పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
కొన్ని కథలు స్థల కాలాలను మించి విస్తరిస్తాయి. వాటికవే సార్వత్రిక సత్యాలుగా అవతరిస్తాయి. అలా శాశ్వతత్వాన్ని సంతరించుకున్న గొప్ప కథని పూర్తిగా చదవలేకపోయినందుకు చాలా వెలితిగా అనిపిస్తోంది.
ఒక రచయితకు అసిస్టంటు అంటే, ఆ వ్యక్తి పని ఏమి అనే కుతూహలము నాకు కలుగుతూ ఉంది. అంటే ఘోస్ట్ రైతటింగ్ చేస్తారా? ఈ అసిస్టంటులు వ్రాసినదాన్ని రచయిత అక్కడా యిక్కడా మార్పు చేసి తనదంటాడా? పాటలు వ్రాసేవాళ్లకు కూడా ఇలా సహాయకులు ఉంటారు, వాళ్ల పేరులను టైటిల్సులో చూస్తుంటాము. పూర్వకాలములో గొప్ప చిత్రకారులకు ఇలా అసిస్టంటులు ఉండేవారట. వాళ్లు నేపథ్యాన్ని చిత్రీకరిస్తే ముఖ్య చిత్రకారుడు పాత్రలను చిత్రీకరించేవాడట. నా ఈ ప్రశ్నలో ఏదైనా తప్పుంటే క్షమించమని ముందరే మనవి చేస్తున్నాను.. విధేయుడు – మోహన
1. నన్నెచోడుఁడు ప్రాసకై సున్నగా వాడాడా, లేక, అతడు నివసిస్తున్న ప్రాంతంలో ఇంకా మూండు అన్న ఉచ్చారణ ఉండేదా అన్న విషయంపై కచ్చితమైన అభిప్రాయం చెప్పడానికి సరైన ఆధారాలు లేవని నా నమ్మకం. దీర్ఘముపైని అనుస్వరం/అనునాసికం లోపించి అంతకు పూర్వం ఉన్న అచ్చు nasalized కావడం తెలుగులో 7-11 శతాబ్దాల మధ్య జరిగిన పరిణామం. నన్నెచోడుఁడు ఇతర పద్యాల్లో మూండు (మూండ్డు) అనే వాడాడా లేక మూఁడు (మూండు) అని వాడాడా అన్న విషయం పరిశీలించాలి.
2. మిశ్రసమాసాల్లో పూర్వపదము తెలుగై, ఉత్తర పదము సంస్కృతమైతే అది దుష్టసమాసం కాదని నేనింతవరకు ఎప్పుడూ వినలేదు. కేతన గానీ, అప్పకవి గానీ వీటిగురించి రాసారేమో నాకు తెలియదు. పడుచాహారం, గొప్పావేశం (గొప్ప+ఆవేశం), మున్నేత్రుడు (=ముక్కంటి) ఇవన్నీ దుష్టసమాసాలు కావా? మరైతే, ముందు తెలుగు పదం వచ్చి తరువాత సంస్కృత పదం వస్తే, వాటిని కలపడానికి తెలుగు సంధి సూత్రాలు ఉపయోగించాలా, లేక సంస్కృత సంధులా? పచ్చ+అంబరం (పచ్చబట్ట)ను తెలుగు అకార సంధిని వాడి పచ్చంబరం అనాలా? లేదా సంస్కృత సవర్ణదీర్ఘ సంధి ఉపయోగించి పచ్చాంబరం అనాలా? ‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా!
వ్యాసం బాగుంది, కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఒక రెండు విషయాలు –
1) నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.
