యశస్వి గారూ,నమస్తే!
జయప్రభ గారి వాన ముచ్చట గురించి మీరిక్కడ ప్ర స్తావించడం చాలా మురిపెంగా వుంది. అందరూ చదివి ఆనందించే విధంగా రాసి పంపిన మీకునూ నా అభినందనలు!
కృతజ్ణతలతో –
ఆర్.దమయంతి.
లక్ష్మన్న గారూ,
మీ వ్యాసాలు దశాబ్దం క్రితంవి. నేను రాద్దామనుకుటున్న విషయం మూడు దశాబ్దాలక్రితం నేను అనుకున్నది. ఇప్పుడు మీ రాగలహరి – మోహనం చూసాక రాయాలనిపించి రాస్తున్నాను.
ఏ వృత్తికైనా – మీ ఇంజినీరింగ్, మా లాయరీ(?), మరెవరి మెడిసిన్ – ఏదైనా ఆ వృత్తికి సంబధించిన జార్గన్ ఒకటి ఉంటుంది. సామాన్యులకి అది పట్టబడకపోవచ్చు. అనవసరం కూడా. అది ఆ వృత్తికి సంబంధించిన అసామాన్యుల భాష. కాని కొన్ని పదాలు ఈ ఇద్దరికి సమానమైనవి ఉండొచ్చు. సామాన్యులు ఆ వృత్తిపరంగా ఆ పదాలని సామాన్యార్ధంలో వాడకూడదన్నది గుర్తుంచుకోవాలి. కానీ విశేషార్ధం ఒకటి ఉంటుందన్నది తెలియక సామాన్యులు ఆ తప్పు చేస్తుంటారు.
ఉదాహరణకి – లీడింగ్ క్వొశ్చన్ – అన్న పదం చాలా మంది వాడుతుంటారు. దేన్ని లీడింగ్ క్వొశ్చన్ అనాలి అని ఎవిడెన్స్ ఆక్ట్ చెబుతుంది. ఏ పశ్నకైతే జవాబు అవును లేదా కాదు అని వస్తుందో అదే, అది మాత్రమే లీడింగ్ క్వొశ్చన్. కేవలం క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యడానికి మాత్రమే ఈ ప్రశ్న అడగాడానికి అవకాశం ఉన్నది. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లీడింగ్ క్వొశ్చన్ అడగకూడదు. వాది, ప్రతివాది అడ్వొకేట్లిద్దరికీ లీడింగ్ క్వొశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఎదుటివాడి సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు. దాని అవసరం ఆ వృత్తిలోని వారికి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళకి తోచిన రీతిలో వాడితే అసందర్భంగా ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకదాని ప్రతివాదిని సంవాది అన్నానుకోండి కోర్టులో, వీడే మార్సునుంచి వచ్చేడ్రా అన్నట్టు చూస్తారు. ఇది కేవలం ఉదాహరణకి చెప్తున్నది. అసలు విషయం –
సంగీతం విషయంలో. ‘శుధ్ధ’ అన్న పదం కొన్ని రాగాలకే పరిమితం. కారణం నాకు తెలీదు. సామాన్యులు శుధ్ధ పదాన్ని pure, pristine అన్న అర్ధంలో వాడతారు. రాగాల విషయంలో – శుధ్ధ సావేరి, శుధ్ధ ధన్యాసి, శుధ్ధసీమంతిని, *శుధ్ధ బంగళా (ఈ ఆఖరిది కర్ణాటక రాగమో కాదో మరి) – ఉద్దేశం అదేనో కాదో నాకు తెలీదు. ఒకే పేరుతో రెండు రాగాలున్నప్పుడు, సావేరి, ధన్యాసిలాంటివి, ఒక దానికి శుధ్ధ prefixతో differentiate చేసినట్టు కనిపిస్తుంది. అవి ఒకే మేళకర్తజన్యాలు కాకపోవచ్చుకూడా. మరే రాగానికి ఈ prefix ఉండదు. శుధ్ధ పదాన్ని లూస్ గా వాడితే ఈ రాగమెక్కడిదీ అని సంగీతం వాళ్ళు అడిగే అవకాశం ఉంది.
ఇక స్వరాల్లో కూడా రిషభ, ధైవతాలు, మొదటివి, రి1, ధ1 శుధ్ధ స్వరాలు. రెండోవి చతుర్ శ్రుతి. నాట రాగంలోని షట్ శ్రుతి రిషభ ధైవతాలు నిజానికి సాధారణ గాంధారం, కైశికనిషాదాలు. స్వరస్థానాలని ఒకటి కంటె ఎక్కువ పేర్లతో గుర్తించడానికి కారణం – నాట లాంటి రాగంలో రెండు గాంధారాలు, రెండు నిషాదాలు ఉన్నప్పుడు వాటిల్లో ఒకటి రిషభం, మరోటి ధైవతంగా గుర్తించి సప్తస్వరాలూ ఉన్నట్టు చూపించడానికేమో? అలాగే కర్ణాటక, హిందుస్థానీ పద్ధతుల్లో ‘శుధ్’ పదం కలిగినవి సమాన స్వరస్థానాలని అనుకోలేం. అంటే హిందుస్ధానీ శుధ్ధ రిషభం కర్ణాటక సంగీతంలో చతుర్ శ్రుతి రిషభం. చతుర్ శ్రుతి రిషభాన్ని శుధ్ధ గాంధారం అన్నా తప్పులేదు. 22 శ్రుతుల ఆధారంగా స్వరస్థానాలని నిర్ణయించినప్పుడు తయారయినది ఈ nomenclature అనుకుంటాను. అందువల్లే చతుర్శ్రుతి, షట్శ్రుతి ఇట్లాంటి పదాలు. నాలుగోది, ఆరోది అని. ఇవన్నీ నాకు తెలిసి అంటున్న విషయాలు కావు. నాన్నగారు చెప్పగా అర్ధంచేసుకుందుకు ప్రయత్నించినవి.
