ఈ రాతలన్నీ రాసిన మూడేళ్ళు తిరక్క ముందే, ఇవన్నీ ‘అయోమయపు మాట’లనీ, ‘పులుముడు’ కవిత్వం అనీ, నిరంకుశంగా, తునాతునకలుగా ఖండించి నిరసించి, హేళన చేసిన అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుణ్ణి మాత్రం ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేదు; ఇప్పుడెవ్వరూ గుర్తు కూడా పట్టరు.
నా వ్యాఖంతా కృష్ణశాస్త్రి గారి గురించి వ్రాసేటపుడు ఉమాకాంత విద్యాశేఖరుల ప్రసక్తి తేవటం గురించే.
ఎప్పుడో నేను పుట్టకమునుపు మాయూరి అం.వెం.న కాలేజీ జువాలజీ లాబ్ డిమాన్స్ట్రేటరు గా పనిచేసి కప్పల మాస్టారు అనే ఉపనామం పొందిన ఒకాయన కృష్ణశాస్త్రి గారి గురించీ భావకవిత్వం గురించీ చెబుతూ, విద్యాశేఖరులకున్న భావకవిత్వాదరణాభావాన్ని వివరించి, నేటికాలపు కవిత్వం లో వారు కృశా తీరును యెండగట్టిన వైనాన్ని మరింత మండిపడుతూ తెగిడారు. అప్పుడే ఈయన గురించి నాకు తెలిసినది.
ఉవిశే నేటికాలపు కవిత్వంలో కృశా కృష్ణపక్షం తర్వాత,వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవనూ,నండూరి వారి యెంకిపాటలను కూడా యేకిపారేసారు. ఈ మూడు కావ్యాలూ నేటికి మలిముద్రణలకూ,రసికాదరణలకూ నోచుకున్నవే. అయితే,మిగిలిన రెండు కావ్యాల గురించీ,తత్కర్తల గురించీ చెప్పుకునేటప్పుడు ఉవిశే గారి ప్రస్తావన వస్తుందో రాదో తెలియదు గాని, కృశా గురించి చెప్పినపుడు మాత్రం నేటికీ ఉవిశే ను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నారు.
పైన చెప్పిన ప్రభవకవి తన అనంతం లో కృష్ణపక్షం మీద అధిక్షేపణ గా వచ్చిన అనంతపంతుల రామలింగస్వామి శుక్లపక్షం గురించి కూడ చెప్పి, దానినిప్పుడెవరూ చదవటం లేదన్నారు. దానిని వేదులవారి గౌతమీకోకిల “సారస్వతారిష్టమను శుక్లనష్టము” అని వెక్కిరించిందని కూడా వక్కాణించారు.(సారస్వాతారిష్టమనే పేర ఒక ఆయుర్వేద ఔషధం ఉన్నట్లు కూడా మొన్నటి దాకా నాకు తెలియదు.)
ఆర్కైవు (https://archive.org/) లో దొరకటం లేదు గానీ,ఉంటే శుక్లపక్షాన్ని నేను తప్పక చదివేవాడినే. ఇజినారం చాగంటి సోమయజులు ఆ శుక్లపక్షం పద్యాలను మెచ్చుకున్నారన్ని అప్పుడప్పుడూ చదువుతుండేవారనీ యెక్కడో చదివాను.వాళ్ళమ్మాయి తులసి గారింట్లో వెదికితే యెక్కడో బూజుపట్టిన ఒక ప్రతి దొరకవచ్చేమో కూడా.
నేటి కాలపు కవిత్వం యిప్పటికీ చదివించే గుణం ఉన్న రచన.ఉమాకాంతుల వారి అభిప్రాయాలు పక్కన పెడితే, వారి గద్యం కవననైపుణికి నికషమే.
ఈయన చేసిన ఈ ప్రసంగం కాకపోయినా, ఎంతో కష్టపడి, యెన్నో ప్రతులు సేకరించి తప్పులు దిద్ది వెలువరించిన పల్నాటి వీర చరిత్ర పరిష్కరణ కు గానైనా వారి విద్యాశేఖరత తెలుగువారికి గుర్తుండిపోతుంది. ఒక నవద్వీప పండితుడు ఒక ద్విపద కావ్యానికి యిచ్చిన విలువే తరువాతి కాలంలో తంగిరాల వారు తెలుగువారి వీరగాథలను వెలుగులోకి తీసుకురావటనికి ప్రేరణ నిచ్చిందేమో.
