నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:
“ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”
సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
మీరు ఇక్కడ ఉంచిన తెలుగు అనువాదంకై నా శుభాభినందనలు. అద్భుతంగా వివరించారు. వీడియోలో శ్లోకం యొక్క గానం కూడా చాలా బాగుంది.
ఐన్స్టియన్ రిలేటివిటీ సూత్రం ద్వారా సృష్టి ఆవిర్భావము, రోదసి మరియు సమయము గురించి పరిశోధన ద్వారా వంద ఏళ్ళ క్రితం వెలుగులోకి తీసుకుని వచ్చారు. కొన్ని వేల ఏళ్ళ క్రితం వేదాలలో చెప్పిన అదే నిజం లోకానికి తెలియక పోవడం ఆశ్చర్యం అనుకుంటే, మన భారతీయులకు ఈ రోజు కూడా సరిగ్గా నాసదీయసూక్తంలో చెప్పిన ఈ విషయాలు తెలియకపోవడం శోచనీయం.
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా అభివందనాలు
ధన్యస్మి🙏
‘అందుకే సమాజం పరిభాషలో రాజేశ్వరి లేచిపోయింది’ అన్నారు వాడ్రేవు వీరలక్ష్మి దేవి. మరి ఆమె పరిభాషలో రాజేశ్వరి చేసిన పనిని ఏమంటారో కూడా చెబితే బాగుండేది. చలం అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు, అంతే విపరీతంగా అసహ్యించుకునేవారు వున్నారుగానీ, ఈ భావోద్వేగానికి అతీతంగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే వ్యాసాలు అరుదు. చలం రచనలను ఒక సాహితీప్రక్రియగా కాకుండా ఒక advocacy గా, program of action గా చూడటమే ఇందుకు కారణం. తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైన నవలలుగా పేరుగాంచిన పుస్తకాల్లో మైదానం ఒకటి. కాసేపు రాజేశ్వరి అన్నదని, చెప్పిందని, చెప్పుకున్నదని, చెలం చెప్పించాడని రకరకాలుగా రచయిత్రి చెప్పింది. చెలం ఇలా చెప్పాడు అంటే బాగుండేది. కాల్పనిక రచనల్లో పాత్రలు రచయిత తనకు ఇష్టం వచ్చినట్లు మలిచినవేగానీ వాటికి స్వతంత్రం వుండదు. చెలమే అన్నాడు అనటానికి ఏదో ఇబ్బంది అడ్డం వస్తుంది.
సమాజం మనుగడకి కుటుంబం మూలస్తంభం. దానిమీద ద్వజమెత్తే రచనల్లో చలం సాహిత్యం ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను సమర్ధించేవారు నేడు సమాజంలో వున్న అనేకమంది రాజేశ్వరీలను ఎక్కడా అక్కున చేర్చుకోవడం చూడం. ఎందుకీ ద్వంద్వ విలువలు?
రతీసౌఖ్యం అనే రుచికి లొంగిపోయిన వారు కొట్టినా తిట్టినా పట్టించుకోరు. రతిలో పొందే ఆనందం ముందు ఆత్మాభిమానం సింగినాదం జీలకర్ర చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. అందుకే 3037లో కూడా చలం మైదానం చదివేవారు వుంటారు. రహస్యంగా దిండు కింద దాచుకోనవసరం లేదు. యూట్యూబ్ నిండా మైదానం లో వున్న రసికత అందరికీ అందుబాటులో వుంది కదా!
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.
ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.
రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.
అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” (https://drive.google.com/file/d/17zVmgoshDjspVZKH_yymzBm11HZEbHDC/view) అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?
ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?
వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.
అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] (https://eemaata.com/em/issues/199907/1107.html) చదవదగ్గది.
దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.
“గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
“వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”
సమార్ద్రమైనభావాలు.
రెండు చిన్న సూచనలు:
“విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.
“బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)
1. వలస వాదము, (దానికి ప్రతిక్రియగా, దాని ప్రభావంతో పుట్టిన సాంస్కృతిక) జాతీయత, ఆధునికత అనే మూడు కలిసి ఆధునిక హిందూ అనే ఒక మెగా మతం పుట్టింది అని చాలా ఓపికగా ఈ వ్యాసం వివరించే ప్రయత్నం చేసింది.
2. పర్షియన్లు, అరబ్బులు ఒక దిక్కును, ప్రాంతాన్ని చూపే పదంగా, తరువాతి కాలంలో ఒక రాజకీయ పాలనాపర పదంగా హిందూస్తాన్ అన్న పదాన్ని బ్రిటిష్ వలస పాలన స్థిరీకరణ ముందు వరకు పాలనా, లేఖనా సాంప్రదాయాలలో ఉపయోగంలో ఉన్న వాస్తవాన్ని వ్యాసం గుర్తుకు తెస్తున్నది.
3. ఏకరూప మతం లేక పోవడం ఈ దేశపు అత్యంత ముఖ్యమైన సమస్యఅని, పుట్టుక పునాది కులాల (వర్ణ-జాతి) విఘటనతో ఈ దేశం, సమాజం మరణయాతన పడుతూ ఉన్నది అని, అందువలన నిరంతర పరాయివారి చేత ఓటమిని చూసిన, చవి చూస్తున్నది అని, అందువలన ఈ దేశానికి ఒక ఏకరూప మతం అవసరం అని అందరూ ఆధునికులు భావించారు.
