క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు.
Category Archive: సంచికలు
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు.
జీవితప్రతిబింబమే కావ్యమని విశ్వసించి, తాదాత్మ్యభావంతో తనచుట్టూ ఉన్నవారి అనుభవపరంపరను పరిశీలించి, సారవిచారం చేసి, కవిత్వాన్ని ఉపదేశాత్మకంగా దిద్దితీర్చిన మహాకవి క్షేమేంద్రుడు. కాశ్మీరదేశంలో ధర్మవృక్షానికి చీడ […]
‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న విమర్శగ్రంథాన్ని 1983లో ప్రకటించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఈ కళావిలాస కావ్యకర్తృత్వం విషయాన్ని కూడా చర్చించి, ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, […]
కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు గాక బద్దె భూపాలుడు కావచ్చునా? ఇదొక సరికొత్త సమస్య. కళావిలాసము నన్నెచోడుని రచనమే గాని, ఆ నన్నెచోడుడు సుప్రసిద్ధమైన కుమారసంభవ […]
నన్నెచోడుని కళావిలాసము లభింపకపోయినప్పటికీ, అందులోని పద్యాలు – 1) కవిసంజీవని, 2) రత్నాకరము, 3) అథర్వణచ్ఛందము, 4) గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణి అన్న నాలుగు […]
సంగీతం, గానం: నచికేత యక్కుండి
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.
రాగం: శుభపంతు వరాళి
తాళం: మిశ్ర చాపు
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
ఆయన ప్రఖ్యాత రచన ‘శివతాండవా’న్ని ఆయనే గానం చేశారు. ఈ రచనని చాలా మంది చాలా రీతుల్లో ప్రదర్శించ ప్రయత్నించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది 1993లో నాగపద్మినిగారు ‘శివతాండవాన్ని’ రేడియో ప్రసారణ కోసం చేసిన అనుసరణ.
మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో … ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి. కానీ మీకు ఇక్కడ వినిపించబోయే జ్ఞాపకాలు వారి శతజయంతి సందర్భంలో నా నివాళి.
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఈమాట నవంబర్ 2013 సంచికలో ప్రచురించిన ఏల్చూరి మురళీధరరావు సాహిత్యవ్యాసం పైన పాఠకులు ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సంచికలో ఆ వ్యాసానికి ప్రతిగా తమ విమర్శలను వ్యాస రూపంలో జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. ఇలా సాహిత్య వ్యాసాలపై స్పందనలు, ప్రతిస్పందనలు సామరస్యంగా తెలుపుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. ముందు ముందు ఇలాంటి సాహిత్య చర్చలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంచికలో కొత్త రచయితలు ఈమాటను తమ రచనలకు వేదికగా చేసుకొనడం చూస్తుంటే ఈమాట మరింతగా ఎదుగుతోందని మాకు నమ్మకం కలుగుతోంది. నాకు నచ్చిన పద్యం, పలుకుబడి లాంటి శీర్షికలు, సాహిత్య పరిశోధనాత్మక వ్యాసాలు, ఆడియోలు ఈమాటకు వన్నె తెస్తున్నాయి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, అందిస్తున్న ప్రోత్సాహాలతో ఈ సాహితీప్రయాణం ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తున్నాం.
ఈ సంచికలో: మానస, భగవంతం, ఇంద్రాణి, కనకప్రసాద్, హెచ్చార్కె, నారాయణ, దేశికాచారి, ప్రసూన, భాస్కర్, అట్లూరి ప్రసాద్, తఃతః, బివివి ప్రసాద్ల కవితలు; మూలా సుబ్రహ్మణ్యం, బులుసు సుబ్రహ్మణ్యం, దమయంతి, సాయి పద్మ, ఆర్. శర్మల కథలు; సాయి బ్రహ్మానందం, మోహన రావు, శ్రీనివాస్, తలిశెట్టి రామారావుల వ్యాసాలు; కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం; సురేశ్ పలుకుబడి; శబ్దతరంగాలలో సాలూరి జనరంజని, చెలియలికట్ట రేడియో నాటిక. …
మారిపోతున్న సాహిత్య సామాజిక పరిస్థితులు, సాంకేతిక అవసరాల వల్ల, ఈమాటలో కూడా కొన్ని మార్పులు తప్పనిసరి అవుతున్నాయి. ఈమాట రచయితలకు, పాఠకులకు వీలైనంత వరకూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఈ మార్పులని ప్రవేశపెట్టటానికి ప్రయత్నిస్తున్నాం. ఈమాట నిర్వహణలో మేము తరచూ తీసుకొనే నిర్ణయాలు కూడా ఇందులో భాగమే. ఇకనుంచీ ఈమాట పద్ధతులు, నియమాలలో కొన్ని మార్పులను మీ దృష్టికి తెస్తున్నాం.
