పాఠకులు ఆసక్తిగా చర్చలో పాల్గొనడం సంపాదకులకు సంతోషమే అయినా, ఈ వ్యాసం మీద వస్తున్న వ్యాఖ్యలు క్రమంగా వ్యాసంలోని అంశానికి సంబంధం లేని రమణ మహర్షి, న్యూటన్, ఆస్కార్ వైల్డ్ వంటి వారిని ప్రస్తావిస్తూ గాడి తప్పుతున్నాయి. మీ వ్యాఖ్యలను వ్యాసంలోని అంశానికి పరిమితం చేయమని కోరుతున్నాం. మీ వ్యాఖ్య వ్యాసానికి సంబంధించినది కాకుండా, ఒక వ్యాఖ్యానకర్తకు ప్రతిసమాధానం అయితే, అటువంటి వ్యాఖ్యను ప్రచురించ(లే)ము.
“ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం వున్నట్టు అనిపిస్తూ వచ్చింది.”-శ్రీ కొడవళ్ళ
దాదాపు పది సంవత్సరాల క్రితం ఆంగ్ల దిన పత్రిక The Hindu కొన్ని ఆదివారాలలో చిన్న పుస్తకం లాంటి సప్లిమెన్ట్ను తీసుకొచ్చింది. కళల మీద. అందులో ఒక వ్యాసంలాంటి దానిలో ఒకరు త్యాగరాజు తన కీర్తనలను బాలమురళి అంత బాగా పాడేవారా అనటం చదివిన గుర్తు
– నమస్కారాలతో -తః తః
శర్మగారికి వ్యంగ్యం పాలు ఎక్కువయ్యి బాలమురళి గురించి రాసింది నేను కల్పించి రాసాని అపోహ పడుతున్నారు. ఆయన (బాలమురళి) అన్న మాటలే రాసాను. రికార్డింగ్ ఉంది.
త్యాగరాజు 1847లో పరమపదించాడు. దాదాపు 180 సంవత్సరాలు కావొస్తోంది. ఈ కాలంలో ఏ కచేరీకెళ్ళినా త్యాగరాజ కీర్తనలు కనీసం 3 లేదా 4 అయినా పాడకుండా కచేరీలు జరగవు.
లేదంటూ, శర్మ గారు ఉదాహరణలు చూపించినా ఆశ్చర్యపోను.
తమిళనాడులో ఇలాంటి ప్రయోగాలు (త్యాగరాజు కృతులు లేకుండా) కొంతమంది చేసి విఫలం అయ్యారు.
త్యాగరాజు అన్ని మేలకర్త రాగాలనీ చిలకరించి ఎన్నో జన్యరాగాలు సృష్టించాడు.
ఒక్క తోడి రాగంలోనే 20కి పైగా కీర్తనలున్నాయి.
అంకెల గారడీ ఎందుక్కానీ, ఆయన తదనంతరం ఎంతో మంది వాగ్గేయకారులు (బాలమురళితో సహా) కొన్ని కీర్తనలు లేదా కృతులు కట్టినా అవి జన బాహుళ్యంలోకి వెళ్ళినవి వేళ్ళతో లెక్కపెట్టచ్చు.
శ్రీ సురేశ్ గారి వ్యాసం షడ్రసోపేత భోజన సమానంగా ఉంది. పలు కంప్యూటర్ పరిభాష మరియు వివరాలతో, చక్కని శైలిలో, చిక్కని తెలుగుదనంతో, విజ్ఞాన దాయకంగా, ఆనాటి విషయాలను మరింత తెలుసుకోవాలనేంత ఆసక్తికరంగా వుంది
హ్యుమిలిటీకి న్యూటన్ను ఉదహరిస్తూ దంతుర్తిగారు అన్నది: “అటువంటివాడు కూడా ‘నేను ఈ మాత్రం పైకి చూడగలగడానిక్కారణం నా పూర్వ శాస్త్రవేత్తలు నన్ను తమ భుజాలమీద ఎక్కడానికి ఏమీ అనుకోకుండా అనుమతి ఇవ్వడమే’ అన్నాడు.”
కాంతిపై న్యూటన్ ప్రచురించిన పరిశోధనల్లో తన కృషికి తగిన గుర్తింపు ఇవ్వలేదని హుక్ (Robert Hooke) చేసిన ఆరోపణకు సమాధానంగా, న్యూటన్ 1676 ఫిబ్రవరిలో వాడిన—12వ శతాబ్దానికే వాడుకలో ఉన్న—వాక్యమిది:
“What Descartes did was a good step. You have added much several ways, and especially in considering the colours of thin plates. If I have seen farther, it is by standing on the shoulders of giants.”
ఈ మాట అందరూ గుర్తుంచుకోదగ్గదే. (దీనిలో హుక్పై వ్యంగ్యం ఉందని కొందరు అంటారు; అది వివాదాస్పదం కాబట్టి దానిని పక్కన పెడదాం.) కానీ దానిని న్యూటన్ వ్యక్తిత్వానికి నిదర్శనంగా తీసుకోవడం సరికాదు.
దాదాపు అందరూ హాకింగ్ పుస్తకం [1] పేరు వినే ఉంటారు. అందులో చివర్లో ముగ్గురు శాస్త్రవేత్తల జీవితాలపై చిన్న చిత్రణలు ఉన్నాయి—ఐన్స్టైన్, గెలీలియో, న్యూటన్. బొమ్మలతో సహా ఒక్కొక్కటి రెండు పేజీలకు మించదు. న్యూటన్ చిత్రణ ఇలా మొదలవుతుంది:
“Isaac Newton was not a pleasant man.”
తప్పక చదవండి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] Stephen Hawking and Leonard Mlodinow. A Briefer History of Time. Bantam. 2005.
ముందే చెప్తున్నాను ఈ వ్యాఖ్య చాలా మందికి నచ్చదు. ఎవరు ఎలా తిట్టుకున్నా సరే.
రమణ మహర్షి దగ్గిరకి ఒకావిడ వెళ్ళి అడిగారుట – త్యాగరాజు వంటి వారు సంగీతం, నాదోపాసనతో భగవంతుణ్ణి చూసారు కదా, నేను కూడా అలా చేయవచ్చా? దానికి రమణుల సమాధానం – వాళ్ళు సంగీతంతో భగవంతుణ్ణి చూడలేదు. సాధన చేసి భగవంతుణ్ణి చూసాక, చూసినదాన్ని సంగీతంలో వ్యక్తపరిచారు. త్యాగరాజ కీర్తనలు, నారాయణీయం, పోతన భాగవతం ఇప్పటికీ అజరామరంగా నిలిచి ఉండడానికి కారణం వాటిని రాసిన వ్యక్తులు కాదు, అవి పలికించిన పై వాడిది. లక్ష సార్లు పోతన భాగవతం చదవండి, ఛందస్సు నేర్చుకోండి, కానీ పోతన రాసినట్టూ “ఒక్క పద్యం” (ఉదా: అలవైకుంఠ పురంబులో, ఎవ్వనిచే జనించు..) రాయగలమా? రాసినా కాలానికి అది నిలబడి ఉండగలదా? అందుకే అంటారు శివమహిమా స్తోత్రంలో “అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే … తదపి తవ గుణానామీశ పారం న యాతి.” ఎప్పుడైతే “నేను” అనేది మొదలుతుందో అదే అధోగతికి మొదటి మెట్టు. అందుకే పోతన చెప్పుకున్నాడు ముందే – పలికించెడు వాడు అంటూ. అదీ భక్తి, హ్యుమిలిటీ అంటే.