4. అయితే వారిలో అందరికీ “హిందూ” అన్న పలుకుమీద ఏకాభిప్రాయం లేదు. రామ్ మోహన్ రాయ్ తన సమాజాన్ని ఉపనిషత్ ఆధార బ్రహ్మ సమాజం అన్నారు, సౌరాష్ట్ర బ్రాహ్మణ పండితుడు దయానంద సరస్వతి తన సమాజాన్ని ఆర్య సమాజం అన్నారు, వివేకానంద, ఆయన సమర్థకులు నవ్య అద్వైత వేదాంతం ద్వారా కొత్త మతం పుట్టించాలి అనుకున్నారు. వారు కూడా హిందూ అనే పదాన్ని పూర్తిగా మతము అనే అర్థంలో వాడలేకపోయినారు. అరబింద ఘోష్ సనాతన వైదిక మూలాలు, జ్ఞానమీమాంస కలసిన మతం ఉండాలి అనుకున్నారు. చివరగా హిందూ మహాసభ, సావర్కర్లు ఏకరూప హిందూ మత నిర్మాణాన్ని ఒక రాజకీయ ప్రాజెక్ట్గా ముందుకు తెచ్చినరు. ఆర్.ఎస్.ఎస్. ఆ పనినే ఇప్పటికీ చేస్తూ ఉన్నది.
5. బాబా సాహెబ్ కు కూడా ఈ దేశానికి మానవీయ, ధృఢ, స్వేచ్ఛ, సమత, సోదర భావన ఉండే నైతికత కేంద్ర ఏకరూప మతం లేదు అనే ఆందోళన, తపన ఉన్నది అనిపిస్తుంది. మొదట ఈ దేశానికి ఒక ఏకరూప మతం ఉండింది — అది బౌద్ధం. అది బ్రాహ్మణ మతం ద్వారా సమసి పోగొట్టబడి దెబ్బతిని, బ్రాహ్మణ మత ప్రధాన లక్షణం అయిన వర్ణ-జాతి విభజనతో ఈ దేశంలో మతం అమానుషంగా మారి దేశం నాశనం అయింది అని అనుకొని, తిరిగి బౌద్ధ ధర్మ పునరుద్ధరణ ద్వారా జన్మ ఆధార కుల వర్ణ ఉనికి లేని నవబౌద్ధుని నిర్మించాలి అని అనుకున్నారు. ఈ ఆలోచనావిధాన కొనసాగింపుగానే ఇస్లాం వెనుకబడిన పరాయి మతంగా, క్రిస్టియన్ మతం వలస వాద లక్షణాలున్న విదేశీ మతంగా ఆయన భావించారు అనిపిస్తుంది.
6. “వేదాలకు తిరిగి వెళ్ళండి” అనే ఆర్య సమాజం వారు, “అఖండ హిందూ మతం ఒకటి పుట్టించాలి” అనే రాజకీయ సాంస్కృతిక హిందుత్వ వాదులు, అంబేద్కర్ వాదులు ఒకే రకం అయిన ఆందోళనతో ప్రారంభం అవడం (వారి మార్గాలు, లక్ష్యాలు, అంతిమ ప్రతిపాదనలు వేరేవేరే అయినా) గమనించవలసిన అంశం. అది వలస ఆధునికత ప్రతిఫలనం. వ్యాసం ఈ విషయాన్ని ఉపపత్తులతో సమర్థించింది అనిపిస్తోంది.
7. యంత్ర సంబంధ, పెట్టుబడి ప్రధాన, భారీ స్థాయి ఉత్పత్తి తెచ్చిన వలస వాదం, దానితో వచ్చిన ప్రొటెస్టెంట్ ఇతర క్రైస్తవ మత ఔన్నత్య ధోరణులు, ఈ దేశంలో “హిందూ మతం” అనే ఏకరూప మత సృష్టి ప్రయత్నాలను బలపరిచినాయి అన్న ఈ వ్యాసంలోని ప్రతిపాదన అధ్యయనం చేయాల్సిన విషయం.
8. ఇంత ఏకరూప మత సృష్టి ప్రయత్నం గట్టిగా జరుగుతున్న ఈ దేశంలో ఆచార, సంప్రదాయ, ఉపాసనా బహుళతలు నేటికీ ఉండటం ఒక వైచిత్రి. బ్రాహ్మణ కుల జీవన కేంద్రంగా, సంస్కృత లిఖిత సాహిత్య ఆధారాల పునాదిగా పాశ్చాత్య పండితులు, అట్టి పండితులను అనుసరించిన దేశీయ మేధావులు పుట్టించిన రాజకీయ సాంస్కృతిక పదంగా “హిందూ మతం” అని అనిపిస్తూ ఉంది — వ్యాసం జాగ్రత్తగా చదివితే. ఇది ఆలోచనాత్మకం, వివేచనాత్మకం.
శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.
పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!
