ఒక ఉపాధ్యాయుడికి శిక్షణ ఇవ్వడానికి నాలుగేళ్ళు, ఔషధ నిర్మాతకి ఐదేళ్ళు, దంత వైద్యుడికి ఆరు, న్యాయవాదికి ఏడు, వైద్యుడికి ఎనిమిది సంవత్సరాలు శిక్షణ అవసరం అయినప్పుడు, అంతకు తక్కువ సమయం లోనే ఒక సుశిక్షితుడైన జీవిత నవలారచయితగా ఎదగడం ఎలా సాధ్యం?
Category Archive: వ్యాసాలు
కారడివిలో రావణాసురుని చేత పట్టుపడిన నిన్ను తొడలమీద పెట్టుకొని ఉన్నాడు రాముడు. ఆయన ఒక క్షణం నీ దగ్గిర లేకపోతే నీకు ప్రాణాలు నిలవవని అన్నావు గుర్తుందా, అప్పుడే నన్ను అనరాని మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు ఆరునెలలు రాముడు లేకుండా ప్రాణాలు నీకు ఎలా నిలిచాయి? ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదు.
ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత. దెబ్బ తాకితే అమ్మో! అంటాము. జాలి చూపడానికి అయ్యయ్యో! అంటాము. అలాగే ఆశ్చర్యానికి అబ్బో! అంటాము. పని పూర్తి కాగానే అమ్మయ్య! అని నిట్టూరుస్తాము.
సావిత్రి గురించి కుటుంబరావుగారు ఊహించిన ‘మంచి భవితవ్యం’ మాట నిజమయింది కాని హిందీ సినిమాల్లో ప్రవేశం మటుకు లభించలేదు. విజయావారు రషెస్ అందరికీ చూపడం వంటి అపురూపమైన విషయాలు మనం ఈ వ్యాసంనుంచి తెలుసుకోవచ్చు. అలాగే సావిత్రి తొలిదశ విశేషాలు ఇంత వివరంగా మరెక్కడా దొరకవేమో.
కుబేరుని కొలువులో ఉండే యక్షుడు శాపగ్రస్తుడై ఒక యేడు తన భార్యకు దూరముగా విరహవేదనతో తపిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ సమయములో వర్షాకాలము ఆసన్నమవుతుంది. ఆకాశములోన మేఘాన్ని చూచి నీవు నా దూతగా వెళ్ళి అలకానగరములో ఉండే నా భార్యను కలిసి నా ప్రేమ సందేశాన్ని అందించమని ప్రాధేయపడుతాడు.
కవితలో, మొదట ఔద్వేగిక ప్రధానంగా, దాదాపు అప్రయత్నంగా వెలువడిన సృజనకు మెరుగులు చెక్కే పని చాల శ్రద్ధతో, సృజనలోని దృశ్య, పద చిత్రాలు, మాటల ఎంపిక, వాటి కూర్పు, స్థానాల్ని గురించీ వివేకంతో వందలాదిగా నిర్ణయాలను తీసుకొని చేసేది. అందుకే ‘కవి పగలల్లా కూర్చుని ఒక కామా ఎక్కడ ఉంచాలో స్థిరంగా ఒక నిశ్చయానికొచ్చేడు,’ లాంటి పరాచికాలున్నాయి.
ఎప్పటికీ సీత రాకపోతే ఆయనకి చాలా కోపం వచ్చి పడకగది తలుపు గడియ పెట్టేస్తాడు. నీ పనులిలా ఉన్నాయా, నీకు వొళ్ళూ పై తెలియడం లేదు అని తల పంకించి ‘కడు భ్రమ చెంది’ పక్కమీద పడుకుంటాడు. ఇక్కడ ‘భ్రమ చెందడం’ చాలా అర్థవంతమైన మాట. రాముడు తనకి సీత మీద లేని అధికారం ఉన్నదని ఊహించుకుంటున్నాడు.
న-కార, ణ-కారాల గురించి, నతిసూత్రం గురించి ఈ మధ్య ఈమాట-అభిప్రాయవేదికపై చర్చ జరిగింది కాబట్టి ఋగ్వేద ప్రాతిశాఖ్యలోని పంచమపటలంలో నతిసూత్రం వివరించిన సంస్కృతశ్లోకాలకు తెలుగు అనువాదం ఈ విడత పలుకుబడిలో భాగంగా అందజేస్తున్నాను. అలాగే కళింగత్తుపరణిలో కరునాడు ప్రస్తావన ఉన్న పద్యం గురించి నా అభిప్రాయం కూడా.
విలాయత్ఖాన్ సితార్ కచేరీ మొదటిసారిగా మద్రాసులో 1965లో. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ స్వయంగా మొదటి వరసలో కూర్చుని, విని ఆనందించిన ఆ కచేరీకి చిట్టిబాబు కూడా హాజరయారు. అందులో విలాయత్ఖాన్ పిలూ రాగంలో తన తాతగారు ఇమ్దాద్ఖాన్, తండ్రి ఇనాయత్ఖాన్ వాయించిన పిలూ రాగపు గత్లను సగర్వంగా వాయించారు.
