అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
సురేశ్,
మాత్రా చందస్సులో ప్రావీణ్యం లేకుండానే “జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార” లాంటి పాట రాయగలరంటావా? ఇది ట్యూనుకు రాసిన పాట అని మర్చేపోవద్దు. ఇంత చిన్న చిన్న విరుపులతో అర్థవంతమైన పాటే రాశారు. నేను ఈ చర్చంతా చదవట్లేదు గానీ… నా అభిప్రాయంలో వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం “ఏం రాస్తే ఎవడు పట్టించుకున్నాళ్ళే” అనే నిరాసక్తత వచ్చాయేమో నని నా అనుమానం.
-అక్కిరాజు
రచయిత వేటూరి కవితారీతిలో తాను గమనించిన దాన్ని వివరించారని నా అభిప్రాయం. రచయిత వేటూరిపై అయిష్టాన్ని ప్రదర్శించారని అనిపించలేదు.
“తరాలు మారినప్పుడు స్థాయి మారుతుందేమో” అన్నారు రోహిణీ ప్రసాద్ గారు. అనుమానమేమీ లేదు దాంట్లో. అయితే ఈ తరాలు వస్తున్న మార్పులను అంగీకరించగలవా లేదా అన్నదే ముఖ్యం. ఇక స్థాయి విషయానికొస్తే, కాళిదాసు చెప్పినట్లు పాతదంతా గొప్పదీ కాదు, కొత్తదంతా చెడ్డదీ కాదు. (పురాణమిత్యేవ న సాధు సర్వం…)
పదాలతో బొమ్మలు చెక్కడం అన్నదాన్ని వేటూరి నమ్మారు. రంగులతో అరూపభావాల్ని చిత్రకారులు ఒకవిధమైన కళారూపంలో అవిష్కరింప ప్రయత్నించినట్లే, వేటూరి ఒక ప్రక్రియను చేపట్టారు. అలాంటి పెయింటింగ్స్ ని పిచ్చిగీతలని వదిలేసి నట్టే, ఈయన కవితల్ని కూడా వదిలేసే వారుంటారు. అది కవి తప్పూ కాదు.. పాఠకుడి తప్పూ కాదు. ఇందాకా అనుకునే స్థాయీభేదమే దానికి కారణం కావచ్చు.
సినీకవి ఒక్క వర్గాన్నే దృష్టిలో పెట్టుకుని పాటలు రాయడు. వేటూరి అన్ని వర్గాలకీ రాయబోయి, చాలా మంచి పాటలు “న భూతో న భవిష్యతి” అనేలా రాసికూడా (అన్ని వర్గాలకీ) అందరి చేతా ఏదో ఒక దానికి నిరసించబడ్డాడు.
జీబ్రాకి algebra చిహ్నాల
లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి
సాహిత్య పౌరోహిత్యం ఇస్తే
వెర్రికాదు వేటూరి పాట సోదరా!
అధివాస్తవిక రచన అంటే మనస్సంచారంలోని అసంలక్ష్యక్రమాన్ని పైకి తేవడం అని శ్రీశ్రీ నిర్వచించాడు. అప్రయత్న రచనలో ఆవిష్కృతమైతున్న చిత్రవిచిత్ర వస్తుజాలమే ఆనందానికి కొంత కారణం అంటూ “మంట, ముళ్ళడొంకలు, నెక్టై, టైపురైటర్, హంస ఇవి ఎందువల్లనో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి, మరుక్షణం మాయమైనవి” అని తన ‘మాటల మూట’లో చెబుతాడు శ్రీశ్రీ.
హద్దులు లేకుండాఎగిరే స్వేచ్ఛాభావాల్ని అస్పష్టమైన పద చిత్రాల ద్వారా, శబ్దం ద్వారా ఆవిష్కరించడం కూడా అధివాస్తవితకే అయితే, వేటూరి అచ్చమైన అధివాస్తవిక కవి. చేతనావస్థలోనో, సుప్తచేతనలోనో తనలో కలిగే అలోచనల అలజడిని పాఠకులలో/శ్రోతలలో కూడా కలిగించడమే కవిత్వానికి పరమావధి అయితే వేటూరి ఆ విషయంలో కృతకృత్యుడయ్యాడనేచెప్పవచ్చు. అదీకాక, ఈ అసంబద్ధ భావాల కుమ్మరింపు వల్ల ఆ పాట భావం చప్పున అర్థం కాకపోవడంలోనే కొంత ఆకర్షణ ఉందని నేనూ భావిస్తాను.