అది అలా ఉంచితే బాలమురళి మనకి తెల్సిన గాయకుల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడని చెప్పడానికి ఎవరికీ ఏమీ సందేహం లేదు. అది గమనించడానికి అన్నం అంతా ఉడికిందా అంటూ చూడక్కర్లేదు, ‘ఏమీ సేతురా లింగా’ అనే ఒక్క మెతుకు చాలు. అయితే ఆయన గురించి రాసిన విషయాల్లో కొన్ని దారుణంగా ఉంటాయి. అవి చెప్పేముందు ఈ మాట చెప్పనివ్వండి – అవి నేను చూసినవి కాదు, పేపర్లో చదివినవి మా-త్ర-మే. మొదటిది – ఒక హిందీ గాయకుడి కొడుకు (పేరు గుర్తు లేదు) అద్భుతంగా పాడుతుంటే బాలమురళి మొదటివరసలో కూర్చుని ఉన్నారుట. పాట అయ్యాక అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు, కుర్రాడు తండ్రిలాగా పాడాడు అని. మొత్తం హాలులో ఒకే ఒకరు లేవకుండా, చప్పట్లు కూడా కొట్టని వారు మన పెద్ద మనిషే. అదేం అని అడిగితే సమాధానం – తండ్రి గాయకుడైనప్పుడు కుర్రాడు ఆ మాత్రం పాడడం పెద్ద గొప్పేం ఉంది అన్నార్ట. దారుణం కదా? ఆ తర్వాత కుర్రాడు జీవితంలో ఏదైనా మరిచిపోకుండా గుర్తు ఉంచుకుంటాడంటే బహుశ: ఈయన లేవకపోవడం, కనీసం చప్పట్లు కూడా కొట్టకపోవడం మాత్రమే కాబోలు. (కోతి కొమ్మచ్చి గెంతు – ఇటువంటి దరిద్రపు ఆటలు సాధారణంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఆడుతూ ఉంటారు. అన్నింటిలో ‘ఏ’ వచ్చిన ఒక కుర్రాడికి మాత్రం ఒకే ఒక కోర్స్ లో ‘బి’ ఇస్తారు ఏదో అతి చిన్న విషయం నచ్చక (కుర్రాడి వంటి రంగో, జుట్టో, వాడు రాసినది గొప్ప పత్రమైనా కొన్ని అక్షరదోషాలు దొర్లాయి వగైరా) లేదా మరోటి ఏదో నచ్చలేదు. అప్పుడేమౌతుందంటే కుర్రాడికి జిపిఏ 3.999 దగ్గిర ఆగుతుంది. మరో ముప్ఫై ఏళ్ళు పోయాక, నోబుల్ ప్రైజ్ వచ్చినా కూడా కుర్రాడికి ఈ ‘బి’ గ్రేడ్ ఇచ్చిన ప్రొఫెసర్ గుర్తు ఉండి తీరుతాడు మిగతా ‘ఏ’ గ్రేడ్ ఇచ్చిన అందరూ గుర్తు లేకపోయినా. అయితే బి గ్రేడ్ ఇచ్చినవాడు మాత్రం అప్పటికి అప్పుడు తనకి తాను సమాధానం చెప్పుకుని హాయిగా ఉంటాడనుకోవడం కష్టం. ఈ ఒక్క బి గ్రేడ్ కి కుర్రాడి మానసిక స్థితి దారుణంగా దెబ్బ తింటుందని తెల్సినా అలాగే చేస్తారు. అదో పైశాచిక ప్రవర్తన. నాకు కూడా ఇది జరిగింది చదుకున్నప్పుడు, అవును అమెరికాలోనే, అయితే అది అప్రస్తుతం)
రెండోది – ఒక సభలో ఆయన అన్నమాట – “బాల సుబ్రహ్మణ్యం నాలాగా పాడగలడు కానీ నేను బాలూ లాగా పాడలేను.” ఇది ఆయన పరోక్షంగా బాలూని ఎత్తిపొడుస్తూ నువ్వు పాడే చెత్త నేను పాడను సుమా అని చెప్పినట్టైంది. అయితే అక్కడే ఉన్న బాలు మాత్రం అదో పొగడ్త అనుకుని సభలో ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడుట. తాను అన్న మాటని వేరేగా అర్థం చేసుకునే సరికి అది వెనక్కి వచ్చి మొహంమీద తగిలింది కాబోలు, ఆ దెబ్బతో మరేమీ మాట్లాడడానికి అవకాశం రాలేదు బాలమురళికి.
దాదాపు మీరు ఏ సైన్స్ పుస్తకం చదివినా న్యూటన్ గురించి లేకుండా ప్రస్తావన రాదు. అందుకే ఆయన సైన్స్ కి పితామహుడు అనడం చూస్తాం. అటువంటివాడు కూడా ‘నేను ఈ మాత్రం పైకి చూడగలగడానిక్కారణం నా పూర్వ శాస్త్రవేత్తలు నన్ను తమ భుజాలమీద ఎక్కడానికి ఏమీ అనుకోకుండా అనుమతి ఇవ్వడమే,’ అన్నాడు. అంటే పూర్వం ఉన్న శాస్త్రజ్ఝులు కనుక్కున్న, కనుక్కోని విషయాలు, ప్రగతీ అవీ పట్టుకుని పైకి వెళ్ళగలిగాడు ఆయన. అందువల్ల వాళ్ళంటే గౌరవం. బ్రహ్మానందంగారు చెప్పినట్టూ “త్యాగరాజు 4 స్వరాలతో ఒక రాగం సృష్టిస్తే, నేను 3 స్వరాలతోనే ఒక రాగం కూర్చాను” అనడంలో అంత ఎత్తుకి ఎదిగిన ఆయనకి ఉండాల్సిన హ్యుమిలిటీ లేదని అనిపిస్తుంది. నేను గొప్పవాణ్ణోయ్, నువ్వింకా గమనించకపోతే నేను ఇది చేసా, అది చేసా అని చెప్పుకోవడం గర్వం తప్ప మరోటి కాదు. ఆ గర్వం ఎటువంటిదంటే ఎంత అణగదొక్కినా ఏదో మారుమూల కూర్చుని అవకాశం ఇవ్వగానే మహావృక్షం లాగా ఒకే ఒక క్షణంలో ఎదుగుతుంది. ఆఖరికి బలి మహారాజు అంతటివాడిక్కూడా ఆ గర్వం పోవడానికి నూరు అశ్వమేధాలు చేసినంత కాలం పట్టిందనేది చూడవచ్చు.