మాటలు పద్యాన్ని చెప్పవు. పద్యంలో మాటలు అర్థాన్నివ్వవు. ఆకారం అసలే ఉండదు. రూపం శూన్యం. మాటల్ని గట్టిగా పట్టుకొని చలిమిడి ముద్దలా పిసకండి. పోనీ, మాటల్ని పంచరంగుల ప్లే డౌ లా పిసకండి. పిసకగా పిసకగా పద్యానికి ఆకారం వస్తుంది. అప్పుడు కనిపిస్తుంది కవితలో విశ్వరూపం.
రామారావు, నాగేశ్వరరావు సరదాగా టెన్నిస్ ఆడడం కె.వి.రెడ్డి గమనించారనీ, అందులో ఒక బాల్ మిస్ అయిన రామారావు కోపంతో దాన్ని దూరంగా పడేట్టు బాదాడనీ, అది చూసి రెడ్డిగారు పాతాళభైరవిలో నాగేశ్వరరావుకు బదులుగా రామారావును తీసుకున్నారనీ ఎక్కడో చదివాను.
ఎవరైనా మనుషులో, సమాజాలో కష్టంలో ఉన్నారని తెలుసుకుంటే వాళ్ళలోని ‘లోపాల్ని’ తప్పనిసరై ఎత్తి చూపించవలసినప్పుడు కూడా ఆ పనిలో సానుభూతి, కరుణ కనిపిస్తాయి. సృజనాత్మకమైన పని – అంటే కళ నిర్వహణ, అభివ్యక్తి ఎంత కష్టతరమో ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోగలిగితే అది ఒకరకమైన వందనానికి, కరుణకు దారితీస్తుంది.
విజయరాఘవరావు తన కళాజీవితాన్ని భరతనాట్యంతో మొదలు పెట్టినప్పటికీ, ఆయన వేణువునేకాక, వాద్యబృంద నిర్వహణనూ, మెళుకువలనూ, స్వరరచననూ, సంగీతప్రసంగాలనూ అద్భుతంగా నిర్వహించారు. ఆయనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలతో బాటుగా బెంగాలీవంటి ఇతరభాషలు కూడా క్షుణ్ణంగా వచ్చు.
ఆడవాళ్ళ వ్యక్తిత్వాలని నిబ్బరంగా నిలబెట్టిన రచన ఇది. ఇందులో పాత్రలకి వ్యక్తమైన మనస్సే కాకుండా సుప్తచేతన, అవ్యక్తభావాలు అనేకం ఉంటాయి. ఇలాంటివి ఫ్రాయిడ్ వొచ్చిన తరవాతే మన సాహిత్యంలో కనిపిస్తాయని విమర్శకులు అంటారు. అలా అనుకోవడం తప్పు అని ఈ పాట మనకి గుర్తు చేస్తుంది.
కథ సామాన్య పాఠకులని ఉద్దేశించే రాస్తాము. కాని సామాన్యుడికి శిల్పం అవగతం కాదు. కథ బాగుంటే ఎందుకు బావున్నది సామాన్యుడికి తెలియదు. కథ ఎందుకు బాగులేనిది అలాగ్గానే తెలియదు. సాహిత్యంలో నిష్ణాతులైన విమర్శకులు ఏ అభిప్రాయాన్ని ఇస్తారో ఆ అభిప్రాయమే సరియైనది అవుతుంది.
మన పద్ధతిలోన తర్క మీమాంసకి న్యాయ, వైశేషికాలని పేరు. మన తార్కికులు వితండము, జల్పము, వాదకధ అని తర్క వాదనని మూడు రకాలుగా ప్రతిపాదించేరు. వితండమంటే ప్రతివాదిని ఏదో ఒకలాగ, వెక్కిరింత, తిట్లతో సహా ఎలాంటి పద్ధతుల్నైనా వాడుకొని ఓడించి, నోరు మూయించే పద్ధతి.
కళ కళ కోసమే అనడం కళ ప్రజల కోసమే అనేదానికి వ్యతిరేకం కాదు. జాగ్రత్తగా గమనిస్తే ప్రజల కోసమే కళ. అంటే మొదట దేనినైతే మనం కళ అని పిలవదలచుకున్నామో అది కళ కావాలి కదా. కళ కాని దానిని కళ అని పిలిచి ఇది ప్రజల కోసం అనడం అసంబద్ధమయిన విషయం. కళ కళ కోసం కానిది ప్రజల కోసం కానేరదు.
తెలుగువాళ్ళకి దేన్ని ‘ఎక్కించా’లన్నా సినిమాలే శరణ్యం కనక శంకరాభరణం సినిమాలోని పాటలవల్ల శాస్త్రీయసంగీతానికి కొంత గ్లామర్ అబ్బింది. తద్వారా బ్రోచేవారెవరురా అనే కీర్తన కమాస్ రాగం లోనిదని చాలామందికి తెలిసింది.