కృష్ణపక్షాన్ని మొదటిసారి విశాలాంధ్రలో చేతిలోనికి తీసుకుని తిరగేసినపుడు, తొలిపుటల్లోనే “ఆకులో ఆకునూ కొమ్మలో కొమ్మనూ” చూసి మేఘసందేశం అనే పేరనున్న ప్రాత తెరాట పాటలపుస్తకం తీసానేమోనని భ్రమగొన్నాను. మా తరం వారికి కృశా గురించి తెలిసిందంతే మఱి! ఆఱవ తరగతిలో “మింట నెచటనో మెఱయు చుక్కల” గురించి విన్నాను గాని, అది అంత దూరంలోనే ఉండిపోయింది.
అప్పుడే కొన్న ఓరియంట్ లాంగ్మన్ వారచ్చేసిన రెండు కృశా గద్య సంకలనాలు చదివాక గాని ఆయనపై మనసు పడలేదు. ఇదీ వారి గద్య రచనా వైదుష్యానికి గీటుఱాయే.
మేఘసందేశం ప్రస్తావన యెలాగో వచ్చింది కాబట్టి ముక్తాయింపుగా రెండు మాటలు. మేఘదూతభాష్యంలో లేని దిఙ్నాగుడి ప్రస్తావనను వ్యాఖ్యాతలు తెచ్చినట్టే కృశా గురించిన వ్యాసాల్లో కూడా ఉవిశే ప్రస్తావన కూడా యిప్పటికీ వస్తున్నది.
[1]
<<>>
[2]
<<>>
ఒకటో పనిని బాగానే చేసే తల్లిదండ్రులకు, రెండో పని బాగా చేస్తున్న వారి గురించి తెలియజెప్పే వ్యాసాలూ,పుస్తక పరిచయాలూ అప్పుడప్పుడూ ప్రచురించమని మనవి.
‘ సి.నా. రె. శేషేంద్ర కవిత్వం గురించీ “ఆత్మాశ్రయ కవిత్వా”న్ని నేను ఆహ్వానించను అన్నారు. ఎందుకో? దీని భావమేమి? ‘ — పఠాభి గురించి కూడా ఇలాంటి పొల్లు మాటలే అన్నాడు ఆయన.
>> ఫారడే జీవితంలో సాండెమానియన్ విశ్వాసం ముఖ్యమైనది. చర్చిలో ప్రార్థనలకి వెళ్ళడం, ఆచారాలు పాటించడం, ఆ సంఘ సభ్యులతో కలసి మెలసి ఉండటం, దాని బోధనలు పాటించడం శ్రద్ధగా చేసేవాడు. తన భార్య కుటుంబం కూడా సాండెమానియన్లే
ఇది నా స్వంత ఘోష కనక ఎవరికీ నచ్చకపోవచ్చు. స్కూల్ లేదా కాలేజీ లెవెల్లో మనకి ఫారడే వంటి వారు తారసపడుతూ ఉంటారు. వీళ్ళు క్లాసులకి రారు, నేర్చుకోరు. వచ్చినా ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళడం. వీళ్ళకి మరికొంతమంది భజనపరులు ఉండడం కూడా చూడొచ్చు. ఈ భజనపరులు చెప్పడం ప్రకారం “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, వగైరా.” ఇదీ సుత్తి పెద్ద నాన్సెన్స్ మాట. వీళ్ళకి ఇక్కడో పనిచేసే రేడియో, లేదా ఒక పాట కంప్యూటర్ ఇస్తే దాన్ని తిరగేసి మరగేసి ఏదో చేయగలరు. ఆ తర్వాత మిగతా విషయాలు నేర్చుకోరు కనక అలా ఫెయిల్ అవుతూ అక్కడే ఉంటారు.
