బాగుందండి. మొత్తానికి గారెల్ని చెంచాతో తినటం నేర్చుకోబోతున్నారన్నమాట. అదేదో నక్క, కొంగ కధ లో లాగా మీఇంటికొస్తే మాకూ అలాంటి టిఫినీ పెడతారేమో ! మేమూ కూడా మా ఇంటికొస్తే కాఫీ లో స్ట్రా వేసి తాగమంటాములేండి. సుబ్బయ్య గారికి పట్టాభిరాం ఐడియా ఇవ్వండి. శ్రీలక్ష్మి లాగా ఆ సంగీతం పిచ్చి వదులుతుంది. కాస్త డబ్బు మాత్రం పట్టాభిరాం గారికి అడిగినంత మొత్తం తక్కువ కాకుండా ఇవ్వమని చెప్పండి. 😉 మీరు డుంగుడుడుంగు చెంబు వారా? వ్రాత శైలి చూసి లోటా వారనుకున్నానే?
1) కేతన తరువాత సుమారు ఏడు శతాబ్దాలు గడిచాయి, మధ్యకాలములో వచ్చిన ఎందరో కవులు ఎన్నో సమాసాలను ప్రయోగించి ఉంటారు గదా? మూడు నేత్రములు, మూడు మూర్తులు సరియైన సమాసము, కాని మున్నేత్రుడు కాదు, ఎందుకంటే నేత్రుడు మహద్వాచకము, నేత్రము అమహద్వాచకము. కొన్ని సమాసములు వైరి సమాసములవలె కనబడవచ్చును, కాని అవి అలాటివి కాదు. ఉదాహరణకు లక్ష్మిమగడులో లక్ష్మి సంస్కృతపదము, మగడు తెలుగు పదము, రాజ్యపు సిరి లాటిదే ఇది కూడ. సంబంధ షష్ఠీవిభక్తి ఉన్నప్పుడు ఇలాటివి చెల్లుతాయి. అదే విధముగా ఆ కాంత అక్కాంత, నాదు శిరము నాశిరము సరియైనవే. వేయిపద్మాలు కూడ సరియైనదే. ఇట్టివి కోరాడ మహాదేవశాస్త్రి Historical Grammar of Telugu, గణపవరపు వేంకటపతికవి ఆంధ్రకౌముదిలో చర్చించబడినవి.
2) నన్నయగానీ, తిక్కనగానీ దీర్ఘముపైన అరసున్నను నిండుసున్నగా ఉపయోగించలేదు. ఎందుకంటే అలాటి ప్రయోగము వారి కాలములో, అప్పుడు వారుండిన ప్రాంతములో లేదు. కాని నన్నెచోడునికి అవి సుపరిచితములు, అందుకే వాడాడు అలా. మదరాసులో ఆండవాళ్లు అని వాడుతారు, కాని ఆంధ్రదేశములో అలా వాడరు. అందువల్ల చెన్నై తెలుగు మాండలికములో వ్రాస్తే కూంతురు, ఆండవాళ్లు సహజముగా ఉంటుంది. కాని ఆంధ్ర మాండలీకాలలో అవి ఎబ్బెట్టుగా ఉంటుంది.
మీరు ఓపిగ్గా కేతన పద్యాలను, నన్నెచోడుని పద్యాలను వెతికి మా అందరికీ అందజేసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు.
నా దృష్టిలో ఈ కింది కేతన పద్యం తెలుగు సంస్కృతం పదాల కలయిక సాధువని ధృవీకరిస్తున్నట్టుగా లేదు. ఒక్కొక్కచోటన్ అంటే rarely, occasionally అని అర్థం చేసుకోవాలనుకుంటాను.
ఇంతకు పూర్వం సుకవీంద్రులు తెలుగు సంస్కృతాలను కలిపిన పదాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి వాటిని వాడడంలో తప్పులేదు అంటున్నాడు, కేతన. “ఆర్యవ్యవహారంబులందు దుష్టంబు గ్రాహ్యంబు” అని చెప్పినట్టుగా.