క్వాంటమ్ ఫిజిక్స్ కు భారతీయ దర్శనాలతో గల సంబంధాన్ని ఈవ్యాసంలో వివరించాను. ఐతే అత్యాధునిక పరిశోధనలు చైతన్యం కేవలం బ్రెయిన్ కు మాత్రమే చెందదు అని, విశ్వంతో జీవికి గల సహజ ఐక్యతతో కూడినదే చైతన్యం అనే వైపు సాగుతున్నాయి.ఈవిషయాలను మిత్రులు ఫిజిక్స్ అధ్యయన పరులు సుధాకర్ ఇలా వివరించారు ఫిలాసఫీ గ్రూపులో.
క్వాంటం బ్రెయిన్:
మన చైతన్యం విశ్వంతో ఎలా కలుస్తుంది?
కొత్త పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మన మెదడులోని క్వాంటం స్థితులు చైతన్యాన్ని (consciousness) యావత్ విశ్వానికి (universe) లింక్ చేయగలవట! భౌతికశాస్త్రం, న్యూరోసైన్స్ కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణంలో, మానవ చైతన్యం ఒక క్వాంటం ఫినామినన్ (quantum phenomenon) లాగా పనిచేస్తుందని, అది మన మనసులను ఈ విశ్వంతో కలుపుతుందని చెబుతోంది.
ఆర్చ్ ఓఆర్ (Orch OR – Orchestrated Objective Reduction) అనే ఒక వివాదాస్పద థియరీ ఉంది. దాని ప్రకారం, మన మెదడు కణాల్లో ఉండే మైక్రోట్యూబుల్స్ (microtubules), మెదడులోని వెచ్చని, తడి వాతావరణంలో కూడా క్వాంటం కొహరెన్స్ను (quantum coherence) మెయింటెయిన్ చేయగలవని సైంటిస్టులు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్తో (experimental evidence) నిరూపిస్తున్నారు.
ఈ క్వాంటం స్థితులు చైతన్యానికి “కీ” లాంటివి కావచ్చని, ఆ కీ సూపర్ పొజిషన్ (superposition), ఎంటాంగిల్మెంట్ (entanglement) లాంటి క్వాంటం లక్షణాలున్న వేవ్ (wave) లాగా పనిచేస్తుందని అంటున్నారు. అంటే, మానవ చైతన్యం అంతరిక్షంలోని క్వాంటం సిస్టమ్స్తో కనెక్ట్ అయి ఉండొచ్చన్నమాట.
సిమ్యులేషన్స్ (simulations), ఎక్స్పెరిమెంట్స్ (experiments) ద్వారా, మైక్రోట్యూబుల్స్ లోపల క్వాంటం రియాక్షన్స్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం నిలబడగలవని తేలడంతో ఈ థియరీకి కొత్త బలం చేకూరింది.
ఇదిలా ఉండగా, థియరిటికల్ ఫిజిసిస్ట్ (theoretical physicist) తిమోతీ పామర్ అనే ఆయన, చైతన్యం అనేది ఒక కాస్మిక్ ఫ్రాక్టల్ “స్టేట్ స్పేస్” (cosmic fractal “state space”) లో ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఫ్రీ విల్ (free will) తో పాటు, మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నామనే ఫీలింగ్ను కూడా వివరించగల ఒక షేర్డ్ జియోమెట్రిక్ స్ట్రక్చర్ (shared geometric structure) కావచ్చని ఆయన అభిప్రాయం.
ఇవన్నీ ఇంకా డెఫినిటివ్ (definitive) కాకపోయినా, చైతన్యం కేవలం ఒక న్యూరల్ ఇల్యూషన్ (neural illusion) మాత్రమే కాదు, అది వాస్తవికతలోని ఒక క్వాంటం ఫీచర్ (quantum feature) కావచ్చని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు ఒక ముఖ్యమైన స్టెప్ అని చెప్పొచ్చు.
భారతీయ హేతు దృష్టికి సమన్వయ లక్షణం, ద్వంద్వత — అందునా వ్యతిరేక ద్వంద్వతను పక్కన పెట్టే లక్షణం ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం వ్యాసంలో ప్రధాన అంశం.
కేవలం చార్వాక, బౌద్ధ చింతనలు మాత్రమే ఆధునిక యూరోపియన్ హేతు దృష్టికి దగ్గరివి. అవి కాని చింతనలు అన్నీ ఆధునికతకు, అంటే హేతు దృష్టికి దూరం అయినవి అనే ప్రచారంలో తర్కపద్ధతిని ఈ వ్యాసం సహేతుకంగా ప్రశ్నించింది.
వర్ణ-జాతి వ్యవస్థ అనేది పుట్టుక పునాది, ఉచ్చ నీచ సామాజిక సాంస్కృతిక వ్యవస్థగా మారిన స్థితి ఈ దేశపు పూర్తి వాస్తవం అనీ. ఈ దేశంలో బౌద్ధము, చార్వాకాలు తప్ప మరే తాత్విక భవనాలు ఈ సామాజిక సాంస్కృతిక వ్యవస్థను వ్యతిరేకించలేదు కనక అవి అన్నీ కూడా హేతువు తో సంబంధం లేనివి (వెస్ట్ సైన్స్ దృష్టి) అనే ఒక అతి సులభ సామాజిక శాస్త్ర సూత్రీకరణ మీద కూడా ఈ వ్యాసం ప్రశ్నలు లేవనెత్తినది.
