నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూవుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!
Category Archive: అనువాదాలు
మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.
వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.
ఏదో పెద్ద ఆఫీసర్ లాగ స్కూలుకు తనకి ఇష్టం ఉంటే వస్తుంది. అలా వచ్చినప్పుడైనా స్టూడెంట్ లాగా వస్తోందా? ఛ!ఛ! నా నోటితో ఎలా చెప్పను? సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట?
శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు.
ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ.
చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.
చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.
సాంప్రదాయ వాదాన్ని ఎదురించే ఆధునిక కవులు, వ్యాసకర్తలు ఇతిహాసాలను పుక్కిటి పురాణాలుగానే భావిస్తారు, ఆ అభిప్రాయాన్నే బలంగా వినిపిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏనుగు, మొసలి మధ్య పోరాటం, సమాజంలోని పీడితుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు, పాలక వర్గం ప్రచారం చేసే ఒక అబద్ధంగా శ్రీశ్రీ వాదించాడు.
ఆయన పాఠకులకు భాగవత పురాణం ఒక కట్టు కథ మాత్రమే. కానీ సాంప్రదాయ హిందువుల దృష్టిలో గజేంద్ర మోక్షం నిజంగా జరిగిన సంఘటన. వారికందులో ఏ సంశయము లేదు. ఒక ఇతిహాసపు స్థాయి, అది ఎంత నిజం అనే నమ్మకం పైన ఆధారపడి ఉందని ఇక్కడ గ్రహించవలసిన సంగతి.
అన్నమయ్య రాసిన 32వేల కీర్తనల రాగిరేకులు తిరుపతి దేవాలయంలోని ఒక చీకటి కొట్లో పడి ఉన్న సంగతి 70 ఏళ్ళకు పూర్వం ఎవరికీ తెలియదనీ, వేటూరి ప్రభాకర శాస్త్రి గారో, ఇంకొకరో అయాచితంగా ఈ రాగిరేకులను కనుగొన్నారని, తద్వారా ఈ భాండారాన్ని వెలికితీశారని ఒక కట్టుకథ బహుళ ప్రచారంలో ఉంది. ఈ కథ దాదాపు అన్నమయ్య గురించి రాసిన చాలా పుస్తకాలలో ఉటంకించడం కనిపిస్తుంది.
దాదాపు ఇటువంటి కథే చాలా సాహితీ గ్రంథాల విషయంలో చెప్పుకునే సంప్రదాయం దక్షిణ భారతంలో ఉంది. గొప్ప సాహితీ సంపద ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోవడం, దానిని అనుకోకుండా ఒక పండితుడు కనుక్కోవడం ఈ కథలన్నింటిలోనూ కనబడే సాధారణ అంశం.
ఆధునిక చరిత్రకారులు నాయకరాజ్యాల సంగతి పట్టించుకోలేదు. గత రెండు దశాబ్దాలలో భారత చరిత్ర రాసిన వారు 1565 నుంచి, 1761 వరకు ఉన్న కాలాన్ని దక్షిణభారత చరిత్రలో ఒక అంధకారయుగంలా పరిగణించారు. ఈమధ్యనే ఈ అలక్ష్యానికి బదులుగా నాయకులు, వారి కాలమంటే ఒక కొత్త ఆసక్తి కనబడుతున్నది.
ఈ పుస్తకంలో విశదీకరించినట్టుగా, నాయకరాజులు దక్షిణ భారతీయ సమాజపు భావనలోనూ, సంస్థాగత నిర్మాణంలోనూ మౌలికమైన పెద్ద మార్పుకు సాక్షులు గానూ, కొంతలో కొంతవరకూ కారణభూతులుగానూ ఉన్నారని మా వాదం.
ఈ పద్యాలలో విష్ణువుపైన పద్యాలు ఉన్నాయి, శివుడిపైన ఉన్నాయి, బుద్ధుడిపైన ఉన్నాయి. శాతవాహన సామ్రాజ్యములోని మత సామరస్యమును ఇవి తెలుపుతుంది. ఇందులో సుభాషితములు ఉన్నాయి. సంభోగ శృంగారము, విప్రలంభ శృంగారము రెండు ఉన్నాయి.
ఈ పులి వేటకన్నీ కలిసొచ్చాయి. ముందస్తుగా మిసెస్ పేకిల్టైడ్ తనకి పులిని చూపెట్టిన వారికి వెయ్యి రూపాయిల బహుమతి ప్రకటించింది. అదృష్టవశాత్తూ పక్కనే వున్న ఒక వూళ్ళో పెద్ద పులి తిరుగుతోందనీ, చాలా మేలు జాతి పులి అనీ, కొడితే అలాటి పులినే కొట్టాలనీ వదంతులు వినొచ్చాయి.