మరో రెండు మూడేళ్ళకి జరిగేది ఏమిటంటే, పూర్తిగా జీవితంలో ఫెయిల్ అయి రోడ్డుమీద నుంచుంటారు. మెల్లిగా సిగరెట్టూ, మందూ అలవాటు అవుతాయి. అక్కడనుంచి జారుడు కిందకి. మరి కొన్నాళ్ళకి ఏదో పనిలో కుదురుకుంటారు. జీవితం తెల్లవారి పోతుంది. అయితే ఇటువంటి వారందరూ ఫారడేలు అయిపోతారని కాదు కానీ, వీళ్ళకి సరైన దిశా నిర్దేశం చేసేవారుంటే ఏదో బతికి బయట కట్టే అవకాశం ఉంది. కొండొకచో ఈ దిశా నిర్దేశానికి దండం కావాల్సి రావొచ్చు. ఫారడే జీవితంలో ఈ “సాండెమానియన్ విశ్వాసం” వల్ల ఆయన దారిలో పడ్డాడనుకుంటా. లేకపోతే మనకి రోజూ కనిపించే “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు” అనే దారిలోనే వెళ్ళి ఉండేవాడేమో అనిపించింది ఈ వ్యాసం చదివాక.
తెలుగుభాషని పాలసముద్రంగా చేసి స్వయంగా చిలికి భాగవతరసామృతాన్ని మనకి అందించిన పరమభాగవతోత్తముడు భక్తపోతనగారు. లక్మీదేవితో సరసాలాడిన ఆ చేతితో, బలిచక్రవర్తిదగ్గర చాపిన ఆ చేతితో మన తెలుగుభాషలో పద్యం రాయించి తెలుగుభాషని పునీతం చేసిన భక్తశిఖామణి. భాగవతరసామృతాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి కలిగినవారికి ఆ సిరిపతి దీర్ఘాయుని ప్రసాదించాలి.
నిజమే.. ఇక మానవకల్పిత కథలు ఉండవు. యాంత్రిక సృజన అప్పుడే సాహిత్యాకాశాన్ని కమ్మేసింది. నువ్వు, నేను అందరం అందులో కలిసిపోవాల్సిందే అనిపిస్తోంది. అయితే రచయిత ఈ వినూత్న ప్రయోగం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు అన్నది అయోమయంగానే మిగిలిపోయింది.
‘దిద్దు’బాటు
గురించి చిట్టత్తూరు మునిగోపాల్ గారి అభిప్రాయం:
12/11/2025
11:59 pm
ముసలోళ్లు అనుకుంటాము కానీ కాలాంతకులు. మనకు ఎప్పుడు ఏమి అవసరమో ముందుగానే ఊహించి భవిష్యత్తుకు మదుపు చేయగల ముందు చూపు కచ్చితంగా వారికి ఉంటుంది. ఈ సత్యాన్ని పొన్నాడ గౌరి గారి కథ, అందమైన శ్రీకాకుళం యాసలో మరోసారి నిరూపించింది.
పుస్తక పరిచయం: మధుమేహం, సమగ్ర విశ్లేషణ గురించి M C R Sesha గారి అభిప్రాయం:
12/21/2025 7:15 pm
మంచి పుస్తకం. నేనూ చదివాను. మధుమేహాన్ని అన్ని కోణాల్లోనూ విశ్లేషించి చేసిన సమగ్ర రచన. రివ్యూ రచనకు న్యాయం చేసింది.
శేషా
కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు గురించి వీరభద్రం గారి అభిప్రాయం:
12/21/2025 2:53 am
నా వ్యాఖంతా కృష్ణశాస్త్రి గారి గురించి వ్రాసేటపుడు ఉమాకాంత విద్యాశేఖరుల ప్రసక్తి తేవటం గురించే.
ఎప్పుడో నేను పుట్టకమునుపు మాయూరి అం.వెం.న కాలేజీ జువాలజీ లాబ్ డిమాన్స్ట్రేటరు గా పనిచేసి కప్పల మాస్టారు అనే ఉపనామం పొందిన ఒకాయన కృష్ణశాస్త్రి గారి గురించీ భావకవిత్వం గురించీ చెబుతూ, విద్యాశేఖరులకున్న భావకవిత్వాదరణాభావాన్ని వివరించి, నేటికాలపు కవిత్వం లో వారు కృశా తీరును యెండగట్టిన వైనాన్ని మరింత మండిపడుతూ తెగిడారు. అప్పుడే ఈయన గురించి నాకు తెలిసినది.
