గాలిలో 60 సెకన్ల పాటు ప్రయాణించే ఒకే ఒక్క ఫిరంగి గుండు మార్గాన్ని పూర్తిగా లెక్కించడానికి ఒక హ్యూమన్ కంప్యూటర్ దాదాపు 20 గంటల సమయం తీసుకునేది. అదే లెక్కింపును ఎనియాక్ (ENIAC) కేవలం 30 సెకన్లలో పూర్తి చేసింది.
శీర్షికలు వ్యాసాలు
తెలుగు సాహిత్యంలో వ్యవసాయ కార్మికులు, రైతు, రైతుకూలీల పై విస్తృతంగా సాహిత్యం వెలువడింది. కానీ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మిక జీవితాలపై వచ్చిన సాహిత్యానికి చాలా తక్కువ పేజీలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ పారిశ్రామిక కార్మికుల జీవితాలపై తెలుగులో వచ్చిన సాహిత్యం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వంగపండు మాత్రం తన తొలి రోజుల నుంచే, అనగా 80వ దశాబ్దానికి పూర్వమే, తన రచనల ద్వారా కార్మిక సాహిత్యానికి ఒక స్థానం కల్పించాడు.
ఆధునికతనుండి అత్యాధునిక యుగానికి దారిలో అడ్డంగా నిలబడిన మేరువు హైడెగర్. అతన్ని దాటడం కష్టం. దాటకుండా యీ యుగంలోకి నడవడం కష్టం. అతడి ప్రభావం ఒక రంగంలో కాదు. తత్త్వశాస్త్రం అటుంచి, మనస్తత్త్వశాస్త్రం, మానసికవైద్యం, సాహిత్యవిమర్శ, సాంకేతికత, పర్యావరణము-బహుశా అతడి ప్రభావంలేని ఆధునికరంగం లేదేమో!
పురాణ కథలు ఎందుకు చదవాలి? అవి మనకు ఏమిటి బోధిస్తాయి? అవి చదవడంవల్ల మనం మన ప్రస్తుత జీవితాలను ఎలా మలుచుకోగలం? పురాణకథలలో ఉన్న నీతులు, బోధలు అర్థం చేసుకుని మనం ఈ కాలంలో ఏ విధంగా లబ్ధి పొందగలం? కాలం మారింది. విలువలు మారేయి కదా. ఎప్పుడో శతాబ్దాల క్రితం హోమర్ రాసిన ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు ఇప్పుడు చదవడంవల్ల లాభం ఏమిటి?
మన తత్వశాస్త్రాన్ని మార్చగలిగే, భౌతికశాస్త్రాన్ని తలకిందులు చేయగలిగే విస్తృతమైన ఆలోచనలు కూడా, చాలా చిన్నదిగా కనిపించే ఒక ప్రయోగ ఫలితం నుంచే పుట్టొచ్చు.
కాఫ్కా రచనల్లో ప్రధానంగా గమనించవలసింది అతని రచనా విధానంలోని మర్మం. జీవిత వాస్తవం బుద్ధికి అందడం లేదు. ఈ అందని అసంబద్ధతను చెప్పడానికి అతడు అవ్యక్తాన్ని ఆశ్రయిస్తాడు. అవ్యక్తం (subconscious) స్వప్నంలో వ్యక్తమయ్యేది. అసంబద్ధ వాస్తవాన్ని వ్యక్తంచేయడానికి ఈ అవ్యక్తాన్ని, స్వాప్నిక వాస్తవాన్ని ఆలంబనం చేసుకుంటాడు. ఈ “తీర్పు” కథలో ముగింపు అటువంటి స్వాప్నిక వాస్తవం.
‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.
సౌతాఫ్రికాని హరివిల్లు దేశం (Rainbow Nation) అని అభివర్ణించారట. అయితే హరివిల్లులో రంగులకంటే సౌతాఫ్రికాలో జాతులూ తెగలూ ఎక్కువన్నది మాత్రం స్పష్టం! ఉత్తర అమెరికాలో పలు స్వదేశీ తెగలు ఉన్నట్టే ఇక్కడ కనీసం అర డజను పెద్ద తెగలు ఉన్నాయి. వీరిలో ఎవరి భాష వారిదే! సౌతాఫ్రికాలో 12 ఆధికారిక భాషలు ఉన్నాయట.
ఏ ఆలయంలోకి వెళ్ళినప్పుడైనా నాలో కొన్ని సందేహాలు తలెత్తుతుంటాయి. ఏది వాస్తవం? ఆలయమా? దైవమా? భక్తులా? వారి మనసుల్లోని ‘భక్తి’ అన్న భావమా? మనిషికి ఉపకరించేది, సాంత్వననిచ్చేది ఏది?