ఈ బాధెందుకు వచ్చిందంటే – శంకారభరణం సినిమా చూసే రోజుల్లో మా ఫ్రెండ్ ఒకతను “శుధ్ధ హిందోళం అన్న రాగం లేదండీ” అని అంటూండే వాడు. ఆ సినిమాలో శంకరశాస్త్రి గొప్ప సంగీతం విద్వాంసుడు – “శుధ్ధహిందోళం లో రిషభం ఎలా వచ్చిందే” అంటాడు హీరోయిన్ని గదామాయించి. ఆయన శంకరాభరణంలోని శంకారాభరణం గురించి అసామాన్యుల అభిప్రాయం apart – వృషభం అంటే రంకెలేస్తాడు, కాని శుధ్ధ హిందోళంలాంటి పదాలు వాడతాడు. అసలు సప్త స్వరస్థానాలు పశుపక్ష్యాదుల శబ్దాలనుంచే వచ్చాయన్నది జ్ఞానుల అభిప్రాయం, వృ(ఋ)షభం సరైనదేనని వాదన. హీరో సమ్మోహనంగా ‘మాణిక్యవీణా’ పాడగానే అంతటి విద్వాంసుడూ మూర్ఛపోతాడు.
ఈ పరిస్థితి ఎందువల్లా అంటే –
రచయిత (అసామాన్యుడు కాని) – ముఖ్యంగా సినిమా అన్న మాస్ మీడియం తీసుకున్న రచయిత ఒక వృత్తికి సంబంధించిన పాత్రచేత ఏం మాట్లాడిస్తున్నాడు అన్నది ఎంతో మంది చూస్తుంటారు. వృత్తిపరమైన పాత్రలని సమగ్రంగా – ఆ వృత్తికి సంబంధించిన సంఘటనలతో – చూపించాలన్న కోరిక ఓపిక ఉన్న రచయితలని, సినిమాలనీ తెలుగులో చూడలేం. జస్టిస్ చౌదరి అని అంటాడు – ఆయన కోటు గౌను వేసుకుని ఇంట్లోనే కనిపిస్తుంటాడు. వీలైతే హీరోయిన్ తో గెంతుతుంటాడు. పైలట్ ప్రేమ్ నాథ్ అని అంటాడు – ఏనాడు ఏరోప్లేన్ లో కూర్చోగా చూడం. ఆ వృత్తికి సంబంధించిన విషయాలేవీ ఉండవు. మనం ఫ్లైట్ ఇన్టు డేంజర్, ఏర్ పోర్ట్ లాంటి థ్రిల్లరేమో అనుకుని వెళతా…మా(?). అబ్బే మనకీ తెలుసు.
మన రచయతలకి బాగా కొట్టిన పిండి – human relations, emotions. మన ఒంట్లో, ఇంట్లో పుట్టిందగ్గర్నుంచి అనుభవిస్తున్నది. పేరేదైనా, పాత్రేదైనా, ఆవు వ్యాసంలాగా చివరకి (కాదు ముందునుంచే) ఈ రెండింటి చుట్టూ తిరగుతుంటుంది కథ. శంకరాభరణం అయినా అంతే. వృత్తిపరమైన విషయాలు convincing గా చెప్పాలంటే కష్టం. ప్రేమలు, అనుమానాలు, ఏడుపులు చుట్టూ తిప్పడం అంటేనా చిటికలో పని. నచ్చిన హీరోయిన్ తో గెంతుతూ ‘నటించ’డానికి హీరోకి స్కోప్ ఉండాలి. రచయితకి ప్రత్యేకంగా ఓ వృత్తికి సంబంధించిన జ్ఞానంతో పనిలేనిది.
సరే ఎందుకింత రాయల్సి వచ్చిందీ అంటే – మీవ్యాసంలో శుధ్ధమోహన అన్న పదం చూసి.
మరోటి – నిర్దిష్టం, నిర్దుష్టం సమానార్ధకాలు కావేమో.
పి.వి. గోపాలకృష్ణ
హెల్ల్లొ అక్కిరాజా ఎలావున్నావు!
నీ కధ చదివాను , చాల different గా , sarcastic గా రాసావు . TV channels ప్రహసనాలతొ start చేసి US లొ medical insurance భాగొతాలను touch చేస్తూ దొoగ బాబాల గురిచి ప్రస్తావిస్తూ puppet ప్రధాని ని చమత్కరిస్తూ చివరికి ఇరాసనీ వదలక కుక్కలతొ మనుషుల దిగజారుడూతనాన్ని చాలా బాగ రాసావు. నీలొ ఇంత గొప్ప critic ఉన్నాడా? good work.
అరుణ
“ఎస్. రాజేశ్వరరావు భైరవిలో ఆర్. బాలసరస్వతితో కలిసి పాడిన ఈ పాటకు స్వరరచన ఆయనదే.”
I think that this was sung by P.Suseela and A.M. Raja in Bangaru paapa.
వేటూరి పాట గురించి Kodavatiganti Rohiniprasad గారి అభిప్రాయం:
07/03/2011 10:21 pm
రామారావుగారి విశ్లేషణ చాలా సమగ్రంగా ఉంది. ఇది ఇటీవలి సినిమా సంగీతానికి కూడా మంచి విశ్లేషణే.
ఓ.పీ. నయ్యర్లాగే మహాదేవన్కూడా రచించిన పాటలకే స్వరాలు అమర్చేవాడట. ఆరుద్ర ‘ముద్దంటే చేదా’ అని రాసిస్తే మహాదేవన్ రెండు నిమిషాలు కళ్ళుమూసుకుని ఆలోచించి దాన్ని ‘ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా’ అని తాళంమీద అమరికగా ఉండేట్టు సర్దాటట!
ఆత్రేయ రచనలకు మహాదేవన్ ట్యూన్లు చెయ్యడం బ్రహ్మవిద్యే.
పరిపూర్ణమైన లయజ్ఞానం ఉన్న సినీరచయితలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సినారె, దేవులపల్లి మొదలైనవారు.
భాషమీద మంచి పట్టు ఉన్నప్పటికీ పాటల్లోని సాహిత్యాన్ని అంతగా పట్టించుకోనవసరం లేదనేది గుర్తించడం వేటూరివంటివారితోనే మొదలయింది.
ఇటీవల నేను స్టేజిమీద సమర్పించిన ఒక తెలుగు సినీగీతాల కార్యక్రమంలో మంచి సంగీతదర్శకుల పాటలన్నీ ఇంక్లూడ్ చేశాను. వాటిలో ఇళయరాజా చేసిన ఓ పాపాలాలి పాడుతున్న మా గాయకమిత్రుడు రిహార్సల్స్లో ‘ఈ వేటూరి పదాలకి అర్థం ఉన్నట్టులేదండీ?’ అని ఫిర్యాదు చెయ్యబోతే నేనతన్ని అవన్నీ అంతగా పట్టించుకోవద్దని చెప్పవలసివచ్చింది!
