ఈ కధలో, బిచ్చమెత్తుకుని, అలా సంపాదించిన డబ్బుని దాచుకునే ఒక ముసలావిడ వుంటుంది. [ఆ డబ్బు తాను వుండే ఇంట్లో కాక, ఏదో చెత్త కుప్పలో (తాత్కాలికంగా కాదు) ఎందుకు దాచుకుంటుందో నాకు అర్ధం కాలేదు. కారణం, కధ లోనే వుంటే, నా కంట మాత్రం పడలేదు. ఈ విషయం, ముఖ్యం కాదు లెండి.] ఆ ముసలావిడ డబ్బుని కాజేసే ఇంకో జేబు దొంగ కూడా వుంటాడు. చివరికి ఆ ముసలావిడ మరణిస్తే, ఆ జేబుదొంగ తల కొరివి పెడతాడు.
ఇక్కడ నాకు అర్ధం అయినంత వరకూ, రెండు విషయాలను సమానం చేశారు.
1. ఆ ముసలావిడ, తనకి తెలియకుండానే, తాను ముష్టెత్తిన డబ్బుతో, ఆ జేబుదొంగకి అన్నం పెట్టింది.
2. దానికి బదులుగా, ఆ ముసలావిడకి, తనకి తెలియకుండానే, ఆ జేబుదొంగ తల కొరివి పెట్టాడు.
నా దృష్టిలో, పై రెండూ సమానం కావు.
ఒక శరీరానికి, ప్రాణం పోయాక, ఏం చేసినా, (అవయదానం, పరిశోధన కోసం ఆస్పత్రికి దానం చెయ్యడం లాంటి పనులు తప్ప), అది, మత నమ్మకాల మనసులకి తృప్తి కలిగించడానికి తప్ప, ఎందుకూ పనికి రాదు. ముఖ్యంగా చనిపోయిన మనిషికి ఎటువంటి మేలూ జరగదు.
మృత దేహానికి తల కొరివి పెట్టడం అనేది ముఖ్యంగా ఆ ముసలావిడకి పనికిరాని విషయం. ఆవిడికి ఏ మేలూ కలగదు. ఇది, ఆ ముసలావిడ బిచ్చంతో అన్నం తిన్న జేబుదొంగకి జరిగిన మేలుతో ఎన్నటికీ సమానం కాదు.
నేను, ఇలా ఆలోచించే పాఠకుణ్ణి కాబట్టి, కధ చివరిలో ప్రస్తావించిన ‘కొత్త సత్యం’ నాకేమీ తెలియలేదు.
“అరవ పిడిగుద్దులు”, “ప్రొఫెషనల్ రైవల్రీ” అనే మాటలు ఈ సందర్భాలలో నాకు బొత్తిగా నచ్చలేదు.
సరదా విషయాలని ఓ పక్కన పెడితే, ఈ వ్యాసం లోని ముఖ్య ఉద్దేశంతో నేను ఏకీభవించను.
భాషా పరిణామ క్రమంలో, భాష లోని అక్షరాలు, మాయం అవడం, సహజమైన విషయమే! తప్పు కూడా కాదు. వాడుక భాషలో, ఆ అక్షరాల ఉపయోగం లేకుండా పోతే, ఆ అక్షరాలు క్రమంగా మాయం అవుతాయి. వాటిని కాపాడడం కోసం, మనమేమీ ప్రణాళికలు నిర్వహించనక్కర లేదు. అది, జరిగే తీరుతుంది. వాడుక బాషే లేకపోతే, ఆ బాషే మాయం అవుతుంది కూడా (అమెరికాలో చాలా మంది తెలుగు వారి ఇళ్ళల్లో తెలుగు మాయం అయినట్టు!).
ఈ అక్షరాలు మాయం అవడం అనే విషయాన్ని ఈ వ్యాస రచయిత కూడా ఒప్పుకున్నారనే విషయం మనం మరవకూడదు. ఎలా అంటారా? ఈ వ్యాసంలో, వ్యాసకర్త, “ౠ, ఌ, ఌూ” మాయం అవడాన్ని ఒప్పేసుకున్నారు కదా? వాటి మాటే ఎత్తలేదు. అంటే, అవి, మాయం అయిపోయినట్టే కదా?
అలాగే, చిన్నప్పుడు, మూడు ‘చ’లూ, మూడు, ‘జ’లూ నేర్పేవారు. మధ్య రకం ‘చ, జ’లు ఎప్పుడో మాయం అయిపోయాయి. రచయిత, ఆ విషయం కూడా ఒప్పేసుకున్నారు. బండి – ర మాత్రం మర్చిపోలేదు ఎందుకో, ‘ఋ’ తో పాటు!
