ఈ సుదీర్థమైన ఎంతో అందమైన చాలా ఉపయుక్తమైన ఆసక్తికరమైన వ్యాసంలో ఆశ్చర్యం నాపేరు కూడా ఉంది. ఎంతో కృతజ్ణుడిని గుర్తుంచుకొన్నందుకు.
నేను అమెరికాకు వచ్చిన క్రొత్తలో SCIT వేదికలో రాయల వారి తలపక్షచ్చట గ్రుక్కి బాతువులు అన్న పద్యం గురించి వ్రాసి రంగప్రవేశం చేసాను. దానికి అభినందనపురస్సరంగా స్పందించిన మొదటి సహృదయులు పిల్లలమఱ్ఱి రామకృష్ణగారు.
పిల్లలమఱ్ఱి రామకృష్ణ గారు బహుసౌమ్యులు సహృదయులు. వారితో నాకు మంచి మైత్రి ఉండేది. నేను అమెరికానుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వారికి దూరమైనాను. వారి మెయిల్ అడ్రసును పోగొట్టుకున్నాను. ఎంత ప్రయత్నించినా వారిని మరలా పలుకరించలేక పోయాను. వారి మెయిల్ అడ్రసు ఎవరైనా ఇస్తే, ఇచ్చినవారికి కృతజ్ఞుడనై ఉంటాను. రామకృష్ణ పిల్లలమఱ్ఱి వారిని పలుకరించటానికి మరలా ప్రయత్నిస్తాను.
రచ్చబండ గురించి తెలియదు! తెలుసా రోజులను ఐతే ఇప్పటికీ మరిచిపోలేను. తెలుసా మిత్రులనూ మరచిపోలేను.
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
ఈ పిల్లనగ్రోవిలోని గాలి అనే ఈశీర్షిక తప్ప దాని క్రింద ఏమీ లేదు! ఏదో జరిగి కాంటెంట్ ఎగిరిపోయింది. సంపాదకులు పునరుద్ధరించవలసింది.
[ఆ రచన తానా పత్రికలో ప్రచురితమైనది, పిడిఎఫ్గా మేము ప్రచురించాము. కొత్త థీమ్కు మారినప్పుడు కొన్ని పిడిఎఫ్ రచనలతో ఇబ్బంది వచ్చింది. సరిదిద్దుతున్నాము – సం.]
ఈమాట సంపాదకులకు విన్నపం.
దయచేసి ఇక్కడ పుస్తకముఖచిత్రాన్ని అడ్డంగా ముద్రించిన విషయాన్ని గమనించి సరిచేయవలసింది. ఇలా ఉండటం సుదర్శనం గారి పట్ల అపచారం అవునో కాదో నేను చెప్పవలసింది లేదు కాని అలా చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.
ఈ ఏడుసంవత్సరాల కాలంలోనూ ఈవిషయం గమనికకు రాలేదంటే దాని అర్ధం ఈవ్యాసాన్ని పాఠకులు పట్టించుకోలేదనా? ఏమో!
చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.
నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.
ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.
మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.
విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.
ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.
అధికమాసం (పురుషోత్తమ మాసం అనీ పిలుస్తారు) లో చౌరాష్టకం గానం చేసే వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంది. ఇక ఈ అష్టకం ‘ఉపజాతి’ అన్న మిశ్ర ఛందస్సులో ఉన్నది. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రను సమ విషమపాదాల్లో ప్రస్తరిస్తే వచ్చే ఛందమిది (మినహాయింపు అష్టకంలో చివరిది – అందులో ప్రస్తరించిన పాదాలు ఇంద్ర వజ్ర (18 మాత్రలు), ఉపేంద్ర వజ్రవి (17 మాత్రలు) కావు, మరేదో వృత్తం -7 మాత్రలు ఎక్కువ). అన్ని అష్టకాల్లాగే ఇది గాన యోగ్యం. అనువాదంలో అసలు గొడవ ఇక్కడి నుండే మొదలవుతుంది. మూలంలో సంగీత గుణమున్న కవిత్వాన్ని అనువాదంలో మెప్పించలేము. అష్టకాలు మరీ కష్టం.
