ఇలాటి పత్రిక సృష్టించిన వారికి సహకరించిన వారికి నడుపుతున్న వారికి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
రచనలల్లొ వంటల శీర్షికలు కూడా కలిపితే బాగుంటుందేమో!
ఎప్పుడో ఆంధ్ర వార పత్రికలో సాలూరి వారి కూరలు అని పల్లెటూళ్ళలో అతి సులభంగా రుచివంతంగా చేసికొనే వంటల గురించి చదివినట్లు గుర్తు. ఆ స్ఫురణతో నేను అమెరికాలొ ట్రెయినింగు నిమిత్తము చికాగొ డేస్ ఇన్ లో ఉన్న సమయంలో వండిన వంట పది మందికి ఆకలి తీర్చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభావితం చేయడమంటే ఏమిటి అనడానికి. తెలుగు భాష వాడుక సరళికి సంబంధించి పాఠకుల సందేహాలకు సమాధానాల వంటివి కూడా ఉంటే బాగుంటుంది.
చక్కగా చదువుకోగలిగే అవకాశం కల్పిస్తున్నారు. కృతజ్ఞతలు.
రచయితలకు సూచనలు గురించి naMdivADa udaya BAskar గారి అభిప్రాయం:
09/10/2011 2:03 pm
ఈమాట పాఠకులకి ఒక విషాదకరమైన వార్త తెలియపరచడానికి చింతిస్తున్నాము.
“మధ్యాహ్నం మాణిక్యం” కథా రచయిత్రి శ్రీమతి నందివాడ శ్యామల గారు 2011్ మే 20వ తేదీ నాడు హైదరాబాదులో తమ స్వగృహంలో మరణించారు.
2001 సంవత్సరంలో67 సంవత్సరాల వయసులో ఈమాట పత్రిక ద్వారా తెలుగు పాఠకులకి రచయిత్రిగా పరిచయమైన శ్రీమతి శ్యామల గారు ఆ తరవాత “వలస” పేరుతో మరొక కథను, తమ భర్తగారైన శ్రీ భీమారావు గారితో సంయుక్తంగా “కదిలే మబ్బులు, కదలని కొండలు” అనే శీర్షికతో తమ ఆత్మకథని, ప్రచురించారు. 2009 లో “కదిలే మబ్బులు, కదలని కొండలు” ఆవిష్కరణ సభలో ఆవిడ చేసిన ప్రసంగం స్ఫూర్తితో శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావుగారు రాసిన “కదిలే మబ్బులతో ఒక చల్లని సాయంకాలం” కథని రంజని సంస్థవారు “బహుమతి కథ” సంకలనంలో ప్రచురించారు.
శ్రీమతి శ్యామల గారి అపూర్జీవ్యక్తిత్వానికి నివాళిని వీడియో రూపంలో ఈ క్రింది
You Tube వీడియోలో చూడగలరు –
నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కాని కర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
ఆరుస్తావా అన్న పదంలో “ఆరు”కి ఉపశమింపజేయు అనే అర్థం వస్తుందనుకుంటాను. “పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా! తమాషా ఏవిటంటే తమిళంలో పాది అంటే సగం అని అర్థం!
>>‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా
మగధీరుడు, మగధీరని ఎవ్వరూ విమర్శించిన సాహసం చేసినట్టు లేదు! :-). మొదటి పదం తెలుగు, రెండవది సంస్కృతం ఉన్న సమాసాలు చాలా వరకూ ఆమోదయోగ్యమే అయినట్టున్నాయి. “పాలాభిషేకం”, “పడుచాచారం” వంటి చోట్ల ముఖ్యంగా అభ్యంతరకరమైనది సంస్కృత సంధులని వాడడమే అనుకుంటాను. ఇలాంటి చోట్ల తెలుగు సంధులనే చెయ్యాలి (“మూఁడస్త్రంబులు”లాగ). రాజ్యపుసిరి అన్నచోటకూడా తెలుగుసంధి జరిగింది.
అసందర్భం అనుకోకపోతే మరొక చమత్కారం. “పట్టభద్రుడు”లో ఉన్న “పట్టము” సంస్కృతమైతే మరి “పట్టరాణి” కాకుండా “పట్టపురాణి” ఎందకయ్యింది? మళ్ళా “పట్టమహిషి” ఎలా అయింది?