హిందీలోనూ, తెలుగులోనూ కూడా సినీగీతాల రచనలు ముందుగా తక్కువరకంగా మొదలయి, తరవాత ఉన్నస్థాయికి ఎదిగి, మళ్ళీ తగ్గుముఖం పట్టాయని అనిపిస్తుంది. ఈ సంగతి నేను వరవరరావుగారికి ఈమధ్య చెపితే ఆయన ‘అది మెరుగవడానికి ఒక కారణం ఇప్టావంటి సంస్థల కార్యకలాపాలు తగ్గాక ఆ కవులందరూ సినిమాల్లోకి రావడమే కారణం’ అన్నాడు.(http://en.wikipedia.org/wiki/Indian_People's_Theatre_Association)
ఇందులో కొంత నిజం ఉండచ్చు. ఎందుకంటే ప్రజానాట్యమండలిలో పనిచేసిన శ్రీశ్రీ, దాశరథివంటి కవులేకాక మాధవపెద్ది గోఖలే, తాతినేని చలపతిరావు, వి.మధుసూదనరావు, ప్రత్యగాత్మ తదితరులుకూడా సినిమాల్లోకి వచ్చారు.
జయప్రభ గారు తన ” ప్రతికూలపవనాలు” పుస్తకంలో ” వాన ముచ్చట” అని ఒకటి రాసేరు. చాలా మందికి గాడంగా గుర్తుండిపోయిన వాన ముచ్చట అది. ఇలా మొదలౌతుంది
“ఒక్కసారిగా శూన్యంలో తూనీగలెగయగానే..మనసు చల్లబడ్డట్టుగా వస్తుంది వానజల్లు.
అదుకే కాబొలు ” ఆషాఢస్య ప్రధమ దివసే” అని అంటాడు కాళిదాసు. ఎంత పౌర్ణమిరోజైనా సరే..చుట్టూ వలయాకృతి గూటిలో చిక్కుకుని చంద్రకాంతి మసకబారిపోతుంది.దిగులుకమ్మినట్టుగా ఆకాశం నల్లటి మబ్బులతో మూసుకుపోతుది.పగటిలోకూడా బొత్తిగా సూరీడుని లెఖ్ఖచేయవు మేఘాల దొంతరలు. ఆ పొరలని దాటుకుని అతగాడు బయటపడేసరికి పొద్దు నడినెత్తికెక్కుతుంది.గుబులుగుబులుగా ఉండే మధ్యాఃహ్నమ్ వేళలో, ఎలాగైతేనేం..ఊరిచి..మురిపించి..హడావుడి చేసి మొత్తానికి రానే వస్తుంది వాన!
“ఝిల్ మిల్ సితారోంకా ఆంగన్ హోగా
రిమ్ ఝిమ్ బరస్ తా సావన్ హోగా…”
–అంటూ కలలుగనటం పడుచు హృదయాలకి ఎంత ఇస్టం! ఎన్నెన్ని రూపాల్లో వస్తుందో వాన !చిలకరింపులతో పలకరిస్తుంది. గాలి వెంబడి విసురుగా కొట్టుకుపోతూ “ఊహు నేనిక్కడ పడను సుమా” అని పక్క వీధి దాకా పరుగెడుతుంది.ఇంక కురవదేమో అనుకుని పనిమీద బయటకు నడిచి వీధి మలుపు తిరిగెసరికి వెంబడిచి వెంటతరిమి కుండలతో దిమ్మరిచినట్టు హొరున కురిసి నిలువునా తడిపేస్తుది.తడిచీర కాళ్ళకి చుట్టుకుపోయి అడుగు తడబడుతూంటే..తేటగా వెలిసి , వెళ్లిపోతుంది వాన !”
ఇలా సాగే ఈ వానముచ్చట మరొక 2 పేజీలదాకా సాగి అనేక విధాలైన వానని వర్ణిస్తుది. వానముచ్చటకి ముగింపుగా జయప్రభగారి వాక్యాలు ఇలాంటివి.
” వాన నేలకి ఆకాశపు నజరానా! వాన నింగీ నేలల తానాబానా”!! అంటూ ఆమె ముగిస్తుంది.
దమయంతి గారి వాన వర్ణన చదివేకా జయప్రభ గారు రాసిన “వానముచ్చట” గుర్తొచ్చి
ప్రస్తావన చేశాను. దమయంతిగారికి అభినందనలు.
మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.
నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.
“ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది”
“ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు”
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?”
“భారత నారీత్వం స్పెషల్ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు”
”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది”
”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండాచేశాయి.”
కొకు గారు రాసిన పై వ్యాక్యాలన్నీ భూమిక వెబ్సైట్లో ప్రతిమ గారు పేర్కొన్నవి. ఆయన పుస్తకాలు నాకు తక్షణ అందుబాటులో లేకపోవటం చేత భూమిక వ్యాసాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను.
నా ఉద్దేశంలో “ఆధునిక మహిళలు భారత దేశ చరిత్రను తిరగరాస్తారు” అన్న గురజాడ భావన కంటే “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్లుగా పుడతారు” అన్న కొకు భావనే మరింత ప్రాసంగికతను, విప్లవాత్మకతను కలిగి ఉంది. గురజాడను మించిన క్రాంతదర్శనం ఈ చిన్న వాక్యంలో కనబడుతుంది.
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసానికి వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తుల జోలి నాకు అనవసరం కాని కొకు పరిమితుల గురించి, ఆయన సిద్ధాంత పరిమితుల గురించి ఈ వ్యాఖ్యానాలలో జోడించిన వారు కొకు రచనలలో కొన్నయినా నిజాయితీగా చదివారా అని నా సందేహం. ఎవరయినా దేన్నయినా విమర్శించవచ్చు.. కొత్త కళ్లతో పాత సిద్ధాంతాలుగా కనిపిస్తున్నవాటిని అంచనా వేయవచ్చు.. తప్పేమీ లేదు. కాని ఏ సిద్ధాంతం పట్ల అయినా పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ప్రాతిపదికన గుడ్డిద్వేషం, సంపూర్ణ వ్యతిరేకత ప్రకటించడం ఆ సిద్ధాంతం గొప్పతనం మాటేమో కాని మన అల్పత్వం మాత్రం నడిబజారులో ప్రదర్సితమవటం ఖాయం.
“కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది”
ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం.అందరూ ముందుగా ఈ పని చేసి తర్వాత మాట్లాడితే, రాస్తే బాగుంటుంది. ఇది మినహాయింపు లేకుండా మనందరికే వర్తించే సత్యం.
కధ పూర్తిగా ఎవరినో వెటకారమ్ చేయడమ్ కోసమ్ రాసినట్టు స్పsTaM అవుతూనే ఉంది. ఆ ఎవరన్నది ఎవరికి ఆసక్తిగా ఉంటె వాళ్ళకి స్పస్టమ్ కావొచ్చునేమో గానీ మిగిలిన వాళ్ళకి ఇటువంటి నెగెటివ్ రచన మీద ఏం ఆసక్తి ఉంటుందో ఇటువంటి రచనలని ఈమాట ఏమి ఆసించి ప్రచురించిందో నాలాంటి వారికి మాత్రం అర్ధం కాలేదు. పైగా రాసినవారికి లింగ భేదం అన్నా స్పస్టపడని ఒక డొంక పేరుని పెట్టుకోవడమ్ లోనే కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది ..ఇది ఉడుకుమోతు రచన అని. ఇందువల్ల ఆ స్త్రీవాద రచయిత్రికి జరిగే నస్టం ఏమన్నా ఉందో లేదో నాకైతే తెలీదు గానీ స్త్రీల రచనలమీద మారుపేరు పెట్టుకుని వెక్కిరించేటంతటి పిరికితనమూ భయమూ ఇది రాసినవారిలో ఉన్నట్టుగా మాత్రం స్పస్టపడుతున్నది.
చరిత్రలు చెప్పుకునే ఘనతలు ఎప్పుడూ మగవారి స్వంతమే అయి ఉండాలి తప్ప ఎంత సాధించినా స్త్రీలకి మాత్రమ్ ఆ హక్కు లేనట్టు ఈ రచన చేసిన వారి భావన కావొచ్చు. పొరపాటున కూడ స్త్రీలు వారి రచనల నేపధ్య వివరణ చెస్తే,.. దాన్నితిరిగీ స్త్రీలపేరుతోనే అపహాస్యమ్ చేయించే ఒక అలవాటూ ..అలాగే ఒక అహంకార ధోరణి ఈ రచనలో బాగా కన్పిస్తోంది. ఇది ప్రచురించడమ్ “ఈమాట” యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మరింతగా ప్రస్పుటం చేస్తోంది. ఎగతాళి చేయడమే లక్ష్యమ్ గా సాగిన ధోరణి ఇది. అది తెలిసిపోవడమే ఈ రచనలోని బలహీనత. కాగా… పాపం ఈ ” అనానిమస్సు” ఇలా తుస్సు.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
07/04/2011 2:43 am
యశస్వి గారూ,నమస్తే!
జయప్రభ గారి వాన ముచ్చట గురించి మీరిక్కడ ప్ర స్తావించడం చాలా మురిపెంగా వుంది. అందరూ చదివి ఆనందించే విధంగా రాసి పంపిన మీకునూ నా అభినందనలు!
కృతజ్ణతలతో –
ఆర్.దమయంతి.
రాగలహరి: మోహనం గురించి పి.వి.గోపాలకృష్ణ గారి అభిప్రాయం:
07/04/2011 1:44 am
లక్ష్మన్న గారూ,
మీ వ్యాసాలు దశాబ్దం క్రితంవి. నేను రాద్దామనుకుటున్న విషయం మూడు దశాబ్దాలక్రితం నేను అనుకున్నది. ఇప్పుడు మీ రాగలహరి – మోహనం చూసాక రాయాలనిపించి రాస్తున్నాను.
ఏ వృత్తికైనా – మీ ఇంజినీరింగ్, మా లాయరీ(?), మరెవరి మెడిసిన్ – ఏదైనా ఆ వృత్తికి సంబధించిన జార్గన్ ఒకటి ఉంటుంది. సామాన్యులకి అది పట్టబడకపోవచ్చు. అనవసరం కూడా. అది ఆ వృత్తికి సంబంధించిన అసామాన్యుల భాష. కాని కొన్ని పదాలు ఈ ఇద్దరికి సమానమైనవి ఉండొచ్చు. సామాన్యులు ఆ వృత్తిపరంగా ఆ పదాలని సామాన్యార్ధంలో వాడకూడదన్నది గుర్తుంచుకోవాలి. కానీ విశేషార్ధం ఒకటి ఉంటుందన్నది తెలియక సామాన్యులు ఆ తప్పు చేస్తుంటారు.
ఉదాహరణకి – లీడింగ్ క్వొశ్చన్ – అన్న పదం చాలా మంది వాడుతుంటారు. దేన్ని లీడింగ్ క్వొశ్చన్ అనాలి అని ఎవిడెన్స్ ఆక్ట్ చెబుతుంది. ఏ పశ్నకైతే జవాబు అవును లేదా కాదు అని వస్తుందో అదే, అది మాత్రమే లీడింగ్ క్వొశ్చన్. కేవలం క్రాస్ ఎగ్జామినేషన్ చెయ్యడానికి మాత్రమే ఈ ప్రశ్న అడగాడానికి అవకాశం ఉన్నది. ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు లీడింగ్ క్వొశ్చన్ అడగకూడదు. వాది, ప్రతివాది అడ్వొకేట్లిద్దరికీ లీడింగ్ క్వొశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, ఎదుటివాడి సాక్షిని క్రాస్ చేస్తున్నప్పుడు. దాని అవసరం ఆ వృత్తిలోని వారికి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళు ఆ పదాన్ని వాళ్ళకి తోచిన రీతిలో వాడితే అసందర్భంగా ఉంటుంది. ఇప్పుడు నేను తెలుసుకదాని ప్రతివాదిని సంవాది అన్నానుకోండి కోర్టులో, వీడే మార్సునుంచి వచ్చేడ్రా అన్నట్టు చూస్తారు. ఇది కేవలం ఉదాహరణకి చెప్తున్నది. అసలు విషయం –
సంగీతం విషయంలో. ‘శుధ్ధ’ అన్న పదం కొన్ని రాగాలకే పరిమితం. కారణం నాకు తెలీదు. సామాన్యులు శుధ్ధ పదాన్ని pure, pristine అన్న అర్ధంలో వాడతారు. రాగాల విషయంలో – శుధ్ధ సావేరి, శుధ్ధ ధన్యాసి, శుధ్ధసీమంతిని, *శుధ్ధ బంగళా (ఈ ఆఖరిది కర్ణాటక రాగమో కాదో మరి) – ఉద్దేశం అదేనో కాదో నాకు తెలీదు. ఒకే పేరుతో రెండు రాగాలున్నప్పుడు, సావేరి, ధన్యాసిలాంటివి, ఒక దానికి శుధ్ధ prefixతో differentiate చేసినట్టు కనిపిస్తుంది. అవి ఒకే మేళకర్తజన్యాలు కాకపోవచ్చుకూడా. మరే రాగానికి ఈ prefix ఉండదు. శుధ్ధ పదాన్ని లూస్ గా వాడితే ఈ రాగమెక్కడిదీ అని సంగీతం వాళ్ళు అడిగే అవకాశం ఉంది.