ఉవిశే నేటికాలపు కవిత్వంలో కృశా కృష్ణపక్షం తర్వాత,వేంకటపార్వతీశ కవుల ఏకాంతసేవనూ,నండూరి వారి యెంకిపాటలను కూడా యేకిపారేసారు. ఈ మూడు కావ్యాలూ నేటికి మలిముద్రణలకూ,రసికాదరణలకూ నోచుకున్నవే. అయితే,మిగిలిన రెండు కావ్యాల గురించీ,తత్కర్తల గురించీ చెప్పుకునేటప్పుడు ఉవిశే గారి ప్రస్తావన వస్తుందో రాదో తెలియదు గాని, కృశా గురించి చెప్పినపుడు మాత్రం నేటికీ ఉవిశే ను గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నారు.
పైన చెప్పిన ప్రభవకవి తన అనంతం లో కృష్ణపక్షం మీద అధిక్షేపణ గా వచ్చిన అనంతపంతుల రామలింగస్వామి శుక్లపక్షం గురించి కూడ చెప్పి, దానినిప్పుడెవరూ చదవటం లేదన్నారు. దానిని వేదులవారి గౌతమీకోకిల “సారస్వతారిష్టమను శుక్లనష్టము” అని వెక్కిరించిందని కూడా వక్కాణించారు.(సారస్వాతారిష్టమనే పేర ఒక ఆయుర్వేద ఔషధం ఉన్నట్లు కూడా మొన్నటి దాకా నాకు తెలియదు.)
ఆర్కైవు (https://archive.org/) లో దొరకటం లేదు గానీ,ఉంటే శుక్లపక్షాన్ని నేను తప్పక చదివేవాడినే. ఇజినారం చాగంటి సోమయజులు ఆ శుక్లపక్షం పద్యాలను మెచ్చుకున్నారన్ని అప్పుడప్పుడూ చదువుతుండేవారనీ యెక్కడో చదివాను.వాళ్ళమ్మాయి తులసి గారింట్లో వెదికితే యెక్కడో బూజుపట్టిన ఒక ప్రతి దొరకవచ్చేమో కూడా.
నేటి కాలపు కవిత్వం యిప్పటికీ చదివించే గుణం ఉన్న రచన.ఉమాకాంతుల వారి అభిప్రాయాలు పక్కన పెడితే, వారి గద్యం కవననైపుణికి నికషమే.
ఈయన చేసిన ఈ ప్రసంగం కాకపోయినా, ఎంతో కష్టపడి, యెన్నో ప్రతులు సేకరించి తప్పులు దిద్ది వెలువరించిన పల్నాటి వీర చరిత్ర పరిష్కరణ కు గానైనా వారి విద్యాశేఖరత తెలుగువారికి గుర్తుండిపోతుంది. ఒక నవద్వీప పండితుడు ఒక ద్విపద కావ్యానికి యిచ్చిన విలువే తరువాతి కాలంలో తంగిరాల వారు తెలుగువారి వీరగాథలను వెలుగులోకి తీసుకురావటనికి ప్రేరణ నిచ్చిందేమో.
కృష్ణపక్షాన్ని మొదటిసారి విశాలాంధ్రలో చేతిలోనికి తీసుకుని తిరగేసినపుడు, తొలిపుటల్లోనే “ఆకులో ఆకునూ కొమ్మలో కొమ్మనూ” చూసి మేఘసందేశం అనే పేరనున్న ప్రాత తెరాట పాటలపుస్తకం తీసానేమోనని భ్రమగొన్నాను. మా తరం వారికి కృశా గురించి తెలిసిందంతే మఱి! ఆఱవ తరగతిలో “మింట నెచటనో మెఱయు చుక్కల” గురించి విన్నాను గాని, అది అంత దూరంలోనే ఉండిపోయింది.
అప్పుడే కొన్న ఓరియంట్ లాంగ్మన్ వారచ్చేసిన రెండు కృశా గద్య సంకలనాలు చదివాక గాని ఆయనపై మనసు పడలేదు. ఇదీ వారి గద్య రచనా వైదుష్యానికి గీటుఱాయే.
మేఘసందేశం ప్రస్తావన యెలాగో వచ్చింది కాబట్టి ముక్తాయింపుగా రెండు మాటలు. మేఘదూతభాష్యంలో లేని దిఙ్నాగుడి ప్రస్తావనను వ్యాఖ్యాతలు తెచ్చినట్టే కృశా గురించిన వ్యాసాల్లో కూడా ఉవిశే ప్రస్తావన కూడా యిప్పటికీ వస్తున్నది.