2) మిశ్రసమాసాలలో తెలుగు పదము ముందు, సంస్కృతపదము తరువాత వస్తే అది దుష్టసమాసము కాదు. సంస్కృతపదము ముందుండి తెలుగు పదము తరువాత వస్తే అది దుష్ట సమాసము. ముజ్జగములు సరియైనది, కాని మహాతల్లి సరియైంది కాదు. కాని ఇతర ద్రావిడ భాషలలో ఇలాటివి ఉన్నాయి.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/02/2011 1:32 pm
పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
లోఁగుఁ దరమైన పొదరుల
నాఁగిన శకునంబ తలఁచు నడుగడుగునకున్
డాఁగఁ గెల నరయుఁ బ్రాణము
లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్ – కు.స. – 5.13
(ప్రాససాంకర్యము చేయలేదు ఇక్కడ)
(దట్టమైన పొదలలో అణగిఉంటాడు, దుశ్శకునాలనుగురించి తలబోస్తాడు, దాగుకోడానికి పక్కల చూస్తాడు, ప్రాణాము విడువడానికి మనసొప్పక మన్మథుడు భయపడుతాడు)
వీంగు నపారసత్త్వగుణా విస్ఫురణం బరమేశ్వరోరు వా-
మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగఁ గాచుచున్న వే-
దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంసుతిఁ దేల్తు సమ్మతిన్ – 1.4
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
వీండేమి సేయుఁ బంచిన
వాండుండంగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక, యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్ – 10.155
(నిజముగా పంపినవాడు ఉండగా వీడేమి చేయును? ఇతడిని పంపిన ఇంద్రుడిని చంపాలి. ప్రయోగించినవాడు ఉండగా బాణము ఏమి చేస్తుంది యుద్ధములో?)
ఇప్పుడు కూడ తమిళనాడులో ఆడవాళ్లను ఆండవాళ్లు అని అంటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఆండవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే అవుతుంది 🙂
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/02/2011 12:54 pm
పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణమునుండి –
సాంస్కృతికాచ్ఛికమిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు – సమాస 2.
సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు. కేవల సంస్కృతంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు రాజాజ్ఞ-తటాకోదకంబు-లక్ష్మీవల్లభుఁడు. సంస్కృతసమంబుల సమాసంబు సాధ్యంబునాఁబడు. రాజునాజ్ఞ-తటాకంబునుదకము-లక్ష్మీవల్లభుఁడు. తక్కిన తెనుఁగుల సమాసంబాచ్ఛికం బనంబడు. ఱేనియానతి-చెఱువునీరు-సిరిచెలువుఁడు. ఉభయంబులు గూడినది మిశ్రంబనంబడు. రాజుముదల-చెఱువునుదకము-సిరివల్లభుఁడు.
మూలఘటిక కేతనకవి ఆంద్రభాషాభూషణమునుండి –
దినకరకొడుకునకును సరి
యనిమిషమొదవునకు సాటి యని యిబ్భంగిన్
దెనిఁగింప సంస్కృతములు
దెనుఁగులు సంధించిరేనిఁ దెగడుదు రార్యుల్ (132)
తెనుగుపదంబులపైఁ బెం-
పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
మును సుకవీంద్రులు గృతులన్
బనిగొని రచియించినట్టి పరిపాటిమెయిన్ (133)
వాఁడిమయూఖము లనఁగా
వేఁడిపయోధార లనఁగా వింజామర నా
మూఁడస్త్రంబు లనఁగా
బోఁడిమిఁ గఱకంఠనామము బోలి తగున్ (134)
(ఇక్కడ అరసున్న ప్రాసనే అన్నిచోట్ల నుపయోగించాడు కేతన)
నీ సంస్కృతంబుతోడ స-
మాసించును నీవినూత్నమణినూపురశ-
బ్దాసక్తచిత్తహంస
త్రాసకరాంబుదము నాగఁ దఱుచై యునికిన్ (135)
ఆకామిని యక్కామిని
యీకొడుకు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూ
రేకార్యం బెక్కార్యం
బాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్ (137)
మీరు వ్రాసిన సమాసాలు ఇలా ఉండవలెననుకొంటాను – పడుచు యాహారము, గొప్ప యావేశము, మూడు నేత్రములవాఁడు, పచ్చ యంబరము లేక పచ్చని యంబరము, పాల యభిషేకము.
విధేయుడు – మోహన
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి pandu kollarapu గారి అభిప్రాయం:
09/02/2011 9:35 am
బాగుందండీ సరదాగా నవ్వడానికి.
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి రాణి. గారి అభిప్రాయం:
09/02/2011 8:17 am
కొన్ని కథలు స్థల కాలాలను మించి విస్తరిస్తాయి. వాటికవే సార్వత్రిక సత్యాలుగా అవతరిస్తాయి. అలా శాశ్వతత్వాన్ని సంతరించుకున్న గొప్ప కథని పూర్తిగా చదవలేకపోయినందుకు చాలా వెలితిగా అనిపిస్తోంది.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Sowmya గారి అభిప్రాయం:
09/02/2011 5:58 am
🙂 బాగుందండీ సరదాగా చదువుకోవడానికి.
