ఉదయం లేచీలేవగానే రేడియో పెట్టి భక్తిరంజని వినటం ముఖ్యంగా ఉండేది.
రోజూ మధ్యాహ్నం పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం వచ్చేది. శనివారం మధ్యాహ్నం రెండున్నరకు విజయవాడ కేంద్రం బొమ్మరిల్లు అని చిన్నపిల్లలకోసం కార్యక్రమం వేసేది. అదేసమయంలో హైదరాబాదు కేంద్రం నుండి బాలానందం వచ్చేది.
అలాగే తెలుగుసినిమా ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చేది సంక్షిప్తశబ్దచిత్రంగా ఒక గంటపాటు. రేడియో వారు లవకుశ సినిమానూ గుటలోనికి కుదించగలిగారు విచిత్రం.
రాత్రి తొమ్మిదింటికి ఇంగ్లీషులో వార్తల తరువాత మంచి సంగీతకచేరీ కాని, నాటకం కాని, హరికథకాని వచ్చేది. మానాన్నగారు అవి తప్పక వినేవారు.
ప్రతి మకరసంక్రాంతినాడు మధ్యాహ్నం వైజయంతి అనే ప్రత్యేకకార్యక్రమం ఉండేది. ప్రతి ఉగాదినాడు ఉదయం పదింటికి రేడియోలో కవిసమ్మేళనం ఉండేది. మొదట్లో అందరూ మంచిరసవంతమైన పద్యకవిత్వం వినిపించేవారు. రానురానూ ఉగాదికవిసమ్మేళనాల నిండా ప్రతిలైనూ రెండేసిమార్లు చదివే వచనకవితలే ఉండటంతోనూ అవి అంత రసవంతంగా తోచకపోవటంతోనూ విసుగొచ్చి మానాన్నగారు ఆకవిసమ్మేళనం వినటం మానేసారు.
ఇవి కాక ప్రతిసాయంత్రం నాలుగింటికి సిలోన్ నుండి మీనాక్షీ పొన్నుదొరై వేసే తెలుగు సినిమాపాటలు, బుధవారం రాత్రి ఎనిమిదింటికి వచ్చే బినాకా గీత్ మాలా హిందీ సినీమాపాటలూ యువతరానికి నచ్చేవి. ఇవన్నీ కాక వివిధ్ భారతి కూడా యవతకు బాగా నచ్చేది.
అప్పటి రేడియో కళాకారుల పేర్లు ఇప్పటికీ పెద్దలందరికీ గుర్తే.
ఈ వ్యాసం చదువుతుంటే 50 ఏళ్లనాటి జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాడాయి. ఏవే రేడియో రోజులు. ఆ కాలంలో రేడియో ఒక చిన్న సైజు టీవీ పెట్టెలా ఉండేది. టీవీ లాగే ఒక చోటే స్థిరంగా ఉండేది. అటుఇటు కదల్చటానికి వీలుండేది కాదు. దానికి సిగ్నల్ రావటానికి ఇంటి ముందు రెండు బొంగులకు పొడవైన వైరు కట్టేవాళ్ళు. దాన్నే ఏరియల్ అనేవాళ్ళు.
అవి కరెంటు లేని రోజులు. రేడియో బ్యాటరీ మీద నడిచేది. స్థితిమంతుల ఇళ్లలోనే ఉండేది రేడియో. దాని చుట్టూ జనం చేరేవాళ్ళు. ఆ కాలంలో రేడియో ఒక్కటే ప్రసార సాధనం. వార్తాపత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. పల్లెటూర్లకి ఆలస్యంగా వచ్చేవి. పత్రికలు చదివితే నిన్న ఏమి జరిగిందో తెలుస్తుంది. రేడియో వింటే ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంత తేడా రేడియోకి పత్రికలకు. వ్యవసాయం, వాతావరణం, రామాయణం, మహాభారతం మీద వ్యాఖ్యానం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ అబ్బో ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు వచ్చేవి. శ్రోతలను అలరించేవి. రేడియోలో సినిమా కూడా వచ్చేది. దాన్ని సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు. అంటే కేవలం ఆడియో అన్న మాట.
ఆ తర్వాత రేడియో రూపాంతరం చెంది ట్రాన్సిస్టర్ గా మారిపోయింది. అది ఆ కాలంలో గొప్ప విప్లవాత్మక మార్పుగా భావించారు. ట్రాన్సిస్టర్ ఖరీదు తక్కువ. చేతితో పట్టుకొని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మొదట్లో పెద్దదిగా వున్నా రానురాను చిన్న సైజు ట్రాన్సిస్టర్లు వచ్చాయి మార్కెట్లోకి. మర్ఫీ, బుష్, బాగా పేరుపొందిన బ్రాండ్లు. ఆ తర్వాత ఫిలిప్స్ వచ్చి మిగిలిన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేసింది. ఖరీదైన ట్రాన్సిస్టర్లో బ్యాండ్లు ఉండేవి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 లాగా. మీడియం వేవ్ లో స్థానిక స్టేషన్ల ప్రసారాలు వచ్చేవి. రేడియో టైం అంటే కచ్చితమైన సమయం అనుకునేవారు.