ఇక మీరు చెప్పిన “మూడు నేత్రములవాఁడు”, “పచ్చ యంబరము” అన్నవి విగ్రహవాక్యాలౌతాయి గాని సమాసాలు కావు. కేతన ఇచ్చిన ఉదాహరణలలో మూడస్త్రంబులు అన్న సమాసంలో తెలుగు సంధి వాడడం గమనించదగ్గ విశేషం.(సంస్కృత సంధి సూత్రాలనుబట్టి మూడు+అస్త్రంబులు = మూడ్వస్త్రంబులు (యణాదేశసంధి) అయ్యేది).
నన్నెచోడుడు మూండు, వాండు, వీండు, వీంగు, లోంగొని అని రాయడానికి తమిళ సంపర్కం కారణం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మనం అరసున్న వాడుతున్న ప్రతిపదాన్ని నిండుసున్నాతో ఒకప్పుడు తెలుగులో ఉచ్చరించేవారు. ఈ నిండుసున్నను అరసున్నగా ఉచ్చరించే ధ్వనిపరిణామం జరుగుతున్న రోజుల్లో రెండు రకాల ప్రయోగాలు అర్థవంతంగానే ఉంటాయి కాబట్టి నన్నెచోడుడు వీటిని సున్నతోనూ, అరసున్నతోనూ వాడగలిగాడని నా అభిప్రాయం.
ముఖ్యసంపాదకుడుగా చక్రపాణిగారి శైలీ, అధికారమూ ప్రత్యేకంగా ఉండేవి. మా నాన్నవంటి రచయితలని working editors గా ఎంపిక చేశాక వారిచేత ఎంత చాకిరీ అయినా చేయించేవారాయన.
అప్పట్లో ఆయన నడిపిన ఆంధ్రజ్యోతి, (కొన్నాళ్ళు యువ – దీన్ని మళ్ళీ 1961లో హైదరాబాద్లో మొదలుపెట్టారు), కినిమా, చందమామ, అన్నిటికీ మా నాన్న చేతా, కొంత దాసరి సుబ్రహ్మణ్యంగారిచేతా left and right ఎంతో రాయించేవారు. ఎక్కడా ఎవరి పేరూ పడేది కాదు.
కినిమాలో అప్పట్లో పైకొస్తున్న తారలూ, గాయనీగాయకులూ, కొత్తగా నిర్మాణసంస్థల్లోకి వచ్చిపడుతున్న డబ్బులూ అన్నీ బోలెడంత పని కల్పించేవి. చందమామ ఆఫీసు నుంచి ఏ లంచ్ టైంలోనో బయలుదేరి విజయా-వాహినీ రికార్డింగ్ స్టూడియోలకేసి వెళ్ళే అలవాటూ, షూటింగ్ జరిగే ఫ్లోర్లకు వెళ్ళడమూ మా నాన్న కినిమా మూతపడిన చాలా ఏళ్ళదాకా చేసేవారు. నా స్కూలు రోజుల్లో ఒక్కొక్కప్పుడు నేనుకూడా వెళ్ళి విశేషాలు చూసేవాణ్ణి.
మొత్తంమీద రాసినదెవరనేది ఆ కాంపౌండ్లో అంత ముఖ్యం కాదు. చివరకు విజయచిత్ర మాసపత్రికకు సంపాదకుడుగా నియమించిన రావి కొండలరావుగారికి తమిళ పత్రిక బొమ్మై ఎడిటర్కన్నా తక్కువ జీతం ఇచ్చేవారు. ఎందుకంటే సినిమాల్లో నటించకూడదనే ఆంక్ష ఆయనమీద పెట్టలేదు కనక. ఇది చదివినవారికి పులి గొంతులో ఎముక తీసిన కొంఘ కథ జ్ఞాపకం రావచ్చు!
భానుమతి వ్యాసం రావడమే ముఖ్యం. ఎవరో సేకరించి, స్వయంగా రాసిన వ్యాసానికి మా నాన్న కొన్ని కామెంట్లు జతచేసి, పేజినేషన్ సరిగ్గా వచ్చేటట్టు (చందమామలాగే!) అచ్చు వేయించి ఉంటారు.
