@పి. తిరుపాలు
హ్యూయాన్ సాంగ్ హిందూమతం గురించి చెప్పింది ఇది. తమరు చెప్పింది కాదు.
Hiuen Tsang, the Chinese Buddhist monk and traveler, observed that Hinduism was more prevalent than Buddhism in India during his visit in the 7th century CE. He noted the presence of various religious faiths and acknowledged the tolerance among people towards different beliefs, with individuals changing their religions voluntarily. Hiuen Tsang also described aspects of Hindu society, including the caste system, the prevalence of Sati, and the education of women.
Here’s a more detailed look at Hiuen Tsang’s observations:
Religious Landscape:
While Buddhism was a significant religion, Hiuen Tsang’s writings indicate that Hinduism was more widespread.
Tolerance and Religious Freedom:
He observed a general atmosphere of tolerance where people of different faiths coexisted and could freely choose their religion.
ఇక ఇస్లామ్ లో ఉండే పరమతసహనం గురించి, హిందువులపై, భారతదేశంపై ముస్లిములకుండే అభిప్రాయాన్ని గురించి తన ‘Pakistan Or The Partition Of India” అనే పుస్తకంలో అంబేడ్కర్ ఇలా అంటున్నారు. The brotherhood of Islam is not the universal brotherhood of man. It is a brotherhood of Muslims for Muslims only. There is a fraternity, but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity.
Ambedkar opined that Muslims think of Hindus as inferior beings and would find it hard to accept the authority of a Hindu majority government.
To the Muslims, a Hindu is a Kaffir. A Kaffir is not worthy of respect. He is low-born and without status. That is why a country that is ruled by a Kaffir is Dar-ul-Harb to a Musalman. Given this, no further evidence seems to be necessary to prove that the Muslims will not obey a Hindu government. The basic feelings of deference and sympathy, which predispose persons to obey the authority of government, do not simply exist. But if a proof is wanted, there is no dearth of it. In the midst of the Khilafat agitation, when the Hindus were doing so much to help the Musalmans, the Muslims did not forget that as compared with them the Hindus were a low and an inferior race.
హిందు మతమంటు లేదన్నది నిజం. హిందు అన్నది ఒక ప్రదేశాన్ని సూచించే మాట. చైనీయ యాత్రికుడు హ్యూహాన్స్చాంగ్ ఇండియా యాత్ర చేసినపుడు ప్రదేశం పేరుగా ‘హిందు’ శబ్దాన్ని తన రచనలలో వాడాడు. అది దేశాన్ని తెలియజేస్తుందేగాని, మతాన్ని కాదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కనుకనే రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అన్న పదం వాడారు. అనేక మతాలు అంటే కేవలం క్రిస్టియన్, ముస్లిం మతం మాత్రమే కాదు. జైన మతం, బౌద్ద మతం, సిక్కు మతం మాత్రమే కాదు, ఈ రోజు హిందు మతంగా వ్యవహారించే మతంలోనే వివిధ మతాలు ఉన్నాయి. వైష్ణవం, శైవం (అందునుండి పుట్టిన పిలకలు – వీరశైవం లాంటివి), శాక్తేయం లాంటివి. ఇంకా స్థానిక గిరిజన మతాలు కూడా! అందుకే బహుళత్వంలో ఏకత్వం అనేది. ఆధునిక మతవాదులు గిరిజన మతాలను కూడా హిందు మతంలో చేర్చి వారి అస్థిత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. హిందువులకు మతసహనం ఎక్కువ అని ఎందుకు అంటున్నారంటే మొదటి నుండి ఇన్ని మతాల మధ్య ఐక్యత ఉంది కాబట్టి. ముస్లిం మతానికి కూడా ఆతాహతు (కలిసి పోవడం) ఉంది. ఆధునిక మతవాదులు మాత్రమే వేరు చేసి చూస్తున్నారు. హిందు మతం ఉండే మత సహనం ఆధునికం కాదు. ఇప్పుడు మాత్రమే మత సహనాన్ని ముస్లిం, క్రైస్తవ మతాల పట్ల చూపలేకపోతున్నారు.
నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:
“ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”
సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
మీరు ఇక్కడ ఉంచిన తెలుగు అనువాదంకై నా శుభాభినందనలు. అద్భుతంగా వివరించారు. వీడియోలో శ్లోకం యొక్క గానం కూడా చాలా బాగుంది.
ఐన్స్టియన్ రిలేటివిటీ సూత్రం ద్వారా సృష్టి ఆవిర్భావము, రోదసి మరియు సమయము గురించి పరిశోధన ద్వారా వంద ఏళ్ళ క్రితం వెలుగులోకి తీసుకుని వచ్చారు. కొన్ని వేల ఏళ్ళ క్రితం వేదాలలో చెప్పిన అదే నిజం లోకానికి తెలియక పోవడం ఆశ్చర్యం అనుకుంటే, మన భారతీయులకు ఈ రోజు కూడా సరిగ్గా నాసదీయసూక్తంలో చెప్పిన ఈ విషయాలు తెలియకపోవడం శోచనీయం.