ఇక స్వరాల్లో కూడా రిషభ, ధైవతాలు, మొదటివి, రి1, ధ1 శుధ్ధ స్వరాలు. రెండోవి చతుర్ శ్రుతి. నాట రాగంలోని షట్ శ్రుతి రిషభ ధైవతాలు నిజానికి సాధారణ గాంధారం, కైశికనిషాదాలు. స్వరస్థానాలని ఒకటి కంటె ఎక్కువ పేర్లతో గుర్తించడానికి కారణం – నాట లాంటి రాగంలో రెండు గాంధారాలు, రెండు నిషాదాలు ఉన్నప్పుడు వాటిల్లో ఒకటి రిషభం, మరోటి ధైవతంగా గుర్తించి సప్తస్వరాలూ ఉన్నట్టు చూపించడానికేమో? అలాగే కర్ణాటక, హిందుస్థానీ పద్ధతుల్లో ‘శుధ్’ పదం కలిగినవి సమాన స్వరస్థానాలని అనుకోలేం. అంటే హిందుస్ధానీ శుధ్ధ రిషభం కర్ణాటక సంగీతంలో చతుర్ శ్రుతి రిషభం. చతుర్ శ్రుతి రిషభాన్ని శుధ్ధ గాంధారం అన్నా తప్పులేదు. 22 శ్రుతుల ఆధారంగా స్వరస్థానాలని నిర్ణయించినప్పుడు తయారయినది ఈ nomenclature అనుకుంటాను. అందువల్లే చతుర్శ్రుతి, షట్శ్రుతి ఇట్లాంటి పదాలు. నాలుగోది, ఆరోది అని. ఇవన్నీ నాకు తెలిసి అంటున్న విషయాలు కావు. నాన్నగారు చెప్పగా అర్ధంచేసుకుందుకు ప్రయత్నించినవి.
ఈ బాధెందుకు వచ్చిందంటే – శంకారభరణం సినిమా చూసే రోజుల్లో మా ఫ్రెండ్ ఒకతను “శుధ్ధ హిందోళం అన్న రాగం లేదండీ” అని అంటూండే వాడు. ఆ సినిమాలో శంకరశాస్త్రి గొప్ప సంగీతం విద్వాంసుడు – “శుధ్ధహిందోళం లో రిషభం ఎలా వచ్చిందే” అంటాడు హీరోయిన్ని గదామాయించి. ఆయన శంకరాభరణంలోని శంకారాభరణం గురించి అసామాన్యుల అభిప్రాయం apart – వృషభం అంటే రంకెలేస్తాడు, కాని శుధ్ధ హిందోళంలాంటి పదాలు వాడతాడు. అసలు సప్త స్వరస్థానాలు పశుపక్ష్యాదుల శబ్దాలనుంచే వచ్చాయన్నది జ్ఞానుల అభిప్రాయం, వృ(ఋ)షభం సరైనదేనని వాదన. హీరో సమ్మోహనంగా ‘మాణిక్యవీణా’ పాడగానే అంతటి విద్వాంసుడూ మూర్ఛపోతాడు.
ఈ పరిస్థితి ఎందువల్లా అంటే –
రచయిత (అసామాన్యుడు కాని) – ముఖ్యంగా సినిమా అన్న మాస్ మీడియం తీసుకున్న రచయిత ఒక వృత్తికి సంబంధించిన పాత్రచేత ఏం మాట్లాడిస్తున్నాడు అన్నది ఎంతో మంది చూస్తుంటారు. వృత్తిపరమైన పాత్రలని సమగ్రంగా – ఆ వృత్తికి సంబంధించిన సంఘటనలతో – చూపించాలన్న కోరిక ఓపిక ఉన్న రచయితలని, సినిమాలనీ తెలుగులో చూడలేం. జస్టిస్ చౌదరి అని అంటాడు – ఆయన కోటు గౌను వేసుకుని ఇంట్లోనే కనిపిస్తుంటాడు. వీలైతే హీరోయిన్ తో గెంతుతుంటాడు. పైలట్ ప్రేమ్ నాథ్ అని అంటాడు – ఏనాడు ఏరోప్లేన్ లో కూర్చోగా చూడం. ఆ వృత్తికి సంబంధించిన విషయాలేవీ ఉండవు. మనం ఫ్లైట్ ఇన్టు డేంజర్, ఏర్ పోర్ట్ లాంటి థ్రిల్లరేమో అనుకుని వెళతా…మా(?). అబ్బే మనకీ తెలుసు.
మన రచయతలకి బాగా కొట్టిన పిండి – human relations, emotions. మన ఒంట్లో, ఇంట్లో పుట్టిందగ్గర్నుంచి అనుభవిస్తున్నది. పేరేదైనా, పాత్రేదైనా, ఆవు వ్యాసంలాగా చివరకి (కాదు ముందునుంచే) ఈ రెండింటి చుట్టూ తిరగుతుంటుంది కథ. శంకరాభరణం అయినా అంతే. వృత్తిపరమైన విషయాలు convincing గా చెప్పాలంటే కష్టం. ప్రేమలు, అనుమానాలు, ఏడుపులు చుట్టూ తిప్పడం అంటేనా చిటికలో పని. నచ్చిన హీరోయిన్ తో గెంతుతూ ‘నటించ’డానికి హీరోకి స్కోప్ ఉండాలి. రచయితకి ప్రత్యేకంగా ఓ వృత్తికి సంబంధించిన జ్ఞానంతో పనిలేనిది.