మళ్ళీ మళ్ళీ చెప్పేదేమంటే, భాష అనేది పరిణామం చెందుతూ వుంటుంది – అని. 🙂 🙂
– ప్రసాద్
తెలుగు యాత్రా సాహిత్యచరిత్రలో దాసరి అమరేంద్రగారు ధ్రువతారవంటి వారని నా అభిప్రాయం. తాము చేసిన అనేక పర్యటనలకు అక్షరరూపం ఇవ్వడంతోపాటు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావుగారిలాంటి వాళ్ళు చేసిన అనేకానేక పర్యటనలను తెలుగు పాఠకులకు మీరు అందజేస్తున్నారు. సర్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
శ్రీనివాస్ గారు, మీ కథనం చాలా బాగుంది. ఎన్నో వివరాలు ఇచ్చారు. అన్నీ రాసి పెట్టుకున్నాను. మీ స్పూర్తితో మేము కూడా ఒకసారి అటు వెళ్తాము. మీ వ్యాసంవల్ల ఏమి గమనించాలో కూడా తెలిసింది. తరువాత భాగం కోసం ఎదురుచూస్తున్నాము.
అవునండి. కానీ హళేబీడు ఆలయాన్ని తనివితీరా చూడడానికి దాని ఎదురుగా ఉన్న హోటల్ మయూర శాంతళలో దిగితే, ఎక్కువ అవకాశం ఉండేది కదా అనిపించింది. మిగిలినవి చూడటానికి ఇంకోసారి వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నాం.
మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి అమరేంద్ర దాసరి అభిప్రాయం:
02/02/2026 4:48 pm
ధన్యవాదాలు మనోజ్ కుమార్ గారూ
ధ్రువతార – పెద్దమాట వాడారు
ఎవరికెవరు? గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/02/2026 4:18 pm
ఈ కధలో, బిచ్చమెత్తుకుని, అలా సంపాదించిన డబ్బుని దాచుకునే ఒక ముసలావిడ వుంటుంది. [ఆ డబ్బు తాను వుండే ఇంట్లో కాక, ఏదో చెత్త కుప్పలో (తాత్కాలికంగా కాదు) ఎందుకు దాచుకుంటుందో నాకు అర్ధం కాలేదు. కారణం, కధ లోనే వుంటే, నా కంట మాత్రం పడలేదు. ఈ విషయం, ముఖ్యం కాదు లెండి.] ఆ ముసలావిడ డబ్బుని కాజేసే ఇంకో జేబు దొంగ కూడా వుంటాడు. చివరికి ఆ ముసలావిడ మరణిస్తే, ఆ జేబుదొంగ తల కొరివి పెడతాడు.
ఇక్కడ నాకు అర్ధం అయినంత వరకూ, రెండు విషయాలను సమానం చేశారు.
1. ఆ ముసలావిడ, తనకి తెలియకుండానే, తాను ముష్టెత్తిన డబ్బుతో, ఆ జేబుదొంగకి అన్నం పెట్టింది.
2. దానికి బదులుగా, ఆ ముసలావిడకి, తనకి తెలియకుండానే, ఆ జేబుదొంగ తల కొరివి పెట్టాడు.
నా దృష్టిలో, పై రెండూ సమానం కావు.
ఒక శరీరానికి, ప్రాణం పోయాక, ఏం చేసినా, (అవయదానం, పరిశోధన కోసం ఆస్పత్రికి దానం చెయ్యడం లాంటి పనులు తప్ప), అది, మత నమ్మకాల మనసులకి తృప్తి కలిగించడానికి తప్ప, ఎందుకూ పనికి రాదు. ముఖ్యంగా చనిపోయిన మనిషికి ఎటువంటి మేలూ జరగదు.
మృత దేహానికి తల కొరివి పెట్టడం అనేది ముఖ్యంగా ఆ ముసలావిడకి పనికిరాని విషయం. ఆవిడికి ఏ మేలూ కలగదు. ఇది, ఆ ముసలావిడ బిచ్చంతో అన్నం తిన్న జేబుదొంగకి జరిగిన మేలుతో ఎన్నటికీ సమానం కాదు.
నేను, ఇలా ఆలోచించే పాఠకుణ్ణి కాబట్టి, కధ చివరిలో ప్రస్తావించిన ‘కొత్త సత్యం’ నాకేమీ తెలియలేదు.
“అరవ పిడిగుద్దులు”, “ప్రొఫెషనల్ రైవల్రీ” అనే మాటలు ఈ సందర్భాలలో నాకు బొత్తిగా నచ్చలేదు.
ఇవి, నా అభిప్రాయాలే సుమా!