వేటూరి పాట గురించి రామారావు గారు ప్రతిపాదించిన కొన్ని ప్రాధమిక సూత్రాలు పూర్తిగా అధివాస్తవికతా కవిత్వ లక్షణాలేనని నా అభిప్రాయం. అధివాస్తవికత ఒక మానసిక రుగ్మత అన్నవారున్నారు. ఒక భావచిత్రాన్ని గీస్తూ అర్ధాంతరంగా, పరధ్యానంతో మరో భావచిత్రపు కొమ్మ పైకి గెంతడం మానసిక రుగ్మతే అయితే, ఆ ‘శాఖాలంఘన’ లక్షణాలు వేలూరి పాటల్లో పుష్కలంగా కనిపిస్తాయి.
అయితే, వేటూరి రాసిన అన్ని పాటల్లో ఈ రకమైన అస్పష్ట కవిత్వం ఉంటుదని చెప్పలేం. ఉదాహరణకు, రామారావు గారు ప్రస్తావించిన శంకరాభరణం సినిమాలోని ‘రాగం, తానం, పల్లవి’ తీసుకోండి. “శబ్దాలంకారాలు పుష్కలంగా ఉండి చెవికింపుగా హాయిగా వినిపించే ఈ పాట, అర్థాన్ని అడివికి తోలేసి శబ్దాన్ని చంకనెత్తుకోవటానికి ఒక మంచి ఉదాహరణ” అని రామారావుగారు అన్నారు. I beg to disagree.
ఈ చరణంలోని అర్థాన్ని వివరించడం అంతకష్టమేం కాదు. ఈ చరణానికి సాధారణ అర్థం: కృష్ణాతరంగాల ధ్వనులు, కృష్ణానది ప్రాంతం వాడైన నారాయణ తీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి లోని భక్తిగీతాలు, పంట పొలాలు వినిపించే గాంధార స్వరం, రసజ్ఞుల హృదయక్షేత్రంలోని విమల సంగీతం, ఇవన్నీ, నీ పాదకీర్తనమే చేస్తున్నాయి, ఓ క్షీరసాగర శయన!
అయితే, ఈ చరణంలో రామారావు గారు ప్రస్తావించని ఎన్నో సంగీత పరమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ‘రాగం, తానం, పల్లవి’ ని రాగమాలికలో స్వరపరిచారు. సాధారణంగా రాగమాలిక అంటే, పాట మొత్తానికి ఒకే రాగం వాడకుండా, పల్లవి, అనుపల్లవి, చరణాలొక్కొక్కటినికి ఒక్కో రాగంలో స్వరపరచడం. ఇటువంటి రాగమాలికను ఉపయోగించిన సినిమా పాటలకు ఒక మంచి ఉదాహరణ హాయిహాయిగా ఆమని సాగె. అయితే, ‘రాగం, తానం, పల్లవి’ పాటలో ఒక్క చరణంలోని వేర్వేరు పంక్తులనే భిన్న రాగాతో స్వరపరిచాడు మామ (మామ అంటే మహదేవన్ అన్న మాట).
మనం చర్చిస్తున్న చరణంలో మొదటి రెండు లైనులు సారంగ రాగంలో, మధ్యలో రెండు లైన్లు కేదార రాగంలో, చివరి రెండు లైన్లు దేవగాంధారిలో వినిపిస్తాయి(ట) (సంగీతంలో నాకు వినికిడి జ్ఞానమే తప్ప ఏ శిక్షణ లేదు. సంగీతం బాగా తెలిసిన వారు నన్ను సవరించవచ్చు). అంటే వేటూరి, సారంగ, కేదార, దేవగాంధారి అన్న రాగాల పేర్లను దత్తపదిలో ఇచ్చిన పదాలుగా కూర్చి రాసిన చరణమిది. అంతేగాక, కేదార రాగంలో సున్నితంగా వినబడే గాంధారం (గ స్వరం) గురించి, దేవగాంధారి రాగం అనగానే గుర్తుకువచ్చే ‘క్షీరసాగరశయన ‘ అన్న త్యాగరాజ కృతి గురించి తెలిసిన సంగీతజ్ఞులు ఈ చరణం వినగానే ఆనందంతో చప్పట్లు కొడతారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ చదవండీ ఈ పాదాలను. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి!