“ఎదిగిన కొడుకును కొట్టలేను. అందుకే నా భార్యను కొట్టాను. ఇదిగో చూడవే! ఈ పెళ్ళి జరగదు. కాదు కూడదు అని నా ఇష్టం లేకుండా జరిపించావంటే, ఆ తర్వాత నీవు నాతో కాపురం చేయడం కుదరదు. భర్త ప్రక్కన నిలబడితేనే ఆ భార్యకి గౌరవం. అర్థం అయ్యిందా?” విసవిసా వెళ్ళి పోయాడు గురుమూర్తి.
జీబ్రా క్రాసింగ్ వద్ద ఆగి లేదా కనీసం నెమ్మదిగా నడిపి పాదచారులను రోడ్డు దాటనివ్వాలనేది డ్రైవర్లు పాటించాల్సిన కనీస మర్యాద! కానీ ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. లెఖ్ఖ లేకుండా దూసుకు పోతున్నారు. వారికి అవసరం ఏముంది? అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, నియంత్రించడానికి ట్రాఫిక్ పోలీసులూ లేరు.
గూగోళ జ్ఞానం – మన అనుభవాలను గుర్తుంచుకోవడం కోసం భాషలను పుట్టించుకొని, వ్రాయటం నేర్చుకొని సమాచారాన్ని పెంచుకోవడం పంచుకోవడమే మన లక్ష్యంగా, సమాచారమే మన ఉనికికి ప్రమాణంగా చేసుకున్నాం. సమాచార జీవితం యదార్థం గానూ, యదార్థ జీవితం సమాచారంగా మారడానికి పనికొచ్చే జ్ఞాపకంగా మాత్రమే మనం బ్రతుకుతున్నాం.
తిరగబడ్డ తొమ్మిది – ఇప్పుడీ సంగతి నాకు కాక నీకొక్కడికే తెలుసు. ఇంకెవరికీ చెప్పకు! నువ్వు మర్చిపోకు! నువ్విందాక అన్నావే కంప్యూటర్లు, సూపర్ కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ బుర్రలు, వాటిని నడిపే మేధావులందర్నీ వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని లెక్కలేసుకోమను. కానీ ఇప్పుడు అర్థమయిందా మన లెక్కలన్నీ శుద్ధ తప్పని?
రాజీ! నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని చీర మార్చుకుని రా. మన ప్లాను ప్రకారం సినిమాకి వెళ్తున్నాం. ఈ ఉంగరం సంగతి పూర్తిగా మర్చిపో. కాసేపట్లోనే ఉన్నట్లుండి కలగన్నట్లు ఎక్కడ పెట్టావో జ్ఞాపకం వస్తుంది. పోగొట్టుకున్న వస్తువును కని పెట్టడానికి ఇది ఒక దారి.
చరిత్రకారులు నవలారచయితల దగ్గరనుంచీ నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది. ఒక సాధారణ పాఠకుడు చరిత్రని తెలుసుకోవడానికి ఏ కెన్నెత్ రాబర్ట్ నవలనో, మార్గరేట్ మిచెల్ నవలనో దొరకబుచ్చుకుంటాడు గాని, ఫలానా చారిత్రకుడు ఏం రాశాడు, ఫలానా పండితుడు ఏమన్నాడు అని వెతకడు కదా? ఎందుకని అని ప్రశ్నించుకుంటే?
స్టాప్! స్టాప్! ఆల్ట్-కంట్రోల్-ఎఫ్8! ప్రోగ్రాం ఆపాలి. ఇంతకు ముందు ఇన్పుట్ చేసిన నియమం – పీక పిసికించుకున్న వ్యక్తికి కత్తిపోటు అనవసరం – మార్చాలి. కంప్యూటర్ పాత మెమరీని తుడిచేసుకొని సున్నాలూ ఒకట్లను కొత్త కొత్త వరసల్లో నిలబెట్టుకుంటోంది. నాకు సన్నగా చెమట పడుతోంది.
ఆ కిటికీ గుండానే మూడేళ్ళ క్రితం ఒకరోజు మా చిన్నాన్న, ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, బయటికెళ్ళారు, వేట కోసం. వాళ్ళిక మరి తిరిగి రాలేదు. బయట అడవుల్లో మంచులో, వానలో చిక్కుకు పోయారు. ఆ సంవత్సరం కనీ వినీ ఎరగని వర్షాలు పడి బయట నేలంతా చిత్తడిగా అయింది. ఏ ఊబిలోనో చిక్కుకొని వుంటారు, వాళ్ళ శవాలు కూడా దొరకలేదు.
గోపాలన్ మా ఆఫీసుకి బ్రాంచ్ మేనేజర్. చాలా కఠినమైన వ్యక్తి. జీవితంలో ఒక్కొక్క మెట్టుగా ఎక్కి వచ్చిన మనిషి. అందువల్ల అందరూ అలాగే రావాలని అనుకునే వ్యక్తి. ప్రొద్దున్న తొమ్మిది గంటలకి ఆఫీసుకి వస్తే సాయంత్రం ఐదు గంటల దాకా వేరే ఆలోచనలు లేకుండా అన్నిటినీ మూటకట్టి పెట్టి ఆయనతో సమంగా పరుగెత్తాలి.