వర్ణ-కుల వ్యవస్థ పుట్టుక పునాది గా మారిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దీర్ఘ చరిత్రను లోతుగా చూస్తే, శుద్ధ హేతు వాదం తో సంబంధం లేని భక్తి వాదులు, అద్వైత వాదులు కూడా పుట్టుకపునాది వివక్ష దృష్టి మీద యుద్ధం చేశారు అని తెలుస్తుంది. కేవలం చార్వాక, బౌద్ధాలు మాత్రమే హేతు వాద చింతనలు తప్ప, ఈశ్వర(దైవ) సంబంధం, ప్రకృతి పురుషుల ఏకతను ప్రతిపాదించే సాంఖ్యం, బ్రహ్మ భావనను పక్కకు పెట్టిన పూర్వ మీమాంసకుల స్వతసిద్ధ వాదాన్ని, ఈ దేశంలోని ప్రభావశీల ఆధునిక వెస్ట్రన్ కర్టీజియన్ సైన్స్ దృక్పథ వాదులు గుర్తించలేదని అనే ప్రతిపాదన కూడా వ్యాసం చేసింది.
అయితే వ్యాసకర్త రచనా పద్ధతి కొంచం గెంతులు వేస్తూ సాగుతున్నట్టు ఉంటుంది. అది రచనా పర సమస్య అనుకుంటాను. క్వాంటమ్ భౌతిక శాస్త్రము, అది దానికన్నా ముందు ఉండే భౌతిక శాస్త్రంతో ఎట్లా విభేదిస్తుంది అనే వివరణ కొంచం ఉంటే వ్యాసానికి అది మరింత పదును ఇచ్చేది అనిపిస్తుంది.
వ్యాసం రాసిన మనిషి బ్రహ్మణ కులస్తుడు, అతని కోరిక బ్రాహ్మణ తత్వ చింతనను సమర్థించడం మాత్రమే అనే తీరు విమర్శలు ఈ వ్యాసం మీద వస్తాయి. కానీ అవి పెద్దగా హేతుబద్ధం కావు — అవి కేవలం భావజాల ప్రేరిత వాదాలు.
భారతీయ చింతనా జగత్తులో పదార్థ దృష్టి, హేతు దృష్టి ఉండిన తీరును చూపే ఒకానొక ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాలి. ఆ ప్రతిపాదనలోని గుణదోషాలను విచారించాలి.
హేతు చింతన అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నను మరొకసారి ఈ వ్యాసం చర్చలోకి తెచ్చింది. ఇది బాగా ఆలోచింపజేసే వ్యాసం.
శ్రీనివాస్ గారి కామెంట్ లో ఒక మాట అన్నారు. రచయిత మధ్యలో ఇంకేమైనా రాస్తే త్రెడ్ తెగిపోయింది అని. ఇది సరైన మాట కాదేమో! రచయిత తనలోని భావాలను బయట పెడితే ఒక భారం వదిలినట్లు మనసు తేలికపడుతుంది. హనుమంతరావు గారు చాలా సార్లు చిన్న కథలు రాశారు ఈ వేదిక మీద. మళ్లీ రాయవచ్చు కూడా రిలాక్సేషన్ కోసం. దానివలన ఈ శీర్షిక దారం ఎలా తెగిపోతుంది? ఈ పోగు వేరుగానే వుంటుంది కదా! మధ్యమధ్యలో ఆటవిడుపుగా కథలు రాయడం మానుకోవద్దని హనుమంతరావు గారిని కోరుతున్నాను.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/11/2025 11:26 am
నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:
“ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”
సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి రాళ్ళబండి శ్రీధర్ గారి అభిప్రాయం:
06/09/2025 11:52 am
మీరు ఇక్కడ ఉంచిన తెలుగు అనువాదంకై నా శుభాభినందనలు. అద్భుతంగా వివరించారు. వీడియోలో శ్లోకం యొక్క గానం కూడా చాలా బాగుంది.
ఐన్స్టియన్ రిలేటివిటీ సూత్రం ద్వారా సృష్టి ఆవిర్భావము, రోదసి మరియు సమయము గురించి పరిశోధన ద్వారా వంద ఏళ్ళ క్రితం వెలుగులోకి తీసుకుని వచ్చారు. కొన్ని వేల ఏళ్ళ క్రితం వేదాలలో చెప్పిన అదే నిజం లోకానికి తెలియక పోవడం ఆశ్చర్యం అనుకుంటే, మన భారతీయులకు ఈ రోజు కూడా సరిగ్గా నాసదీయసూక్తంలో చెప్పిన ఈ విషయాలు తెలియకపోవడం శోచనీయం.