1975-80 ప్రాంతాల్లో యువ దీపావళి సంచికల్లోనూ, ఇతర సంచికల్లోనూ మా నాన్న రాసినవీ, దాసరివారు రాసినవీ బెంగాలీ నవలల అనుసరణలు చాలా అచ్చయాయి. కొన్ని నా దగ్గర ఉన్నాయి కూడాను. దీన్ని ghost writing అనాలో, hack work అనాలో నాకు తెలియదు!
ఈమాట అచ్చుతప్పులు లేకుండా ఉండాలంటే ఎవరూ అడగని నా సలహాలు 🙂
1. అచ్చు తప్పులను దుర్భిణీ కళ్లతో చూడవలసిన బాధ్యత రచయితకు ఉంది. ఒకటికి రెండుమారులు చదివి తప్పులను, టైపోలను సంపాదకుల దృష్టికి తేవాలి. మన కళ్లముందున్న తప్పులు మనకు గోచరించవు ఒక్కొక్కప్పుడు. స్నేహితులను, ఇంటిలోని వాళ్లను చదివి వెదకమనాలి.
2. ప్రతి సంపాదకునికి మూడో నాలుగో రచనలను ఎడిట్ చేయవలసి ఉంటుంది, అవి కూడ పత్రిక ప్రకాశమయ్యే మూడు నాలుగు రోజులకుముందు. ఇది అంత సులభమైన పని కాదు. చివరి బాధ్యత వారిదే ఐనా, ఒక రెండు మూడు రోజులలో వాళ్ల వృత్తి, ఇంటి పనులతోబాటు ఈ పనులను కూడా కొనసాగించడము కష్టతరమే.
3. పాఠకులు తప్పులను కనుగొంటే, వాటిని నేరుగా సంపాదకులకు తెలియజేస్తే వారు తప్పకుండా వాటిని సరిదిద్దుతారు. ఈమాట మనది కూడా, కాబట్టి మనము కూడా దీనిని సర్వాంగసుందరముగా చేయవచ్చును.
4. విశ్వనాథం-విశ్వనాధం, తెలుగువారు థ అనే అక్షరాన్ని అలాగే వ్రాసినా దానిని ధ అనే ఉచ్చరిస్తారు. అందుకే థ-ధ లకు యతిమాత్రమే కాదు ప్రాస కూడ చెల్లుతుంది. సారథి-సారధి, కథ-కధ, ఇత్యాదులు ఎన్నో! విధేయుడు – మోహన
“భార్యామణి చెప్పింది చేయడం నాకు నలభయ్యొక్కేళ్ళుగా అలవాటు అయిపోయింది. పెళ్ళికి ముందు అమ్మ కూచి అనేవారు, పెళ్లి అయిన తరువాత కొంగు చాటు మొగుడు అంటున్నారు.” ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ నవంబరులో అవకాశం వచ్చి, మీ ఇంటికి ఏలూరు వస్తే, ఆ టెబుల్ మేనర్సూ అవీ లేకపోతే, కాఫీ ఈయరేమో అని భయంగా ఉంది!
రమ్మంటారా వద్దంటారా?
మీరే అన్నట్లుగా ” పెసరట్టే తెలియని, తినడానికే ఇష్టపడని జనాభా ఉందంటే ” ఆ ప్రాంతంలో తెలుగుదనం తగలపడిపోయినట్లే కదండీ. ఇంకా దేని గురించి మీ కోపం. మీరు అమెరికాలో ఉన్నందున…. మీ ఒక్కరికో , ఇంకోతమందికో పెసరట్టు చేసే విదానం తెలిసినందున, అక్కడ తెలుగుదనం బ్రతికే ఉంది అనుకోమంటే , అనుకుంటాం…! నేను 1984 లో పుట్టాను, నాకు పెసరట్టు తెలుసు , స్వతహాగా చేసుకోగలను కుడా (కావాలని మా అమ్మతో కుర్చుని నేర్చుకున్నాను), అంటే దాన్ని అంత ఇష్టపడ్డాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో చాలా మంది దీనిని ఎరుగుదురు కుడా..!