అలాగే రామారావు గారు సిరిసిరిమువ్వ సినిమాలోని ఈ కింది పాటలో “చివరి ఏడు పాదాల్లోను ఏం రాయాలో తోచక గిలగిలలాడటం స్పష్టంగా కనిపిస్తుంది” అని నిష్కారణంగా వేటూరిని నిందించారని నా అభిప్రాయం!
కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయ సంహితలో నాలుగో కాండంలోని 5వ అధ్యాయాన్ని నమకం అని 7వ అధ్యాయాన్ని చమకం అంటారు! ఇవి రెండు మన వేదవాఙ్మయంలో రుద్రుడిని కీర్తిస్తూ రాసిన వాటిలో అతి ప్రశస్తమైనవి. స్వరాన్ని (tone) అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో యమ ( < యమము=control) అనిపిలిచేవారు. యమ, గమక, లయలు -- ఇవన్నీ ప్రాచీన కాలం నుండీ సంగీతానికి సంబంధించిన పదాలు (See: "Hidden faces of ancient Indian song" By Solveig McIntosh, p. 75 and also "The Ragas of Early Indian Music" by Widdess, Richard (1995), p 404).శివుని తాండవంలో నమక చమకాలలో వినిపించే యమ, గమక, లయలుంటాయి, అలాగే, లోకాలను లయం చేసే విస్ఫులింగాల వికటనటన ఉండుంది. నువ్వు శిలవో, శివుడివో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యిందని దేవుడినే సవాలు చేస్తున్న వాక్యాలు నాకు చిన్నప్పటినుండి అద్భుతంగా అనిపించేవి.
ఆయనకు మాత్రాఛందస్సులపై అంతగా పట్టు లేదన్న విషయం ఆయన రాసిన డబ్బింగ్ పాటలు చూస్తే బోధపడుతుంది. వేటూరి డబ్బింగ్ పాటలపై ఒక ఆసక్తికరమైన చర్చను మీరు తెరచాటు చందమామ అన్న బ్లాగులో చదవవచ్చు!
ఇంకా వేటూరి పాట గురించి ఎంతో రాయాలని ఉంది కానీ, మరింకెప్పుడైనా!
వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
08/26/2011 9:14 pm
అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
08/26/2011 11:08 am
అవునా!థాంక్యూ!!
ఆర్.దమయంతి.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Madhurasree గారి అభిప్రాయం:
08/26/2011 4:07 am
ఆర్.దమయంతి గారు మీరు వ్రాసిన కథ చాలా బాగుంది
వేటూరి పాట గురించి Akkiraju గారి అభిప్రాయం:
08/25/2011 9:03 am
సురేశ్,
మాత్రా చందస్సులో ప్రావీణ్యం లేకుండానే “జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార” లాంటి పాట రాయగలరంటావా? ఇది ట్యూనుకు రాసిన పాట అని మర్చేపోవద్దు. ఇంత చిన్న చిన్న విరుపులతో అర్థవంతమైన పాటే రాశారు. నేను ఈ చర్చంతా చదవట్లేదు గానీ… నా అభిప్రాయంలో వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం “ఏం రాస్తే ఎవడు పట్టించుకున్నాళ్ళే” అనే నిరాసక్తత వచ్చాయేమో నని నా అనుమానం.
-అక్కిరాజు
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
08/23/2011 9:41 pm
తులసీ మోహన్ గారూ!
మీ భావాభిప్రాయాన్ని ఒకే ఒక్క వాక్యంలో వ్యక్తీకరించడం బావుంది.అందంగా కూడా వుంది.థాంక్యూ!
శుభాకాంక్షలతో..
ఆర్.దమయంతి.
