గూగోళ జ్ఞానంమన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.

తిరగబడ్డ తొమ్మిదిఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?

పద్దాలుగాడు తాగుబోతు. పచ్చి దొంగ. తాగినప్పుడు రంగిని చితక తంతాడు. రంగి ఒక్కత్తే కాదు; మరొక ఆడదానితో పోతాడు. అయినా రంగికి వాడంటే ఉన్న ఆకర్షణ ఏమిటో బోధపడలేదు. వాడు దొంగతనం చెయ్యడానికి సహాయం కూడా చేస్తుంది. వాడితో ఎన్ని అవస్థలు పడ్డా మళ్ళీ వాడి పక్కకే చేరటం నాకు నచ్చలేదు. రంగి మానసికస్థితి ఒక పట్టాన బోధపడలేదు.

రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మన ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి.

ఇంగ్లీషు పొయిట్రీ క్లాసు చెప్పే ఎస్.వి.ఎల్.ఎన్ గారి క్లాసులో పాఠం కంటే హస్కే ఎక్కువ. దీపావళికి ఎవరెవరో ఏం కాల్చారూ అని అడుగుతూ ఆయన చిన్నప్పటి సొంత గోల చెప్పడం మొదలు పెట్టాడు. మిగతా స్టూడెంట్లూ ఎవరికి తోచినవి వాళ్ళు మధ్య మధ్యలో చెబుతున్నారు. శీనుగాడు మాత్రం మౌనంగా ఉన్నాడు.

పొద్దున్నే ఎనిమిదయ్యింది. బల్లుల్లా రకరకాల సైజుల కారులు, పెద్దవీ, చిన్నవీ, బుల్లిబుల్లివీ! గోడమీద బల్లులు పురుగు కనిపించంగానే దబుక్కున దూకినట్టు ముందుకారు వెనకాతల కాస్త […]

కన్నయ్య, భార్య బుల్లెమ్మ, వాళ్ళ జీవితంలో మొట్టమొదటిసారిగా బుల్లెమ్మకి ఓ చీరె కొందామని వస్తారు. ఆ కొట్టు, ఆ లైట్ల హడావిడి చూడంగానే కన్నయ్యకి భయంవేస్తుంది, తనని బయటికి గెంటేస్తారేమోనని! భయపడుతూ భయపడుతూ ” మా ఆడోళ్ళకి చీరెలు కొనాలండి,” అంటాడు, కొట్లో గుమాస్తాతోటి, అదేదో తప్పుచేసిన వాడిలా!

స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్‌పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.

“అలాగే ఏం పందెం వేసుకుందాం? నువ్వే చెప్పు. నువ్వేదంటే అదే” తలెత్తి చూపు సారించి సుబ్బలక్ష్మిని తనివిదీరా చూసుకున్నాను. చింపిరి జుట్టును చేత్తోనే అటూ ఇటూ సరిచేసి వేసుకున్న రెండు జడలు, కళ్ళనిండుగా కాటుక, పెదవులపై అస్తవ్యస్తంగా పూసుకున్న ముదురు ఎరుపు లిప్‌స్టిక్.

ఆ కిటికీ గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.

గోపాలన్ మా ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్. చాలా కఠినమైన వ్యక్తి. జీవితంలో ఒక్కొక్క మెట్టుగా ఎక్కి వచ్చిన మనిషి. అందువల్ల అందరూ అలాగే రావాలని అనుకునే వ్యక్తి. ప్రొద్దున్న తొమ్మిది గంటలకి ఆఫీసుకి వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వేరే ఆలోచనలు లేకుండా అన్నిటినీ మూటకట్టి పెట్టి ఆయనతో సమంగా పరుగెత్తాలి.

ఎవరబ్బా ఈ మీనాక్షి? ఆమెకి నా ముఖం ఉంది. నా రూపం ఉంది. కాని వట్టి ఆమె కాదు నేను. రాబోయే కాలంలో నా పేరు మారు మ్రోగబోతుంది. చిన్నప్పటి నుంచీ అదే నా కల. అదే నా లక్ష్యం. ఎంతో మంది మీనాక్షిలలో నేను కూడా ఒక మీనాక్షినా? కానే కాదు. నేను వాణిని. చదువుల తల్లిని. పూలమాలతో దేవేరుని అలంకరించిన ఆండాళ్ నేనే.