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా అభివందనాలు
ధన్యస్మి🙏
చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ గురించి రంగారావు గుమ్మడిదల గారి అభిప్రాయం:
06/09/2025 7:21 am
‘అందుకే సమాజం పరిభాషలో రాజేశ్వరి లేచిపోయింది’ అన్నారు వాడ్రేవు వీరలక్ష్మి దేవి. మరి ఆమె పరిభాషలో రాజేశ్వరి చేసిన పనిని ఏమంటారో కూడా చెబితే బాగుండేది. చలం అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు, అంతే విపరీతంగా అసహ్యించుకునేవారు వున్నారుగానీ, ఈ భావోద్వేగానికి అతీతంగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే వ్యాసాలు అరుదు. చలం రచనలను ఒక సాహితీప్రక్రియగా కాకుండా ఒక advocacy గా, program of action గా చూడటమే ఇందుకు కారణం. తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైన నవలలుగా పేరుగాంచిన పుస్తకాల్లో మైదానం ఒకటి. కాసేపు రాజేశ్వరి అన్నదని, చెప్పిందని, చెప్పుకున్నదని, చెలం చెప్పించాడని రకరకాలుగా రచయిత్రి చెప్పింది. చెలం ఇలా చెప్పాడు అంటే బాగుండేది. కాల్పనిక రచనల్లో పాత్రలు రచయిత తనకు ఇష్టం వచ్చినట్లు మలిచినవేగానీ వాటికి స్వతంత్రం వుండదు. చెలమే అన్నాడు అనటానికి ఏదో ఇబ్బంది అడ్డం వస్తుంది.
సమాజం మనుగడకి కుటుంబం మూలస్తంభం. దానిమీద ద్వజమెత్తే రచనల్లో చలం సాహిత్యం ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను సమర్ధించేవారు నేడు సమాజంలో వున్న అనేకమంది రాజేశ్వరీలను ఎక్కడా అక్కున చేర్చుకోవడం చూడం. ఎందుకీ ద్వంద్వ విలువలు?
రతీసౌఖ్యం అనే రుచికి లొంగిపోయిన వారు కొట్టినా తిట్టినా పట్టించుకోరు. రతిలో పొందే ఆనందం ముందు ఆత్మాభిమానం సింగినాదం జీలకర్ర చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. అందుకే 3037లో కూడా చలం మైదానం చదివేవారు వుంటారు. రహస్యంగా దిండు కింద దాచుకోనవసరం లేదు. యూట్యూబ్ నిండా మైదానం లో వున్న రసికత అందరికీ అందుబాటులో వుంది కదా!
చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/07/2025 2:45 pm
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.
“చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గలభంగి నిచ్చునతండుఁ బుణ్య
పురుషు లని చెప్పి రార్యులు గురువరేణ్య.”
దానికి రెండు పద్యాల ముందరిది:
“క్షమియించువారిఁ గని చా
లమి వెట్టుదు రైననుం దలంప ననూన
క్షమయ కడు మెఱయుతొడ వు
త్తమరూపము గోరువారు దాల్తురు దానిన్.”
(ఉద్యోగపర్వం, రెండో ఆశ్వాసం)
ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.
రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.
అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” (https://drive.google.com/file/d/17zVmgoshDjspVZKH_yymzBm11HZEbHDC/view) అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?
ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?
వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.
అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] (https://eemaata.com/em/issues/199907/1107.html) చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సత్యాన్వేషి చలం: ఒక పరిశీలన,” డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి. 2006. (పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం, 2002).
[2] “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” జయప్రభ. 2003.
[ఇది ఇదివరకే కొలిమి పత్రికలో వచ్చిందని మాకు తెలియదు – సం. ]
దర్శనము గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/07/2025 1:39 pm
మంత్రదర్శనాన్ని ఒక కవితగా వ్రాయాలన్న ఊహ అపూర్వం!
దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.
“గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
“వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”
సమార్ద్రమైనభావాలు.
రెండు చిన్న సూచనలు:
“విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.
“బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)
హిందూ మతం అంటే ఏమిటి? గురించి Harathi Vageeshan గారి అభిప్రాయం:
06/07/2025 10:14 am
1. వలస వాదము, (దానికి ప్రతిక్రియగా, దాని ప్రభావంతో పుట్టిన సాంస్కృతిక) జాతీయత, ఆధునికత అనే మూడు కలిసి ఆధునిక హిందూ అనే ఒక మెగా మతం పుట్టింది అని చాలా ఓపికగా ఈ వ్యాసం వివరించే ప్రయత్నం చేసింది.
2. పర్షియన్లు, అరబ్బులు ఒక దిక్కును, ప్రాంతాన్ని చూపే పదంగా, తరువాతి కాలంలో ఒక రాజకీయ పాలనాపర పదంగా హిందూస్తాన్ అన్న పదాన్ని బ్రిటిష్ వలస పాలన స్థిరీకరణ ముందు వరకు పాలనా, లేఖనా సాంప్రదాయాలలో ఉపయోగంలో ఉన్న వాస్తవాన్ని వ్యాసం గుర్తుకు తెస్తున్నది.
3. ఏకరూప మతం లేక పోవడం ఈ దేశపు అత్యంత ముఖ్యమైన సమస్యఅని, పుట్టుక పునాది కులాల (వర్ణ-జాతి) విఘటనతో ఈ దేశం, సమాజం మరణయాతన పడుతూ ఉన్నది అని, అందువలన నిరంతర పరాయివారి చేత ఓటమిని చూసిన, చవి చూస్తున్నది అని, అందువలన ఈ దేశానికి ఒక ఏకరూప మతం అవసరం అని అందరూ ఆధునికులు భావించారు.