చిట్ట చివరిది గురించి Tulasimohan గారి అభిప్రాయం:
08/23/2011 2:00 pm
బాగుంది.. చదువుతుంటే హాయిగా!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Tulasimohan గారి అభిప్రాయం:
08/23/2011 1:51 pm
వర్షంలో నిలువెల్లా తడిసినట్టు వుంది!
వేటూరి పాట గురించి Bhaskar Kompella గారి అభిప్రాయం:
08/22/2011 8:08 pm
పాఠకులు కొందరు, రచయితకి వేటూరి నచ్చరు అన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనబడుతోంది. ఒకరు, “నాకూ నచ్చరు” అన్నారు..
రచయిత వేటూరి కవితారీతిలో తాను గమనించిన దాన్ని వివరించారని నా అభిప్రాయం. రచయిత వేటూరిపై అయిష్టాన్ని ప్రదర్శించారని అనిపించలేదు.
“తరాలు మారినప్పుడు స్థాయి మారుతుందేమో” అన్నారు రోహిణీ ప్రసాద్ గారు. అనుమానమేమీ లేదు దాంట్లో. అయితే ఈ తరాలు వస్తున్న మార్పులను అంగీకరించగలవా లేదా అన్నదే ముఖ్యం. ఇక స్థాయి విషయానికొస్తే, కాళిదాసు చెప్పినట్లు పాతదంతా గొప్పదీ కాదు, కొత్తదంతా చెడ్డదీ కాదు. (పురాణమిత్యేవ న సాధు సర్వం…)
పదాలతో బొమ్మలు చెక్కడం అన్నదాన్ని వేటూరి నమ్మారు. రంగులతో అరూపభావాల్ని చిత్రకారులు ఒకవిధమైన కళారూపంలో అవిష్కరింప ప్రయత్నించినట్లే, వేటూరి ఒక ప్రక్రియను చేపట్టారు. అలాంటి పెయింటింగ్స్ ని పిచ్చిగీతలని వదిలేసి నట్టే, ఈయన కవితల్ని కూడా వదిలేసే వారుంటారు. అది కవి తప్పూ కాదు.. పాఠకుడి తప్పూ కాదు. ఇందాకా అనుకునే స్థాయీభేదమే దానికి కారణం కావచ్చు.
సినీకవి ఒక్క వర్గాన్నే దృష్టిలో పెట్టుకుని పాటలు రాయడు. వేటూరి అన్ని వర్గాలకీ రాయబోయి, చాలా మంచి పాటలు “న భూతో న భవిష్యతి” అనేలా రాసికూడా (అన్ని వర్గాలకీ) అందరి చేతా ఏదో ఒక దానికి నిరసించబడ్డాడు.
వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
08/22/2011 8:30 am
జీబ్రాకి algebra చిహ్నాల
లాంకోటూ పాంకోళ్ళూ తొడిగి
సాహిత్య పౌరోహిత్యం ఇస్తే
వెర్రికాదు వేటూరి పాట సోదరా!
అధివాస్తవిక రచన అంటే మనస్సంచారంలోని అసంలక్ష్యక్రమాన్ని పైకి తేవడం అని శ్రీశ్రీ నిర్వచించాడు. అప్రయత్న రచనలో ఆవిష్కృతమైతున్న చిత్రవిచిత్ర వస్తుజాలమే ఆనందానికి కొంత కారణం అంటూ “మంట, ముళ్ళడొంకలు, నెక్టై, టైపురైటర్, హంస ఇవి ఎందువల్లనో వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా నా మనస్సులో దొర్లుతూ క్షణంలో కనబడి, మరుక్షణం మాయమైనవి” అని తన ‘మాటల మూట’లో చెబుతాడు శ్రీశ్రీ.
హద్దులు లేకుండాఎగిరే స్వేచ్ఛాభావాల్ని అస్పష్టమైన పద చిత్రాల ద్వారా, శబ్దం ద్వారా ఆవిష్కరించడం కూడా అధివాస్తవితకే అయితే, వేటూరి అచ్చమైన అధివాస్తవిక కవి. చేతనావస్థలోనో, సుప్తచేతనలోనో తనలో కలిగే అలోచనల అలజడిని పాఠకులలో/శ్రోతలలో కూడా కలిగించడమే కవిత్వానికి పరమావధి అయితే వేటూరి ఆ విషయంలో కృతకృత్యుడయ్యాడనేచెప్పవచ్చు. అదీకాక, ఈ అసంబద్ధ భావాల కుమ్మరింపు వల్ల ఆ పాట భావం చప్పున అర్థం కాకపోవడంలోనే కొంత ఆకర్షణ ఉందని నేనూ భావిస్తాను.