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా అభివందనాలు
ధన్యస్మి🙏
‘అందుకే సమాజం పరిభాషలో రాజేశ్వరి లేచిపోయింది’ అన్నారు వాడ్రేవు వీరలక్ష్మి దేవి. మరి ఆమె పరిభాషలో రాజేశ్వరి చేసిన పనిని ఏమంటారో కూడా చెబితే బాగుండేది. చలం అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు, అంతే విపరీతంగా అసహ్యించుకునేవారు వున్నారుగానీ, ఈ భావోద్వేగానికి అతీతంగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే వ్యాసాలు అరుదు. చలం రచనలను ఒక సాహితీప్రక్రియగా కాకుండా ఒక advocacy గా, program of action గా చూడటమే ఇందుకు కారణం. తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైన నవలలుగా పేరుగాంచిన పుస్తకాల్లో మైదానం ఒకటి. కాసేపు రాజేశ్వరి అన్నదని, చెప్పిందని, చెప్పుకున్నదని, చెలం చెప్పించాడని రకరకాలుగా రచయిత్రి చెప్పింది. చెలం ఇలా చెప్పాడు అంటే బాగుండేది. కాల్పనిక రచనల్లో పాత్రలు రచయిత తనకు ఇష్టం వచ్చినట్లు మలిచినవేగానీ వాటికి స్వతంత్రం వుండదు. చెలమే అన్నాడు అనటానికి ఏదో ఇబ్బంది అడ్డం వస్తుంది.
సమాజం మనుగడకి కుటుంబం మూలస్తంభం. దానిమీద ద్వజమెత్తే రచనల్లో చలం సాహిత్యం ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను సమర్ధించేవారు నేడు సమాజంలో వున్న అనేకమంది రాజేశ్వరీలను ఎక్కడా అక్కున చేర్చుకోవడం చూడం. ఎందుకీ ద్వంద్వ విలువలు?
రతీసౌఖ్యం అనే రుచికి లొంగిపోయిన వారు కొట్టినా తిట్టినా పట్టించుకోరు. రతిలో పొందే ఆనందం ముందు ఆత్మాభిమానం సింగినాదం జీలకర్ర చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. అందుకే 3037లో కూడా చలం మైదానం చదివేవారు వుంటారు. రహస్యంగా దిండు కింద దాచుకోనవసరం లేదు. యూట్యూబ్ నిండా మైదానం లో వున్న రసికత అందరికీ అందుబాటులో వుంది కదా!
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.
ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.
రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.
అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” (https://drive.google.com/file/d/17zVmgoshDjspVZKH_yymzBm11HZEbHDC/view) అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?
ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?
వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.
అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] (https://eemaata.com/em/issues/199907/1107.html) చదవదగ్గది.
దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.
“గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
“వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”
సమార్ద్రమైనభావాలు.
రెండు చిన్న సూచనలు:
“విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.
“బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)
1. వలస వాదము, (దానికి ప్రతిక్రియగా, దాని ప్రభావంతో పుట్టిన సాంస్కృతిక) జాతీయత, ఆధునికత అనే మూడు కలిసి ఆధునిక హిందూ అనే ఒక మెగా మతం పుట్టింది అని చాలా ఓపికగా ఈ వ్యాసం వివరించే ప్రయత్నం చేసింది.
2. పర్షియన్లు, అరబ్బులు ఒక దిక్కును, ప్రాంతాన్ని చూపే పదంగా, తరువాతి కాలంలో ఒక రాజకీయ పాలనాపర పదంగా హిందూస్తాన్ అన్న పదాన్ని బ్రిటిష్ వలస పాలన స్థిరీకరణ ముందు వరకు పాలనా, లేఖనా సాంప్రదాయాలలో ఉపయోగంలో ఉన్న వాస్తవాన్ని వ్యాసం గుర్తుకు తెస్తున్నది.
3. ఏకరూప మతం లేక పోవడం ఈ దేశపు అత్యంత ముఖ్యమైన సమస్యఅని, పుట్టుక పునాది కులాల (వర్ణ-జాతి) విఘటనతో ఈ దేశం, సమాజం మరణయాతన పడుతూ ఉన్నది అని, అందువలన నిరంతర పరాయివారి చేత ఓటమిని చూసిన, చవి చూస్తున్నది అని, అందువలన ఈ దేశానికి ఒక ఏకరూప మతం అవసరం అని అందరూ ఆధునికులు భావించారు.