ఇదే కాకుండా దిబ్బరొట్టె , జోన్నరోట్టే కూడా నా చిన్న వయసులో తిన్నాను. అయితే ఇప్పుడు అవి అంతగా లేవు, ముఖ్యంగా జోన్నరోట్టే. మీరు చెప్పిన తరువాతే ” పెసరట్టు ” తెలుగు వారిదని నాకు తెలిసింది. కాని నాకు ఇష్టమైన ఉపహారం ఏది అని ఎవరైనా అడిగితె నేను చెప్పేది పెసరట్టు, పూరి.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి చాతకం గారి అభిప్రాయం:
09/06/2011 10:40 pm
బాగుందండి. మొత్తానికి గారెల్ని చెంచాతో తినటం నేర్చుకోబోతున్నారన్నమాట. అదేదో నక్క, కొంగ కధ లో లాగా మీఇంటికొస్తే మాకూ అలాంటి టిఫినీ పెడతారేమో ! మేమూ కూడా మా ఇంటికొస్తే కాఫీ లో స్ట్రా వేసి తాగమంటాములేండి. సుబ్బయ్య గారికి పట్టాభిరాం ఐడియా ఇవ్వండి. శ్రీలక్ష్మి లాగా ఆ సంగీతం పిచ్చి వదులుతుంది. కాస్త డబ్బు మాత్రం పట్టాభిరాం గారికి అడిగినంత మొత్తం తక్కువ కాకుండా ఇవ్వమని చెప్పండి. 😉 మీరు డుంగుడుడుంగు చెంబు వారా? వ్రాత శైలి చూసి లోటా వారనుకున్నానే?
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి kavitha గారి అభిప్రాయం:
09/06/2011 10:29 pm
గౌరి గారు, మీ కథలు అనువాదాలు కొన్ని విపుల మాస పత్రిక లొ చదివాను.
ఇది అన్నిటి లోకి మర్చిపోలేనిది! అనువాదం కాకపోయినప్పటికీ…..
పైన మోహన గారు చెప్పినట్టు బిడ్డలను వదలి వేయటము అన్ని చోట్లా ఉన్నదే, కాని ఆడపిల్ల అనే కారణం తో వదలి వేయటము కేవలము మన సంస్కృతి లోనే!!
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/06/2011 8:36 pm
1) కేతన తరువాత సుమారు ఏడు శతాబ్దాలు గడిచాయి, మధ్యకాలములో వచ్చిన ఎందరో కవులు ఎన్నో సమాసాలను ప్రయోగించి ఉంటారు గదా? మూడు నేత్రములు, మూడు మూర్తులు సరియైన సమాసము, కాని మున్నేత్రుడు కాదు, ఎందుకంటే నేత్రుడు మహద్వాచకము, నేత్రము అమహద్వాచకము. కొన్ని సమాసములు వైరి సమాసములవలె కనబడవచ్చును, కాని అవి అలాటివి కాదు. ఉదాహరణకు లక్ష్మిమగడులో లక్ష్మి సంస్కృతపదము, మగడు తెలుగు పదము, రాజ్యపు సిరి లాటిదే ఇది కూడ. సంబంధ షష్ఠీవిభక్తి ఉన్నప్పుడు ఇలాటివి చెల్లుతాయి. అదే విధముగా ఆ కాంత అక్కాంత, నాదు శిరము నాశిరము సరియైనవే. వేయిపద్మాలు కూడ సరియైనదే. ఇట్టివి కోరాడ మహాదేవశాస్త్రి Historical Grammar of Telugu, గణపవరపు వేంకటపతికవి ఆంధ్రకౌముదిలో చర్చించబడినవి.