– ప్రసాద్
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి ప్రసాద్ అభిప్రాయం:
02/02/2026 11:54 am
సరదా విషయాలని ఓ పక్కన పెడితే, ఈ వ్యాసం లోని ముఖ్య ఉద్దేశంతో నేను ఏకీభవించను.
భాషా పరిణామ క్రమంలో, భాష లోని అక్షరాలు, మాయం అవడం, సహజమైన విషయమే! తప్పు కూడా కాదు. వాడుక భాషలో, ఆ అక్షరాల ఉపయోగం లేకుండా పోతే, ఆ అక్షరాలు క్రమంగా మాయం అవుతాయి. వాటిని కాపాడడం కోసం, మనమేమీ ప్రణాళికలు నిర్వహించనక్కర లేదు. అది, జరిగే తీరుతుంది. వాడుక బాషే లేకపోతే, ఆ బాషే మాయం అవుతుంది కూడా (అమెరికాలో చాలా మంది తెలుగు వారి ఇళ్ళల్లో తెలుగు మాయం అయినట్టు!).
ఈ అక్షరాలు మాయం అవడం అనే విషయాన్ని ఈ వ్యాస రచయిత కూడా ఒప్పుకున్నారనే విషయం మనం మరవకూడదు. ఎలా అంటారా? ఈ వ్యాసంలో, వ్యాసకర్త, “ౠ, ఌ, ఌూ” మాయం అవడాన్ని ఒప్పేసుకున్నారు కదా? వాటి మాటే ఎత్తలేదు. అంటే, అవి, మాయం అయిపోయినట్టే కదా?
అలాగే, చిన్నప్పుడు, మూడు ‘చ’లూ, మూడు, ‘జ’లూ నేర్పేవారు. మధ్య రకం ‘చ, జ’లు ఎప్పుడో మాయం అయిపోయాయి. రచయిత, ఆ విషయం కూడా ఒప్పేసుకున్నారు. బండి – ర మాత్రం మర్చిపోలేదు ఎందుకో, ‘ఋ’ తో పాటు!
మళ్ళీ మళ్ళీ చెప్పేదేమంటే, భాష అనేది పరిణామం చెందుతూ వుంటుంది – అని. 🙂 🙂
– ప్రసాద్
మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి Manoj kumar cheruku అభిప్రాయం:
02/02/2026 4:03 am
తెలుగు యాత్రా సాహిత్యచరిత్రలో దాసరి అమరేంద్రగారు ధ్రువతారవంటి వారని నా అభిప్రాయం. తాము చేసిన అనేక పర్యటనలకు అక్షరరూపం ఇవ్వడంతోపాటు డాక్టర్ నిమ్మగడ్డ శేషగిరిరావుగారిలాంటి వాళ్ళు చేసిన అనేకానేక పర్యటనలను తెలుగు పాఠకులకు మీరు అందజేస్తున్నారు. సర్, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
తమిళ సంగ సాహిత్యం-2: అగం కవిత్వ పరిచయం గురించి Palanki sathya అభిప్రాయం:
02/02/2026 2:23 am
చాలా బాగుంది
అభినందనలు
కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
02/02/2026 2:05 am
ధన్యవాదాలు ప్రసూనగారూ!
కళాసాగరం కర్ణాటకం గురించి Prasuna Balantrapu అభిప్రాయం:
02/02/2026 2:04 am
శ్రీనివాస్ గారు, మీ కథనం చాలా బాగుంది. ఎన్నో వివరాలు ఇచ్చారు. అన్నీ రాసి పెట్టుకున్నాను. మీ స్పూర్తితో మేము కూడా ఒకసారి అటు వెళ్తాము. మీ వ్యాసంవల్ల ఏమి గమనించాలో కూడా తెలిసింది. తరువాత భాగం కోసం ఎదురుచూస్తున్నాము.
కళాసాగరం కర్ణాటకం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:
02/02/2026 1:16 am
అవునండి. కానీ హళేబీడు ఆలయాన్ని తనివితీరా చూడడానికి దాని ఎదురుగా ఉన్న హోటల్ మయూర శాంతళలో దిగితే, ఎక్కువ అవకాశం ఉండేది కదా అనిపించింది. మిగిలినవి చూడటానికి ఇంకోసారి వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నాం.
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Radhadevi అభిప్రాయం:
02/02/2026 12:11 am
ఇంత చక్కగా, సులువుగా అద్చుతమైన కావ్యాన్ని చదవటానికి వీలు కల్పించారు. ధన్యవాదాలు 🙏
హఠాత్తుగా అక్షరాలు మాయమైతే… గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:
02/01/2026 11:35 pm
ప్రసాద్ గారు,
మహా ప్రాణమే పోయినప్పుడు అల్ప ప్రాణం ఆగుతుందా! అలా అనుకొని రాజీ పడదాం.