డిసెంబర్ 2025 గురించి వీరభద్రం గారి అభిప్రాయం:
12/17/2025 11:14 pm
[1]
<<>>
[2]
<<>>
ఒకటో పనిని బాగానే చేసే తల్లిదండ్రులకు, రెండో పని బాగా చేస్తున్న వారి గురించి తెలియజెప్పే వ్యాసాలూ,పుస్తక పరిచయాలూ అప్పుడప్పుడూ ప్రచురించమని మనవి.
కృష్ణశాస్త్రి బాధ — ప్రపంచపు బాధ గురించి సుమనస్పతి గారి అభిప్రాయం:
12/17/2025 10:00 pm
‘ సి.నా. రె. శేషేంద్ర కవిత్వం గురించీ “ఆత్మాశ్రయ కవిత్వా”న్ని నేను ఆహ్వానించను అన్నారు. ఎందుకో? దీని భావమేమి? ‘ — పఠాభి గురించి కూడా ఇలాంటి పొల్లు మాటలే అన్నాడు ఆయన.
కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
12/14/2025 2:02 pm
>> ఫారడే జీవితంలో సాండెమానియన్ విశ్వాసం ముఖ్యమైనది. చర్చిలో ప్రార్థనలకి వెళ్ళడం, ఆచారాలు పాటించడం, ఆ సంఘ సభ్యులతో కలసి మెలసి ఉండటం, దాని బోధనలు పాటించడం శ్రద్ధగా చేసేవాడు. తన భార్య కుటుంబం కూడా సాండెమానియన్లే
ఇది నా స్వంత ఘోష కనక ఎవరికీ నచ్చకపోవచ్చు. స్కూల్ లేదా కాలేజీ లెవెల్లో మనకి ఫారడే వంటి వారు తారసపడుతూ ఉంటారు. వీళ్ళు క్లాసులకి రారు, నేర్చుకోరు. వచ్చినా ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళడం. వీళ్ళకి మరికొంతమంది భజనపరులు ఉండడం కూడా చూడొచ్చు. ఈ భజనపరులు చెప్పడం ప్రకారం “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు, వగైరా.” ఇదీ సుత్తి పెద్ద నాన్సెన్స్ మాట. వీళ్ళకి ఇక్కడో పనిచేసే రేడియో, లేదా ఒక పాట కంప్యూటర్ ఇస్తే దాన్ని తిరగేసి మరగేసి ఏదో చేయగలరు. ఆ తర్వాత మిగతా విషయాలు నేర్చుకోరు కనక అలా ఫెయిల్ అవుతూ అక్కడే ఉంటారు.
మరో రెండు మూడేళ్ళకి జరిగేది ఏమిటంటే, పూర్తిగా జీవితంలో ఫెయిల్ అయి రోడ్డుమీద నుంచుంటారు. మెల్లిగా సిగరెట్టూ, మందూ అలవాటు అవుతాయి. అక్కడనుంచి జారుడు కిందకి. మరి కొన్నాళ్ళకి ఏదో పనిలో కుదురుకుంటారు. జీవితం తెల్లవారి పోతుంది. అయితే ఇటువంటి వారందరూ ఫారడేలు అయిపోతారని కాదు కానీ, వీళ్ళకి సరైన దిశా నిర్దేశం చేసేవారుంటే ఏదో బతికి బయట కట్టే అవకాశం ఉంది. కొండొకచో ఈ దిశా నిర్దేశానికి దండం కావాల్సి రావొచ్చు. ఫారడే జీవితంలో ఈ “సాండెమానియన్ విశ్వాసం” వల్ల ఆయన దారిలో పడ్డాడనుకుంటా. లేకపోతే మనకి రోజూ కనిపించే “వాడికి మంచి సబ్జక్ట్ ఉంది కానీ రాయలేడు, అందువల్ల అస్తమానూ ఫెయిల్ అయిపోతూ ఉంటాడు” అనే దారిలోనే వెళ్ళి ఉండేవాడేమో అనిపించింది ఈ వ్యాసం చదివాక.