రోజూ ఉదయాన్నే 5.55 కి వాల్టర్ కాఫ్మన్ అనే పాశ్చాత్య సంగీత పండితుడు కంపోజ్ చేసిన సంతక స్వరంతో మొదలై వినసొంపైన కంఠం పలికేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358 మీటర్లు అనగా 857 కిలోహెర్ట్స్ మీద జరిగే ప్రసారాలు అన్న మాటలతో మొదలయ్యేది ప్రసారం. వివిధ భారతిలో జనరంజని కార్యక్రమంలో రోజుకు మూడుసార్లు తెలుగు సినిమా పాటలు వచ్చేవి. అన్ని ఇళ్లలో ఆ సమయంలో అదే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా వినేవారు. పలానా పాట కావాలని ఉత్తరం రాసిన శ్రోతల పేర్లు కూడా చదివేవారు. పిల్లలు తప్పిపోతే రేడియోలో ప్రకటన చేయించేవాళ్ళు. అనేక వస్తువుల ధరలు కూడా రేడియోలో చెప్పేవాళ్ళు. పురాణాల మీద ఉషశ్రీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూసి మరీ వినేవాళ్ళు.
మాది ప్రకాశం జిల్లా. మాకు విజయవాడ కార్యక్రమాలు బాగా వచ్చేవి. తర్వాత కడప నుంచి కూడా వచ్చేవి. విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాలు బలహీనంగా వచ్చేవి. సిగ్నల్ సరిగా లేనందువలన. షార్ట్ వేవ్ మీద సిలోన్ నుంచి వచ్చే బైబిల్ కార్యక్రమంలో సినిమా పాటలు మాత్రం వినేవాళ్ళు!
రేడియోలో వార్తలు చదివే వాళ్లకు మంచి గుర్తింపు ఉండేది. మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ లాంటి పేర్లు ఇప్పటికీ గుర్తే. వీరు ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు చదివేవారు. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే అయ్యేవి. ఆదివారం రాత్రి భోజనాలు అయ్యాక సంక్షిప్త శబ్ద చిత్రం కోసం రేడియో చుట్టూ జనం మూగేవాళ్ళు. శనివారం రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం వచ్చేది. మంగళంపల్లి సహా అందరూ తమ సంగీత ప్రయాణాన్ని రేడియో ద్వారానే ప్రారంభించేవాళ్లు. బి అని బి హై అని, ఏ అని ఏ హై అని గ్రేడ్లు ఉండేవి సంగీత కళాకారులకు. రేడియో ఆర్టిస్ట్ అంటే అదో పెద్ద గౌరవం కళాకారులకు. క్రికెట్ మ్యాచ్ గురించి కామెంట్రీ వినాలంటే రేడియో ఒక్కటే మార్గం. రేడియోకి ఒక ఆదర్శం ఉండేది. అల్లరి చిల్లరి కార్యక్రమాలు అందులో వచ్చేవి కావు. ప్రతి కార్యక్రమంలో ఒక అభ్యుదయం నిమిడి ఉండేది.
ట్రాన్సిస్టర్ రాకముందు పల్లెటూళ్లలో కమ్యూనిటీ రేడియో అని ఉండేది. అక్కడికి చేరేవారు పురుష జనం అంతా! రేడియోని గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేడియోకి లైసెన్స్ ఉండేది 1970 దశకం చివరి వరకు. అలాగే సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేదట! ఏడాదికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి రేడియో లైసెన్స్ ఫీజు.
ట్రాన్సిస్టర్ వచ్చాక కట్నం కింద రేడియో, సైకిల్, చేతి వాచీ లాంటివి కూడా చేరేవి. ఆ రోజులు చాలా బాగుండేవి. మనిషికి తెలిసిన రేడియోని రూపొందించటానికి ఎన్నో దశాబ్దాలుగా శోధించి, శ్రమించి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తల గురించి హనుమంతరావు గారి వ్యాసం చదువుతుంటే మనసంతా నోస్టాల్జిక్ జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ రావుకదా ఆ తీపి రోజులు. ఒక్కసారిగా కాలాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన కొడవళ్ళ హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.
