సీతాకోకచిలుక పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి. త్యాగము ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా.

అద్దం ఎదుట నిలబడి ఒకసారి చూసుకొండి! ఏమిటి కనిపించింది? రెండు కళ్ళతో సూటిగా ఎదుటికి చూస్తూన్న ఒక భోక్త విగ్రహం! దరిదాపుగా భోక్తలన్నిటికి రెండు కళ్ళు, ముఖానికి మధ్యస్థంగా ఉండి, ఎట్టఎదుటకు సూటిగా చూస్తూ ఉంటాయి; తద్వారా వాటి ద్విచక్షు దృష్టిని ఉపయోగించి అవి భోజ్యాన్ని వేటాడి తినగలవు!

ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది.

నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.

ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.

దొస్తోయెవ్‍స్కీ ప్రధానజీవితదర్శనం బాధ్యతారహితనిశ్చేష్టతను, హేతువాదస్వర్గాన్ని, వ్యతిరేకిస్తుంది. రెండు రెళ్ళు నాలుగే. నిజమే. కాని రెండు రెళ్ళు అయిదు అనే స్వేచ్ఛ నీకు లేదని ఎందుకు అనుకుంటావు? విధినిర్ణయం జరిగిపోయింది. నిజమే, కాని దాని అర్థం నీ బాధ్యత లేదని కాదు.

ఈ సందర్భంలో గతంలో జరిగిన ఒక హృదయ విదారకమైన సంఘటనని మన దృష్టికోణంలో పెట్టుకోవడం అప్రస్తుతం కాదు. వేవిళ్ళతో బాధపడే గర్భిణులకి ఉపశమనం కలిగించడానికి 1950, 1960 దశకాలలో థాలిడొమైడ్ అనే మందు వాడడం వల్ల దరిదాపు 10,000 మంది పిల్లలు వికలాంగులుగా పుట్టేరు.

భావనాబలం, సంకల్పం ఉంటే హిందూ జాతి గొప్పదిగా అవతరిస్తుoది అని గోల్వాల్కర్ అంటాడు. అదే భావనాబలంతో క్రైస్తవులు ముస్లింలు తమ జాతి గొప్పదని చాటుకోవచ్చు కదా అని నిలదీస్తాడు కరపాత్ర స్వామి. హిందుత్వకి అనుగుణంగా భారతీయ తత్వాన్ని ఆలోచనలని వక్రీకరించడాన్నీ తీవ్రంగా ఖండిస్తాడు. నిత్య అనిత్య వస్తు వివేకం అనే శంకర అద్వైత భావనని హిందూ సమాజ పరంగా అన్వయిస్తాడు గోల్వాల్కర్.

ఒకానొక కాలంలో విశ్వాసం ఒక జీవితకాల సాధన. మించి సాధించదగింది లేదు. ఈనాడు ‘నేను విశ్వాసిని’ అని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాం. మనకు విశ్వాసం వద్దు. అది మూఢులకు. మనం మేధావులం. విశ్వాసం నీళ్ళను మద్యంగా మారుస్తుంది. మనకీనాడు మద్యం మంచినీళ్ళు.

కాలం క్షణికమా? శాశ్వతమా? స్థిర రాశా? చర రాశా? మనం పరిశీలిస్తున్న వస్తువులలో వచ్చిన మార్పుని కొలిచే సాధనమా? లేక మార్పుకి మరో పేరే కాలమా? అది మనలో భాగమా? పరిశీలించే హృదయానికే దాని అస్తిత్వం అవగతమౌతుందా? లేక ఇతర అస్తిత్వాలతో సంబంధం లేకుండా తన కొక ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నదా? రెండువేల సంవత్సరాలకు పైగా ఈ ప్రశ్నలు శాస్త్రజ్ఞులని, తత్త్వవేత్తలనీ సమానంగా సవాలు చేశాయి.

వయసు, అనారోగ్యాల కారణంగా అంబేద్కర్ తన భార్యకి మూడు లక్షణాలు ఉండాలి అనుకున్నాడు. తనకు కాబోయే భార్య విద్యావంతురాలు, వైద్యురాలు, వంటనేర్చిన వ్యక్తి కావాలని ఆయన కోరుకున్నాడు. సవితా అంబేద్కర్ ఆ పాత్రలు అన్నీ ఒక ఆధునిక ఆదర్శ గృహిణిగా పోషించినట్లుగా ఆమె కథనం ఉంది.

శంతనుడికి ఒక అన్నగారు ఉన్నారన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. ఈ అన్నగారైన దేవాపి – బొల్లి (రోగం) వల్ల రాజ్యార్హతని పోగొట్టుకుని అడవులలో తపస్సు చేసుకుందుకు వెళ్ళిపోబట్టే చిన్నవాడైన శంతనుడికి రాజ్యం దక్కింది. తరువాత తరంలో దేవవ్రతుడికి దక్కవలసిన రాజ్యం మరొక విధంగా చెయ్యి జారిపోయింది. పోనీ శంతనుడికి సత్యవతి వల్ల కలిగిన ప్రథమ సంతానమైన చిత్రాంగదుడికి రాజ్యం దక్కిందా? అదీ లేదు.

ఎక్కడో సుదూరపు మధ్య అమెరికా, దక్షిణ అమెరికా ప్రజల గురించి రాసిన పుస్తకం కాదిది – సమస్త మానవాళి ఆశనిరాశలను, సుఖదుఃఖాలను, కష్టనష్టాలను, ఉత్థానపతనాలను, విజయపరాజయాలను, కరుణాక్రౌర్యాలను, స్వార్థాలూ ఉదారతలను విప్పి చెప్పే రచన ఇది.