మరో వందేళ్ళకి కూడా త్యాగరాజు ఆయన కీర్తనలు నిలబడి ఉంటాయి ఎక్కడో ఒకచోట అనేది గారంటీగా చెప్పవచ్చు. శంకరాభరణంలో చెప్పినట్టూ ‘కనీసం ఒక్క వ్యక్తి ఉన్నా సరే….” అయితే మరో వందేళ్ళకి బాలమురళి ఎక్కడ ఉంటాడో ఊహించడం అంత కష్టం కాదు. వందేళ్ల వరకూ ఎందుకు ప్రస్తుతం ఆంధ్రాలో ఏ స్కూల్ కైనా వెళ్ళి క్లాసులో అడిగితే చాలదా? ఇది కూడా బ్రహ్మానందం గారు చెప్పారు కదా?
ముగించే ముందు మరోసారి – పైన రాసిన మొదటి వాక్యం చదవండి.
ఆర్యా..అద్భుతమైన సేకరణ. కవిత్వాన్ని నమ్ముకొని బతికిన ఆనాటి కవి రాజ శేఖరులు..వాగ్దేవతానుగృహీత కవిసత్తములు శ్రీనాథమహాకవి పద్యములు మాకు మానసోల్లాసము కల్గించినవి. నమస్సులు.
బాలమురళి గారితో చాలా సార్లే సంభాషించాను–ఎదురుగానూ, గుంపులలోనూ.
విశేష ప్రజ్ఞావంతుడు. గాత్రం అద్భుతం. జనరంజకంగా పాడ గలరు. ఇవన్నీ ఒక ఎత్తు.
ఆయనలో నచ్చనివి కొన్ని ఉన్నాయి. అది–స్వోత్కర్ష. త్యాగరాజు 4 స్వరాలతో ఒక రాగం సృష్టిస్తే, నేను 3 స్వరాలతోనే ఒక రాగం కూర్చాను–అని ఆయనే చెప్పుకోవడం నాకు అంతగా మింగుడు పడలేదు.
నిజానికి–సంగీత శాస్త్రమూ, సృజనా , ప్రజ్ఞ, లోతైన అవగాహనా, ఇలాంటి అంశాలు తీసుకొని విడివిడిగా త్యాగరాజునీ, దీక్షితార్నీ, శ్యామశాస్త్రినీ, తీసుకొని వీరిని బాలమురళి పక్కన పెట్టలేము. ఎందుకంటే వారి కృతులు ఇప్పటికీ అందరూ పాడుతున్నారు.
ఇంకో పాతికేళ్ళలో ఆ త్రిమూర్తుల 200 సంవత్సరాల ఉత్సవాలు జరుపుంటారు.
బాలమురళి కృతులు ఎంతమంది పాడుతున్నారన్న ప్రశ్నకి జవాబు వెతకడం అంత కష్టమేమీ కాదు.
ఆయన స్వీయ రచనలు కూర్చిన పుస్తకం–గాన సూర్య కాంతి–అద్భుతంగా కూర్చారు; తెలుగు, తమిళ, కన్నడ భాషల లిపిలో ప్రచురించారు. అది నాకు బాగా నచ్చింది. గాన సూర్య కాంతి పుస్తకం కొందామంటే ఎక్కడా దొరకదు. ఎవరికీ పట్ట లేదు–అటు అభిమానులకీ, ఇటు శిష్యులకీ, మరో వైపు సంగీతజ్ఞులకీ.
మంగళంపల్లి వారి మీద వ్యాసం పునఃప్రచురించడం ముదావహం. ఆయన వున్న రోజుల్లో ‘ఈనాటి త్యాగరాజుగా’ ఒక వెలుగు వెలిగారు. ఆయన సంగీతప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు, ఏక సంథాగ్రహి కూడా. విజయవాడ మద్రాసు మధ్యలో ప్రతి రైల్వే స్టేషన్ పేరునూ అలవోకగా వల్లెవేయగల అసమాన జ్ఞాపక శక్తి వున్న వ్యక్తి. సంగీత విద్వాంసులకు వుండే piety ఆయనకు లేదు. జీవితంలోని సౌఖ్యాన్ని అనుభవిస్తూనే సంగీతానికి ఎనలేని సేవ చేశారు. నేను ఢిల్లీలో వున్న మూడు దశాబ్దాల కాలంలో ఆయన కచేరీలు ఎన్నో చూశాను. ఆయన కచ్చేరీలకు వయోలిన్, మృదంగం, ఘటం వాయించే వారు వాసి గలవారితో తప్ప ఆయన ధాటికి తట్టుకోవడం కష్టం. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చేవారు సంగీత ప్రియులు ఆయన కచేరీలకు. ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగయ్య, ముత్తయ్య, శ్యామయ్య తో పాటుగా తన స్వీయ రచనలను ఆలపించి మెప్పించేవారు. హనుమ అనుమ మనమా అనే కృతి, తనకు తెలియని కన్న తల్లిని స్మరించుకుంటూ రాసిన అమ్మ అకార ఉకార మకార కృతిలో తనను పెంచిన తల్లికి శివే శివే అని నివాళులు అర్పించటం శ్రోతలను ఎంతగానో అలరించింది. బాలమురళి మరియు సంగీత క్యాసెట్ కంపెనీ కలిసి ఒక ముప్ఫై సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా త్యాగరాజ కృతులను, జన బాహుళ్యంలోకి తీసుకుపోవటానికి గొప్ప కృషి చేశారు. త్యాగయ్య సంస్కృత కీర్తనలు, (అందులోనే సామజవరగమన కూడా వుంది), పంచరత్న కీర్తనలు, తత్వబోధ కీర్తనలు, ఉత్సవ సంప్రదాయా కీర్తనలు వగైరా మరియు ఆయన స్వయంగా రచించి ఆలపించిన థిల్లానాలు, ముఖ్యంగా థిమ్న నాథ రాగమాలిక లో ఊపిరి పీల్చుకోకుండా ఆలపించే సంగతులు, సంగీత ప్రియులను నేటికీ అలరించుతున్నవి. ఓసారి మంగళంపల్లి వారి క్యాసెట్లు రెండిటిమీద ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అవి కాలగర్భంలో కలిసిపోయాయి. నేను రోజూ వాకింగ్ లో బాలమురళి అభోగి రాగంలో రచించిన వేగమె గావరా రంగయ్యా అనే కీర్తనను, సుదీర్ఘ రాగాలాపనను ఆస్వాదిస్తూ వుంటాను. నా వెనక నడిచే వాళ్ళు రోజూ ఇదేనా అంటుంటారు! సంగీత సంప్రదాయం వున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ నాకు సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేదు. కానీ విని ఆనందించే స్పృహ మాత్రం బాగా వుంది. సంగీత జ్ఞానం లేనందుకు ప్రాయశ్చిత్తంగా నా కూతురికి అభేరి అని నామకరణం చేసి, ఆమెకు సంగీతం నేర్పించుతూ శాస్త్రీయ సంగీత పట్ల నాకున్న అభిమానం చాటుకుంటున్నాను.
