మహాభారతంలో పాత్రలను వాడుకున్నా ఈ నాటకపు కథ స్వతంత్రమైన కల్పనే. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకును వదులుకోవాల్సిన క్లిష్టపరిస్థితి ఏర్పడ్డప్పుడు తల్లిదండ్రులు రెండవ కొడుకును వదులుకునేందుకు సిద్ధపడడం అనే ఊహకు, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే శునశ్శేఫుడి కథకు సామ్యం కనిపిస్తుంది.
శీర్షికలు పద్య సాహిత్యం
‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.
ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.
పలుకునో, వివరణమునో, ప్రశ్ననో మ
లచి, ప్రియజిగీష విడుచుట ప్రణయమునకు
ప్రకటరూపము కాబోదు; లలితమైన
హృదయభూమిక స్పందించి కదలనపుడు.
వ్యాసుడు విషయానికి ప్రాధాన్యతనిచ్చి, మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడాన్ని మూడు శ్లోకాలలో ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న చందంగా తేల్చేసాడు. సన్నివేశ చిత్రీకరణ ఇక్కడ జరగలేదు. పాఠకులకు లేదా శ్రోతలకు, ఈ సన్నివేశంలో ఏమి జరిగిందో తెలుస్తుంది తప్ప వారి ఊహలకు ఊతమిచ్చే వర్ణనలు, వివరాలు ఈ శ్లోకాలలో లేవు.
ఆ తరళ ఘనసౌందర్యపాత మడరి
తనను ముంచెత్త నిలువెల్ల తడిసి తడిసి
గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.
ప్రతి పాత్ర రూపుఁ జూపునుఁ
బ్రతి మాటయుఁ బ్రతి తలపునుఁ బ్రతి కదలికయున్
బ్రతి నవ్వునుఁ బ్రతి యూరుపు
నతనికి సాక్షాత్కరించి యక్షర మయ్యెన్
ఎటు పొంచియున్నాడొ యెక్కుపెట్టిన యమ్ము
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి
శ్రీలలితాలక్ష్మణుడున్
బాలితజనరక్షణోరుభారభరతుడున్
బాలిశశత్రుఘ్నుడుఁ దా
నేలిక యన నొక్క రాముడే యనవలెగా!
పట్టుపురుగు కోరి యిల్లు కట్టుకొనగ
తనదు పట్టు తననె చుట్టి చచ్చినట్లు
మదిని రేగు కోర్కెలు మనిషిని బంధించునయ్య!
నా మనసు దురాశల నాశమొందగజేసి
నీ దరిని జూపు చెన్నమల్లికార్జునయ్య!
పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే.
లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.
కలుషితములు రాగంబులు
కలుషితములు నృత్యగానకవితారీతుల్
కలుషితములు కావ్యంబులు
కలుషితములు సకలకళలు కలికాలమునన్
యక్షగానం అనగానే కొంత సామాన్యజనులు నిత్యవ్యవహారంలో ఉపయోగించే పదజాలం రచనలో చేరడం సహజం అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేని సంగతి. రచనలో ఎక్కడా పేర్కొనబడకపోవడం వలన ఈ రచనకు కర్త ఎవరో తెలియదు. భాషను బట్టి, తాళపత్రప్రతిలోని వ్రాతను బట్టి కనీసం రెండు వందల సంవత్సరాల మునుపటి రచనగా దీనిని నేను భావిస్తున్నాను. అప్రకటితంగా నిలిచిపోదగ్గ రచనగా ఇది అనిపించదని ప్రగాఢంగా నమ్ముతూ ఇప్పుడు మీ ముందుంచుతున్నాను.
అల్పకాంతులతో నసంఖ్యాకముగను
నింగి నాక్రమించుచు నిగనిగలఁ గుల్కు
తారకాతతి సౌరు సందర్శనీయ
మగును రాకేందుఁ డుదయింపనంతవఱకె.
జ్యోతిష్మంతమైన యజ్ఞరథమునెక్కి
తమమునెల్లనీవు తరిమివేసి
భీమరూపమందు శత్రుదంభముజేసి
వేదనిందకులను వెడలగొట్టి
గోత్ర భిదము సల్పి స్వర్గ విభము నిల్పి
రాక్షసులను చంపు రక్షకుడవు!
స్త్రీలో ప్రాకృతికంగా వచ్చిన దేహం వెనుక విలాసమయ శరీరం ఒకటుంటుంది. ఇది భౌతికమైనదే గానీ శరీరసౌష్ఠవాన్నీ, అశ్లీల ప్రదర్శననూ అపేక్షించేది కాదు. ఆ విలాసానికి ప్రేమే హేతువు. వేరేది ఉండే ఆస్కారం లేదు. అటువంటి ప్రేమమయ స్త్రీవిలాసం చాలా గొప్పది. అందుకే అది కావ్యాలలో ఎంతో గొప్పగా వర్ణింపబడింది. ప్రణయకోపంలో ఒక స్త్రీ ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో చెప్పే పద్యమిది. ఈ పద్యంలోని నాయిక తన నాయకుడిపై కినుక వహించింది.
దాశరథి ఆధునిక కవితాయుగపు అవతీర్ణభారతి. నిజజీవితం కష్టాలకు పుట్టినిల్లై, జైలుగోడల మధ్య బిగించి పరీక్షపెడితే, అక్కడ మగ్గుతూ పళ్ళు తోముకోవడం కోసం ఇచ్చిన బొగ్గుతో జైలుగోడల మీద పద్యం వ్రాశారు. అంతే కాదు, అర్ధరాత్రి వేరే చోటుకు ఖైదీలని తీసుకుపోతున్నపుడు, మరుసటి రోజుని చూడకుండానే మరణించే అవకాశం ఉన్న ఆ సమయంలో భయపడకపోగా ఆ స్వేచ్ఛామారుతాన్ని చూసి ఆశువుగా పద్యాలు చెప్పారు.
బేలూరు చెన్నకేశవాలయం యునెస్కోవారసత్వనిర్మాణములలో శాశ్వతసభ్యత్వగౌరవము లభించిన ఈశుభతరుణంలో నా మహాశిల్పి జక్కనచరిత్రలోని వర్ణనను నేనిక్కడ పునర్మననం చేసికొంటున్నాను. 1992లో ఆ ఆలయమును దర్శించిన తర్వాత కల్గిన అపూర్వమైన ప్రేరణవల్లనే నేను ఈ మహాకావ్యాన్ని వ్రాసినాను.
ఈ పద్యంలోని ఊహ సరికొత్తది. భగవంతుడి కవితలన్నీ నూటికి తొంభైపాళ్ళు స్తుతులు. కాకుంటే వ్యాజనిందా వ్యాజస్తుతులే కానీ ఇటువంటి ఒక భావన మనకు ఎక్కడో గానీ లభించదు. గ్రీష్మమహోగ్రవేళలో భగవంతుడు ఒక మ్రోడట. అదేవిటయ్యా, అన్ని వాంఛలనూ తీర్చే కల్పతరువు వంటి స్వామిని పట్టుకుని మోడంటావూ అంటే, అన్నీ అయిన స్వామి మోడెందుకు కాడు అని కవి మనకు ఇచ్చే సమాధానం. ఆ మ్రోడుకూడా తుదకు నిల్చినది.