1983 ప్రాంతంలో “అతడు-ఆమె,” “బతుకుపుస్తకం” చదవడాన తఃతః గారి January 18, 2019 వ్యాఖ్య మనసులో ఉండిపోయింది. ఇవాళ వికాసం వారి 2024 ప్రచురణ, “వుప్పల లక్ష్మణరావు రచనలు,” తెరిస్తే మొదట కనిపించింది 1971 నాటి వుప్పల ఉత్తరం:
“మీ స్రుజనాత్మక సాహితీ క్రుషికీ, తెలుగు తల్లి మీద మీకున్న భక్తి గౌరవాలకీ నేనెంతో సంబరపడ్డానని నేనంటే నా మాటలు నీటిమూటలు కావు – నిజంగా నమ్మండి. మీ జట్టు కూడాలనుంది నాకు. నన్ను కూడా మీలో వొహణ్ణిగా తీసుకోండని నా మనవి.”
కొత్తగా తెలుసుకున్న విషయం—తన జీవిత చరిత్రకు ఆయన మొదట పెట్టుకున్న పేరు “అసమర్థుని జీవయాత్ర.” వికాసం సభ్యులు గగ్గోలు పెట్టడంతో, దేవి (డా. దేవరకొండ సహదేవరావు?) గారి సూచన మేరకు “బతుకుపుస్తకం” పేరుకు ఒప్పుకున్నారు.
ఇప్పుడు నాకు 55 ఇయర్స్..ఇలాంటి సబ్జెక్ట్ చూడటం చదవటం ఇదే ప్రథమం..చాలా బాగున్నది .. కాలాలను ఇలా కూడా సూచించారు అనే విషయం మాకు ఏ స్కూల్ లో మాకు చూచాయగా కూడా చెప్పలేదు
శ్రమించి చక్కటి అనువాదం అందించిన శ్రీనివాస్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు.
భాస నాటకాలు చాలావరకు స్వకపోలకల్పితాలే. పాత్రలు పరిచితాలే ఐన సందర్భాల్లో కూడ కథలు అతనివే. ఇందుకు ప్రముఖ ఉదాహరణలు ప్రతిమా, ఊరుభంగం, ఈ మధ్యమ వ్యాయోగం. అతని అద్భుతకల్పనాశక్తికి అంజలి ఘటించి ఆస్వాదించగలగటం అదృష్టం.
ఇకపోతే, భాసుని గురించి కొందరి సాహితీవిమర్శలు పట్టించుకోవలసినవి కావని నా అభిప్రాయం. రచనల్లో కులవ్యవస్థను చూపిన తీరునుబట్టి కవుల కాలాన్ని నిర్ణయించటమంటే రామాయణ భారతాల్నీ, మనుధర్మశాస్త్రాన్నీ, కాళిదాసు తర్వాత వచ్చినవిగా పరిగణించాల్సి వస్తుందన్న ఆలోచన కూడ వారికి తట్టినట్టు లేదు. రామాయణంలో విశ్వామిత్రుడి కథ సైతం వారికి తెలియదా? ఏమైనా ఇది ఇంతటితో ఆపుదాం.
వ్యాసం చాలా వివరణాత్మకంగా బాగుంది. వ్యాసకర్త కొండలరావు గారు ఇండియా వచ్చి అగమ్య గమ్యాలు రచయిత ముకుంద రామారావు గారిని కలిసి తమ తమ అనుభవాలు పంచుకున్న విషయం తెలిసి చాలా సంతోషించాను. అయితే దక్షిణాఫ్రికాకు రామారావు గారి పూర్వికులు కూలీలుగా వెళ్ళలేదు. ఇండెచర్ లేబర్ కు తెలుగులో వలస కార్మికులు సరైన పదం. కూలీ పదాన్ని శ్వేత జాతీయులు మనవారిని నీచంగా అవమానించడానికి అగౌరవంగా వాడేవారు. దానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ స్వరం వినిపించిన వారిలో గాంధీజీ ప్రముఖుడు. ముకుంద రామారావు తన పుస్తకంలో ఈ విషయం బలంగా ప్రస్తావించారు. కొండల రావు గారూ మీరు కూడా కూలీ పదాన్ని తొలగించి కార్మికులు అని రాస్తే బాగుంటుంది.
కొడవటిగంటి నవల “ఐశ్వర్యం” లో డాక్టరు, incongruity తో భాసుడు హాస్యం పుట్టించాడన్నాడు (“మా అమ్మకి నర మాసం మీద కోరిక మళ్ళింది, మీ కొడుకుల్లో ఒకరిని ఇవ్వమని,” ఘటోత్కచుడు వినయంగా కోరడం). భాసుడి ప్రధాన గుణం నాటకీయ వక్రత (dramatic irony) అని వి. వెంకటాచలం రాశారు. ఈ చక్కని అనువాదం దానిని ప్రతిబింబిస్తుంది. “ఈమాట” లోని ఉరుపుటూరి వ్యాసాలు కొద్దివే అయినా తనకున్న ఉభయ భాషాపాండిత్యం వెల్లడవుతుంది. భాసుని ఇతర రూపకాలని కూడా అనువదిస్తారని ఆశిస్తాను.