అనువాదకులు అధికంగా మాలికలు ఎంచుకున్నారు (4 ఉత్పలమాలలు & 2 చంపకమాలలు – 28 మాత్రలు – వజ్రలతో పోలిస్తే 10-11 మాత్రలు ఎక్కువ); సీసం ఆటవెలది, తేటగీతి కూడా వచ్చాయి. ఇందులో తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది. కారణం – తేటగీతి పాదంలో తక్కువ అంటే 17 మాత్రలు, ఎక్కువ అంటే 19 – మధ్యస్థంగా 18 మాత్రలు వస్తాయి. కొంత మెలకువతో రాస్తే క్లుప్తత చెడకుండా భావాన్ని, ఉపజాతి లోని స్ఫూర్తిని సమంగా పట్టుకురావచ్చు – ఏమాత్రం దండుగ్గణాలు లేకుండా. సంస్కృతంలో ఏదో ఒక వృత్తాన్ని ఎన్నుకొని చివరికంటా దానితోనే బండి లాగించడం పరిపాటి, మన కవుల్లో దూకుడు ఎక్కువ, అది అలా ఉండనిస్తే, అక్కడక్కడ లోతైన వ్యంగ్యం ఉన్నా – మూలంలో కథ అందరికి తెలిసినదే. కావున చౌరాష్టకం మొత్తం తేటగీతులతో రాస్తే మరింత అందగించేది. మూలంలో – వ్యంగ్యంగా, క్లుప్తంగా చెప్పడం ఉంది, ఎక్కడా వివరణ అన్నది లేదు.
ఎంచుకున్న వృత్తం ఉపజాతి కాబట్టి, ఆ పరిమితులకు లోబడి, ఎంతో సంయమంతో నడిచింది వ్యవహారం. ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –
చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
కొండ మీద కూచుని రోజుకొక కృతి రచించిన అన్నమయ్య కూడా ‘ కినిసి వెన్న దొంగిలె వీడే’ అన్నాడే గానీ పాల ప్రస్తావన తీసుకురాలేదు. (5 వ పద్యానువాదంలో “వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు” అన్న వాక్యమున్నది – పాల ప్రస్తావన లేదక్కడ). ఇక, జలకాలు ఆడేటప్పుడే కదా బట్టలు మాయమయినది – మూలంలో స్నానాల ప్రస్తావన తేలేదు. అది అనువాదంలోకి వచ్చి చేరింది. కవిత్వంలో పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరించడం, వివరణకు పూనుకోవడం పెద్ద దోషం – మూలంలోని లేని దోషాన్ని అనువాదంలో స్థాపించడం మరింత పెద్ద తప్పు. అంతేకాదు, అగ్రగణ్యుడు అంటే రాజు అనడం కూడా తప్పు – వీరాగ్రగణ్యుడు అంటే వీరుల్లో మొదట లెక్కించవలసిన వాడు అంతే గాని వీరులకు రాజు కాదు. ఇన్ని తప్పులు ఎందుకు దొర్లాయి అంటే – మూలంలో కావ్యాత్మను పట్టుకోలేకపోవడం, వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం. కాబట్టి మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది.
ఐదవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ:
ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
[వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు]
భక్తిరజ్జువులను బంధించినాను నా
[హృదయమందిరమున నింపు మీఱ] ( 5)
(మూలము నందు లేని సంబోధనలు ) [మూలంలో లేనివి ]
మూలంలో కృష్ణ సంబోధన అష్టకం ముగిసేటప్పుడు కేవలం ఒక్క సారి వినిపిస్తుంది – అనువాదంలో ఐదారు వచ్చి చేరాయి. మూలంలో రెండు పాదాల్లో చెప్పిన భావం అనువాదంలో సీసమై విస్తరించింది. తర్వాత రెండు పాదాల్లోని భావం చెప్పడానికి అనువాదంలో ఒక ఆటవెలది ప్రవేశించింది. అనువాదం కత్తి మీద సాము, అందులోను గానయోగ్యమైన అష్టకాలకు ఇక చెప్పేదేముంది. దాని కన్నా – మూలంలోని విశేషాలు సరళంగా అనువాదకునికి తెలిసిన వాడుకభాషలో వివరించడం శ్రేయస్కరం అనిపిస్తుంది. లేదా గురజాడ మార్గంలో, ముత్యాల సరాల్లో అణకువగా తేలిక తెలుగులో అనువాదం చేయవచ్చు.
(ఉరామరికగా, కేవలం ఉదాహరణ కోసం సుమా)
ఆరవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ :
‘ తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది ‘ అని పైన తెలిపి ఉన్నాను. ఛినత్సి, భినత్సి అన్న రెండు సంస్కృత క్రియలను తెనుఁగులో ఏకంగా త్రెంచి పడ వైచినా – దాని దుంప తెంచిరి అది అటుండనిద్దాం- బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నారు శ్యామలకవి – ఉపజాతిని ఎంతో ఔచిత్యంతో తేటగీతిలో తెనిగించారు.