[ఈ వ్యాసం ఇప్పుడే తొలిసారిగా ప్రచురించబడింది. ‘పునః’ప్రచురణ కాదు. – సం.]
బాలమురళి స్మృతి ఆద్యంతమూ, సంగీత పరిజ్ఞానం ఏమాత్రమూ లేని నాకు కూడా హృద్యమనిపించింది. బెజవాడ విశేషాలు మరో ఆకర్షణ—నేను లయోలాలో రెండేళ్లు (1974–76) చదవడాన.
గొర్తి తన ‘యజ్ఞం’ (“మనకు తెలియని మన త్యాగరాజు“) లోని ఓ అధ్యాయం, “గాన సూర్యకాంతి: బాలమురళి” లో బాలమురళి బెజవాడ మీద రాసిన పాటను—“వినుమురా విజయ వాణి – కనుమురా కృష్ణ వేణి / ఆలకించు ఆంధ్ర బాల / లాలపించు మధుర వాణి”—చేర్చారు.
త్యాగరాజుతో పోల్చడం చదివితే, నాకు కొడవటిగంటి రాసిన “కర్ణాటక సంగీతంలో శ్రీ బాలమురళీకృష్ణ ప్రతిభ” అన్న వ్యాసం (ఆంధ్రజ్యోతి దినపత్రిక, 9-3-1967) [1] గుర్తొచ్చింది:
“త్యాగయ్య భక్తుడు, కవి, గాయకుడు, సంగీత కళానిధి, సంఘ విమర్శకుడు. కాని, అన్నింటిని మించి సంగీతపు పుట్ట, సంగీతం మహాసముద్రమైతే, త్యాగరాజు గజ ఈతగాడు కాదు, తిమింగలం. ఆయన సంగీతం కోసం బతికాడు. అమిత అరాజక పరిస్థితులలో బతికి భక్తిద్వారా ఆత్మ సాక్షాత్కారం సాధించాడు. అమాయకుడు కాదు, ఆత్మాభిమానం లేనివాడు కాదు. తన గేయాల ద్వారా తన గోడు ఎంత వెళ్ళబోసుకున్నాడో చెప్పడం కష్టం. “నాదు పై పలికేరు నరులు” అన్నాడు. “పుట్టులోభులను పొట్టకై పొగడితి, దుష్టులతో గూడి, దుష్కృత్యములు సలిపినట్టు చేసిన త్యాగరాజును” అని కూడా తానే చెప్పుకున్నాడు. కాని లోకాన్ని వెయ్యి కళ్ళతో చూసి అసహ్యించుకున్నాడు, నవ్వుకున్నాడు, మెచ్చుకున్నాడు, ఏ నాటకం చూసాడో ఏమో, “స్త్రీ వేషధారికి సాధ్వి నడతలు ఏమైనా తెలుసునా?” అనుకున్నాడు.
“ఇటువంటి లక్షణాలు కొన్ని బాలమురళిలో కనిపిస్తున్నాయా? బాలమురళి తన రచనలలో కొన్ని విసుర్లు విసురుతున్నాడు. …
“కర్ణాటక సంగీతానికి కాణాచిగా వుంటూ వస్తున్న దక్షిణ దేశంలో ఆ సంగీతానికి కొత్త జీవం పోయడానికి బాలమురళి అవతరించాడనడానికి ఆధారం వున్నది. ఆ కర్తవ్యం అతను నిర్వహించగలిగితే బాలమురళి నిజంగా అభినవ త్యాగరాజే.”
“గాన సుధాకరుడు” అన్న మరో వ్యాసంలో (ఫిబ్రవరి 1971) [1], బాలమురళీకృష్ణలో ‘విశ్రాంతి’ ధోరణి లేదనీ, గాయకునిగా నిరంతరం పెరగడం అతని అంతస్స్వభావమనీ, అది డబ్బు కోసం కాదనీ, ఒకసారి బాలమురళి తనతో, “ఈ పాటకచ్చేరీలు కాక జరుగుబాటు కావటానికి ఇంకా ఏ మార్గం వున్నా బాగుండును! సంగీతం అమ్ముకోవటం బాధగా వుంది!” అన్నాడని కూడా పేర్కొన్నాడు:
“పెరగటం తన అంతస్స్వభావం గనక పెరుగుతున్న గాయకులు ఎంతమంది వుంటారు? సంగీతం అమ్ముకోవటం బాధగా వుందని ఏ గాయకుడు అంటాడు? ఈ లక్షణాలు గలవాళ్ళు ఇంకా వుంటే వాళ్ళు విలక్షణమైన గాయకులే!
“గాయకుడుగా అతనికి అద్భుతమైన శరీరం వున్నది. అది మంద్ర గాంధారం నుంచి తారాషడ్జమం దాకా పలకటం నేను డజనుసార్లు విన్నాను. అతని శరీరం అతిరథుడి లాంటిది. ఎలాంటి క్లిష్టరీతిలోనూ క్రమశిక్షణ పొరపాటున కూడా కోల్పోడు. రాగమూ, స్వరమూ, లయా అతనికి బానిసలలా వుంటాయి. వాటిపైన అతను చూపే అధికారం అనన్యమనిపిస్తుంది. అతని సంగీతం అగాధమనిపిస్తుంది. చాలామంది తమ యావచ్ఛక్తినీ ప్రదర్శించినట్టూ, అంతకుపైన పోలేరన్నట్టూ ఎప్పుడన్నా అనిపించవచ్చు. బాలమురళి విషయంలో అలా ఏనాడూ అనిపించలేదు నాకు… అంటే నాకు అతని ‘అడుగు’ ఇంతవరకు తగిలినట్టు భావన కలగలేదు.
“ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం వున్నట్టు అనిపిస్తూ వచ్చింది.”
బాలమురళి – స్మృతి సరళి గురించి సంపాదకులు అభిప్రాయం:
08/25/2026 1:40 pm
పాఠకులు ఆసక్తిగా చర్చలో పాల్గొనడం సంపాదకులకు సంతోషమే అయినా, ఈ వ్యాసం మీద వస్తున్న వ్యాఖ్యలు క్రమంగా వ్యాసంలోని అంశానికి సంబంధం లేని రమణ మహర్షి, న్యూటన్, ఆస్కార్ వైల్డ్ వంటి వారిని ప్రస్తావిస్తూ గాడి తప్పుతున్నాయి. మీ వ్యాఖ్యలను వ్యాసంలోని అంశానికి పరిమితం చేయమని కోరుతున్నాం. మీ వ్యాఖ్య వ్యాసానికి సంబంధించినది కాకుండా, ఒక వ్యాఖ్యానకర్తకు ప్రతిసమాధానం అయితే, అటువంటి వ్యాఖ్యను ప్రచురించ(లే)ము.