విన్నానులే ప్రియా అనే పాట విశ్వనాథన్ తమిళంలో చేసిన ముత్తుకళో కణ్గళ్ అనేదానికి అనుకరణ. తమిళంలో అది ఎక్కువ బావుంటుంది. ఆ ఒరిజినల్ పాట కానడా బహార్ రాగంమీద చేసినట్టుగా అనిపిస్తుంది. అలకలు తీరిన అన్నది నేను వినలేదు కనక చెప్పలేను. లింక్ ఉంటే పంపండి.
అదేదో సినిమాలో రమణారెడ్డి చేగోడీల్ని ఫోర్కు తో తినే ప్రయత్నం చేస్తాడు. చాలా బావుంది ఈ ప్రహసనం. రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నట్టు – అన్న ముగింపు ఇంకా బావుంది.
రావణుడి తలలు గురించి అజిత్ కుమార్ గారి అభిప్రాయం:
09/11/2011 12:20 pm
దశకంఠుడంటే పది రకాలుగా మాట్లాడగలిగే వాడని. అంటే మిమిక్రీ చేసినట్లుగా.
పాఠకులకు సూచనలు గురించి P.Rangaiah గారి అభిప్రాయం:
09/11/2011 12:29 am
ఈ మాట పత్రిక సంపాదకులకు నమస్కారాలతో,
ఇలాటి పత్రిక సృష్టించిన వారికి సహకరించిన వారికి నడుపుతున్న వారికి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.
రచనలల్లొ వంటల శీర్షికలు కూడా కలిపితే బాగుంటుందేమో!
ఎప్పుడో ఆంధ్ర వార పత్రికలో సాలూరి వారి కూరలు అని పల్లెటూళ్ళలో అతి సులభంగా రుచివంతంగా చేసికొనే వంటల గురించి చదివినట్లు గుర్తు. ఆ స్ఫురణతో నేను అమెరికాలొ ట్రెయినింగు నిమిత్తము చికాగొ డేస్ ఇన్ లో ఉన్న సమయంలో వండిన వంట పది మందికి ఆకలి తీర్చింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ప్రభావితం చేయడమంటే ఏమిటి అనడానికి. తెలుగు భాష వాడుక సరళికి సంబంధించి పాఠకుల సందేహాలకు సమాధానాల వంటివి కూడా ఉంటే బాగుంటుంది.
కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి Ennela గారి అభిప్రాయం:
09/10/2011 2:07 pm
చక్కగా చదువుకోగలిగే అవకాశం కల్పిస్తున్నారు. కృతజ్ఞతలు.
రచయితలకు సూచనలు గురించి naMdivADa udaya BAskar గారి అభిప్రాయం:
09/10/2011 2:03 pm
ఈమాట పాఠకులకి ఒక విషాదకరమైన వార్త తెలియపరచడానికి చింతిస్తున్నాము.
“మధ్యాహ్నం మాణిక్యం” కథా రచయిత్రి శ్రీమతి నందివాడ శ్యామల గారు 2011్ మే 20వ తేదీ నాడు హైదరాబాదులో తమ స్వగృహంలో మరణించారు.
2001 సంవత్సరంలో67 సంవత్సరాల వయసులో ఈమాట పత్రిక ద్వారా తెలుగు పాఠకులకి రచయిత్రిగా పరిచయమైన శ్రీమతి శ్యామల గారు ఆ తరవాత “వలస” పేరుతో మరొక కథను, తమ భర్తగారైన శ్రీ భీమారావు గారితో సంయుక్తంగా “కదిలే మబ్బులు, కదలని కొండలు” అనే శీర్షికతో తమ ఆత్మకథని, ప్రచురించారు. 2009 లో “కదిలే మబ్బులు, కదలని కొండలు” ఆవిష్కరణ సభలో ఆవిడ చేసిన ప్రసంగం స్ఫూర్తితో శ్రీ పాలగుమ్మి రామకృష్ణారావుగారు రాసిన “కదిలే మబ్బులతో ఒక చల్లని సాయంకాలం” కథని రంజని సంస్థవారు “బహుమతి కథ” సంకలనంలో ప్రచురించారు.
శ్రీమతి శ్యామల గారి అపూర్జీవ్యక్తిత్వానికి నివాళిని వీడియో రూపంలో ఈ క్రింది
You Tube వీడియోలో చూడగలరు –
నందివాడ భీమారావు, నందివాడ ఉదయభాస్కర్, కూచిమంచి నాగమణి, రత్నశ్రీ దాస్ గుప్త, నందివాడ సోమశేఖర్.