4. అయితే వారిలో అందరికీ “హిందూ” అన్న పలుకుమీద ఏకాభిప్రాయం లేదు. రామ్ మోహన్ రాయ్ తన సమాజాన్ని ఉపనిషత్ ఆధార బ్రహ్మ సమాజం అన్నారు, సౌరాష్ట్ర బ్రాహ్మణ పండితుడు దయానంద సరస్వతి తన సమాజాన్ని ఆర్య సమాజం అన్నారు, వివేకానంద, ఆయన సమర్థకులు నవ్య అద్వైత వేదాంతం ద్వారా కొత్త మతం పుట్టించాలి అనుకున్నారు. వారు కూడా హిందూ అనే పదాన్ని పూర్తిగా మతము అనే అర్థంలో వాడలేకపోయినారు. అరబింద ఘోష్ సనాతన వైదిక మూలాలు, జ్ఞానమీమాంస కలసిన మతం ఉండాలి అనుకున్నారు. చివరగా హిందూ మహాసభ, సావర్కర్లు ఏకరూప హిందూ మత నిర్మాణాన్ని ఒక రాజకీయ ప్రాజెక్ట్గా ముందుకు తెచ్చినరు. ఆర్.ఎస్.ఎస్. ఆ పనినే ఇప్పటికీ చేస్తూ ఉన్నది.
5. బాబా సాహెబ్ కు కూడా ఈ దేశానికి మానవీయ, ధృఢ, స్వేచ్ఛ, సమత, సోదర భావన ఉండే నైతికత కేంద్ర ఏకరూప మతం లేదు అనే ఆందోళన, తపన ఉన్నది అనిపిస్తుంది. మొదట ఈ దేశానికి ఒక ఏకరూప మతం ఉండింది — అది బౌద్ధం. అది బ్రాహ్మణ మతం ద్వారా సమసి పోగొట్టబడి దెబ్బతిని, బ్రాహ్మణ మత ప్రధాన లక్షణం అయిన వర్ణ-జాతి విభజనతో ఈ దేశంలో మతం అమానుషంగా మారి దేశం నాశనం అయింది అని అనుకొని, తిరిగి బౌద్ధ ధర్మ పునరుద్ధరణ ద్వారా జన్మ ఆధార కుల వర్ణ ఉనికి లేని నవబౌద్ధుని నిర్మించాలి అని అనుకున్నారు. ఈ ఆలోచనావిధాన కొనసాగింపుగానే ఇస్లాం వెనుకబడిన పరాయి మతంగా, క్రిస్టియన్ మతం వలస వాద లక్షణాలున్న విదేశీ మతంగా ఆయన భావించారు అనిపిస్తుంది.
6. “వేదాలకు తిరిగి వెళ్ళండి” అనే ఆర్య సమాజం వారు, “అఖండ హిందూ మతం ఒకటి పుట్టించాలి” అనే రాజకీయ సాంస్కృతిక హిందుత్వ వాదులు, అంబేద్కర్ వాదులు ఒకే రకం అయిన ఆందోళనతో ప్రారంభం అవడం (వారి మార్గాలు, లక్ష్యాలు, అంతిమ ప్రతిపాదనలు వేరేవేరే అయినా) గమనించవలసిన అంశం. అది వలస ఆధునికత ప్రతిఫలనం. వ్యాసం ఈ విషయాన్ని ఉపపత్తులతో సమర్థించింది అనిపిస్తోంది.
7. యంత్ర సంబంధ, పెట్టుబడి ప్రధాన, భారీ స్థాయి ఉత్పత్తి తెచ్చిన వలస వాదం, దానితో వచ్చిన ప్రొటెస్టెంట్ ఇతర క్రైస్తవ మత ఔన్నత్య ధోరణులు, ఈ దేశంలో “హిందూ మతం” అనే ఏకరూప మత సృష్టి ప్రయత్నాలను బలపరిచినాయి అన్న ఈ వ్యాసంలోని ప్రతిపాదన అధ్యయనం చేయాల్సిన విషయం.
8. ఇంత ఏకరూప మత సృష్టి ప్రయత్నం గట్టిగా జరుగుతున్న ఈ దేశంలో ఆచార, సంప్రదాయ, ఉపాసనా బహుళతలు నేటికీ ఉండటం ఒక వైచిత్రి. బ్రాహ్మణ కుల జీవన కేంద్రంగా, సంస్కృత లిఖిత సాహిత్య ఆధారాల పునాదిగా పాశ్చాత్య పండితులు, అట్టి పండితులను అనుసరించిన దేశీయ మేధావులు పుట్టించిన రాజకీయ సాంస్కృతిక పదంగా “హిందూ మతం” అని అనిపిస్తూ ఉంది — వ్యాసం జాగ్రత్తగా చదివితే. ఇది ఆలోచనాత్మకం, వివేచనాత్మకం.
శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.
పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!
హిందూ మతం అంటే ఏమిటి? గురించి శ్రీనివాసుడు గారి అభిప్రాయం:
06/13/2025 10:24 pm
@పి. తిరుపాలు
హ్యూయాన్ సాంగ్ హిందూమతం గురించి చెప్పింది ఇది. తమరు చెప్పింది కాదు.