క్రింది స్వగతంలో “గౌరవనీయమైన స్థాయికి” బదులు “దుస్థితికి” అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది (చందమామలో కథ).
భీముడు:
(తనలో) ఇదెక్కడి తల్లి ఆజ్ఞ! పెద్దవారిని సేవించడం విషయమై ఈ అమాయకుడికి ఎంత శ్రద్ధ!
మనుషులకైనా, దేవతలకైనా తల్లియే దైవము. అమ్మ మాటను ఔదలదాల్చినందుకే కదా మేము ఈనాడు ఈ గౌరవనీయమైన స్థాయికి చేరుకున్నాము.
సంస్కృతం-తెలుగు పైనా కిందా కాకుండా పక్కపక్కన ఉంటే చదవడానికి ఆటంకం కలగదు.
వాడ్రేవు వ్యాఖ్య:
“భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు కాలూనుకుంటున్న సమయాన్ని కాళిదాసు నాటకాలు ప్రతిబింబిస్తే, ఆ ధర్మాలు పూర్తిగా వేళ్ళుదన్నుకున్న కాలం భాసనాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు నాటకాల్లో ఒక వర్ణం కన్నా మరొక వర్ణం గొప్పదనే భావనగానీ లేదా ఒక ఆశ్రమవిధికన్నా మరొక ఆశ్రమ విధి గొప్పదనే ప్రచారం కానీ కనిపించవు. కానీ సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.”
తనకు నిమ్నవృత్తుల వారితో చిన్నతనం నుండీ ఉన్న దగ్గరి సంబంధాల వలన కాని, ఉన్నత సంస్కారం వలన కాని వారిపై కల సానుభూతి వలన వాడ్రేవుకి ఈహాస్య రూపకంలోని సంభాషణలు జుగుప్స కలిగించి ఉండవచ్చు. దానిని పక్కనబెట్టి తను లేవదీసిన విషయం గురించి ఓమాట.
వాడ్రేవు వ్యాఖ్యకి సందర్భం: “Metatheatre and Sanskrit Drama,” by Michael Lockwood and A. Vishnu Bhat (2005)లో వారు భాసుని నాటకాలు ఇప్పటివరకూ పండితవర్గం అతను కాళిదాసు (క్రీ. శ. 4-5 వ శతాబ్ది) కి పూర్వం వాడు అంటున్నది తప్పని తీర్మానించారు. కాళిదాసు రచనలో “భాస” అన్నది ఒక విశేషణమే కాని రచయిత పేరు కాదు అని వారి థీసిస్. అంతేకాక భాస నాటకాలు దక్షిణ భారతదేశపు రాజయిన మహేంద్రవర్మ (క్రీ.శ. 6-7 వ శతాభ్ది) రచనలయి ఉంటాయని వారి వాదన.
వారిని సమర్థిస్తూ వాడ్రేవు అందుకు కొంత రుజువుగా, కాళిదాస నాటకాలలో వర్ణాశ్రమ ధర్మాలు కేవలం కాలూనుకుంటున్నవనీ (still establishing), భాసుని నాటకాలలో అవి పూర్తిగా వేళ్ళుదన్నుకున్నవనీ (deep rooted) అన్నారు.
నా పరిమిత సాహితీ జ్ఞానంతో దానికి నా ప్రతివాదం: కాళిదాస శాకుంతలంలోని జాలరి కథని చదివితే వర్ణాశ్రమ ధర్మాలు అప్పటికే వేళ్ళుదన్నుకున్నట్లు అనిపించడం లేదా?
కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
05/12/2026 7:50 pm
విజయవాడ కేంద్రం 357.1 కాని 358 కాదండి.
ఉదయం లేచీలేవగానే రేడియో పెట్టి భక్తిరంజని వినటం ముఖ్యంగా ఉండేది.
రోజూ మధ్యాహ్నం పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం వచ్చేది. శనివారం మధ్యాహ్నం రెండున్నరకు విజయవాడ కేంద్రం బొమ్మరిల్లు అని చిన్నపిల్లలకోసం కార్యక్రమం వేసేది. అదేసమయంలో హైదరాబాదు కేంద్రం నుండి బాలానందం వచ్చేది.
అలాగే తెలుగుసినిమా ఆదివారం మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చేది సంక్షిప్తశబ్దచిత్రంగా ఒక గంటపాటు. రేడియో వారు లవకుశ సినిమానూ గుటలోనికి కుదించగలిగారు విచిత్రం.
రాత్రి తొమ్మిదింటికి ఇంగ్లీషులో వార్తల తరువాత మంచి సంగీతకచేరీ కాని, నాటకం కాని, హరికథకాని వచ్చేది. మానాన్నగారు అవి తప్పక వినేవారు.