“దించెదను కవిభావ ముదీర్ణశక్తి ” అని గొప్పగా రాశారు ఈ పద్యం.
కథనం బాగుంది, కానీ ఆవిడ 4గురి పిల్లల్ని వదిలి వెల్లిపోవడానికి ఏమాత్రం సహేతుకమైన కారణం కనిపించలేదు, తన సొంత కొడుకు 10 ఏళ్ళ తరవాత వస్తే కనీసం దగ్గరికి కూడా తీసుకోదా, మరి ఏ కారణం చేత చివరలో ఆవిడ పశ్చాత్తాపం పొందింది.
ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:
11/09/2024 7:19 pm
హను గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు
శ్రీనివాస్ గారూ
ధన్యవాదాలు
మీలాంటి వారి స్పందన నాకు మరిన్ని రాసే, చేసే ప్రేరణనిస్తుంది
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 1:22 pm
ఈ సుదీర్థమైన ఎంతో అందమైన చాలా ఉపయుక్తమైన ఆసక్తికరమైన వ్యాసంలో ఆశ్చర్యం నాపేరు కూడా ఉంది. ఎంతో కృతజ్ణుడిని గుర్తుంచుకొన్నందుకు.
నేను అమెరికాకు వచ్చిన క్రొత్తలో SCIT వేదికలో రాయల వారి తలపక్షచ్చట గ్రుక్కి బాతువులు అన్న పద్యం గురించి వ్రాసి రంగప్రవేశం చేసాను. దానికి అభినందనపురస్సరంగా స్పందించిన మొదటి సహృదయులు పిల్లలమఱ్ఱి రామకృష్ణగారు.
పిల్లలమఱ్ఱి రామకృష్ణ గారు బహుసౌమ్యులు సహృదయులు. వారితో నాకు మంచి మైత్రి ఉండేది. నేను అమెరికానుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వారికి దూరమైనాను. వారి మెయిల్ అడ్రసును పోగొట్టుకున్నాను. ఎంత ప్రయత్నించినా వారిని మరలా పలుకరించలేక పోయాను. వారి మెయిల్ అడ్రసు ఎవరైనా ఇస్తే, ఇచ్చినవారికి కృతజ్ఞుడనై ఉంటాను. రామకృష్ణ పిల్లలమఱ్ఱి వారిని పలుకరించటానికి మరలా ప్రయత్నిస్తాను.
రచ్చబండ గురించి తెలియదు! తెలుసా రోజులను ఐతే ఇప్పటికీ మరిచిపోలేను. తెలుసా మిత్రులనూ మరచిపోలేను.
తుపాకి గురించి Ramesh అభిప్రాయం:
11/09/2024 12:57 pm
చాలా sensitive గా , చిన్న పిల్లలని ఎలా పెంచుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో చక్కగా వుంది, ధన్యవాదాలు
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 10:58 am
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 6:20 am
ఇప్పుడు వ్రాస్తున్న మాటలు నాదగ్గర దాదాపుగా యాభైయేళ్ళుగా మురుగుతున్న మాటలు.
విశ్వనాథ వారి నవల ఒకటి ఉంది “బాణామతి” అని. తెన్నేటి హేమలత గారి నవల ఒకటి ఉంది “దెయ్యాలు లేవూ” అని.
ఎవరైనా ఈ రెండు పుస్తకాలను చదివితే అవి ఒకదానికి ఒకటి దాదాపు కార్బన్ కాపీల వంటివి అని స్పష్టంగానే తెలుస్తుంది.
ఇద్దరూ ఉద్దండులైన రచయితలు.వీరిలో ఎవరికీ మరొకరి నవలను దాదాపు యధాతధంగా వ్రాయవలసిన అగత్యం లేదు.కాని ఇలా ఎలా జరిగింది?
అదే నాకు అయోమయంగా అనిపిస్తుంది.
మరొకసారి ఈ రచనలను రెండింటినీ చదువుదామంటే నాకు అంతర్జాలంలో ఐతే కనబడటం లేదు. అవి సంపాదించగలిగితే ఏది ముందుగా వెలువడిందీ అన్నదైనా తెలుస్తుంది.
ఈ పిల్లనగ్రోవిలోని గాలి గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 6:01 am
ఈ పిల్లనగ్రోవిలోని గాలి అనే ఈశీర్షిక తప్ప దాని క్రింద ఏమీ లేదు! ఏదో జరిగి కాంటెంట్ ఎగిరిపోయింది. సంపాదకులు పునరుద్ధరించవలసింది.