Hiuen Tsang, the Chinese Buddhist monk and traveler, observed that Hinduism was more prevalent than Buddhism in India during his visit in the 7th century CE. He noted the presence of various religious faiths and acknowledged the tolerance among people towards different beliefs, with individuals changing their religions voluntarily. Hiuen Tsang also described aspects of Hindu society, including the caste system, the prevalence of Sati, and the education of women.
Here’s a more detailed look at Hiuen Tsang’s observations:
Religious Landscape:
While Buddhism was a significant religion, Hiuen Tsang’s writings indicate that Hinduism was more widespread.
Tolerance and Religious Freedom:
He observed a general atmosphere of tolerance where people of different faiths coexisted and could freely choose their religion.
ఇక ఇస్లామ్ లో ఉండే పరమతసహనం గురించి, హిందువులపై, భారతదేశంపై ముస్లిములకుండే అభిప్రాయాన్ని గురించి తన ‘Pakistan Or The Partition Of India” అనే పుస్తకంలో అంబేడ్కర్ ఇలా అంటున్నారు. The brotherhood of Islam is not the universal brotherhood of man. It is a brotherhood of Muslims for Muslims only. There is a fraternity, but its benefit is confined to those within that corporation. For those who are outside the corporation, there is nothing but contempt and enmity.
Ambedkar opined that Muslims think of Hindus as inferior beings and would find it hard to accept the authority of a Hindu majority government.
To the Muslims, a Hindu is a Kaffir. A Kaffir is not worthy of respect. He is low-born and without status. That is why a country that is ruled by a Kaffir is Dar-ul-Harb to a Musalman. Given this, no further evidence seems to be necessary to prove that the Muslims will not obey a Hindu government. The basic feelings of deference and sympathy, which predispose persons to obey the authority of government, do not simply exist. But if a proof is wanted, there is no dearth of it. In the midst of the Khilafat agitation, when the Hindus were doing so much to help the Musalmans, the Muslims did not forget that as compared with them the Hindus were a low and an inferior race.
హిందూ మతం అంటే ఏమిటి? గురించి P. తిరుపాలు గారి అభిప్రాయం:
06/12/2025 1:48 pm
హిందు మతమంటు లేదన్నది నిజం. హిందు అన్నది ఒక ప్రదేశాన్ని సూచించే మాట. చైనీయ యాత్రికుడు హ్యూహాన్స్చాంగ్ ఇండియా యాత్ర చేసినపుడు ప్రదేశం పేరుగా ‘హిందు’ శబ్దాన్ని తన రచనలలో వాడాడు. అది దేశాన్ని తెలియజేస్తుందేగాని, మతాన్ని కాదు. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి కనుకనే రాజ్యాంగంలో ‘సెక్యులరిజం’ అన్న పదం వాడారు. అనేక మతాలు అంటే కేవలం క్రిస్టియన్, ముస్లిం మతం మాత్రమే కాదు. జైన మతం, బౌద్ద మతం, సిక్కు మతం మాత్రమే కాదు, ఈ రోజు హిందు మతంగా వ్యవహారించే మతంలోనే వివిధ మతాలు ఉన్నాయి. వైష్ణవం, శైవం (అందునుండి పుట్టిన పిలకలు – వీరశైవం లాంటివి), శాక్తేయం లాంటివి. ఇంకా స్థానిక గిరిజన మతాలు కూడా! అందుకే బహుళత్వంలో ఏకత్వం అనేది. ఆధునిక మతవాదులు గిరిజన మతాలను కూడా హిందు మతంలో చేర్చి వారి అస్థిత్వాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. హిందువులకు మతసహనం ఎక్కువ అని ఎందుకు అంటున్నారంటే మొదటి నుండి ఇన్ని మతాల మధ్య ఐక్యత ఉంది కాబట్టి. ముస్లిం మతానికి కూడా ఆతాహతు (కలిసి పోవడం) ఉంది. ఆధునిక మతవాదులు మాత్రమే వేరు చేసి చూస్తున్నారు. హిందు మతం ఉండే మత సహనం ఆధునికం కాదు. ఇప్పుడు మాత్రమే మత సహనాన్ని ముస్లిం, క్రైస్తవ మతాల పట్ల చూపలేకపోతున్నారు.