— సంపాదకులు
బాలమురళి – స్మృతి సరళి గురించి తః తః అభిప్రాయం:
08/25/2026 12:27 pm
“ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం వున్నట్టు అనిపిస్తూ వచ్చింది.”-శ్రీ కొడవళ్ళ
దాదాపు పది సంవత్సరాల క్రితం ఆంగ్ల దిన పత్రిక The Hindu కొన్ని ఆదివారాలలో చిన్న పుస్తకం లాంటి సప్లిమెన్ట్ను తీసుకొచ్చింది. కళల మీద. అందులో ఒక వ్యాసంలాంటి దానిలో ఒకరు త్యాగరాజు తన కీర్తనలను బాలమురళి అంత బాగా పాడేవారా అనటం చదివిన గుర్తు
– నమస్కారాలతో -తః తః
బాలమురళి – స్మృతి సరళి గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
08/24/2026 2:15 pm
శర్మగారికి వ్యంగ్యం పాలు ఎక్కువయ్యి బాలమురళి గురించి రాసింది నేను కల్పించి రాసాని అపోహ పడుతున్నారు. ఆయన (బాలమురళి) అన్న మాటలే రాసాను. రికార్డింగ్ ఉంది.
త్యాగరాజు 1847లో పరమపదించాడు. దాదాపు 180 సంవత్సరాలు కావొస్తోంది. ఈ కాలంలో ఏ కచేరీకెళ్ళినా త్యాగరాజ కీర్తనలు కనీసం 3 లేదా 4 అయినా పాడకుండా కచేరీలు జరగవు.
లేదంటూ, శర్మ గారు ఉదాహరణలు చూపించినా ఆశ్చర్యపోను.
తమిళనాడులో ఇలాంటి ప్రయోగాలు (త్యాగరాజు కృతులు లేకుండా) కొంతమంది చేసి విఫలం అయ్యారు.
త్యాగరాజు అన్ని మేలకర్త రాగాలనీ చిలకరించి ఎన్నో జన్యరాగాలు సృష్టించాడు.
ఒక్క తోడి రాగంలోనే 20కి పైగా కీర్తనలున్నాయి.
అంకెల గారడీ ఎందుక్కానీ, ఆయన తదనంతరం ఎంతో మంది వాగ్గేయకారులు (బాలమురళితో సహా) కొన్ని కీర్తనలు లేదా కృతులు కట్టినా అవి జన బాహుళ్యంలోకి వెళ్ళినవి వేళ్ళతో లెక్కపెట్టచ్చు.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి డా. వెల్ముల కృష్ణారావు అభిప్రాయం:
08/23/2026 11:13 pm
శ్రీ సురేశ్ గారి వ్యాసం షడ్రసోపేత భోజన సమానంగా ఉంది. పలు కంప్యూటర్ పరిభాష మరియు వివరాలతో, చక్కని శైలిలో, చిక్కని తెలుగుదనంతో, విజ్ఞాన దాయకంగా, ఆనాటి విషయాలను మరింత తెలుసుకోవాలనేంత ఆసక్తికరంగా వుంది
బాలమురళి – స్మృతి సరళి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
08/23/2026 1:11 pm
హ్యుమిలిటీకి న్యూటన్ను ఉదహరిస్తూ దంతుర్తిగారు అన్నది: “అటువంటివాడు కూడా ‘నేను ఈ మాత్రం పైకి చూడగలగడానిక్కారణం నా పూర్వ శాస్త్రవేత్తలు నన్ను తమ భుజాలమీద ఎక్కడానికి ఏమీ అనుకోకుండా అనుమతి ఇవ్వడమే’ అన్నాడు.”
కాంతిపై న్యూటన్ ప్రచురించిన పరిశోధనల్లో తన కృషికి తగిన గుర్తింపు ఇవ్వలేదని హుక్ (Robert Hooke) చేసిన ఆరోపణకు సమాధానంగా, న్యూటన్ 1676 ఫిబ్రవరిలో వాడిన—12వ శతాబ్దానికే వాడుకలో ఉన్న—వాక్యమిది:
“What Descartes did was a good step. You have added much several ways, and especially in considering the colours of thin plates. If I have seen farther, it is by standing on the shoulders of giants.”
ఈ మాట అందరూ గుర్తుంచుకోదగ్గదే. (దీనిలో హుక్పై వ్యంగ్యం ఉందని కొందరు అంటారు; అది వివాదాస్పదం కాబట్టి దానిని పక్కన పెడదాం.) కానీ దానిని న్యూటన్ వ్యక్తిత్వానికి నిదర్శనంగా తీసుకోవడం సరికాదు.
దాదాపు అందరూ హాకింగ్ పుస్తకం [1] పేరు వినే ఉంటారు. అందులో చివర్లో ముగ్గురు శాస్త్రవేత్తల జీవితాలపై చిన్న చిత్రణలు ఉన్నాయి—ఐన్స్టైన్, గెలీలియో, న్యూటన్. బొమ్మలతో సహా ఒక్కొక్కటి రెండు పేజీలకు మించదు. న్యూటన్ చిత్రణ ఇలా మొదలవుతుంది:
“Isaac Newton was not a pleasant man.”
తప్పక చదవండి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] Stephen Hawking and Leonard Mlodinow. A Briefer History of Time. Bantam. 2005.
బాలమురళి – స్మృతి సరళి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
08/23/2026 11:15 am
ముందే చెప్తున్నాను ఈ వ్యాఖ్య చాలా మందికి నచ్చదు. ఎవరు ఎలా తిట్టుకున్నా సరే.
రమణ మహర్షి దగ్గిరకి ఒకావిడ వెళ్ళి అడిగారుట – త్యాగరాజు వంటి వారు సంగీతం, నాదోపాసనతో భగవంతుణ్ణి చూసారు కదా, నేను కూడా అలా చేయవచ్చా? దానికి రమణుల సమాధానం – వాళ్ళు సంగీతంతో భగవంతుణ్ణి చూడలేదు. సాధన చేసి భగవంతుణ్ణి చూసాక, చూసినదాన్ని సంగీతంలో వ్యక్తపరిచారు. త్యాగరాజ కీర్తనలు, నారాయణీయం, పోతన భాగవతం ఇప్పటికీ అజరామరంగా నిలిచి ఉండడానికి కారణం వాటిని రాసిన వ్యక్తులు కాదు, అవి పలికించిన పై వాడిది. లక్ష సార్లు పోతన భాగవతం చదవండి, ఛందస్సు నేర్చుకోండి, కానీ పోతన రాసినట్టూ “ఒక్క పద్యం” (ఉదా: అలవైకుంఠ పురంబులో, ఎవ్వనిచే జనించు..) రాయగలమా? రాసినా కాలానికి అది నిలబడి ఉండగలదా? అందుకే అంటారు శివమహిమా స్తోత్రంలో “అసితగిరిసమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే … తదపి తవ గుణానామీశ పారం న యాతి.” ఎప్పుడైతే “నేను” అనేది మొదలుతుందో అదే అధోగతికి మొదటి మెట్టు. అందుకే పోతన చెప్పుకున్నాడు ముందే – పలికించెడు వాడు అంటూ. అదీ భక్తి, హ్యుమిలిటీ అంటే.