ప్రతి మకరసంక్రాంతినాడు మధ్యాహ్నం వైజయంతి అనే ప్రత్యేకకార్యక్రమం ఉండేది. ప్రతి ఉగాదినాడు ఉదయం పదింటికి రేడియోలో కవిసమ్మేళనం ఉండేది. మొదట్లో అందరూ మంచిరసవంతమైన పద్యకవిత్వం వినిపించేవారు. రానురానూ ఉగాదికవిసమ్మేళనాల నిండా ప్రతిలైనూ రెండేసిమార్లు చదివే వచనకవితలే ఉండటంతోనూ అవి అంత రసవంతంగా తోచకపోవటంతోనూ విసుగొచ్చి మానాన్నగారు ఆకవిసమ్మేళనం వినటం మానేసారు.
ఇవి కాక ప్రతిసాయంత్రం నాలుగింటికి సిలోన్ నుండి మీనాక్షీ పొన్నుదొరై వేసే తెలుగు సినిమాపాటలు, బుధవారం రాత్రి ఎనిమిదింటికి వచ్చే బినాకా గీత్ మాలా హిందీ సినీమాపాటలూ యువతరానికి నచ్చేవి. ఇవన్నీ కాక వివిధ్ భారతి కూడా యవతకు బాగా నచ్చేది.
అప్పటి రేడియో కళాకారుల పేర్లు ఇప్పటికీ పెద్దలందరికీ గుర్తే.
ఆ రేడియోరోజులే వేరు. అన్నీ మధురస్మృతులే.
కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి G.RANGARAO అభిప్రాయం:
05/12/2026 7:10 am
ఈ వ్యాసం చదువుతుంటే 50 ఏళ్లనాటి జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాడాయి. ఏవే రేడియో రోజులు. ఆ కాలంలో రేడియో ఒక చిన్న సైజు టీవీ పెట్టెలా ఉండేది. టీవీ లాగే ఒక చోటే స్థిరంగా ఉండేది. అటుఇటు కదల్చటానికి వీలుండేది కాదు. దానికి సిగ్నల్ రావటానికి ఇంటి ముందు రెండు బొంగులకు పొడవైన వైరు కట్టేవాళ్ళు. దాన్నే ఏరియల్ అనేవాళ్ళు.
అవి కరెంటు లేని రోజులు. రేడియో బ్యాటరీ మీద నడిచేది. స్థితిమంతుల ఇళ్లలోనే ఉండేది రేడియో. దాని చుట్టూ జనం చేరేవాళ్ళు. ఆ కాలంలో రేడియో ఒక్కటే ప్రసార సాధనం. వార్తాపత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. పల్లెటూర్లకి ఆలస్యంగా వచ్చేవి. పత్రికలు చదివితే నిన్న ఏమి జరిగిందో తెలుస్తుంది. రేడియో వింటే ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంత తేడా రేడియోకి పత్రికలకు. వ్యవసాయం, వాతావరణం, రామాయణం, మహాభారతం మీద వ్యాఖ్యానం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ అబ్బో ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు వచ్చేవి. శ్రోతలను అలరించేవి. రేడియోలో సినిమా కూడా వచ్చేది. దాన్ని సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు. అంటే కేవలం ఆడియో అన్న మాట.
ఆ తర్వాత రేడియో రూపాంతరం చెంది ట్రాన్సిస్టర్ గా మారిపోయింది. అది ఆ కాలంలో గొప్ప విప్లవాత్మక మార్పుగా భావించారు. ట్రాన్సిస్టర్ ఖరీదు తక్కువ. చేతితో పట్టుకొని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మొదట్లో పెద్దదిగా వున్నా రానురాను చిన్న సైజు ట్రాన్సిస్టర్లు వచ్చాయి మార్కెట్లోకి. మర్ఫీ, బుష్, బాగా పేరుపొందిన బ్రాండ్లు. ఆ తర్వాత ఫిలిప్స్ వచ్చి మిగిలిన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేసింది. ఖరీదైన ట్రాన్సిస్టర్లో బ్యాండ్లు ఉండేవి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 లాగా. మీడియం వేవ్ లో స్థానిక స్టేషన్ల ప్రసారాలు వచ్చేవి. రేడియో టైం అంటే కచ్చితమైన సమయం అనుకునేవారు.