చలం సాహిత్యం-విముక్తి గురించి ప్రతాప్ రెడ్డి ఏ గారి అభిప్రాయం:
06/12/2025 11:01 am
శివశంకర్ ప్రసిద్ధ రచయిత. ప్రసంగ వ్యాసం సమతూకంగా చాలా బాగుంది. రచయితకి హృదయపూర్వక అభినందనలు.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/11/2025 11:26 am
నేను వేదాలనీ ఉపనిషత్తులనీ మధించలేదు కాని, వాటినీ సాపేక్ష సిద్ధాంతాలనీ తరచి చూచిన నండూరి “విశ్వరూపం” లో అంటారు:
“ప్రాచీన హిందువులు ఖగోళ విజ్ఞానంలో ఆరితేరినవారే. కాని వారి విజ్ఞానం ఎంత ప్రాచీనమైనదనే విషయం ఈనాటికి కూడా వివాదగ్రస్తంగా వున్నది. మన సంప్రదాయం ప్రకారం మన నాగరికత అతి పురాతనం. మన ఖగోళ విజ్ఞానం కూడా అతి ప్రాచీనమైనదే. అసలు ఖగోళ విజ్ఞానమే కాదు, ఏ విజ్ఞానమైనా ముందు భారతదేశంలోనే పుట్టి ఇతర దేశాలకు వ్యాపించిందని వాదించే ఛాందసులు పలువురున్నారు. వారి దృష్టిలో అసలు ఈనాడు పాశ్చాత్యవేత్తలు కనిపెట్టిన కొత్త విషయం ఒక్కటీ లేదు. ఏ పాశ్చాత్యుడు ఏ నూత్న విషయాన్ని ప్రతిపాదించినా, అది మన వేదాలలోనే వున్నదంటారు. ఏదో శ్లోకాన్ని తీసుకుని దానికి నూత్న సిద్ధాంతానుగుణమైన అర్థం చెబుతారు. ఇంతేకాక, పాశ్చాత్యులు ఈనాటికీ కనిపెట్టలేని ఎన్నో మహత్తర విశేషాలు వేదాలలో వున్నాయని, వేదాలు అపౌరుషేయాలు కనుక మన విజ్ఞానం అనాది అని చెబుతారు. ఇది ఒక విధమైన జాత్యహంకారం.”
సృష్టి ఆవిర్భావం మీద ఆసక్తి కలవాళ్ళు నండూరి, Weinberg [1] రచనలు చదవాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] The First Three Minutes: A Modern View of the Origin of the Universe. Steven Weinberg. Basic Books. 1993.
నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి రాళ్ళబండి శ్రీధర్ గారి అభిప్రాయం:
06/09/2025 11:52 am
మీరు ఇక్కడ ఉంచిన తెలుగు అనువాదంకై నా శుభాభినందనలు. అద్భుతంగా వివరించారు. వీడియోలో శ్లోకం యొక్క గానం కూడా చాలా బాగుంది.
ఐన్స్టియన్ రిలేటివిటీ సూత్రం ద్వారా సృష్టి ఆవిర్భావము, రోదసి మరియు సమయము గురించి పరిశోధన ద్వారా వంద ఏళ్ళ క్రితం వెలుగులోకి తీసుకుని వచ్చారు. కొన్ని వేల ఏళ్ళ క్రితం వేదాలలో చెప్పిన అదే నిజం లోకానికి తెలియక పోవడం ఆశ్చర్యం అనుకుంటే, మన భారతీయులకు ఈ రోజు కూడా సరిగ్గా నాసదీయసూక్తంలో చెప్పిన ఈ విషయాలు తెలియకపోవడం శోచనీయం.
మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా అభివందనాలు
ధన్యస్మి🙏
చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ గురించి రంగారావు గుమ్మడిదల గారి అభిప్రాయం:
06/09/2025 7:21 am
‘అందుకే సమాజం పరిభాషలో రాజేశ్వరి లేచిపోయింది’ అన్నారు వాడ్రేవు వీరలక్ష్మి దేవి. మరి ఆమె పరిభాషలో రాజేశ్వరి చేసిన పనిని ఏమంటారో కూడా చెబితే బాగుండేది. చలం అంటే విపరీతంగా అభిమానించే వాళ్లు, అంతే విపరీతంగా అసహ్యించుకునేవారు వున్నారుగానీ, ఈ భావోద్వేగానికి అతీతంగా వాస్తవిక దృక్పథంతో విశ్లేషించే వ్యాసాలు అరుదు. చలం రచనలను ఒక సాహితీప్రక్రియగా కాకుండా ఒక advocacy గా, program of action గా చూడటమే ఇందుకు కారణం. తెలుగు సాహిత్యంలో అత్యంత వివాదాస్పదమైన నవలలుగా పేరుగాంచిన పుస్తకాల్లో మైదానం ఒకటి. కాసేపు రాజేశ్వరి అన్నదని, చెప్పిందని, చెప్పుకున్నదని, చెలం చెప్పించాడని రకరకాలుగా రచయిత్రి చెప్పింది. చెలం ఇలా చెప్పాడు అంటే బాగుండేది. కాల్పనిక రచనల్లో పాత్రలు రచయిత తనకు ఇష్టం వచ్చినట్లు మలిచినవేగానీ వాటికి స్వతంత్రం వుండదు. చెలమే అన్నాడు అనటానికి ఏదో ఇబ్బంది అడ్డం వస్తుంది.
సమాజం మనుగడకి కుటుంబం మూలస్తంభం. దానిమీద ద్వజమెత్తే రచనల్లో చలం సాహిత్యం ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను సమర్ధించేవారు నేడు సమాజంలో వున్న అనేకమంది రాజేశ్వరీలను ఎక్కడా అక్కున చేర్చుకోవడం చూడం. ఎందుకీ ద్వంద్వ విలువలు?