రాగలహరి: ఆభేరి గురించి మోహన గారి అభిప్రాయం:
09/10/2011 11:05 am
నాకు సంగీతం ఎక్కువగా తెలియదు. కాని కర్నాటిక్ సైటులో ముత్తుక్కళో కణ్గళ్ రాగము మధ్యమావతి అని ఉన్నది. ( విన్నానులే ప్రియా ) ఈ సైటులో మధ్యమావతి హిందుస్తానీ సారంగ్ రాగము లాటిది అని ఉన్నది.
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన గారి అభిప్రాయం:
09/10/2011 10:46 am
ఆరు అంటే నిండు, ఉపశమించు, వెండ్రుకలు (నూగారులాటి పదాలలో) అని అర్థము. సంఖ్యను సామాన్యముగా ఆఱు అని వాడుతాము. కాని యిప్పుడు బండి ఱ వాడడము లేదు కాబట్టి ఈ సందిగ్ధము, సందేహము కలుగుతుంది. రాణి తెలుగు పదము, రాజ్ఞి సంస్కృతపదము. అందువల్ల తెలుగు సంధితో పట్టపురాణి. సంస్కృతములో పట్టరాజ్ఞి అని అనుకొంటాను. పాదము అంటే ఈ సుభాషితము నాకు జ్ఞాపకానికి వచ్చింది. జ్ఞానసముపార్జన ఎలాగవుతుంది అనేది ఇందులోని అంశము.
ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేధయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణచ
గురువువద్ద ఒక నాల్గవ వంతు, (teaching)
స్వయంకృషివలన నాల్గవ వంతు, (effort)
సహచరులతో నాల్గవ వంతు, (discussion)
మిగిలినది కాలక్రమేణ (experience)
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
09/10/2011 9:14 am
ఆరుస్తావా అన్న పదంలో “ఆరు”కి ఉపశమింపజేయు అనే అర్థం వస్తుందనుకుంటాను. “పాతిక” పాద నుండి వచ్చుండాలి. పద్యంలో పాదం నాలుగోవంతు కదా! తమాషా ఏవిటంటే తమిళంలో పాది అంటే సగం అని అర్థం!
>>‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా
మగధీరుడు, మగధీరని ఎవ్వరూ విమర్శించిన సాహసం చేసినట్టు లేదు! :-). మొదటి పదం తెలుగు, రెండవది సంస్కృతం ఉన్న సమాసాలు చాలా వరకూ ఆమోదయోగ్యమే అయినట్టున్నాయి. “పాలాభిషేకం”, “పడుచాచారం” వంటి చోట్ల ముఖ్యంగా అభ్యంతరకరమైనది సంస్కృత సంధులని వాడడమే అనుకుంటాను. ఇలాంటి చోట్ల తెలుగు సంధులనే చెయ్యాలి (“మూఁడస్త్రంబులు”లాగ). రాజ్యపుసిరి అన్నచోటకూడా తెలుగుసంధి జరిగింది.
అసందర్భం అనుకోకపోతే మరొక చమత్కారం. “పట్టభద్రుడు”లో ఉన్న “పట్టము” సంస్కృతమైతే మరి “పట్టరాణి” కాకుండా “పట్టపురాణి” ఎందకయ్యింది? మళ్ళా “పట్టమహిషి” ఎలా అయింది?
రాగలహరి: ఆభేరి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
09/10/2011 6:03 am
విన్నానులే ప్రియా అనే పాట విశ్వనాథన్ తమిళంలో చేసిన ముత్తుకళో కణ్గళ్ అనేదానికి అనుకరణ. తమిళంలో అది ఎక్కువ బావుంటుంది. ఆ ఒరిజినల్ పాట కానడా బహార్ రాగంమీద చేసినట్టుగా అనిపిస్తుంది. అలకలు తీరిన అన్నది నేను వినలేదు కనక చెప్పలేను. లింక్ ఉంటే పంపండి.
గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి ratnababu గారి అభిప్రాయం:
09/10/2011 1:40 am
గుర్రం జాషువా గారు అద్భుత మహోన్నత మహిమాన్వితుడు. ఆయనను చూచి ఈ తరం కవులు నేర్చుకొనవలసినది చాలా వున్నది.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి sujata గారి అభిప్రాయం:
09/09/2011 11:39 pm
అదేదో సినిమాలో రమణారెడ్డి చేగోడీల్ని ఫోర్కు తో తినే ప్రయత్నం చేస్తాడు. చాలా బావుంది ఈ ప్రహసనం. రోలు వెళ్ళి మద్దెల తో మొరపెట్టుకున్నట్టు – అన్న ముగింపు ఇంకా బావుంది.