అది అలా ఉంచితే బాలమురళి మనకి తెల్సిన గాయకుల్లో అద్భుతమైన ప్రతిభ ఉన్నవాడని చెప్పడానికి ఎవరికీ ఏమీ సందేహం లేదు. అది గమనించడానికి అన్నం అంతా ఉడికిందా అంటూ చూడక్కర్లేదు, ‘ఏమీ సేతురా లింగా’ అనే ఒక్క మెతుకు చాలు. అయితే ఆయన గురించి రాసిన విషయాల్లో కొన్ని దారుణంగా ఉంటాయి. అవి చెప్పేముందు ఈ మాట చెప్పనివ్వండి – అవి నేను చూసినవి కాదు, పేపర్లో చదివినవి మా-త్ర-మే. మొదటిది – ఒక హిందీ గాయకుడి కొడుకు (పేరు గుర్తు లేదు) అద్భుతంగా పాడుతుంటే బాలమురళి మొదటివరసలో కూర్చుని ఉన్నారుట. పాట అయ్యాక అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు, కుర్రాడు తండ్రిలాగా పాడాడు అని. మొత్తం హాలులో ఒకే ఒకరు లేవకుండా, చప్పట్లు కూడా కొట్టని వారు మన పెద్ద మనిషే. అదేం అని అడిగితే సమాధానం – తండ్రి గాయకుడైనప్పుడు కుర్రాడు ఆ మాత్రం పాడడం పెద్ద గొప్పేం ఉంది అన్నార్ట. దారుణం కదా? ఆ తర్వాత కుర్రాడు జీవితంలో ఏదైనా మరిచిపోకుండా గుర్తు ఉంచుకుంటాడంటే బహుశ: ఈయన లేవకపోవడం, కనీసం చప్పట్లు కూడా కొట్టకపోవడం మాత్రమే కాబోలు. (కోతి కొమ్మచ్చి గెంతు – ఇటువంటి దరిద్రపు ఆటలు సాధారణంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా ఆడుతూ ఉంటారు. అన్నింటిలో ‘ఏ’ వచ్చిన ఒక కుర్రాడికి మాత్రం ఒకే ఒక కోర్స్ లో ‘బి’ ఇస్తారు ఏదో అతి చిన్న విషయం నచ్చక (కుర్రాడి వంటి రంగో, జుట్టో, వాడు రాసినది గొప్ప పత్రమైనా కొన్ని అక్షరదోషాలు దొర్లాయి వగైరా) లేదా మరోటి ఏదో నచ్చలేదు. అప్పుడేమౌతుందంటే కుర్రాడికి జిపిఏ 3.999 దగ్గిర ఆగుతుంది. మరో ముప్ఫై ఏళ్ళు పోయాక, నోబుల్ ప్రైజ్ వచ్చినా కూడా కుర్రాడికి ఈ ‘బి’ గ్రేడ్ ఇచ్చిన ప్రొఫెసర్ గుర్తు ఉండి తీరుతాడు మిగతా ‘ఏ’ గ్రేడ్ ఇచ్చిన అందరూ గుర్తు లేకపోయినా. అయితే బి గ్రేడ్ ఇచ్చినవాడు మాత్రం అప్పటికి అప్పుడు తనకి తాను సమాధానం చెప్పుకుని హాయిగా ఉంటాడనుకోవడం కష్టం. ఈ ఒక్క బి గ్రేడ్ కి కుర్రాడి మానసిక స్థితి దారుణంగా దెబ్బ తింటుందని తెల్సినా అలాగే చేస్తారు. అదో పైశాచిక ప్రవర్తన. నాకు కూడా ఇది జరిగింది చదుకున్నప్పుడు, అవును అమెరికాలోనే, అయితే అది అప్రస్తుతం)
రెండోది – ఒక సభలో ఆయన అన్నమాట – “బాల సుబ్రహ్మణ్యం నాలాగా పాడగలడు కానీ నేను బాలూ లాగా పాడలేను.” ఇది ఆయన పరోక్షంగా బాలూని ఎత్తిపొడుస్తూ నువ్వు పాడే చెత్త నేను పాడను సుమా అని చెప్పినట్టైంది. అయితే అక్కడే ఉన్న బాలు మాత్రం అదో పొగడ్త అనుకుని సభలో ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడుట. తాను అన్న మాటని వేరేగా అర్థం చేసుకునే సరికి అది వెనక్కి వచ్చి మొహంమీద తగిలింది కాబోలు, ఆ దెబ్బతో మరేమీ మాట్లాడడానికి అవకాశం రాలేదు బాలమురళికి.
దాదాపు మీరు ఏ సైన్స్ పుస్తకం చదివినా న్యూటన్ గురించి లేకుండా ప్రస్తావన రాదు. అందుకే ఆయన సైన్స్ కి పితామహుడు అనడం చూస్తాం. అటువంటివాడు కూడా ‘నేను ఈ మాత్రం పైకి చూడగలగడానిక్కారణం నా పూర్వ శాస్త్రవేత్తలు నన్ను తమ భుజాలమీద ఎక్కడానికి ఏమీ అనుకోకుండా అనుమతి ఇవ్వడమే,’ అన్నాడు. అంటే పూర్వం ఉన్న శాస్త్రజ్ఝులు కనుక్కున్న, కనుక్కోని విషయాలు, ప్రగతీ అవీ పట్టుకుని పైకి వెళ్ళగలిగాడు ఆయన. అందువల్ల వాళ్ళంటే గౌరవం. బ్రహ్మానందంగారు చెప్పినట్టూ “త్యాగరాజు 4 స్వరాలతో ఒక రాగం సృష్టిస్తే, నేను 3 స్వరాలతోనే ఒక రాగం కూర్చాను” అనడంలో అంత ఎత్తుకి ఎదిగిన ఆయనకి ఉండాల్సిన హ్యుమిలిటీ లేదని అనిపిస్తుంది. నేను గొప్పవాణ్ణోయ్, నువ్వింకా గమనించకపోతే నేను ఇది చేసా, అది చేసా అని చెప్పుకోవడం గర్వం తప్ప మరోటి కాదు. ఆ గర్వం ఎటువంటిదంటే ఎంత అణగదొక్కినా ఏదో మారుమూల కూర్చుని అవకాశం ఇవ్వగానే మహావృక్షం లాగా ఒకే ఒక క్షణంలో ఎదుగుతుంది. ఆఖరికి బలి మహారాజు అంతటివాడిక్కూడా ఆ గర్వం పోవడానికి నూరు అశ్వమేధాలు చేసినంత కాలం పట్టిందనేది చూడవచ్చు.