రతీసౌఖ్యం అనే రుచికి లొంగిపోయిన వారు కొట్టినా తిట్టినా పట్టించుకోరు. రతిలో పొందే ఆనందం ముందు ఆత్మాభిమానం సింగినాదం జీలకర్ర చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి. అందుకే 3037లో కూడా చలం మైదానం చదివేవారు వుంటారు. రహస్యంగా దిండు కింద దాచుకోనవసరం లేదు. యూట్యూబ్ నిండా మైదానం లో వున్న రసికత అందరికీ అందుబాటులో వుంది కదా!
చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
06/07/2025 2:45 pm
“చెల్లియుండియు సైరణ చేయునతడు” అన్న భారత సూక్తి ఏ సందర్భంలోదని వెదుకుతుండగా, ఈ వ్యాసం 2022 ఏప్రిల్ “కొలిమి” లోనిదని తెలిసింది. “ఈమాట” ఆమాట చెప్పాల్సింది.
“చెల్లియుండియు సైరణ సేయునతఁడుఁ
బేదవడియును నర్థికిఁ బ్రియముతోడఁ
దనకుఁ గలభంగి నిచ్చునతండుఁ బుణ్య
పురుషు లని చెప్పి రార్యులు గురువరేణ్య.”
దానికి రెండు పద్యాల ముందరిది:
“క్షమియించువారిఁ గని చా
లమి వెట్టుదు రైననుం దలంప ననూన
క్షమయ కడు మెఱయుతొడ వు
త్తమరూపము గోరువారు దాల్తురు దానిన్.”
(ఉద్యోగపర్వం, రెండో ఆశ్వాసం)
ధృతరాష్ట్రుడికి విదురుడు హితోపదేశం చేసే సందర్భం లోని ఈ పద్యాల సారాంశం: సమర్థుడయి (చెల్లియు) కూడా శాంతం (సైరణ) వహించేవాడు పుణ్యపురుషుడు; క్షమించే స్వభావం కలవాళ్లకి జనులు అసమర్థతని ఆపాదిస్తారు (చాలమి+పెట్టుదురు) కాని, ఆలోచిస్తే క్షమాగుణమే మిక్కిలి మెరిసే ఆభరణం.
రాజేశ్వరి పొందిన “లోపలి స్వేచ్చ” వలన కలిగిన క్షమ, ఓరిమి ఆమెకు ఆత్మవైశాల్యాన్ని చేకూర్చాయని వాడ్రేవు గారి ప్రశంస.
అమీర్ కి మరొక స్త్రీ పై మోజు పడితే వారినిరువురినీ కలిపిన రాజేశ్వరిది ప్రకాశించే క్షమా? కడుపుతో ఉన్నప్పుడు కర్రతో బాదితే, తన్నితే సహించడం మెచ్చుకోదగ్గ ఓరిమా? బిడ్డని కనాలని ఉన్నా అమీర్ కోసం గర్భం పోగొట్టుకోవడం స్వాతంత్రమా? ఇదంతా తను సంపాదించిన “లోపలి స్వేచ్చ” వలనే అనడం విడ్డూరంగా ఉంది; కాదు, చాలా ఎబ్బెట్టుగా ఉంది. కొడవటిగంటి 1947 లో రాసిన “ఆడబ్రతుకే మధురం!” (https://drive.google.com/file/d/17zVmgoshDjspVZKH_yymzBm11HZEbHDC/view) అన్న కథలో పిల్ల అంటుంది: ” నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుణ్ణి మాత్రం చేసుకోను. పుణ్యం లేకపోతే పీడాపాయె.” ఓ చిన్న పిల్లకున్న స్వాభిమానం కూడా రాజేశ్వరి చూపించలేదే?
ఇంతకీ తన 2002 సిద్ధాంత వ్యాసంలో [1], “మైదానంలో వ్యక్తి స్వేచ్చ గురించి మాట్లాడలేదు,” అని, ఇప్పుడీ “లోపలి స్వేచ్చ” సిద్ధాంతం తేవడమెందుకు?
వాడ్రేవు గారు [1] కి అనుబంధంగా ఇస్మాయిల్ తో చేసిన ఇంటర్వ్యూ లో ఓ చక్కని జవాబుంది:
ప్ర. స్త్రీవాదులు చలంలో తమకు అవసరమైనది తీసుకుని శతజయంతులు జరపడం మీద మీ ఉద్దేశ్యం ఏమిటి?
జ. చలం ఒక మహా కాసారం. అందులో స్వచ్ఛమైన జలముంది. అందమైన తామరలున్నాయి. రుచికరమైన చేపలున్నాయి. పచ్చటి నాచుంది. ఎవరికి అవరమైనది వారు తీసుకుంటారు.