4. అయితే వారిలో అందరికీ “హిందూ” అన్న పలుకుమీద ఏకాభిప్రాయం లేదు. రామ్ మోహన్ రాయ్ తన సమాజాన్ని ఉపనిషత్ ఆధార బ్రహ్మ సమాజం అన్నారు, సౌరాష్ట్ర బ్రాహ్మణ పండితుడు దయానంద సరస్వతి తన సమాజాన్ని ఆర్య సమాజం అన్నారు, వివేకానంద, ఆయన సమర్థకులు నవ్య అద్వైత వేదాంతం ద్వారా కొత్త మతం పుట్టించాలి అనుకున్నారు. వారు కూడా హిందూ అనే పదాన్ని పూర్తిగా మతము అనే అర్థంలో వాడలేకపోయినారు. అరబింద ఘోష్ సనాతన వైదిక మూలాలు, జ్ఞానమీమాంస కలసిన మతం ఉండాలి అనుకున్నారు. చివరగా హిందూ మహాసభ, సావర్కర్లు ఏకరూప హిందూ మత నిర్మాణాన్ని ఒక రాజకీయ ప్రాజెక్ట్గా ముందుకు తెచ్చినరు. ఆర్.ఎస్.ఎస్. ఆ పనినే ఇప్పటికీ చేస్తూ ఉన్నది.
5. బాబా సాహెబ్ కు కూడా ఈ దేశానికి మానవీయ, ధృఢ, స్వేచ్ఛ, సమత, సోదర భావన ఉండే నైతికత కేంద్ర ఏకరూప మతం లేదు అనే ఆందోళన, తపన ఉన్నది అనిపిస్తుంది. మొదట ఈ దేశానికి ఒక ఏకరూప మతం ఉండింది — అది బౌద్ధం. అది బ్రాహ్మణ మతం ద్వారా సమసి పోగొట్టబడి దెబ్బతిని, బ్రాహ్మణ మత ప్రధాన లక్షణం అయిన వర్ణ-జాతి విభజనతో ఈ దేశంలో మతం అమానుషంగా మారి దేశం నాశనం అయింది అని అనుకొని, తిరిగి బౌద్ధ ధర్మ పునరుద్ధరణ ద్వారా జన్మ ఆధార కుల వర్ణ ఉనికి లేని నవబౌద్ధుని నిర్మించాలి అని అనుకున్నారు. ఈ ఆలోచనావిధాన కొనసాగింపుగానే ఇస్లాం వెనుకబడిన పరాయి మతంగా, క్రిస్టియన్ మతం వలస వాద లక్షణాలున్న విదేశీ మతంగా ఆయన భావించారు అనిపిస్తుంది.
6. “వేదాలకు తిరిగి వెళ్ళండి” అనే ఆర్య సమాజం వారు, “అఖండ హిందూ మతం ఒకటి పుట్టించాలి” అనే రాజకీయ సాంస్కృతిక హిందుత్వ వాదులు, అంబేద్కర్ వాదులు ఒకే రకం అయిన ఆందోళనతో ప్రారంభం అవడం (వారి మార్గాలు, లక్ష్యాలు, అంతిమ ప్రతిపాదనలు వేరేవేరే అయినా) గమనించవలసిన అంశం. అది వలస ఆధునికత ప్రతిఫలనం. వ్యాసం ఈ విషయాన్ని ఉపపత్తులతో సమర్థించింది అనిపిస్తోంది.
7. యంత్ర సంబంధ, పెట్టుబడి ప్రధాన, భారీ స్థాయి ఉత్పత్తి తెచ్చిన వలస వాదం, దానితో వచ్చిన ప్రొటెస్టెంట్ ఇతర క్రైస్తవ మత ఔన్నత్య ధోరణులు, ఈ దేశంలో “హిందూ మతం” అనే ఏకరూప మత సృష్టి ప్రయత్నాలను బలపరిచినాయి అన్న ఈ వ్యాసంలోని ప్రతిపాదన అధ్యయనం చేయాల్సిన విషయం.
8. ఇంత ఏకరూప మత సృష్టి ప్రయత్నం గట్టిగా జరుగుతున్న ఈ దేశంలో ఆచార, సంప్రదాయ, ఉపాసనా బహుళతలు నేటికీ ఉండటం ఒక వైచిత్రి. బ్రాహ్మణ కుల జీవన కేంద్రంగా, సంస్కృత లిఖిత సాహిత్య ఆధారాల పునాదిగా పాశ్చాత్య పండితులు, అట్టి పండితులను అనుసరించిన దేశీయ మేధావులు పుట్టించిన రాజకీయ సాంస్కృతిక పదంగా “హిందూ మతం” అని అనిపిస్తూ ఉంది — వ్యాసం జాగ్రత్తగా చదివితే. ఇది ఆలోచనాత్మకం, వివేచనాత్మకం.
మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/07/2025 9:29 am
నా పద్యాలకు ఆనందించి స్పందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
అవునండి. వాజ అంటే నీరు అనే అర్థం ఉన్నది.