2) నన్నయగానీ, తిక్కనగానీ దీర్ఘముపైన అరసున్నను నిండుసున్నగా ఉపయోగించలేదు. ఎందుకంటే అలాటి ప్రయోగము వారి కాలములో, అప్పుడు వారుండిన ప్రాంతములో లేదు. కాని నన్నెచోడునికి అవి సుపరిచితములు, అందుకే వాడాడు అలా. మదరాసులో ఆండవాళ్లు అని వాడుతారు, కాని ఆంధ్రదేశములో అలా వాడరు. అందువల్ల చెన్నై తెలుగు మాండలికములో వ్రాస్తే కూంతురు, ఆండవాళ్లు సహజముగా ఉంటుంది. కాని ఆంధ్ర మాండలీకాలలో అవి ఎబ్బెట్టుగా ఉంటుంది.
విధేయుడు – మోహన
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి NNMuralidhar గారి అభిప్రాయం:
09/06/2011 4:46 pm
రెండు చి.న.లు నాలుగు ద.హాలు. అరడజను అ.హా.లు
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల గారి అభిప్రాయం:
09/06/2011 1:55 pm
మోహనరావుగారు:
మీరు ఓపిగ్గా కేతన పద్యాలను, నన్నెచోడుని పద్యాలను వెతికి మా అందరికీ అందజేసినందుకు ఎంతగానో కృతజ్ఞతలు.
నా దృష్టిలో ఈ కింది కేతన పద్యం తెలుగు సంస్కృతం పదాల కలయిక సాధువని ధృవీకరిస్తున్నట్టుగా లేదు. ఒక్కొక్కచోటన్ అంటే rarely, occasionally అని అర్థం చేసుకోవాలనుకుంటాను.
తెనుగుపదంబులపైఁ బెం-
పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
మును సుకవీంద్రులు గృతులన్
బనిగొని రచియించినట్టి పరిపాటిమెయిన్ (133)
ఇంతకు పూర్వం సుకవీంద్రులు తెలుగు సంస్కృతాలను కలిపిన పదాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి కాబట్టి వాటిని వాడడంలో తప్పులేదు అంటున్నాడు, కేతన. “ఆర్యవ్యవహారంబులందు దుష్టంబు గ్రాహ్యంబు” అని చెప్పినట్టుగా.
ఇక మీరు చెప్పిన “మూడు నేత్రములవాఁడు”, “పచ్చ యంబరము” అన్నవి విగ్రహవాక్యాలౌతాయి గాని సమాసాలు కావు. కేతన ఇచ్చిన ఉదాహరణలలో మూడస్త్రంబులు అన్న సమాసంలో తెలుగు సంధి వాడడం గమనించదగ్గ విశేషం.(సంస్కృత సంధి సూత్రాలనుబట్టి మూడు+అస్త్రంబులు = మూడ్వస్త్రంబులు (యణాదేశసంధి) అయ్యేది).
నన్నెచోడుడు మూండు, వాండు, వీండు, వీంగు, లోంగొని అని రాయడానికి తమిళ సంపర్కం కారణం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు మనం అరసున్న వాడుతున్న ప్రతిపదాన్ని నిండుసున్నాతో ఒకప్పుడు తెలుగులో ఉచ్చరించేవారు. ఈ నిండుసున్నను అరసున్నగా ఉచ్చరించే ధ్వనిపరిణామం జరుగుతున్న రోజుల్లో రెండు రకాల ప్రయోగాలు అర్థవంతంగానే ఉంటాయి కాబట్టి నన్నెచోడుడు వీటిని సున్నతోనూ, అరసున్నతోనూ వాడగలిగాడని నా అభిప్రాయం.
కినిమా మాసపత్రిక: భానుమతిపై వ్యాసం గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/06/2011 12:36 pm
ముఖ్యసంపాదకుడుగా చక్రపాణిగారి శైలీ, అధికారమూ ప్రత్యేకంగా ఉండేవి. మా నాన్నవంటి రచయితలని working editors గా ఎంపిక చేశాక వారిచేత ఎంత చాకిరీ అయినా చేయించేవారాయన.