మరో వందేళ్ళకి కూడా త్యాగరాజు ఆయన కీర్తనలు నిలబడి ఉంటాయి ఎక్కడో ఒకచోట అనేది గారంటీగా చెప్పవచ్చు. శంకరాభరణంలో చెప్పినట్టూ ‘కనీసం ఒక్క వ్యక్తి ఉన్నా సరే….” అయితే మరో వందేళ్ళకి బాలమురళి ఎక్కడ ఉంటాడో ఊహించడం అంత కష్టం కాదు. వందేళ్ల వరకూ ఎందుకు ప్రస్తుతం ఆంధ్రాలో ఏ స్కూల్ కైనా వెళ్ళి క్లాసులో అడిగితే చాలదా? ఇది కూడా బ్రహ్మానందం గారు చెప్పారు కదా?
ముగించే ముందు మరోసారి – పైన రాసిన మొదటి వాక్యం చదవండి.
శ్రీనాథుని చాటుపద్యములు గురించి వారణాసి భానుమూర్తి రావు అభిప్రాయం:
08/23/2026 4:07 am
ఆర్యా..అద్భుతమైన సేకరణ. కవిత్వాన్ని నమ్ముకొని బతికిన ఆనాటి కవి రాజ శేఖరులు..వాగ్దేవతానుగృహీత కవిసత్తములు శ్రీనాథమహాకవి పద్యములు మాకు మానసోల్లాసము కల్గించినవి. నమస్సులు.
బాలమురళి – స్మృతి సరళి గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:
08/23/2026 3:08 am
బాలమురళి గారితో చాలా సార్లే సంభాషించాను–ఎదురుగానూ, గుంపులలోనూ.
విశేష ప్రజ్ఞావంతుడు. గాత్రం అద్భుతం. జనరంజకంగా పాడ గలరు. ఇవన్నీ ఒక ఎత్తు.
ఆయనలో నచ్చనివి కొన్ని ఉన్నాయి. అది–స్వోత్కర్ష. త్యాగరాజు 4 స్వరాలతో ఒక రాగం సృష్టిస్తే, నేను 3 స్వరాలతోనే ఒక రాగం కూర్చాను–అని ఆయనే చెప్పుకోవడం నాకు అంతగా మింగుడు పడలేదు.
నిజానికి–సంగీత శాస్త్రమూ, సృజనా , ప్రజ్ఞ, లోతైన అవగాహనా, ఇలాంటి అంశాలు తీసుకొని విడివిడిగా త్యాగరాజునీ, దీక్షితార్నీ, శ్యామశాస్త్రినీ, తీసుకొని వీరిని బాలమురళి పక్కన పెట్టలేము. ఎందుకంటే వారి కృతులు ఇప్పటికీ అందరూ పాడుతున్నారు.
ఇంకో పాతికేళ్ళలో ఆ త్రిమూర్తుల 200 సంవత్సరాల ఉత్సవాలు జరుపుంటారు.
బాలమురళి కృతులు ఎంతమంది పాడుతున్నారన్న ప్రశ్నకి జవాబు వెతకడం అంత కష్టమేమీ కాదు.
ఆయన స్వీయ రచనలు కూర్చిన పుస్తకం–గాన సూర్య కాంతి–అద్భుతంగా కూర్చారు; తెలుగు, తమిళ, కన్నడ భాషల లిపిలో ప్రచురించారు. అది నాకు బాగా నచ్చింది. గాన సూర్య కాంతి పుస్తకం కొందామంటే ఎక్కడా దొరకదు. ఎవరికీ పట్ట లేదు–అటు అభిమానులకీ, ఇటు శిష్యులకీ, మరో వైపు సంగీతజ్ఞులకీ.
ఇదీ ప్రస్తుత సంగీతం–గతి, సంగతీ.
బాలమురళి – స్మృతి సరళి గురించి గుమ్మడిదల రంగారావు అభిప్రాయం:
08/23/2026 12:47 am
మంగళంపల్లి వారి మీద వ్యాసం పునఃప్రచురించడం ముదావహం. ఆయన వున్న రోజుల్లో ‘ఈనాటి త్యాగరాజుగా’ ఒక వెలుగు వెలిగారు. ఆయన సంగీతప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలే కాదు, ఏక సంథాగ్రహి కూడా. విజయవాడ మద్రాసు మధ్యలో ప్రతి రైల్వే స్టేషన్ పేరునూ అలవోకగా వల్లెవేయగల అసమాన జ్ఞాపక శక్తి వున్న వ్యక్తి. సంగీత విద్వాంసులకు వుండే piety ఆయనకు లేదు. జీవితంలోని సౌఖ్యాన్ని అనుభవిస్తూనే సంగీతానికి ఎనలేని సేవ చేశారు. నేను ఢిల్లీలో వున్న మూడు దశాబ్దాల కాలంలో ఆయన కచేరీలు ఎన్నో చూశాను. ఆయన కచ్చేరీలకు వయోలిన్, మృదంగం, ఘటం వాయించే వారు వాసి గలవారితో తప్ప ఆయన ధాటికి తట్టుకోవడం కష్టం. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చేవారు సంగీత ప్రియులు ఆయన కచేరీలకు. ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగయ్య, ముత్తయ్య, శ్యామయ్య తో పాటుగా తన స్వీయ రచనలను ఆలపించి మెప్పించేవారు. హనుమ అనుమ మనమా అనే కృతి, తనకు తెలియని కన్న తల్లిని స్మరించుకుంటూ రాసిన అమ్మ అకార ఉకార మకార కృతిలో తనను పెంచిన తల్లికి శివే శివే అని నివాళులు అర్పించటం శ్రోతలను ఎంతగానో అలరించింది. బాలమురళి మరియు సంగీత క్యాసెట్ కంపెనీ కలిసి ఒక ముప్ఫై సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా త్యాగరాజ కృతులను, జన బాహుళ్యంలోకి తీసుకుపోవటానికి గొప్ప కృషి చేశారు. త్యాగయ్య సంస్కృత కీర్తనలు, (అందులోనే సామజవరగమన కూడా వుంది), పంచరత్న కీర్తనలు, తత్వబోధ కీర్తనలు, ఉత్సవ సంప్రదాయా కీర్తనలు వగైరా మరియు ఆయన స్వయంగా రచించి ఆలపించిన థిల్లానాలు, ముఖ్యంగా థిమ్న నాథ రాగమాలిక లో ఊపిరి పీల్చుకోకుండా ఆలపించే సంగతులు, సంగీత ప్రియులను నేటికీ అలరించుతున్నవి. ఓసారి మంగళంపల్లి వారి క్యాసెట్లు రెండిటిమీద ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అవి కాలగర్భంలో కలిసిపోయాయి. నేను రోజూ వాకింగ్ లో బాలమురళి అభోగి రాగంలో రచించిన వేగమె గావరా రంగయ్యా అనే కీర్తనను, సుదీర్ఘ రాగాలాపనను ఆస్వాదిస్తూ వుంటాను. నా వెనక నడిచే వాళ్ళు రోజూ ఇదేనా అంటుంటారు! సంగీత సంప్రదాయం వున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ నాకు సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేదు. కానీ విని ఆనందించే స్పృహ మాత్రం బాగా వుంది. సంగీత జ్ఞానం లేనందుకు ప్రాయశ్చిత్తంగా నా కూతురికి అభేరి అని నామకరణం చేసి, ఆమెకు సంగీతం నేర్పించుతూ శాస్త్రీయ సంగీత పట్ల నాకున్న అభిమానం చాటుకుంటున్నాను.