“ఆ కళ్ళు ఇంతకు ముందు నిన్ను ఇలా నిలదీసి చూడలేదు. నిన్ను చూసి చూపు తిప్పుకునే కళ్ళు నిన్నిప్పుడు సూటిగా చూస్తున్నాయి. నువ్వూ మెల్లిగా మర్చిపోతున్నావు. ఆ కళ్ళు అప్పటి శత్రువులవి. వీళ్ళవి కాదు. ఇప్పుడు వీళ్ళూ అవే కళ్ళతో మనల్ని చూస్తున్నారు.

నాకు బాగా జ్ఞాపకం ఉంది. చిన్నప్పుడు నాకెప్పుడు ఒంట్లో బాలేకపోయినా, అమ్మ ఇలాగే చేసేది. ఎన్నోసార్లు నా రోగాలు అమ్మ చేతి స్పర్శ తగలగానే మంత్రం వేసినట్లు మాయమయ్యేవి. అమ్మ అరచేతుల స్పర్శ స్నేహితంగా ఎంతో ఆనందంగా ఉండేది, గంగ, యమున నదుల నీళ్ళలా చల్లగా హాయిగా ఉండేది.

నాగమ్మ పని మానేయడానికి నన్ను కారణం చేస్తున్నందుకు నాకైతే భలే మండుకొచ్చింది. శాసన సభలోలా, ఈ సంసారంలో – ఈవిడ ఎప్పుడు ప్రతిపక్షమౌతుందో, ఎప్పుడు మిత్రపక్షం వహిస్తుందో తెలీదు. తను నాకు అత్తగారన్న సంగతి ఆర్నెల్లకో సారి ఇదిగో ఇలా గుర్తు చేస్తూ వుంటుంది. సుర్రుమంది మనసు. పీకల దాకా వచ్చిన కోపాన్ని నిభాయించుకోవాల్సి వచ్చింది.

“స్త్రీల విషయంలో మనుష్యులు ఆచరించని దోషం ఏదయినా వుందా? నిజం చెప్పండి.” అని వరాహమిహిరుడి శ్లోకం మకుటంగా ఈ కథ ప్రారంభమవుతుంది. కథా వస్తువు ముందుగానే తెలిసిపోతుంది. కథ అంతా చదివిన తరువాత, బహుశా ఆ వాక్యం ఆఖరిగా రాసి వుంటే బాగుండేదేమో ననిపించింది, నాలో ‘విమర్శకుడి’కి.

బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ అనే కుగ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస.

హటాత్తుగా అతను నన్నే చూస్తున్నాడని నాకనిపించింది. మామూలుగా చూడటం కాదు. అతని చూపులు సూటిగా, అటూ ఇటూ తొణక్కుండా నన్ను ఆపాదమస్తకం శ్రద్ధగా చదువుతున్నట్టుగా, అక్కడితో ఆగకుండా లోపల్లోపలికి చొచ్చుకొనిపోయి నా వీపుని కూడా ఒదిలిపెట్టకుండా, నా శరీరాన్ని బైటా లోపలా కూడా శల్యపరీక్ష చేస్తున్నాట్టుగా, అబ్బ! చటుక్కున చూపు తిప్పుకున్నాను.

మత రాజకీయాలని, విద్వేషాలనీ అవతలకి నెట్టి ఈ కథ చదవవలసిన అవసరం ఉన్నది. ఈ కథని చదవవలసిన నేపథ్యం కూడా వేరే! మహాత్మా గాంధీ అంటే సాధారణ భారతీయులకి ఎంత ఆదర్శమూర్తో, మహమ్మదాలీ జిన్నా పాకిస్థానీయులకి అంత ఆత్మీయుడు. నెహ్రూని పక్కకి తప్పించి జిన్నాని మొదటి ప్రధానిగా చెయ్యటానికి కూడా గాంధీ సిద్ధపడ్డాడు. అయితే, జిన్నా గురించి హిందువులకి ఉన్న అభిప్రాయాలు వేరు.

ఆ రాత్రి చెవులు బద్దలైపోయేంత గట్టిగా మెరుపు మెరిసింది. తర్వాత అడవినిండా ఆ వెలుగు పడింది. కొంతదూరంలో ఒక ఎండిపోయిన చెట్టు మీద ఒక వింత జంతువు కూర్చుని, ఆ చెట్టుని తినేస్తూ ఉంది. ఆ జంతువు శరీరం నుండి సూర్యుడి నుంచి వచ్చేలాంటి వెలుగు వస్తూ ఉంది. ఇలాంటి జంతువుని ఇంతకు ముందు ఎవ్వరూ, బాఖా ముందు తరాల వాళ్ళు కూడా చూడలేదు.