అప్పట్లో ఆయన నడిపిన ఆంధ్రజ్యోతి, (కొన్నాళ్ళు యువ – దీన్ని మళ్ళీ 1961లో హైదరాబాద్లో మొదలుపెట్టారు), కినిమా, చందమామ, అన్నిటికీ మా నాన్న చేతా, కొంత దాసరి సుబ్రహ్మణ్యంగారిచేతా left and right ఎంతో రాయించేవారు. ఎక్కడా ఎవరి పేరూ పడేది కాదు.
కినిమాలో అప్పట్లో పైకొస్తున్న తారలూ, గాయనీగాయకులూ, కొత్తగా నిర్మాణసంస్థల్లోకి వచ్చిపడుతున్న డబ్బులూ అన్నీ బోలెడంత పని కల్పించేవి. చందమామ ఆఫీసు నుంచి ఏ లంచ్ టైంలోనో బయలుదేరి విజయా-వాహినీ రికార్డింగ్ స్టూడియోలకేసి వెళ్ళే అలవాటూ, షూటింగ్ జరిగే ఫ్లోర్లకు వెళ్ళడమూ మా నాన్న కినిమా మూతపడిన చాలా ఏళ్ళదాకా చేసేవారు. నా స్కూలు రోజుల్లో ఒక్కొక్కప్పుడు నేనుకూడా వెళ్ళి విశేషాలు చూసేవాణ్ణి.
మొత్తంమీద రాసినదెవరనేది ఆ కాంపౌండ్లో అంత ముఖ్యం కాదు. చివరకు విజయచిత్ర మాసపత్రికకు సంపాదకుడుగా నియమించిన రావి కొండలరావుగారికి తమిళ పత్రిక బొమ్మై ఎడిటర్కన్నా తక్కువ జీతం ఇచ్చేవారు. ఎందుకంటే సినిమాల్లో నటించకూడదనే ఆంక్ష ఆయనమీద పెట్టలేదు కనక. ఇది చదివినవారికి పులి గొంతులో ఎముక తీసిన కొంఘ కథ జ్ఞాపకం రావచ్చు!
భానుమతి వ్యాసం రావడమే ముఖ్యం. ఎవరో సేకరించి, స్వయంగా రాసిన వ్యాసానికి మా నాన్న కొన్ని కామెంట్లు జతచేసి, పేజినేషన్ సరిగ్గా వచ్చేటట్టు (చందమామలాగే!) అచ్చు వేయించి ఉంటారు.
1975-80 ప్రాంతాల్లో యువ దీపావళి సంచికల్లోనూ, ఇతర సంచికల్లోనూ మా నాన్న రాసినవీ, దాసరివారు రాసినవీ బెంగాలీ నవలల అనుసరణలు చాలా అచ్చయాయి. కొన్ని నా దగ్గర ఉన్నాయి కూడాను. దీన్ని ghost writing అనాలో, hack work అనాలో నాకు తెలియదు!
కోనసీమ కథలు: సత్తెవతి గురించి మోహన గారి అభిప్రాయం:
09/06/2011 10:21 am
ఈమాట అచ్చుతప్పులు లేకుండా ఉండాలంటే ఎవరూ అడగని నా సలహాలు 🙂
1. అచ్చు తప్పులను దుర్భిణీ కళ్లతో చూడవలసిన బాధ్యత రచయితకు ఉంది. ఒకటికి రెండుమారులు చదివి తప్పులను, టైపోలను సంపాదకుల దృష్టికి తేవాలి. మన కళ్లముందున్న తప్పులు మనకు గోచరించవు ఒక్కొక్కప్పుడు. స్నేహితులను, ఇంటిలోని వాళ్లను చదివి వెదకమనాలి.
2. ప్రతి సంపాదకునికి మూడో నాలుగో రచనలను ఎడిట్ చేయవలసి ఉంటుంది, అవి కూడ పత్రిక ప్రకాశమయ్యే మూడు నాలుగు రోజులకుముందు. ఇది అంత సులభమైన పని కాదు. చివరి బాధ్యత వారిదే ఐనా, ఒక రెండు మూడు రోజులలో వాళ్ల వృత్తి, ఇంటి పనులతోబాటు ఈ పనులను కూడా కొనసాగించడము కష్టతరమే.