సరే ఎందుకింత రాయల్సి వచ్చిందీ అంటే – మీవ్యాసంలో శుధ్ధమోహన అన్న పదం చూసి.
మరోటి – నిర్దిష్టం, నిర్దుష్టం సమానార్ధకాలు కావేమో.
పి.వి. గోపాలకృష్ణ
కుక్కపిల్లలు గురించి aruna mendu గారి అభిప్రాయం:
07/04/2011 1:43 am
హెల్ల్లొ అక్కిరాజా ఎలావున్నావు!
నీ కధ చదివాను , చాల different గా , sarcastic గా రాసావు . TV channels ప్రహసనాలతొ start చేసి US లొ medical insurance భాగొతాలను touch చేస్తూ దొoగ బాబాల గురిచి ప్రస్తావిస్తూ puppet ప్రధాని ని చమత్కరిస్తూ చివరికి ఇరాసనీ వదలక కుక్కలతొ మనుషుల దిగజారుడూతనాన్ని చాలా బాగ రాసావు. నీలొ ఇంత గొప్ప critic ఉన్నాడా? good work.
అరుణ
భావతరంగాల సింధువు: భైరవి గురించి gaddeswarup గారి అభిప్రాయం:
07/03/2011 10:32 pm
“ఎస్. రాజేశ్వరరావు భైరవిలో ఆర్. బాలసరస్వతితో కలిసి పాడిన ఈ పాటకు స్వరరచన ఆయనదే.”
I think that this was sung by P.Suseela and A.M. Raja in Bangaru paapa.
వేటూరి పాట గురించి Kodavatiganti Rohiniprasad గారి అభిప్రాయం:
07/03/2011 10:21 pm
రామారావుగారి విశ్లేషణ చాలా సమగ్రంగా ఉంది. ఇది ఇటీవలి సినిమా సంగీతానికి కూడా మంచి విశ్లేషణే.
ఓ.పీ. నయ్యర్లాగే మహాదేవన్కూడా రచించిన పాటలకే స్వరాలు అమర్చేవాడట. ఆరుద్ర ‘ముద్దంటే చేదా’ అని రాసిస్తే మహాదేవన్ రెండు నిమిషాలు కళ్ళుమూసుకుని ఆలోచించి దాన్ని ‘ముమ్ముమ్ముమ్ముమ్ముమ్ముద్దంటే చేదా’ అని తాళంమీద అమరికగా ఉండేట్టు సర్దాటట!
ఆత్రేయ రచనలకు మహాదేవన్ ట్యూన్లు చెయ్యడం బ్రహ్మవిద్యే.
పరిపూర్ణమైన లయజ్ఞానం ఉన్న సినీరచయితలు శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి, సినారె, దేవులపల్లి మొదలైనవారు.
భాషమీద మంచి పట్టు ఉన్నప్పటికీ పాటల్లోని సాహిత్యాన్ని అంతగా పట్టించుకోనవసరం లేదనేది గుర్తించడం వేటూరివంటివారితోనే మొదలయింది.
ఇటీవల నేను స్టేజిమీద సమర్పించిన ఒక తెలుగు సినీగీతాల కార్యక్రమంలో మంచి సంగీతదర్శకుల పాటలన్నీ ఇంక్లూడ్ చేశాను. వాటిలో ఇళయరాజా చేసిన ఓ పాపాలాలి పాడుతున్న మా గాయకమిత్రుడు రిహార్సల్స్లో ‘ఈ వేటూరి పదాలకి అర్థం ఉన్నట్టులేదండీ?’ అని ఫిర్యాదు చెయ్యబోతే నేనతన్ని అవన్నీ అంతగా పట్టించుకోవద్దని చెప్పవలసివచ్చింది!
హిందీలోనూ, తెలుగులోనూ కూడా సినీగీతాల రచనలు ముందుగా తక్కువరకంగా మొదలయి, తరవాత ఉన్నస్థాయికి ఎదిగి, మళ్ళీ తగ్గుముఖం పట్టాయని అనిపిస్తుంది. ఈ సంగతి నేను వరవరరావుగారికి ఈమధ్య చెపితే ఆయన ‘అది మెరుగవడానికి ఒక కారణం ఇప్టావంటి సంస్థల కార్యకలాపాలు తగ్గాక ఆ కవులందరూ సినిమాల్లోకి రావడమే కారణం’ అన్నాడు.(http://en.wikipedia.org/wiki/Indian_People's_Theatre_Association)
ఇందులో కొంత నిజం ఉండచ్చు. ఎందుకంటే ప్రజానాట్యమండలిలో పనిచేసిన శ్రీశ్రీ, దాశరథివంటి కవులేకాక మాధవపెద్ది గోఖలే, తాతినేని చలపతిరావు, వి.మధుసూదనరావు, ప్రత్యగాత్మ తదితరులుకూడా సినిమాల్లోకి వచ్చారు.
హిందీ/ఉర్దూ కవుల్లో సాహిర్ లూధియానవీ, మజ్రూహ్ సుల్తాన్పురీ, కైఫీ ఆజ్మీ, జాన్ నిసార్ అఖ్తర్, శైలేంద్రవంటి హేమాహేమీలందరూ వచ్చాకనే సినీగీతాలు ఉన్నతస్థితికి చేరుకున్నాయి.
సినీ సాహిత్యంకూడా తక్కిన సాంస్కృతిక అంశాలలాగే సామాజిక పరిణామాలను ప్రతిఫలిస్తుంది.
krp
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి yasasvi గారి అభిప్రాయం:
07/03/2011 2:27 am
జయప్రభ గారు తన ” ప్రతికూలపవనాలు” పుస్తకంలో ” వాన ముచ్చట” అని ఒకటి రాసేరు. చాలా మందికి గాడంగా గుర్తుండిపోయిన వాన ముచ్చట అది. ఇలా మొదలౌతుంది
“ఒక్కసారిగా శూన్యంలో తూనీగలెగయగానే..మనసు చల్లబడ్డట్టుగా వస్తుంది వానజల్లు.
