నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.

సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.

ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.

విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.

రాత్రి రాయలు పడకగదికి వెళ్ళి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది.

దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!

“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”

భరత మాత దగ్గరి నించి తెలుగు తల్లి వరకూ, ఈ మాతలు అందరూ ఒకానొక రాజకీయ సందర్భంలో ఎట్లా పుట్టారో, ఈ రకమైన మాతృ దర్శనాలు ఎట్లా ఉపయోగ పడ్డాయో మనమందరమూ మర్చిపోయాము.

అప్పట్లో వైద్యనాథయ్యరుకి పోటీ లేదని ఒకసారి మైసూరు మహారాజు అంటే, సుబ్రమణ్యయ్యరు ఒక ప్రత్యేకరాగంలో పాట కట్టి ఆశువుగా కచేరీలో పాడాడు.

నాటకం బలిజేపల్లి లక్ష్మీకాంత కవిది. కాటి సీనులో బలిజేపల్లి వారి పద్యాలతో పాటు మరో మహాకవి పద్యాలు – కేవలం శ్మశానాన్ని వర్ణించేవి – నటకులు పాడటం పరిపాటి అయింది.

ఈ అష్టపదిలో కృష్ణుడు లేని రాధ విరహోత్కంఠితయై పడే వియోగబాధ వర్ణించబడింది. ప్రియుడి విరహంతో ప్రియురాలు దగ్ధమవుతున్నట్లుగా భావించడం అష్టవిధ నాయికా లక్షణాలలో ఒకటి.

సీతారామారావుని అసమర్థుడిగా మొదలుపెట్టబోయినా ఆ తర్వాత గోపీచంద్ విఫలమైనాడనీ, అది ఆ రచయితకూ తెలుసనీ, కానీ అతనేమీ చేయలేదనీ నా అభియోగం.

ఇక్కడ అసమర్ధతకు, మానసిక ఋగ్మతకు పెద్ద తేడా కనిపించకపోవచ్చు గాని, తెలిసీ, ఎటూ తేల్చుకోలేక వేదన పడే సందిగ్ధ స్థితి అది. సాంప్రదాయపు పొరలను ఛేదించుకుని కాలానికి పరిస్థితులకీ అనుగుణంగా జీవించలేకపోవడం అతని అసమర్ధత.

మహాప్రస్థాన మరోప్రస్థానాలు భూమ్యాకాశాల సరిహద్దులనుకుంటే, మధ్యనున్న విశాలాకాశంలో మెరుస్తున్న గోళాలు శ్రీశ్రీ సాధించిన కవితా విజయాలు.