అలాగే “మైదానం” లో విశాలమైన పచ్చటి బయళ్లతో పాటు కొన్ని కలుపుమొక్కలున్నాయి. వాటిని వివరించే జయప్రభ వ్యాసం “మైదానానికి చెలియలి కట్ట” [2] (https://eemaata.com/em/issues/199907/1107.html) చదవదగ్గది.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “సత్యాన్వేషి చలం: ఒక పరిశీలన,” డా. వాడ్రేవు వీరలక్ష్మీదేవి. 2006. (పి.హెచ్.డి. సిద్ధాంత వ్యాసం, 2002).
[2] “మార్గము – మార్గణము (సాహిత్య వ్యాసాలు),” జయప్రభ. 2003.
[ఇది ఇదివరకే కొలిమి పత్రికలో వచ్చిందని మాకు తెలియదు – సం. ]
దర్శనము గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/07/2025 1:39 pm
మంత్రదర్శనాన్ని ఒక కవితగా వ్రాయాలన్న ఊహ అపూర్వం!
దర్శించిన దేవత పేరు కవితలో నేరుగా చెప్పకుండా నడిపించడం విశేషం. “తొలిపాటల కమ్మని పొందికమ్మ”, “మననజనావనకళా” – ఈ రెండూ ఈ కవి తన మాటలలో ఆ దేవి పేరుకు చేసిన అనువాదాలు. అన్వర్థాలు. అలా ఇది ఈ కవి దర్శనంకూడా అయింది.
“గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.”
“వేదమయీ! చిగిర్చితివి వేల వసంతములైనయట్లు”
సమార్ద్రమైనభావాలు.
రెండు చిన్న సూచనలు:
“విశ్వాసప్రియే! రమ్మ!” అంటే మేలు.
“బుద్దికెందామర” అంటే బాగుంటుంది (బుద్ధికి వైకృత రూపం)
హిందూ మతం అంటే ఏమిటి? గురించి Harathi Vageeshan గారి అభిప్రాయం:
06/07/2025 10:14 am
1. వలస వాదము, (దానికి ప్రతిక్రియగా, దాని ప్రభావంతో పుట్టిన సాంస్కృతిక) జాతీయత, ఆధునికత అనే మూడు కలిసి ఆధునిక హిందూ అనే ఒక మెగా మతం పుట్టింది అని చాలా ఓపికగా ఈ వ్యాసం వివరించే ప్రయత్నం చేసింది.
2. పర్షియన్లు, అరబ్బులు ఒక దిక్కును, ప్రాంతాన్ని చూపే పదంగా, తరువాతి కాలంలో ఒక రాజకీయ పాలనాపర పదంగా హిందూస్తాన్ అన్న పదాన్ని బ్రిటిష్ వలస పాలన స్థిరీకరణ ముందు వరకు పాలనా, లేఖనా సాంప్రదాయాలలో ఉపయోగంలో ఉన్న వాస్తవాన్ని వ్యాసం గుర్తుకు తెస్తున్నది.
3. ఏకరూప మతం లేక పోవడం ఈ దేశపు అత్యంత ముఖ్యమైన సమస్యఅని, పుట్టుక పునాది కులాల (వర్ణ-జాతి) విఘటనతో ఈ దేశం, సమాజం మరణయాతన పడుతూ ఉన్నది అని, అందువలన నిరంతర పరాయివారి చేత ఓటమిని చూసిన, చవి చూస్తున్నది అని, అందువలన ఈ దేశానికి ఒక ఏకరూప మతం అవసరం అని అందరూ ఆధునికులు భావించారు.
4. అయితే వారిలో అందరికీ “హిందూ” అన్న పలుకుమీద ఏకాభిప్రాయం లేదు. రామ్ మోహన్ రాయ్ తన సమాజాన్ని ఉపనిషత్ ఆధార బ్రహ్మ సమాజం అన్నారు, సౌరాష్ట్ర బ్రాహ్మణ పండితుడు దయానంద సరస్వతి తన సమాజాన్ని ఆర్య సమాజం అన్నారు, వివేకానంద, ఆయన సమర్థకులు నవ్య అద్వైత వేదాంతం ద్వారా కొత్త మతం పుట్టించాలి అనుకున్నారు. వారు కూడా హిందూ అనే పదాన్ని పూర్తిగా మతము అనే అర్థంలో వాడలేకపోయినారు. అరబింద ఘోష్ సనాతన వైదిక మూలాలు, జ్ఞానమీమాంస కలసిన మతం ఉండాలి అనుకున్నారు. చివరగా హిందూ మహాసభ, సావర్కర్లు ఏకరూప హిందూ మత నిర్మాణాన్ని ఒక రాజకీయ ప్రాజెక్ట్గా ముందుకు తెచ్చినరు. ఆర్.ఎస్.ఎస్. ఆ పనినే ఇప్పటికీ చేస్తూ ఉన్నది.