దీర్ఘాంతరూపంకూడా ఉన్నదనుకుంటానండి. శబ్దరత్నాకరం దానిని దీర్ఘాంతంగానే పేర్కొంది.
“జననాథస్మరచింతనాపరవశస్వాంతంబునం” – చంద్రికాపరిణయం చ.ఆ.16, సురభి మాధవరాయలు
“…నిరంతర మాధవ చింతనా సము
త్సుకలలితాధరుండు…” – శ్రీనివాసప్రబంధము చ.ఆ.77 పుట్టపర్తి నారాయణాచార్యులు
శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.
పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి రాణి శివశంకర శర్మ గారి అభిప్రాయం:
06/05/2025 11:13 pm
క్వాంటమ్ ఫిజిక్స్ కు భారతీయ దర్శనాలతో గల సంబంధాన్ని ఈవ్యాసంలో వివరించాను. ఐతే అత్యాధునిక పరిశోధనలు చైతన్యం కేవలం బ్రెయిన్ కు మాత్రమే చెందదు అని, విశ్వంతో జీవికి గల సహజ ఐక్యతతో కూడినదే చైతన్యం అనే వైపు సాగుతున్నాయి.ఈవిషయాలను మిత్రులు ఫిజిక్స్ అధ్యయన పరులు సుధాకర్ ఇలా వివరించారు ఫిలాసఫీ గ్రూపులో.
క్వాంటం బ్రెయిన్:
మన చైతన్యం విశ్వంతో ఎలా కలుస్తుంది?
కొత్త పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, మన మెదడులోని క్వాంటం స్థితులు చైతన్యాన్ని (consciousness) యావత్ విశ్వానికి (universe) లింక్ చేయగలవట! భౌతికశాస్త్రం, న్యూరోసైన్స్ కలిసి సాగిస్తున్న ఈ ప్రయాణంలో, మానవ చైతన్యం ఒక క్వాంటం ఫినామినన్ (quantum phenomenon) లాగా పనిచేస్తుందని, అది మన మనసులను ఈ విశ్వంతో కలుపుతుందని చెబుతోంది.
ఆర్చ్ ఓఆర్ (Orch OR – Orchestrated Objective Reduction) అనే ఒక వివాదాస్పద థియరీ ఉంది. దాని ప్రకారం, మన మెదడు కణాల్లో ఉండే మైక్రోట్యూబుల్స్ (microtubules), మెదడులోని వెచ్చని, తడి వాతావరణంలో కూడా క్వాంటం కొహరెన్స్ను (quantum coherence) మెయింటెయిన్ చేయగలవని సైంటిస్టులు ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్తో (experimental evidence) నిరూపిస్తున్నారు.
ఈ క్వాంటం స్థితులు చైతన్యానికి “కీ” లాంటివి కావచ్చని, ఆ కీ సూపర్ పొజిషన్ (superposition), ఎంటాంగిల్మెంట్ (entanglement) లాంటి క్వాంటం లక్షణాలున్న వేవ్ (wave) లాగా పనిచేస్తుందని అంటున్నారు. అంటే, మానవ చైతన్యం అంతరిక్షంలోని క్వాంటం సిస్టమ్స్తో కనెక్ట్ అయి ఉండొచ్చన్నమాట.
సిమ్యులేషన్స్ (simulations), ఎక్స్పెరిమెంట్స్ (experiments) ద్వారా, మైక్రోట్యూబుల్స్ లోపల క్వాంటం రియాక్షన్స్ అనుకున్నదానికంటే ఎక్కువ కాలం నిలబడగలవని తేలడంతో ఈ థియరీకి కొత్త బలం చేకూరింది.
ఇదిలా ఉండగా, థియరిటికల్ ఫిజిసిస్ట్ (theoretical physicist) తిమోతీ పామర్ అనే ఆయన, చైతన్యం అనేది ఒక కాస్మిక్ ఫ్రాక్టల్ “స్టేట్ స్పేస్” (cosmic fractal “state space”) లో ఉంటుందని సూచిస్తున్నారు. ఇది ఫ్రీ విల్ (free will) తో పాటు, మనం విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నామనే ఫీలింగ్ను కూడా వివరించగల ఒక షేర్డ్ జియోమెట్రిక్ స్ట్రక్చర్ (shared geometric structure) కావచ్చని ఆయన అభిప్రాయం.
ఇవన్నీ ఇంకా డెఫినిటివ్ (definitive) కాకపోయినా, చైతన్యం కేవలం ఒక న్యూరల్ ఇల్యూషన్ (neural illusion) మాత్రమే కాదు, అది వాస్తవికతలోని ఒక క్వాంటం ఫీచర్ (quantum feature) కావచ్చని అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధనలు ఒక ముఖ్యమైన స్టెప్ అని చెప్పొచ్చు.
మరిన్ని వివరాలకు: https://global.oup.com/academic/product/the-primacy-of-doubt-9780192843609?cc=kh&lang=en
From: Hashem Al-Ghaili
భారతీయులకు హేతు చింతన ఉందా? గురించి Harathi Vageeshan గారి అభిప్రాయం:
06/04/2025 5:28 am
భారతీయ హేతు దృష్టికి సమన్వయ లక్షణం, ద్వంద్వత — అందునా వ్యతిరేక ద్వంద్వతను పక్కన పెట్టే లక్షణం ఉంది అని నిరూపణ చేసే ప్రయత్నం వ్యాసంలో ప్రధాన అంశం.