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి మోహన గారి అభిప్రాయం:
09/01/2011 10:01 pm
ఒక రచయితకు అసిస్టంటు అంటే, ఆ వ్యక్తి పని ఏమి అనే కుతూహలము నాకు కలుగుతూ ఉంది. అంటే ఘోస్ట్ రైతటింగ్ చేస్తారా? ఈ అసిస్టంటులు వ్రాసినదాన్ని రచయిత అక్కడా యిక్కడా మార్పు చేసి తనదంటాడా? పాటలు వ్రాసేవాళ్లకు కూడా ఇలా సహాయకులు ఉంటారు, వాళ్ల పేరులను టైటిల్సులో చూస్తుంటాము. పూర్వకాలములో గొప్ప చిత్రకారులకు ఇలా అసిస్టంటులు ఉండేవారట. వాళ్లు నేపథ్యాన్ని చిత్రీకరిస్తే ముఖ్య చిత్రకారుడు పాత్రలను చిత్రీకరించేవాడట. నా ఈ ప్రశ్నలో ఏదైనా తప్పుంటే క్షమించమని ముందరే మనవి చేస్తున్నాను.. విధేయుడు – మోహన
నివాసం గురించి రవి వీరేల్లి గారి అభిప్రాయం:
09/01/2011 9:10 pm
చాలా బావుంది. ఇల్లలుకుతున్న కందిరీగ మరీ నచ్చింది.
తానా 2011 ప్రసంగాలు: నవల-నాటకం-సినిమా గురించి Sivakumar గారి అభిప్రాయం:
09/01/2011 9:00 pm
ఆకెళ్ళ గారి ప్రసంగానికి మారుతీరావుగారి జవాబు చాలా గొప్పగా వున్నది.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/01/2011 2:07 pm
మోహన గారు,
మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.
1. నన్నెచోడుఁడు ప్రాసకై సున్నగా వాడాడా, లేక, అతడు నివసిస్తున్న ప్రాంతంలో ఇంకా మూండు అన్న ఉచ్చారణ ఉండేదా అన్న విషయంపై కచ్చితమైన అభిప్రాయం చెప్పడానికి సరైన ఆధారాలు లేవని నా నమ్మకం. దీర్ఘముపైని అనుస్వరం/అనునాసికం లోపించి అంతకు పూర్వం ఉన్న అచ్చు nasalized కావడం తెలుగులో 7-11 శతాబ్దాల మధ్య జరిగిన పరిణామం. నన్నెచోడుఁడు ఇతర పద్యాల్లో మూండు (మూండ్డు) అనే వాడాడా లేక మూఁడు (మూండు) అని వాడాడా అన్న విషయం పరిశీలించాలి.
2. మిశ్రసమాసాల్లో పూర్వపదము తెలుగై, ఉత్తర పదము సంస్కృతమైతే అది దుష్టసమాసం కాదని నేనింతవరకు ఎప్పుడూ వినలేదు. కేతన గానీ, అప్పకవి గానీ వీటిగురించి రాసారేమో నాకు తెలియదు. పడుచాహారం, గొప్పావేశం (గొప్ప+ఆవేశం), మున్నేత్రుడు (=ముక్కంటి) ఇవన్నీ దుష్టసమాసాలు కావా? మరైతే, ముందు తెలుగు పదం వచ్చి తరువాత సంస్కృత పదం వస్తే, వాటిని కలపడానికి తెలుగు సంధి సూత్రాలు ఉపయోగించాలా, లేక సంస్కృత సంధులా? పచ్చ+అంబరం (పచ్చబట్ట)ను తెలుగు అకార సంధిని వాడి పచ్చంబరం అనాలా? లేదా సంస్కృత సవర్ణదీర్ఘ సంధి ఉపయోగించి పచ్చాంబరం అనాలా? ‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా!
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/01/2011 1:05 pm
వ్యాసం బాగుంది, కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఒక రెండు విషయాలు –
1) నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.
2) మిశ్రసమాసాలలో తెలుగు పదము ముందు, సంస్కృతపదము తరువాత వస్తే అది దుష్టసమాసము కాదు. సంస్కృతపదము ముందుండి తెలుగు పదము తరువాత వస్తే అది దుష్ట సమాసము. ముజ్జగములు సరియైనది, కాని మహాతల్లి సరియైంది కాదు. కాని ఇతర ద్రావిడ భాషలలో ఇలాటివి ఉన్నాయి.
విధేయుడు – మోహన