రోజూ ఉదయాన్నే 5.55 కి వాల్టర్ కాఫ్మన్ అనే పాశ్చాత్య సంగీత పండితుడు కంపోజ్ చేసిన సంతక స్వరంతో మొదలై వినసొంపైన కంఠం పలికేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358 మీటర్లు అనగా 857 కిలోహెర్ట్స్ మీద జరిగే ప్రసారాలు అన్న మాటలతో మొదలయ్యేది ప్రసారం. వివిధ భారతిలో జనరంజని కార్యక్రమంలో రోజుకు మూడుసార్లు తెలుగు సినిమా పాటలు వచ్చేవి. అన్ని ఇళ్లలో ఆ సమయంలో అదే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా వినేవారు. పలానా పాట కావాలని ఉత్తరం రాసిన శ్రోతల పేర్లు కూడా చదివేవారు. పిల్లలు తప్పిపోతే రేడియోలో ప్రకటన చేయించేవాళ్ళు. అనేక వస్తువుల ధరలు కూడా రేడియోలో చెప్పేవాళ్ళు. పురాణాల మీద ఉషశ్రీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూసి మరీ వినేవాళ్ళు.
మాది ప్రకాశం జిల్లా. మాకు విజయవాడ కార్యక్రమాలు బాగా వచ్చేవి. తర్వాత కడప నుంచి కూడా వచ్చేవి. విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాలు బలహీనంగా వచ్చేవి. సిగ్నల్ సరిగా లేనందువలన. షార్ట్ వేవ్ మీద సిలోన్ నుంచి వచ్చే బైబిల్ కార్యక్రమంలో సినిమా పాటలు మాత్రం వినేవాళ్ళు!
రేడియోలో వార్తలు చదివే వాళ్లకు మంచి గుర్తింపు ఉండేది. మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ లాంటి పేర్లు ఇప్పటికీ గుర్తే. వీరు ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు చదివేవారు. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే అయ్యేవి. ఆదివారం రాత్రి భోజనాలు అయ్యాక సంక్షిప్త శబ్ద చిత్రం కోసం రేడియో చుట్టూ జనం మూగేవాళ్ళు. శనివారం రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం వచ్చేది. మంగళంపల్లి సహా అందరూ తమ సంగీత ప్రయాణాన్ని రేడియో ద్వారానే ప్రారంభించేవాళ్లు. బి అని బి హై అని, ఏ అని ఏ హై అని గ్రేడ్లు ఉండేవి సంగీత కళాకారులకు. రేడియో ఆర్టిస్ట్ అంటే అదో పెద్ద గౌరవం కళాకారులకు. క్రికెట్ మ్యాచ్ గురించి కామెంట్రీ వినాలంటే రేడియో ఒక్కటే మార్గం. రేడియోకి ఒక ఆదర్శం ఉండేది. అల్లరి చిల్లరి కార్యక్రమాలు అందులో వచ్చేవి కావు. ప్రతి కార్యక్రమంలో ఒక అభ్యుదయం నిమిడి ఉండేది.
ట్రాన్సిస్టర్ రాకముందు పల్లెటూళ్లలో కమ్యూనిటీ రేడియో అని ఉండేది. అక్కడికి చేరేవారు పురుష జనం అంతా! రేడియోని గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేడియోకి లైసెన్స్ ఉండేది 1970 దశకం చివరి వరకు. అలాగే సైకిల్కి కూడా లైసెన్స్ ఉండేదట! ఏడాదికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి రేడియో లైసెన్స్ ఫీజు.
ట్రాన్సిస్టర్ వచ్చాక కట్నం కింద రేడియో, సైకిల్, చేతి వాచీ లాంటివి కూడా చేరేవి. ఆ రోజులు చాలా బాగుండేవి. మనిషికి తెలిసిన రేడియోని రూపొందించటానికి ఎన్నో దశాబ్దాలుగా శోధించి, శ్రమించి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తల గురించి హనుమంతరావు గారి వ్యాసం చదువుతుంటే మనసంతా నోస్టాల్జిక్ జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ రావుకదా ఆ తీపి రోజులు. ఒక్కసారిగా కాలాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన కొడవళ్ళ హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.
చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/09/2026 6:21 pm
1983 ప్రాంతంలో “అతడు-ఆమె,” “బతుకుపుస్తకం” చదవడాన తఃతః గారి January 18, 2019 వ్యాఖ్య మనసులో ఉండిపోయింది. ఇవాళ వికాసం వారి 2024 ప్రచురణ, “వుప్పల లక్ష్మణరావు రచనలు,” తెరిస్తే మొదట కనిపించింది 1971 నాటి వుప్పల ఉత్తరం:
“మీ స్రుజనాత్మక సాహితీ క్రుషికీ, తెలుగు తల్లి మీద మీకున్న భక్తి గౌరవాలకీ నేనెంతో సంబరపడ్డానని నేనంటే నా మాటలు నీటిమూటలు కావు – నిజంగా నమ్మండి. మీ జట్టు కూడాలనుంది నాకు. నన్ను కూడా మీలో వొహణ్ణిగా తీసుకోండని నా మనవి.”