[ఆ రచన తానా పత్రికలో ప్రచురితమైనది, పిడిఎఫ్గా మేము ప్రచురించాము. కొత్త థీమ్కు మారినప్పుడు కొన్ని పిడిఎఫ్ రచనలతో ఇబ్బంది వచ్చింది. సరిదిద్దుతున్నాము – సం.]
పుస్తక పరిచయం: సుదర్శనం గారికి… గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 5:25 am
ఈమాట సంపాదకులకు విన్నపం.
దయచేసి ఇక్కడ పుస్తకముఖచిత్రాన్ని అడ్డంగా ముద్రించిన విషయాన్ని గమనించి సరిచేయవలసింది. ఇలా ఉండటం సుదర్శనం గారి పట్ల అపచారం అవునో కాదో నేను చెప్పవలసింది లేదు కాని అలా చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.
ఈ ఏడుసంవత్సరాల కాలంలోనూ ఈవిషయం గమనికకు రాలేదంటే దాని అర్ధం ఈవ్యాసాన్ని పాఠకులు పట్టించుకోలేదనా? ఏమో!
[మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు – సం.]
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
11/09/2024 2:21 am
చౌరాష్టకానువాదానికి యదుకులభూషణుల విమర్శ రమ్యంగా ఉంది.
నేను చేసినది చౌరాష్టకానికి స్వేచ్ఛానువాదం అని మనవి చేయటం జరిగింది.
ఒక భాష నుండి మరొక భాష లోనికి అనువదించటం లోని సాధకబాధకాలు తెలిసిన యదుకులభూషణులు అమూలకమైన మాటల నెత్తి చూపటమూ తప్పుబట్టటమూ కొంచెం అచ్చెరువు కలిగించింది. మూలం లోని పదాలను కాని తత్సమానాలను కాని ప్రయోగిస్తూ అలాగే భూలోకంలోని భావానికి న్యూనాతిరిక్తంగా ఏమీ లేకుండా మూలదైర్ఘ్యాన్నే పాటించుతూ అనువదించటం బహుకష్టం. పద్యం కృతకం అయిపోయే ప్రమాదం హెచ్చు.
మహాభారతాంధ్రీకరణం నాటి నుండి నేటిదాకా కవులు అనువాదంలో స్వేచ్ఛ తీసుకున్నారు. మక్కికిమక్కి అనువాదాలు కళగట్టినది తక్కువే కదా.
విషయాన్ని సందర్భానుసారంగా పెంచటం కొత్త విషయం కాదు కదా. పాల దొంగతనం వేమనగారే అంటించారు కదా కృష్ణుడికి గొల్ల యిండ్లపాలు కోరనేల అని. నేనేమీ కొత్తగా అన్నది లేదు.
ఇకపోతే విమర్శకులు నేను బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నానని అన్నారు. చాలా సంతోషం.
యదుకులభూషణులకు ధన్యవాదాలు.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
11/08/2024 9:44 pm
అధికమాసం (పురుషోత్తమ మాసం అనీ పిలుస్తారు) లో చౌరాష్టకం గానం చేసే వైష్ణవ సంప్రదాయం ఒకటి ఉంది. ఇక ఈ అష్టకం ‘ఉపజాతి’ అన్న మిశ్ర ఛందస్సులో ఉన్నది. ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్రను సమ విషమపాదాల్లో ప్రస్తరిస్తే వచ్చే ఛందమిది (మినహాయింపు అష్టకంలో చివరిది – అందులో ప్రస్తరించిన పాదాలు ఇంద్ర వజ్ర (18 మాత్రలు), ఉపేంద్ర వజ్రవి (17 మాత్రలు) కావు, మరేదో వృత్తం -7 మాత్రలు ఎక్కువ). అన్ని అష్టకాల్లాగే ఇది గాన యోగ్యం. అనువాదంలో అసలు గొడవ ఇక్కడి నుండే మొదలవుతుంది. మూలంలో సంగీత గుణమున్న కవిత్వాన్ని అనువాదంలో మెప్పించలేము. అష్టకాలు మరీ కష్టం.