అతను టార్చి వేశాడు. ఆ సన్నని కాంతిపుంజం ఆ దట్టమైన చీకట్లో ఒక వెలుగు సొరంగం తవ్వుతున్నట్టుగా వ్యాపించింది. గడ్డి మధ్యలో చిన్న కాలిబాట. చుట్టూ కీచురాళ్ళ అరుపులు వినిపిస్తున్నాయి. చీకటి, నిశ్శబ్దం ఇంత దట్టంగా కూడా ఉంటాయని తెలుస్తోంది. ఆ చీకట్లో ఒక మనిషి దీపం పట్టుకుని ముందు నడుస్తుంటే అతణ్ణి అనుసరించడం కొత్తగా ఉంది. మరో ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా అనిపించింది.
క్లిక్ మని శబ్దంతో డిస్కనెక్ట్ చేసిన టోన్ వచ్చింది. గౌతమ్కి పిచ్చి పట్టినట్టుగా అయింది. ఒక్కసారి గడియారాలన్నీ కదలటం మొదలెట్టాయి. కేవలం శబ్దమే. సమయం కదలటం లేదు. వెన్నులో చలి పుట్టటం అంటే ఏమిటో మొదటి సారి అనుభవం లోకి వచ్చింది. అన్ని గడియారాల కదలిక గుండెల్లో దడ పుట్టించేదిగా అనిపించింది.
ఇద్దరమూ కలిసి ఈ బంధాన్ని ‘మన అంతరంగాల సాక్షిగా అంగీకరించుకుని’ వున్నామేమో? అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు నువ్వు, ఇంకో అప్పుడు నేను, సర్దుకున్నాం. పెళ్ళైన కొత్తల్లో నువ్వెంత అంటే నువ్వెంత వరకూ వెళ్ళినా, ఏదో జంకు, ఇంకొంచెం బెరకు, మనల్ని ఈ గీటు దాటనీకుండా ఆపింది. అరి కట్టింది.
నేను విత్తనాలు నాటి ఇప్పటికి పదేళ్ళయింది. ఉదయం తొమ్మిది గంటలకి నేను, తెల్ల పొడుగు చేతుల చొక్కా వేసుకొని, చొక్కా మీద తెల్ల గ్లాస్కో పంచె ధరించి, నల్ల బెల్టుతో పంచె బిగించి, వంకాయ రంగు కోటు ధరించి, తెల్ల తలపాగా కట్టుకొని, నా ఆఫీసులో అడుగు పెట్టాను. నాకు భారతీయ సంస్కృతి అన్ననూ అందులో తెలుగు సంస్కృతి యన్ననూ మిక్కిలి మక్కువ.
పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్ కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్కి గుర్తు లేదు.
ఆమె ముఖపద్మం వాడిపోయింది. తెల్లని నిడుదైన కన్నులు చిన్నబోయి ఉన్నాయి. చెలులతో చేరి ఆమె సరసులోకి దిగి ఆడటం లేదు. ఒక చేయి నుదుటన పెట్టుకుని అలా ఒడ్డునే కూర్చొని ఉంది. నెచ్చెలులు తనని ఆడడానికి రమ్మని పిలుస్తున్నారు. వాళ్ళకి రెండో చేత్తో, ఒంటి చేత్తోనే, నమస్కారం పెట్టి, దయచేసి మీ దోవన మీరు ఆడుకోండని చెపుతోంది. నలుదిక్కులా పరికిస్తోంది. ఏమిటి చూస్తోంది? ఏమీ లేదు! అది ‘చూడక చూచు చూడ్కి.’ వట్టి చూపులన్న మాట.