వేటూరి పాట గురించి రామారావు గారు ప్రతిపాదించిన కొన్ని ప్రాధమిక సూత్రాలు పూర్తిగా అధివాస్తవికతా కవిత్వ లక్షణాలేనని నా అభిప్రాయం. అధివాస్తవికత ఒక మానసిక రుగ్మత అన్నవారున్నారు. ఒక భావచిత్రాన్ని గీస్తూ అర్ధాంతరంగా, పరధ్యానంతో మరో భావచిత్రపు కొమ్మ పైకి గెంతడం మానసిక రుగ్మతే అయితే, ఆ ‘శాఖాలంఘన’ లక్షణాలు వేలూరి పాటల్లో పుష్కలంగా కనిపిస్తాయి.
అయితే, వేటూరి రాసిన అన్ని పాటల్లో ఈ రకమైన అస్పష్ట కవిత్వం ఉంటుదని చెప్పలేం. ఉదాహరణకు, రామారావు గారు ప్రస్తావించిన శంకరాభరణం సినిమాలోని ‘రాగం, తానం, పల్లవి’ తీసుకోండి. “శబ్దాలంకారాలు పుష్కలంగా ఉండి చెవికింపుగా హాయిగా వినిపించే ఈ పాట, అర్థాన్ని అడివికి తోలేసి శబ్దాన్ని చంకనెత్తుకోవటానికి ఒక మంచి ఉదాహరణ” అని రామారావుగారు అన్నారు. I beg to disagree.
“కృష్ణాతరంగాల సారంగరాగాలు
కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు
సస్యకేదారాల స్వరసగాంధారాలు
సరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు
క్షీరసాగరశయన దేవగాంధారిలో
నీపద కీర్తన సేయగా”
ఈ చరణంలోని అర్థాన్ని వివరించడం అంతకష్టమేం కాదు. ఈ చరణానికి సాధారణ అర్థం: కృష్ణాతరంగాల ధ్వనులు, కృష్ణానది ప్రాంతం వాడైన నారాయణ తీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి లోని భక్తిగీతాలు, పంట పొలాలు వినిపించే గాంధార స్వరం, రసజ్ఞుల హృదయక్షేత్రంలోని విమల సంగీతం, ఇవన్నీ, నీ పాదకీర్తనమే చేస్తున్నాయి, ఓ క్షీరసాగర శయన!
అయితే, ఈ చరణంలో రామారావు గారు ప్రస్తావించని ఎన్నో సంగీత పరమైన రహస్యాలు ఇమిడి ఉన్నాయి. ‘రాగం, తానం, పల్లవి’ ని రాగమాలికలో స్వరపరిచారు. సాధారణంగా రాగమాలిక అంటే, పాట మొత్తానికి ఒకే రాగం వాడకుండా, పల్లవి, అనుపల్లవి, చరణాలొక్కొక్కటినికి ఒక్కో రాగంలో స్వరపరచడం. ఇటువంటి రాగమాలికను ఉపయోగించిన సినిమా పాటలకు ఒక మంచి ఉదాహరణ హాయిహాయిగా ఆమని సాగె. అయితే, ‘రాగం, తానం, పల్లవి’ పాటలో ఒక్క చరణంలోని వేర్వేరు పంక్తులనే భిన్న రాగాతో స్వరపరిచాడు మామ (మామ అంటే మహదేవన్ అన్న మాట).