అనువాదకులు అధికంగా మాలికలు ఎంచుకున్నారు (4 ఉత్పలమాలలు & 2 చంపకమాలలు – 28 మాత్రలు – వజ్రలతో పోలిస్తే 10-11 మాత్రలు ఎక్కువ); సీసం ఆటవెలది, తేటగీతి కూడా వచ్చాయి. ఇందులో తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది. కారణం – తేటగీతి పాదంలో తక్కువ అంటే 17 మాత్రలు, ఎక్కువ అంటే 19 – మధ్యస్థంగా 18 మాత్రలు వస్తాయి. కొంత మెలకువతో రాస్తే క్లుప్తత చెడకుండా భావాన్ని, ఉపజాతి లోని స్ఫూర్తిని సమంగా పట్టుకురావచ్చు – ఏమాత్రం దండుగ్గణాలు లేకుండా. సంస్కృతంలో ఏదో ఒక వృత్తాన్ని ఎన్నుకొని చివరికంటా దానితోనే బండి లాగించడం పరిపాటి, మన కవుల్లో దూకుడు ఎక్కువ, అది అలా ఉండనిస్తే, అక్కడక్కడ లోతైన వ్యంగ్యం ఉన్నా – మూలంలో కథ అందరికి తెలిసినదే. కావున చౌరాష్టకం మొత్తం తేటగీతులతో రాస్తే మరింత అందగించేది. మూలంలో – వ్యంగ్యంగా, క్లుప్తంగా చెప్పడం ఉంది, ఎక్కడా వివరణ అన్నది లేదు.
ఎంచుకున్న వృత్తం ఉపజాతి కాబట్టి, ఆ పరిమితులకు లోబడి, ఎంతో సంయమంతో నడిచింది వ్యవహారం. ఇక అనువాదంలోకి ప్రవేశిస్తే –
మొదటి శ్లోకం, దానికి ఆంధ్రీకరణ:
వ్రజే ప్రసిద్ధం నవనీతచౌరం
గోపాంగనానాం చ దుకూలచౌరం
అనేకజన్మార్జితపాపచౌరం
చౌరాగ్రగణ్యం పురుషం నమామి
దొంగిలె [పాలు]వెన్నలను [తొల్లిట నీతడు] గొల్లపల్లెలన్
దొంగిలె గొల్లకన్నియలు [తోయములాడెడు వేళ] చీరలన్
దొంగతనంబుచేసె [బహుధూర్తత నావగు] పాప[సంపదల్]
దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద [వీని కెప్పుడున్]
[కుండలీకరణల్లో ఉన్నవి – మూలంలో లేని అంశాలు ]
చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
కొండ మీద కూచుని రోజుకొక కృతి రచించిన అన్నమయ్య కూడా ‘ కినిసి వెన్న దొంగిలె వీడే’ అన్నాడే గానీ పాల ప్రస్తావన తీసుకురాలేదు. (5 వ పద్యానువాదంలో “వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు” అన్న వాక్యమున్నది – పాల ప్రస్తావన లేదక్కడ). ఇక, జలకాలు ఆడేటప్పుడే కదా బట్టలు మాయమయినది – మూలంలో స్నానాల ప్రస్తావన తేలేదు. అది అనువాదంలోకి వచ్చి చేరింది. కవిత్వంలో పాఠకుని ఊహకు వదిలేయవలసిన విషయాన్ని విస్తరించడం, వివరణకు పూనుకోవడం పెద్ద దోషం – మూలంలోని లేని దోషాన్ని అనువాదంలో స్థాపించడం మరింత పెద్ద తప్పు. అంతేకాదు, అగ్రగణ్యుడు అంటే రాజు అనడం కూడా తప్పు – వీరాగ్రగణ్యుడు అంటే వీరుల్లో మొదట లెక్కించవలసిన వాడు అంతే గాని వీరులకు రాజు కాదు. ఇన్ని తప్పులు ఎందుకు దొర్లాయి అంటే – మూలంలో కావ్యాత్మను పట్టుకోలేకపోవడం, వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం. కాబట్టి మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది.
ఐదవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ:
“ధనం చ మానం చ తథేంద్రియాణి
ప్రాణాంచ హృత్వా మమ సర్వమేవ
పలాయసే కుత్ర ధృతోద్య చౌర
త్వం భక్తిదామ్నాసి మయా నిరుద్ధః” (5)
నాధనంబుల నెల్ల [నయముగా నీపాలు చేసికొన్నావుగా]( చిన్నిదొంగ)
నా మాన[ధన]మును (శ్యామసుందర) [నీవు కొల్లగొట్టితివిగా] (గోపబాల)
అరయ నా సర్వేంద్రియముల సత్వంబుల నీవ గైకొంటివి (నీటుకాడ)
నాప్రాణములు [కూడ నావి కావాయెనే నీయందు నిలచెనే] (నీలవపుష)
ఇన్ని యపహరించి యెందు బోయెదవయ్య
[వెన్నదొంగ నిన్ను విడుచు టెట్లు]
భక్తిరజ్జువులను బంధించినాను నా
[హృదయమందిరమున నింపు మీఱ] ( 5)
(మూలము నందు లేని సంబోధనలు ) [మూలంలో లేనివి ]
మూలంలో కృష్ణ సంబోధన అష్టకం ముగిసేటప్పుడు కేవలం ఒక్క సారి వినిపిస్తుంది – అనువాదంలో ఐదారు వచ్చి చేరాయి. మూలంలో రెండు పాదాల్లో చెప్పిన భావం అనువాదంలో సీసమై విస్తరించింది. తర్వాత రెండు పాదాల్లోని భావం చెప్పడానికి అనువాదంలో ఒక ఆటవెలది ప్రవేశించింది. అనువాదం కత్తి మీద సాము, అందులోను గానయోగ్యమైన అష్టకాలకు ఇక చెప్పేదేముంది. దాని కన్నా – మూలంలోని విశేషాలు సరళంగా అనువాదకునికి తెలిసిన వాడుకభాషలో వివరించడం శ్రేయస్కరం అనిపిస్తుంది. లేదా గురజాడ మార్గంలో, ముత్యాల సరాల్లో అణకువగా తేలిక తెలుగులో అనువాదం చేయవచ్చు.
(ఉరామరికగా, కేవలం ఉదాహరణ కోసం సుమా)
పేరుమోసిన వెన్న దొంగవు
గొల్లభామల వల్లెవాటులు,
జన్మజన్మల పాపభారం –
హరించు నీకు నమస్కారం 1
రాధమనసును చూరగొంటివి
మెరిసిపోయే మేఘకాంతిని,
పంచ జేరినవారి సమస్తం –
హరించు నీకు నమస్కారం 2
ఆరవ శ్లోకం దానికి ఆంధ్రీకరణ :
‘ తేటగీతితో చేసిన అనువాదం మేలుగా ఉంది ‘ అని పైన తెలిపి ఉన్నాను. ఛినత్సి, భినత్సి అన్న రెండు సంస్కృత క్రియలను తెనుఁగులో ఏకంగా త్రెంచి పడ వైచినా – దాని దుంప తెంచిరి అది అటుండనిద్దాం- బిల్వమంగళుని స్ఫూర్తి, ఆర్తి పట్టుకున్నారు శ్యామలకవి – ఉపజాతిని ఎంతో ఔచిత్యంతో తేటగీతిలో తెనిగించారు.
“దించెదను కవిభావ ముదీర్ణశక్తి ” అని గొప్పగా రాశారు ఈ పద్యం.
ఛినత్సి ఘోరం యమపాశబంధం
భినత్సి భీమం భవపాశబంధం
ఛినత్సి సర్వస్య సమస్తబంధం
నైవాత్మనో భక్తకృతం తు బంధం (6)
త్రెంచెదవు ఘోరయమపాశ మంచితముగ
త్రెంచెదవు భవపాశ ముదీర్ణశక్తి
త్రెంచెద వఖిలబంధముల్ దీనుల గని
భక్తిపాశంబులను ద్రెంచ వశమె నీకు
స్థాలీపులాకంగా అనువాదంలో కష్టసుఖాలను వివరించాను. ఇంకా ఎవరైనా అనువాదాల్లో మెలకువలు తెలుసుకోదలిస్తే: “అనువాదంలో మెలకువలు
ఇంత కష్టమైన పనిని తలకెత్తుకున్నందుకు తాడిగడప శ్యామలరావు గారికి అభినందనలు తెలుపుతున్నాను. అందరిలాగా, వారి ఇతర పద్యరచనల కోసం ఎదురుచూస్తాను.
రెండు ఆకాశాలు గురించి Ramesh అభిప్రాయం:
11/08/2024 10:35 am
కథనం బాగుంది, కానీ ఆవిడ 4గురి పిల్లల్ని వదిలి వెల్లిపోవడానికి ఏమాత్రం సహేతుకమైన కారణం కనిపించలేదు, తన సొంత కొడుకు 10 ఏళ్ళ తరవాత వస్తే కనీసం దగ్గరికి కూడా తీసుకోదా, మరి ఏ కారణం చేత చివరలో ఆవిడ పశ్చాత్తాపం పొందింది.