5. బాబా సాహెబ్ కు కూడా ఈ దేశానికి మానవీయ, ధృఢ, స్వేచ్ఛ, సమత, సోదర భావన ఉండే నైతికత కేంద్ర ఏకరూప మతం లేదు అనే ఆందోళన, తపన ఉన్నది అనిపిస్తుంది. మొదట ఈ దేశానికి ఒక ఏకరూప మతం ఉండింది — అది బౌద్ధం. అది బ్రాహ్మణ మతం ద్వారా సమసి పోగొట్టబడి దెబ్బతిని, బ్రాహ్మణ మత ప్రధాన లక్షణం అయిన వర్ణ-జాతి విభజనతో ఈ దేశంలో మతం అమానుషంగా మారి దేశం నాశనం అయింది అని అనుకొని, తిరిగి బౌద్ధ ధర్మ పునరుద్ధరణ ద్వారా జన్మ ఆధార కుల వర్ణ ఉనికి లేని నవబౌద్ధుని నిర్మించాలి అని అనుకున్నారు. ఈ ఆలోచనావిధాన కొనసాగింపుగానే ఇస్లాం వెనుకబడిన పరాయి మతంగా, క్రిస్టియన్ మతం వలస వాద లక్షణాలున్న విదేశీ మతంగా ఆయన భావించారు అనిపిస్తుంది.
6. “వేదాలకు తిరిగి వెళ్ళండి” అనే ఆర్య సమాజం వారు, “అఖండ హిందూ మతం ఒకటి పుట్టించాలి” అనే రాజకీయ సాంస్కృతిక హిందుత్వ వాదులు, అంబేద్కర్ వాదులు ఒకే రకం అయిన ఆందోళనతో ప్రారంభం అవడం (వారి మార్గాలు, లక్ష్యాలు, అంతిమ ప్రతిపాదనలు వేరేవేరే అయినా) గమనించవలసిన అంశం. అది వలస ఆధునికత ప్రతిఫలనం. వ్యాసం ఈ విషయాన్ని ఉపపత్తులతో సమర్థించింది అనిపిస్తోంది.
7. యంత్ర సంబంధ, పెట్టుబడి ప్రధాన, భారీ స్థాయి ఉత్పత్తి తెచ్చిన వలస వాదం, దానితో వచ్చిన ప్రొటెస్టెంట్ ఇతర క్రైస్తవ మత ఔన్నత్య ధోరణులు, ఈ దేశంలో “హిందూ మతం” అనే ఏకరూప మత సృష్టి ప్రయత్నాలను బలపరిచినాయి అన్న ఈ వ్యాసంలోని ప్రతిపాదన అధ్యయనం చేయాల్సిన విషయం.
8. ఇంత ఏకరూప మత సృష్టి ప్రయత్నం గట్టిగా జరుగుతున్న ఈ దేశంలో ఆచార, సంప్రదాయ, ఉపాసనా బహుళతలు నేటికీ ఉండటం ఒక వైచిత్రి. బ్రాహ్మణ కుల జీవన కేంద్రంగా, సంస్కృత లిఖిత సాహిత్య ఆధారాల పునాదిగా పాశ్చాత్య పండితులు, అట్టి పండితులను అనుసరించిన దేశీయ మేధావులు పుట్టించిన రాజకీయ సాంస్కృతిక పదంగా “హిందూ మతం” అని అనిపిస్తూ ఉంది — వ్యాసం జాగ్రత్తగా చదివితే. ఇది ఆలోచనాత్మకం, వివేచనాత్మకం.
మౌనంబంతట మాటలాడె… (3వ భాగం) గురించి కామేశ్వరరావు గారి అభిప్రాయం:
06/07/2025 9:29 am
నా పద్యాలకు ఆనందించి స్పందించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
అవునండి. వాజ అంటే నీరు అనే అర్థం ఉన్నది.
దీర్ఘాంతరూపంకూడా ఉన్నదనుకుంటానండి. శబ్దరత్నాకరం దానిని దీర్ఘాంతంగానే పేర్కొంది.
“జననాథస్మరచింతనాపరవశస్వాంతంబునం” – చంద్రికాపరిణయం చ.ఆ.16, సురభి మాధవరాయలు
“…నిరంతర మాధవ చింతనా సము
త్సుకలలితాధరుండు…” – శ్రీనివాసప్రబంధము చ.ఆ.77 పుట్టపర్తి నారాయణాచార్యులు
శ్రీరామనాథ్ గారూ, మీ ఆత్మీయమైన మాటలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. కాని మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.
పద్యరచనాభ్యాసంగా ఏదో కొంత ప్రయత్నిస్తున్నాను తప్ప ప్రచురించాలన్న ఉద్దేశం లేదు. “మరల నిదేల రామాయణం బన్నచో… నా భక్తిరచనలు నావి కాన” – అని చెప్పగలనని నాకు అనిపించిననాడు తప్పక ప్రచురిస్తాను. అది ఎప్పుడు, ఎంతవరకూ సాధ్యమవుతుందో!