[ఈ వ్యాసం ఇప్పుడే తొలిసారిగా ప్రచురించబడింది. ‘పునః’ప్రచురణ కాదు. – సం.]
బాలమురళి – స్మృతి సరళి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
08/22/2026 3:00 pm
బాలమురళి స్మృతి ఆద్యంతమూ, సంగీత పరిజ్ఞానం ఏమాత్రమూ లేని నాకు కూడా హృద్యమనిపించింది. బెజవాడ విశేషాలు మరో ఆకర్షణ—నేను లయోలాలో రెండేళ్లు (1974–76) చదవడాన.
గొర్తి తన ‘యజ్ఞం’ (“మనకు తెలియని మన త్యాగరాజు“) లోని ఓ అధ్యాయం, “గాన సూర్యకాంతి: బాలమురళి” లో బాలమురళి బెజవాడ మీద రాసిన పాటను—“వినుమురా విజయ వాణి – కనుమురా కృష్ణ వేణి / ఆలకించు ఆంధ్ర బాల / లాలపించు మధుర వాణి”—చేర్చారు.
త్యాగరాజుతో పోల్చడం చదివితే, నాకు కొడవటిగంటి రాసిన “కర్ణాటక సంగీతంలో శ్రీ బాలమురళీకృష్ణ ప్రతిభ” అన్న వ్యాసం (ఆంధ్రజ్యోతి దినపత్రిక, 9-3-1967) [1] గుర్తొచ్చింది:
“త్యాగయ్య భక్తుడు, కవి, గాయకుడు, సంగీత కళానిధి, సంఘ విమర్శకుడు. కాని, అన్నింటిని మించి సంగీతపు పుట్ట, సంగీతం మహాసముద్రమైతే, త్యాగరాజు గజ ఈతగాడు కాదు, తిమింగలం. ఆయన సంగీతం కోసం బతికాడు. అమిత అరాజక పరిస్థితులలో బతికి భక్తిద్వారా ఆత్మ సాక్షాత్కారం సాధించాడు. అమాయకుడు కాదు, ఆత్మాభిమానం లేనివాడు కాదు. తన గేయాల ద్వారా తన గోడు ఎంత వెళ్ళబోసుకున్నాడో చెప్పడం కష్టం. “నాదు పై పలికేరు నరులు” అన్నాడు. “పుట్టులోభులను పొట్టకై పొగడితి, దుష్టులతో గూడి, దుష్కృత్యములు సలిపినట్టు చేసిన త్యాగరాజును” అని కూడా తానే చెప్పుకున్నాడు. కాని లోకాన్ని వెయ్యి కళ్ళతో చూసి అసహ్యించుకున్నాడు, నవ్వుకున్నాడు, మెచ్చుకున్నాడు, ఏ నాటకం చూసాడో ఏమో, “స్త్రీ వేషధారికి సాధ్వి నడతలు ఏమైనా తెలుసునా?” అనుకున్నాడు.
“ఇటువంటి లక్షణాలు కొన్ని బాలమురళిలో కనిపిస్తున్నాయా? బాలమురళి తన రచనలలో కొన్ని విసుర్లు విసురుతున్నాడు. …
“కర్ణాటక సంగీతానికి కాణాచిగా వుంటూ వస్తున్న దక్షిణ దేశంలో ఆ సంగీతానికి కొత్త జీవం పోయడానికి బాలమురళి అవతరించాడనడానికి ఆధారం వున్నది. ఆ కర్తవ్యం అతను నిర్వహించగలిగితే బాలమురళి నిజంగా అభినవ త్యాగరాజే.”
“గాన సుధాకరుడు” అన్న మరో వ్యాసంలో (ఫిబ్రవరి 1971) [1], బాలమురళీకృష్ణలో ‘విశ్రాంతి’ ధోరణి లేదనీ, గాయకునిగా నిరంతరం పెరగడం అతని అంతస్స్వభావమనీ, అది డబ్బు కోసం కాదనీ, ఒకసారి బాలమురళి తనతో, “ఈ పాటకచ్చేరీలు కాక జరుగుబాటు కావటానికి ఇంకా ఏ మార్గం వున్నా బాగుండును! సంగీతం అమ్ముకోవటం బాధగా వుంది!” అన్నాడని కూడా పేర్కొన్నాడు:
“పెరగటం తన అంతస్స్వభావం గనక పెరుగుతున్న గాయకులు ఎంతమంది వుంటారు? సంగీతం అమ్ముకోవటం బాధగా వుందని ఏ గాయకుడు అంటాడు? ఈ లక్షణాలు గలవాళ్ళు ఇంకా వుంటే వాళ్ళు విలక్షణమైన గాయకులే!
“గాయకుడుగా అతనికి అద్భుతమైన శరీరం వున్నది. అది మంద్ర గాంధారం నుంచి తారాషడ్జమం దాకా పలకటం నేను డజనుసార్లు విన్నాను. అతని శరీరం అతిరథుడి లాంటిది. ఎలాంటి క్లిష్టరీతిలోనూ క్రమశిక్షణ పొరపాటున కూడా కోల్పోడు. రాగమూ, స్వరమూ, లయా అతనికి బానిసలలా వుంటాయి. వాటిపైన అతను చూపే అధికారం అనన్యమనిపిస్తుంది. అతని సంగీతం అగాధమనిపిస్తుంది. చాలామంది తమ యావచ్ఛక్తినీ ప్రదర్శించినట్టూ, అంతకుపైన పోలేరన్నట్టూ ఎప్పుడన్నా అనిపించవచ్చు. బాలమురళి విషయంలో అలా ఏనాడూ అనిపించలేదు నాకు… అంటే నాకు అతని ‘అడుగు’ ఇంతవరకు తగిలినట్టు భావన కలగలేదు.
“ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం వున్నట్టు అనిపిస్తూ వచ్చింది.”
తఃతః గారికీ, గొర్తి గారికీ కృతజ్ఞతలతో,
కొడవళ్ళ హనుమంతరావు
[1] కొడవటిగంటి కుటుంబరావు. రచనా ప్రపంచం – 13వ సంపుటం – సంస్కృతి వ్యాసాలు. విరసం ప్రచురణ. 2014.