన్ని రాసిన పరేశ్ పట్నాయక్ అభినందనీయుడు.