కేవలం చార్వాక, బౌద్ధ చింతనలు మాత్రమే ఆధునిక యూరోపియన్ హేతు దృష్టికి దగ్గరివి. అవి కాని చింతనలు అన్నీ ఆధునికతకు, అంటే హేతు దృష్టికి దూరం అయినవి అనే ప్రచారంలో తర్కపద్ధతిని ఈ వ్యాసం సహేతుకంగా ప్రశ్నించింది.
వర్ణ-జాతి వ్యవస్థ అనేది పుట్టుక పునాది, ఉచ్చ నీచ సామాజిక సాంస్కృతిక వ్యవస్థగా మారిన స్థితి ఈ దేశపు పూర్తి వాస్తవం అనీ. ఈ దేశంలో బౌద్ధము, చార్వాకాలు తప్ప మరే తాత్విక భవనాలు ఈ సామాజిక సాంస్కృతిక వ్యవస్థను వ్యతిరేకించలేదు కనక అవి అన్నీ కూడా హేతువు తో సంబంధం లేనివి (వెస్ట్ సైన్స్ దృష్టి) అనే ఒక అతి సులభ సామాజిక శాస్త్ర సూత్రీకరణ మీద కూడా ఈ వ్యాసం ప్రశ్నలు లేవనెత్తినది.
వర్ణ-కుల వ్యవస్థ పుట్టుక పునాది గా మారిపోవడం, దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాల దీర్ఘ చరిత్రను లోతుగా చూస్తే, శుద్ధ హేతు వాదం తో సంబంధం లేని భక్తి వాదులు, అద్వైత వాదులు కూడా పుట్టుకపునాది వివక్ష దృష్టి మీద యుద్ధం చేశారు అని తెలుస్తుంది. కేవలం చార్వాక, బౌద్ధాలు మాత్రమే హేతు వాద చింతనలు తప్ప, ఈశ్వర(దైవ) సంబంధం, ప్రకృతి పురుషుల ఏకతను ప్రతిపాదించే సాంఖ్యం, బ్రహ్మ భావనను పక్కకు పెట్టిన పూర్వ మీమాంసకుల స్వతసిద్ధ వాదాన్ని, ఈ దేశంలోని ప్రభావశీల ఆధునిక వెస్ట్రన్ కర్టీజియన్ సైన్స్ దృక్పథ వాదులు గుర్తించలేదని అనే ప్రతిపాదన కూడా వ్యాసం చేసింది.
అయితే వ్యాసకర్త రచనా పద్ధతి కొంచం గెంతులు వేస్తూ సాగుతున్నట్టు ఉంటుంది. అది రచనా పర సమస్య అనుకుంటాను. క్వాంటమ్ భౌతిక శాస్త్రము, అది దానికన్నా ముందు ఉండే భౌతిక శాస్త్రంతో ఎట్లా విభేదిస్తుంది అనే వివరణ కొంచం ఉంటే వ్యాసానికి అది మరింత పదును ఇచ్చేది అనిపిస్తుంది.
వ్యాసం రాసిన మనిషి బ్రహ్మణ కులస్తుడు, అతని కోరిక బ్రాహ్మణ తత్వ చింతనను సమర్థించడం మాత్రమే అనే తీరు విమర్శలు ఈ వ్యాసం మీద వస్తాయి. కానీ అవి పెద్దగా హేతుబద్ధం కావు — అవి కేవలం భావజాల ప్రేరిత వాదాలు.
భారతీయ చింతనా జగత్తులో పదార్థ దృష్టి, హేతు దృష్టి ఉండిన తీరును చూపే ఒకానొక ప్రయత్నంగా ఈ వ్యాసాన్ని చూడాలి. ఆ ప్రతిపాదనలోని గుణదోషాలను విచారించాలి.
హేతు చింతన అంటే ఏమిటి? అనే మౌలిక ప్రశ్నను మరొకసారి ఈ వ్యాసం చర్చలోకి తెచ్చింది. ఇది బాగా ఆలోచింపజేసే వ్యాసం.
కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు గురించి Rangarao గారి అభిప్రాయం:
06/04/2025 2:18 am
శ్రీనివాస్ గారి కామెంట్ లో ఒక మాట అన్నారు. రచయిత మధ్యలో ఇంకేమైనా రాస్తే త్రెడ్ తెగిపోయింది అని. ఇది సరైన మాట కాదేమో! రచయిత తనలోని భావాలను బయట పెడితే ఒక భారం వదిలినట్లు మనసు తేలికపడుతుంది. హనుమంతరావు గారు చాలా సార్లు చిన్న కథలు రాశారు ఈ వేదిక మీద. మళ్లీ రాయవచ్చు కూడా రిలాక్సేషన్ కోసం. దానివలన ఈ శీర్షిక దారం ఎలా తెగిపోతుంది? ఈ పోగు వేరుగానే వుంటుంది కదా! మధ్యమధ్యలో ఆటవిడుపుగా కథలు రాయడం మానుకోవద్దని హనుమంతరావు గారిని కోరుతున్నాను.