అదుకే కాబొలు ” ఆషాఢస్య ప్రధమ దివసే” అని అంటాడు కాళిదాసు. ఎంత పౌర్ణమిరోజైనా సరే..చుట్టూ వలయాకృతి గూటిలో చిక్కుకుని చంద్రకాంతి మసకబారిపోతుంది.దిగులుకమ్మినట్టుగా ఆకాశం నల్లటి మబ్బులతో మూసుకుపోతుది.పగటిలోకూడా బొత్తిగా సూరీడుని లెఖ్ఖచేయవు మేఘాల దొంతరలు. ఆ పొరలని దాటుకుని అతగాడు బయటపడేసరికి పొద్దు నడినెత్తికెక్కుతుంది.గుబులుగుబులుగా ఉండే మధ్యాఃహ్నమ్ వేళలో, ఎలాగైతేనేం..ఊరిచి..మురిపించి..హడావుడి చేసి మొత్తానికి రానే వస్తుంది వాన!
“ఝిల్ మిల్ సితారోంకా ఆంగన్ హోగా
రిమ్ ఝిమ్ బరస్ తా సావన్ హోగా…”
–అంటూ కలలుగనటం పడుచు హృదయాలకి ఎంత ఇస్టం! ఎన్నెన్ని రూపాల్లో వస్తుందో వాన !చిలకరింపులతో పలకరిస్తుంది. గాలి వెంబడి విసురుగా కొట్టుకుపోతూ “ఊహు నేనిక్కడ పడను సుమా” అని పక్క వీధి దాకా పరుగెడుతుంది.ఇంక కురవదేమో అనుకుని పనిమీద బయటకు నడిచి వీధి మలుపు తిరిగెసరికి వెంబడిచి వెంటతరిమి కుండలతో దిమ్మరిచినట్టు హొరున కురిసి నిలువునా తడిపేస్తుది.తడిచీర కాళ్ళకి చుట్టుకుపోయి అడుగు తడబడుతూంటే..తేటగా వెలిసి , వెళ్లిపోతుంది వాన !”
ఇలా సాగే ఈ వానముచ్చట మరొక 2 పేజీలదాకా సాగి అనేక విధాలైన వానని వర్ణిస్తుది. వానముచ్చటకి ముగింపుగా జయప్రభగారి వాక్యాలు ఇలాంటివి.
” వాన నేలకి ఆకాశపు నజరానా! వాన నింగీ నేలల తానాబానా”!! అంటూ ఆమె ముగిస్తుంది.
దమయంతి గారి వాన వర్ణన చదివేకా జయప్రభ గారు రాసిన “వానముచ్చట” గుర్తొచ్చి
ప్రస్తావన చేశాను. దమయంతిగారికి అభినందనలు.
యశస్వి.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి శివరామప్రసాద్ కప్పగంతు గారి అభిప్రాయం:
07/03/2011 1:04 am
ప్రశాంత్ గారూ,
మూడు మూడున్నర దశాబ్ధాల క్రితం వరకూ కూడా రికార్డ్ చెయ్యటం అనేది సామాన్యుడి చేతిలోలేదు. ఒక్క ఆకాశవాణి వారికే అది కుదిరే పని. ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గర స్పూల్ టేఫ్ రికార్డర్ లు ఉండి ఉంటే ;ఉండి ఉండవచ్చు. కాని వాళ్ళకు అభిరుచి కూడా ఉండాలికదా. ప్రస్తుతం సాంకేతిక అభివృధ్ది పుణ్యమా అని నాలాంటి సామాన్యులు కూడా స్వంతంగా రికార్డ్ చేసుకోగలుగుతున్నాము. ఈనాటి మహనీయులు వారి వారి గోంతులు, వీడియోలు ఎన్నెన్నో కలెక్షన్లలో తయారవుతున్నాయతంఎతోమది ఔత్సాహికులు ఎవరి పరిధిలో వారు ఈ కలెక్షన్లు తయారుచేసుకుని, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వారి వారి సేకరణను పరిపుష్టం చేసుకుటూనే ఉన్నారు.
నా బాధ ఒక్కటే అలనాడు ఆకాశవాణి అధికారులకి కొద్దిగా ముందు చూపు ఉండి వాళ్ళు తయారు చేసిన టేపులను భధ్రపరచి ఉండి ఉంటే, ఈ రోజున మనకు ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. అది జరుగలేదు. అదే బాధ.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి గారి అభిప్రాయం:
07/02/2011 7:39 pm
పాణి!
మీ అభిమానానికి చాలా చాలా థాంక్సండి. తప్పకుండా మంచి కధలు రాయడానికి కృషి చేస్తాను.
మోహన గారికి, నమస్తే.
వర్షాన్ని వసంతంగా ఎంత బాగా చెప్పారు! నేను తప్పకుండా మీ పద్యాలు చదువుతాను.
నా అక్షరాల వాన జల్లు నచ్చినందుకు మనఃపూర్వక కృతజ్ణ తలు తెలియజేసుకుంటూ-
ఆర్.దమయంతి.
కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా? గురించి k.Raja Sekhara Raju గారి అభిప్రాయం:
07/02/2011 4:24 pm
“ఇప్పుడున్న ఈ వివాహవ్యవస్థ గొప్ప మార్పులకు లోనయితేనే గానీ స్త్రీపురుషుల సమానత్వం సాధ్యం కాదు. ఇప్పుడు వారి మధ్యనుండే అసమానత కేవలం వ్యక్తిగతమైనది కాదు… సామాజికమైనది”
“ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్ళుగా పుడతారు”
”నేను పెద్దదాన్నయితే కొట్టే మొగుడ్ని చేసుకోను… పుణ్యం లేకపోతే పీడాపాయ… ఎవరు పడతారమ్మా ఈ తిట్లూ, దెబ్బలూనూ?”