మనం చర్చిస్తున్న చరణంలో మొదటి రెండు లైనులు సారంగ రాగంలో, మధ్యలో రెండు లైన్లు కేదార రాగంలో, చివరి రెండు లైన్లు దేవగాంధారిలో వినిపిస్తాయి(ట) (సంగీతంలో నాకు వినికిడి జ్ఞానమే తప్ప ఏ శిక్షణ లేదు. సంగీతం బాగా తెలిసిన వారు నన్ను సవరించవచ్చు). అంటే వేటూరి, సారంగ, కేదార, దేవగాంధారి అన్న రాగాల పేర్లను దత్తపదిలో ఇచ్చిన పదాలుగా కూర్చి రాసిన చరణమిది. అంతేగాక, కేదార రాగంలో సున్నితంగా వినబడే గాంధారం (గ స్వరం) గురించి, దేవగాంధారి రాగం అనగానే గుర్తుకువచ్చే ‘క్షీరసాగరశయన ‘ అన్న త్యాగరాజ కృతి గురించి తెలిసిన సంగీతజ్ఞులు ఈ చరణం వినగానే ఆనందంతో చప్పట్లు కొడతారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్ళీ చదవండీ ఈ పాదాలను. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టండి!
“కృష్ణాతరంగాల సారంగరాగాలు
కృష్ణలీలాతరంగిణీ భక్తిగీతాలు
సస్యకేదారాల స్వరగాంధారాలు
స్వరసహృదయక్షేత్ర విమలగాంధర్వాలు
క్షీరసాగరశయన దేవగాంధారిలో
నీపద కీర్తన సేయగా”
*
అలాగే రామారావు గారు సిరిసిరిమువ్వ సినిమాలోని ఈ కింది పాటలో “చివరి ఏడు పాదాల్లోను ఏం రాయాలో తోచక గిలగిలలాడటం స్పష్టంగా కనిపిస్తుంది” అని నిష్కారణంగా వేటూరిని నిందించారని నా అభిప్రాయం!
సతీ వియోగము సహియించక – దు
ర్మతియౌ దక్షుని మదమడంచగా
ఢమ, ఢమ, ఢమ, ఢమరుక ధ్వనుల
నమక చమక యమ గమక లయంకర
సకల లోక జర్జరిత భయంకర
వికటనటస్పద విస్ఫులింగముల
విలయ తాండవము సలిపిన నీవే
శిలవే అయితే పగిలిపో-
శివుడే అయితే రగిలిపో-
కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన తైత్తరీయ సంహితలో నాలుగో కాండంలోని 5వ అధ్యాయాన్ని నమకం అని 7వ అధ్యాయాన్ని చమకం అంటారు! ఇవి రెండు మన వేదవాఙ్మయంలో రుద్రుడిని కీర్తిస్తూ రాసిన వాటిలో అతి ప్రశస్తమైనవి. స్వరాన్ని (tone) అతి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో యమ ( < యమము=control) అనిపిలిచేవారు. యమ, గమక, లయలు -- ఇవన్నీ ప్రాచీన కాలం నుండీ సంగీతానికి సంబంధించిన పదాలు (See: "Hidden faces of ancient Indian song" By Solveig McIntosh, p. 75 and also "The Ragas of Early Indian Music" by Widdess, Richard (1995), p 404).శివుని తాండవంలో నమక చమకాలలో వినిపించే యమ, గమక, లయలుంటాయి, అలాగే, లోకాలను లయం చేసే విస్ఫులింగాల వికటనటన ఉండుంది. నువ్వు శిలవో, శివుడివో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యిందని దేవుడినే సవాలు చేస్తున్న వాక్యాలు నాకు చిన్నప్పటినుండి అద్భుతంగా అనిపించేవి. ఆయనకు మాత్రాఛందస్సులపై అంతగా పట్టు లేదన్న విషయం ఆయన రాసిన డబ్బింగ్ పాటలు చూస్తే బోధపడుతుంది. వేటూరి డబ్బింగ్ పాటలపై ఒక ఆసక్తికరమైన చర్చను మీరు తెరచాటు చందమామ అన్న బ్లాగులో చదవవచ్చు!
ఇంకా వేటూరి పాట గురించి ఎంతో రాయాలని ఉంది కానీ, మరింకెప్పుడైనా!
సురేశ్.
నీళ్ళు కాచే పనిపిల్ల గురించి Jagannadham Alapati గారి అభిప్రాయం:
08/22/2011 6:39 am
హృద్యానికి ఈ కవిత సోదాహరణలా ఉంది!
…జగన్నాథం ఆలపాటి