కొత్తగా తెలుసుకున్న విషయం—తన జీవిత చరిత్రకు ఆయన మొదట పెట్టుకున్న పేరు “అసమర్థుని జీవయాత్ర.” వికాసం సభ్యులు గగ్గోలు పెట్టడంతో, దేవి (డా. దేవరకొండ సహదేవరావు?) గారి సూచన మేరకు “బతుకుపుస్తకం” పేరుకు ఒప్పుకున్నారు.
కొడవళ్ళ హనుమంతరావు
పలుకుబడి: ఋతువులు, కాలాలు గురించి హరి ప్రసాద రావు అభిప్రాయం:
05/08/2026 10:16 pm
ఇప్పుడు నాకు 55 ఇయర్స్..ఇలాంటి సబ్జెక్ట్ చూడటం చదవటం ఇదే ప్రథమం..చాలా బాగున్నది .. కాలాలను ఇలా కూడా సూచించారు అనే విషయం మాకు ఏ స్కూల్ లో మాకు చూచాయగా కూడా చెప్పలేదు
కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం గురించి రామకృష్ణ శిష్ట్లా అభిప్రాయం:
05/08/2026 1:19 pm
మీ వ్యాసాలు చాలా బాగున్నాయి. మీరు ఎంచుకున్న విషయం క్లిష్టమైనదైనా పాఠకులకు సరళంగా అర్ధమైయ్యేట్లు అద్భుతం గా అందించారు.
మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
05/07/2026 7:05 pm
శ్రమించి చక్కటి అనువాదం అందించిన శ్రీనివాస్ గారికి అభినందనలు, కృతజ్ఞతలు.
భాస నాటకాలు చాలావరకు స్వకపోలకల్పితాలే. పాత్రలు పరిచితాలే ఐన సందర్భాల్లో కూడ కథలు అతనివే. ఇందుకు ప్రముఖ ఉదాహరణలు ప్రతిమా, ఊరుభంగం, ఈ మధ్యమ వ్యాయోగం. అతని అద్భుతకల్పనాశక్తికి అంజలి ఘటించి ఆస్వాదించగలగటం అదృష్టం.
ఇకపోతే, భాసుని గురించి కొందరి సాహితీవిమర్శలు పట్టించుకోవలసినవి కావని నా అభిప్రాయం. రచనల్లో కులవ్యవస్థను చూపిన తీరునుబట్టి కవుల కాలాన్ని నిర్ణయించటమంటే రామాయణ భారతాల్నీ, మనుధర్మశాస్త్రాన్నీ, కాళిదాసు తర్వాత వచ్చినవిగా పరిగణించాల్సి వస్తుందన్న ఆలోచన కూడ వారికి తట్టినట్టు లేదు. రామాయణంలో విశ్వామిత్రుడి కథ సైతం వారికి తెలియదా? ఏమైనా ఇది ఇంతటితో ఆపుదాం.
[Comment edited — సంపాదకులు.]
మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/05/2026 10:47 am
నేనన్న “‘గౌరవనీయమైన స్థాయికి’ బదులు ‘దుస్థితికి’ అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది,” తప్పేమో. ఐరనీ ఉండాలంటే వక్రత ఉండాలి కదా.
కొడవళ్ళ హనుమంతరావు
సౌతాఫ్రికాలో ప్రవాస ప్రస్థానం-2 గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:
05/05/2026 1:04 am
వ్యాసం చాలా వివరణాత్మకంగా బాగుంది. వ్యాసకర్త కొండలరావు గారు ఇండియా వచ్చి అగమ్య గమ్యాలు రచయిత ముకుంద రామారావు గారిని కలిసి తమ తమ అనుభవాలు పంచుకున్న విషయం తెలిసి చాలా సంతోషించాను. అయితే దక్షిణాఫ్రికాకు రామారావు గారి పూర్వికులు కూలీలుగా వెళ్ళలేదు. ఇండెచర్ లేబర్ కు తెలుగులో వలస కార్మికులు సరైన పదం. కూలీ పదాన్ని శ్వేత జాతీయులు మనవారిని నీచంగా అవమానించడానికి అగౌరవంగా వాడేవారు. దానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ స్వరం వినిపించిన వారిలో గాంధీజీ ప్రముఖుడు. ముకుంద రామారావు తన పుస్తకంలో ఈ విషయం బలంగా ప్రస్తావించారు. కొండల రావు గారూ మీరు కూడా కూలీ పదాన్ని తొలగించి కార్మికులు అని రాస్తే బాగుంటుంది.