“భారత నారీత్వం స్పెషల్ రబ్బరులాంటిది… ఎంతలాగినా తిరిగి యథాస్థితికి వచ్చి ఏమీ జరగనట్టుగా మసులుకుంటుంది. దాన్నే మనవాళ్ళు ఆకాశానికెత్తారు… ఇంకా ఎత్తుకున్నారు”
”రంకుతనాల గురించి రాద్ధాంతాలు చేస్తారెందుకూ? మగ వాళ్ళకు లేని పవిత్రత ఆడదానికెందుకు?… పురుషులకు నిజంగా పాతివ్రత్య విశ్వాసముంటే ఇతర భార్యలతోనూ, సానులతోనూ ఎందుకు పోతారు. చూడగా చూడగా నీతి అన్నది ఆడదాన్ని చిత్రహింస చేయడానికి మగాడు సృష్టించిన నరకంలాగ అన్పిస్తోంది”
”ఆడదానికి ప్రకృతి అన్యాయం చేసిందంటారు. కానీ అన్నిటికన్నా ఆడదానికి హెచ్చు అన్యాయం చేసింది వివాహవ్యవస్థ… వివాహవ్యవస్థ ననుసరించి వచ్చిన సామాజిక పరిణామాలన్నీ ఆడదానికి స్వేచ్ఛ లేకుండాచేశాయి.”
కొకు గారు రాసిన పై వ్యాక్యాలన్నీ భూమిక వెబ్సైట్లో ప్రతిమ గారు పేర్కొన్నవి. ఆయన పుస్తకాలు నాకు తక్షణ అందుబాటులో లేకపోవటం చేత భూమిక వ్యాసాన్నే ఆధారంగా తీసుకుంటున్నాను.
నా ఉద్దేశంలో “ఆధునిక మహిళలు భారత దేశ చరిత్రను తిరగరాస్తారు” అన్న గురజాడ భావన కంటే “ఈ సమాజంలో కొందరు తక్కువ కులాల్లో పుడతారు. మరి కొందరు ఆడవాళ్లుగా పుడతారు” అన్న కొకు భావనే మరింత ప్రాసంగికతను, విప్లవాత్మకతను కలిగి ఉంది. గురజాడను మించిన క్రాంతదర్శనం ఈ చిన్న వాక్యంలో కనబడుతుంది.
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసానికి వ్యాఖ్యానాలు రాసిన వ్యక్తుల జోలి నాకు అనవసరం కాని కొకు పరిమితుల గురించి, ఆయన సిద్ధాంత పరిమితుల గురించి ఈ వ్యాఖ్యానాలలో జోడించిన వారు కొకు రచనలలో కొన్నయినా నిజాయితీగా చదివారా అని నా సందేహం. ఎవరయినా దేన్నయినా విమర్శించవచ్చు.. కొత్త కళ్లతో పాత సిద్ధాంతాలుగా కనిపిస్తున్నవాటిని అంచనా వేయవచ్చు.. తప్పేమీ లేదు. కాని ఏ సిద్ధాంతం పట్ల అయినా పూర్వ నిర్ధారిత అభిప్రాయాల ప్రాతిపదికన గుడ్డిద్వేషం, సంపూర్ణ వ్యతిరేకత ప్రకటించడం ఆ సిద్ధాంతం గొప్పతనం మాటేమో కాని మన అల్పత్వం మాత్రం నడిబజారులో ప్రదర్సితమవటం ఖాయం.
“కొద్దిపాటి అభిప్రాయ ప్రకటనలు కాకుండా ఆయన సాహిత్య విశ్లేషణని వివరంగా చేయాల్సివుంది”
ఇది నూటికి నూరుపాళ్ళూ సత్యం.అందరూ ముందుగా ఈ పని చేసి తర్వాత మాట్లాడితే, రాస్తే బాగుంటుంది. ఇది మినహాయింపు లేకుండా మనందరికే వర్తించే సత్యం.
సన్మానానికి రెండు సీ.వీ.లు గురించి prashanth gundavarapu గారి అభిప్రాయం:
07/02/2011 3:06 pm
కధ పూర్తిగా ఎవరినో వెటకారమ్ చేయడమ్ కోసమ్ రాసినట్టు స్పsTaM అవుతూనే ఉంది. ఆ ఎవరన్నది ఎవరికి ఆసక్తిగా ఉంటె వాళ్ళకి స్పస్టమ్ కావొచ్చునేమో గానీ మిగిలిన వాళ్ళకి ఇటువంటి నెగెటివ్ రచన మీద ఏం ఆసక్తి ఉంటుందో ఇటువంటి రచనలని ఈమాట ఏమి ఆసించి ప్రచురించిందో నాలాంటి వారికి మాత్రం అర్ధం కాలేదు. పైగా రాసినవారికి లింగ భేదం అన్నా స్పస్టపడని ఒక డొంక పేరుని పెట్టుకోవడమ్ లోనే కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది ..ఇది ఉడుకుమోతు రచన అని. ఇందువల్ల ఆ స్త్రీవాద రచయిత్రికి జరిగే నస్టం ఏమన్నా ఉందో లేదో నాకైతే తెలీదు గానీ స్త్రీల రచనలమీద మారుపేరు పెట్టుకుని వెక్కిరించేటంతటి పిరికితనమూ భయమూ ఇది రాసినవారిలో ఉన్నట్టుగా మాత్రం స్పస్టపడుతున్నది.
చరిత్రలు చెప్పుకునే ఘనతలు ఎప్పుడూ మగవారి స్వంతమే అయి ఉండాలి తప్ప ఎంత సాధించినా స్త్రీలకి మాత్రమ్ ఆ హక్కు లేనట్టు ఈ రచన చేసిన వారి భావన కావొచ్చు. పొరపాటున కూడ స్త్రీలు వారి రచనల నేపధ్య వివరణ చెస్తే,.. దాన్నితిరిగీ స్త్రీలపేరుతోనే అపహాస్యమ్ చేయించే ఒక అలవాటూ ..అలాగే ఒక అహంకార ధోరణి ఈ రచనలో బాగా కన్పిస్తోంది. ఇది ప్రచురించడమ్ “ఈమాట” యొక్క వ్యక్తిత్వాన్ని కూడా మరింతగా ప్రస్పుటం చేస్తోంది. ఎగతాళి చేయడమే లక్ష్యమ్ గా సాగిన ధోరణి ఇది. అది తెలిసిపోవడమే ఈ రచనలోని బలహీనత. కాగా… పాపం ఈ ” అనానిమస్సు” ఇలా తుస్సు.
ప్రశాంత్