పోతన భాగవతంలో దృశ్యీకరణం – 3 గురించి Giri గారి అభిప్రాయం:
12/13/2025 9:41 am
తెలుగుభాషని పాలసముద్రంగా చేసి స్వయంగా చిలికి భాగవతరసామృతాన్ని మనకి అందించిన పరమభాగవతోత్తముడు భక్తపోతనగారు. లక్మీదేవితో సరసాలాడిన ఆ చేతితో, బలిచక్రవర్తిదగ్గర చాపిన ఆ చేతితో మన తెలుగుభాషలో పద్యం రాయించి తెలుగుభాషని పునీతం చేసిన భక్తశిఖామణి. భాగవతరసామృతాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి కలిగినవారికి ఆ సిరిపతి దీర్ఘాయుని ప్రసాదించాలి.
Walked into a bar గురించి చిట్టత్తూరు మునిగోపాల్ గారి అభిప్రాయం:
12/12/2025 12:20 am
నిజమే.. ఇక మానవకల్పిత కథలు ఉండవు. యాంత్రిక సృజన అప్పుడే సాహిత్యాకాశాన్ని కమ్మేసింది. నువ్వు, నేను అందరం అందులో కలిసిపోవాల్సిందే అనిపిస్తోంది. అయితే రచయిత ఈ వినూత్న ప్రయోగం ద్వారా ఏమి చెప్పదలచుకున్నారు అన్నది అయోమయంగానే మిగిలిపోయింది.
‘దిద్దు’బాటు గురించి చిట్టత్తూరు మునిగోపాల్ గారి అభిప్రాయం:
12/11/2025 11:59 pm
ముసలోళ్లు అనుకుంటాము కానీ కాలాంతకులు. మనకు ఎప్పుడు ఏమి అవసరమో ముందుగానే ఊహించి భవిష్యత్తుకు మదుపు చేయగల ముందు చూపు కచ్చితంగా వారికి ఉంటుంది. ఈ సత్యాన్ని పొన్నాడ గౌరి గారి కథ, అందమైన శ్రీకాకుళం యాసలో మరోసారి నిరూపించింది.
త్యాగరాజ అష్టోత్తరశతనామములు గురించి హనుమ కుమారి గురజాల గారి అభిప్రాయం:
12/09/2025 9:48 am
ఓం శ్రీ త్యాగరాజు గారి నామావళి చాలా బాగుంది.అంతటి మహానుభావుల నామాలు జపించటం చాలా యోగం. చాలాబాగా వ్రాసారు mam. ధన్యవాదములు.
తిక్కనగారి భారతంలో ఒక పద్యం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
12/09/2025 9:34 am
సుధేష్ణ కోసం వెతుకుతూ ఇక్కడకి యథాలాపముగ వచ్చాను. వేలూరి గారి ప్రశ్నకి విశ్వనాథ వారి జవాబు [1]:
“తిక్కన్న గారు మరియొక పద్యమును వ్రాయగలరు కదా! వ్రాయలేదు. ఎందుచేత వ్రాయలేదు.
ఈ పద్యములోని అన్వయము, కూర్పు, మాటలు, సర్వమును ద్రౌపది కీచకునితో మాటాడునపుడు సహజముగా వచ్చినవి. ఈమాటలలో ఆమెయొక్క మనోయధార్ధ్యము విస్పష్టముగా గోచరించుచున్నది. మరల నదే పద్యము భర్తతో మాటాడినపుడు చెప్పినచో నామె మనోయధార్ధ్యము, ఆమె కోపము, కీచకునితో నన్నప్పు డెట్లున్నవో అట్లు వెలయించుటకు చెప్పినది. భర్త కదా! అతడు నమ్మవలయును. ఇప్పుడు నమ్మక తప్పదు. అప్పుడున్న కోపపుటొత్తిడి యిప్పుడుండదు. ఇంకేవో మాటలు వచ్చును. భర్తకు నమ్మకము కుదురును కుదరదు. ఇప్పుడు కుదరక తప్పదు.
ఆ వెనుకటి స్థితిని సరిగా నదే పద్యముతో రూపుకట్టించుట గొప్పకవులు చేసెడి శిల్పములో నొకటి.”
కొడవళ్ళ హనుమంతరావు
[1] విశ్వనాథ విమర్శ గ్రంథ నిdhi – II. తృతీయ ముద్రణ. 2021. పేజి 56.