మధ్యమవ్యాయోగము – సమూలానువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
05/03/2026 6:57 pm
కొడవటిగంటి నవల “ఐశ్వర్యం” లో డాక్టరు, incongruity తో భాసుడు హాస్యం పుట్టించాడన్నాడు (“మా అమ్మకి నర మాసం మీద కోరిక మళ్ళింది, మీ కొడుకుల్లో ఒకరిని ఇవ్వమని,” ఘటోత్కచుడు వినయంగా కోరడం). భాసుడి ప్రధాన గుణం నాటకీయ వక్రత (dramatic irony) అని వి. వెంకటాచలం రాశారు. ఈ చక్కని అనువాదం దానిని ప్రతిబింబిస్తుంది. “ఈమాట” లోని ఉరుపుటూరి వ్యాసాలు కొద్దివే అయినా తనకున్న ఉభయ భాషాపాండిత్యం వెల్లడవుతుంది. భాసుని ఇతర రూపకాలని కూడా అనువదిస్తారని ఆశిస్తాను.
క్రింది స్వగతంలో “గౌరవనీయమైన స్థాయికి” బదులు “దుస్థితికి” అని ఉండాలి – లేకపోతే ఐరనీ పోతుంది (చందమామలో కథ).
భీముడు:
(తనలో) ఇదెక్కడి తల్లి ఆజ్ఞ! పెద్దవారిని సేవించడం విషయమై ఈ అమాయకుడికి ఎంత శ్రద్ధ!
మనుషులకైనా, దేవతలకైనా తల్లియే దైవము. అమ్మ మాటను ఔదలదాల్చినందుకే కదా మేము ఈనాడు ఈ గౌరవనీయమైన స్థాయికి చేరుకున్నాము.
సంస్కృతం-తెలుగు పైనా కిందా కాకుండా పక్కపక్కన ఉంటే చదవడానికి ఆటంకం కలగదు.
వాడ్రేవు వ్యాఖ్య:
“భారతీయ సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు కాలూనుకుంటున్న సమయాన్ని కాళిదాసు నాటకాలు ప్రతిబింబిస్తే, ఆ ధర్మాలు పూర్తిగా వేళ్ళుదన్నుకున్న కాలం భాసనాటకాల్లో కనిపిస్తుంది. కాళిదాసు నాటకాల్లో ఒక వర్ణం కన్నా మరొక వర్ణం గొప్పదనే భావనగానీ లేదా ఒక ఆశ్రమవిధికన్నా మరొక ఆశ్రమ విధి గొప్పదనే ప్రచారం కానీ కనిపించవు. కానీ సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.”
తనకు నిమ్నవృత్తుల వారితో చిన్నతనం నుండీ ఉన్న దగ్గరి సంబంధాల వలన కాని, ఉన్నత సంస్కారం వలన కాని వారిపై కల సానుభూతి వలన వాడ్రేవుకి ఈహాస్య రూపకంలోని సంభాషణలు జుగుప్స కలిగించి ఉండవచ్చు. దానిని పక్కనబెట్టి తను లేవదీసిన విషయం గురించి ఓమాట.
వాడ్రేవు వ్యాఖ్యకి సందర్భం: “Metatheatre and Sanskrit Drama,” by Michael Lockwood and A. Vishnu Bhat (2005)లో వారు భాసుని నాటకాలు ఇప్పటివరకూ పండితవర్గం అతను కాళిదాసు (క్రీ. శ. 4-5 వ శతాబ్ది) కి పూర్వం వాడు అంటున్నది తప్పని తీర్మానించారు. కాళిదాసు రచనలో “భాస” అన్నది ఒక విశేషణమే కాని రచయిత పేరు కాదు అని వారి థీసిస్. అంతేకాక భాస నాటకాలు దక్షిణ భారతదేశపు రాజయిన మహేంద్రవర్మ (క్రీ.శ. 6-7 వ శతాభ్ది) రచనలయి ఉంటాయని వారి వాదన.
వారిని సమర్థిస్తూ వాడ్రేవు అందుకు కొంత రుజువుగా, కాళిదాస నాటకాలలో వర్ణాశ్రమ ధర్మాలు కేవలం కాలూనుకుంటున్నవనీ (still establishing), భాసుని నాటకాలలో అవి పూర్తిగా వేళ్ళుదన్నుకున్నవనీ (deep rooted) అన్నారు.
నా పరిమిత సాహితీ జ్ఞానంతో దానికి నా ప్రతివాదం: కాళిదాస శాకుంతలంలోని జాలరి కథని చదివితే వర్ణాశ్రమ ధర్మాలు అప్పటికే వేళ్ళుదన్నుకున్నట్లు అనిపించడం లేదా?
కొడవళ్ళ హనుమంతరావు
మనసును దోచే మనస్లు– 5 గురించి Ramesh అభిప్రాయం:
05/03/2026 6:42 pm
మీ యాత్రానుభవాలు ఎంతో చక్కగా వున్నాయి. ఫుర్బు మీకొక book కానుకగా యివ్వడం మనసుని తాకింది., థాంక్స్, నమస్కారం, ఆరోగ్యమస్తు.