ఇక్కడ, నా ఆలోచనలు, అనుమానాలు, అభిప్రాయాలు కాసిని మీతో పంచుకుంటాను, ఓపికుండి చదవగోరే వారికోసం. దీనిని నేను ఒక క్రమపద్ధతిలో వ్యాసంలాగా నిర్మించటం లేదు. మాటల పొదుపు పాటించటం లేదు. ఇది ఒక డిౙల్టరీ కాన్వర్సేషన్, ఒక అన్‌ప్లగ్‌డ్ మోనోలాగ్. తీరిగ్గా, పొడూగ్గా ఊహకొచ్చినట్టు వ్రాసుకుంటూ పోతాను, మిమ్మల్నీ అంతే తీరిగ్గా నిదానంగా చదువుకోమని చెప్తాను. ఇప్పుడే చెప్తున్నాను, మీరు చదవకపోతే కోల్పోయేదీ ఏమీ లేదు!

ఆత్మవిమర్శ చేసుకోలేని, ఏ ఉద్యమమైనా ఏ వాదమైనా అంతిమంగా పెడదారే పట్టింది, పడుతుంది. ఎటువంటి ఉద్యమమైనా వాటిలో ఈ ఆత్మవిమర్శ అన్నది లేనంతవరకూ వాటివల్ల సమాజానికి చిరకాలపు మంచి జరగదు. తాత్కాలికంగా కొంత అభ్యుదయం ఉన్నట్లు కనిపించవచ్చు. అంతే. ఆత్మవిమర్శ లేని ఉద్యమాలు వాటిని నడిపే వ్యక్తులకు మాత్రమే లాభం చేకూరుస్తాయి. ఆత్మవిమర్శ లేనంతకాలం ఈ అస్తిత్వవాద ఉద్యమాలపై నా అభిప్రాయం మారదు.

మానవుడిని కేంద్రంగా చేసుకుని తత్వాన్నీ విజ్ఞానాన్నీ రూపొందిస్తే తప్పేముంది? అది ప్రగతికి సోపానం కదా? మానవ జాతి అభివృద్ధికి ఉపకరిస్తుంది కదా? ప్రపంచానికి ఎంతో విజ్ఞానాన్ని ప్రసాదించిందని చెప్పే భారత్ కులవ్యవస్థలో మగ్గిపోతుండగా క్రైస్తవ పాశ్చాత్యం మానవుడే మహనీయుడని చాటుతోంది కదా అని అడగవచ్చు.

ఎలా అయితే వారి జీవన అస్తిత్వానికి మతమో, దేశమో, సినిమా నటులో ఊతమో, వీరి అస్తిత్వానికి ఈ అభ్యుదయవాదం అలా ఒక ఊతం. అందుకే వీళ్ళు కాలంతో మారరు. ఇది ఆవేదన నుంచి నిజాయితీగా పుట్టిన ఆవేశం కాదు. అలా ఆవేశించడం సమాజంలో వారి ఉనికికి కేవలం ఒక అవసరం. రాజకీయనాయకులు ప్రజల పట్ల చూపించే ప్రేమ లాంటిదే ఇది. వకాలత్‍గిరీ అంటే ఇదే. రాముడు వచ్చి తనను రక్షించమని భక్తులకు చెప్పాడా? లేదు.

మానవస్వభావానికి, కులాలు మతాలు భాష ప్రాంతాలు దేశాలు వంటి నియమాల గోడలు ఉంటాయా? చట్టం వారిని పట్టుకున్నప్పుడో, సమాజం వారిని వేలెత్తి చూపినప్పుడో, మేము నిమ్న/దళిత/ముస్లిం/స్త్రీ కాబట్టే మమ్మల్ని ఇలా… అని ‘సమయానికి తగు కార్డు’ వాడిన రాజకీయ నాయకులు, ఉన్నత ప్రభుత్వోద్యోగులు, క్రీడాకారులు, రచయితలు, నటులు ఎందరు లేరు వీరిలో? వీరిని విమర్శించినంత ‘మాత్రాన’ అగ్రవర్ణ, మతదురహంకారులు అని ముద్ర వేసేయచ్చా ఎవరినైనా?

మెదడులలో ఉండే జీవకణాలని న్యూరానులు అంటారు. ఇవి శరీరంలోని ఇతర జీవకణాలవంటివి కావు. ఈ న్యూరానులని కొన్నింటిని ఒక జాడీలో వేసి అలా వాటి మానాన్న వాటిని వదిలేస్తే కొంతసేపట్లో అవి ‘ఆలోచించడం’ మొదలెడతాయి! ఈ వాక్యం కాసింత అతిశయోక్తి అనిపించినా, ఇది హాప్‌ఫీల్డ్ పరిశోధన సారాంశం.

కుగ్రామంలో పుట్టి పెరిగి, పట్నానికి వెళ్ళి, దాన్ని వదలిపెట్టి అడవి దాపుకి వెళ్ళిన కవి మనిషినీ ప్రకృతినీ పునర్దర్శించి వాటి మధ్యనున్నది, ఆదిమానికీ ఆధునికానికీ మధ్యనున్నదీ అయిన ఒకే అనుబంధాన్ని కనుగొని జీవితానికి అర్థమేమిటనే అందర్నీ తొలిచే ప్రశ్నను ఆదరించి చేసిన కవనయజ్ఞఫలాన్ని పఠితలకిస్తూ వినయంగా తల వంచాడు.