3. పాఠకులు తప్పులను కనుగొంటే, వాటిని నేరుగా సంపాదకులకు తెలియజేస్తే వారు తప్పకుండా వాటిని సరిదిద్దుతారు. ఈమాట మనది కూడా, కాబట్టి మనము కూడా దీనిని సర్వాంగసుందరముగా చేయవచ్చును.
4. విశ్వనాథం-విశ్వనాధం, తెలుగువారు థ అనే అక్షరాన్ని అలాగే వ్రాసినా దానిని ధ అనే ఉచ్చరిస్తారు. అందుకే థ-ధ లకు యతిమాత్రమే కాదు ప్రాస కూడ చెల్లుతుంది. సారథి-సారధి, కథ-కధ, ఇత్యాదులు ఎన్నో! విధేయుడు – మోహన
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి చిలమకూరు విజయమోహన్ గారి అభిప్రాయం:
09/06/2011 7:02 am
“లోపలి నుండి మా కోడలివి, వెనువెంటనే మా అబ్బాయివీ నవ్వులు వినబడ్డాయి.”
ఆ నవ్వులతోపాటు మా నవ్వులు కూడా వినిపించి ఉండాలే మీకు !
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Bhamidipati Phani Babu గారి అభిప్రాయం:
09/06/2011 5:19 am
“భార్యామణి చెప్పింది చేయడం నాకు నలభయ్యొక్కేళ్ళుగా అలవాటు అయిపోయింది. పెళ్ళికి ముందు అమ్మ కూచి అనేవారు, పెళ్లి అయిన తరువాత కొంగు చాటు మొగుడు అంటున్నారు.” ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ నవంబరులో అవకాశం వచ్చి, మీ ఇంటికి ఏలూరు వస్తే, ఆ టెబుల్ మేనర్సూ అవీ లేకపోతే, కాఫీ ఈయరేమో అని భయంగా ఉంది!
రమ్మంటారా వద్దంటారా?
తెలుగుదనం (not in lighter vein) గురించి రాజేష్ దేవభక్తుని గారి అభిప్రాయం:
09/06/2011 3:03 am
వెంకటేశ్వర రావు గారు, నమస్కారం.
మీరే అన్నట్లుగా ” పెసరట్టే తెలియని, తినడానికే ఇష్టపడని జనాభా ఉందంటే ” ఆ ప్రాంతంలో తెలుగుదనం తగలపడిపోయినట్లే కదండీ. ఇంకా దేని గురించి మీ కోపం. మీరు అమెరికాలో ఉన్నందున…. మీ ఒక్కరికో , ఇంకోతమందికో పెసరట్టు చేసే విదానం తెలిసినందున, అక్కడ తెలుగుదనం బ్రతికే ఉంది అనుకోమంటే , అనుకుంటాం…! నేను 1984 లో పుట్టాను, నాకు పెసరట్టు తెలుసు , స్వతహాగా చేసుకోగలను కుడా (కావాలని మా అమ్మతో కుర్చుని నేర్చుకున్నాను), అంటే దాన్ని అంత ఇష్టపడ్డాను. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో చాలా మంది దీనిని ఎరుగుదురు కుడా..!
ఇదే కాకుండా దిబ్బరొట్టె , జోన్నరోట్టే కూడా నా చిన్న వయసులో తిన్నాను. అయితే ఇప్పుడు అవి అంతగా లేవు, ముఖ్యంగా జోన్నరోట్టే. మీరు చెప్పిన తరువాతే ” పెసరట్టు ” తెలుగు వారిదని నాకు తెలిసింది. కాని నాకు ఇష్టమైన ఉపహారం ఏది అని ఎవరైనా అడిగితె నేను చెప్పేది పెసరట్టు, పూరి.