ఈ తరంగాలు ఒక గదిని దాటగలిగినప్పుడు, ఒక ఊరిని, ఒక దేశాన్ని, ఒక ఖండాన్ని, బహుశా మహాసముద్రాలను కూడా దాటగలవు కదా!
మన ప్రియుడు ధనార్జన కోసం వెళ్లి ఏ దేశంలో ఉంటున్నాడో ఆ తెలుగు ప్రజల దేశానికే మనం వెళ్ళిపోదాం. అక్కడి వారి భాష నాకు రాదు. అయినా నా ప్రియుని కోసం ఆ దేశాన్ని నా దేశంగా చేసుకోవడానికి నేను సిద్ధమే.
మొత్తానికి ఆయన కవిత్వంలోనూ, నవలల్లోనూ సాహితీ విలువలు అథమ స్థాయిలో ఉన్నాయని వీరి ఆరోపణ. అంతేకాకుండా, వైరముత్తు మొదటి నుండి ఉన్నత పదవుల్లో ఉన్నవారిని ప్రసన్నం చేసుకుని, వారి ద్వారా పురస్కారాలు పొందడంలో దిట్ట అని విమర్శలు ఉన్నాయి.
వ్యాస భాగవతంలో రేఖామాత్రంగా వున్న దృశ్యీకరణాన్ని పోతన ఎలా విస్తరింపజేసాడో సోదాహరణంగా వివరించాను. పోతనకు పూర్వం వచ్చిన కావ్యాలలోని దృశ్యీకరణను కొన్ని పద్యాలను, సందర్భాలను ఉదాహరణలుగా తీసుకుని చూపించాను.
భారత స్వాతంత్ర్యోద్యమం మీద ఆసక్తి ఉన్న వాళ్ళకు సౌతాఫ్రికా తప్పక చూడాల్సిన దేశం! గాంధీగారు సౌత్ ఆఫ్రికాలో కొంత కాలమున్నారని చిన్నప్పుడు స్కూలు పుస్తకాల్లో చదువుకున్నా, ఇండియన్ ఇండిపెండెన్స్లో సౌతాఫ్రికాది ఒక కీలకపాత్ర అన్న విషయం ఈ ట్రిప్పు వరకూ నాకు తెలీదు.
మా ప్రయాణంలో మొట్టమొదటిసారిగా దూరాన ఉన్న మనస్లు శిఖరం చూసాం. ఆ శంఖువు ఆకారపు హిమశిఖర రాజస దృశ్యం మమ్మల్ని ముగ్ధులని చేసింది. కానీ మరికాసేపట్లో మబ్బులు కమ్ముకు వచ్చి శిఖరాన్ని మాకు దూరం చేసాయి. కొద్ది క్షణాల పాటైనా ఆ సుందర గంభీర శిఖరాన్ని చూడగలిగినందుకు అంతా ఎంతో సంతోషించాం.
ఎవరు వీళ్ళు? ఈ అడవిదారిలో, అర్ధరాత్రిలా అనిపిస్తున్న చీకట్లో, అర్థమయ్యీ కాని భాష మాట్లాడుతూ సాయం చేస్తామని ముందుకొస్తున్న ఈ అపరిచితులని నమ్మాలా వద్దా?
ఈ కథ రాయడం ఒకే రాత్రి ఎనిమిది గంటలలో ముగించానని చెప్పుకున్నాడు కాఫ్కా. తన ‘దేహము, ఆత్మ పూర్తిగా తెరచుకొని, తనలో మగ్గుతుండిన కథను బయటికి వదిలేశాయి’, అన్నాడు. కథ మొదలు పెట్టినప్పటినుండి ముగించే వరకు అతడు పడింది ప్రసవవేదన.
కాంతి రూపాలన్నీ – సూర్య రశ్మి, కొవ్వొత్తి వెలుగు, మిణుగురు పురుగు మెరుపు – విద్యుత్ రూపాలే
మాటలకంటే ఎక్కువ కొట్లాడుకునేవాళ్ళం. ఆ మాటల మధ్యలోనే తెలుగు సాహిత్యమూ, దాని వెనుకనున్న హిపోక్రసీ ఇవన్నీ సంభాషణల్లో భాగమయ్యేవి.
అచ్చుయంత్రం వేల, లక్షల పుస్తకాలు ప్రజల మీదకు పడేస్తున్నది. ఈ యాంత్రిక యుగంలో ఎప్పటికైనా గ్రంథ దహనోద్యమం ప్రారంభం కాక తప్పదు. ఎందుకంటే, అచ్చు యంత్రాలు లేని రోజుల్లో, మంచి గ్రంథాలు నిలిచి చెత్త గ్రంథాలు పోయేందుకు ఎవరూ ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేక పోయేది.