“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.
Category Archive: అనువాదాలు
“నేనొచ్చిన సంగతి తెలిసి అమ్మ ఒక్క గెంతుతో కిందకి దిగింది. అందరూ నన్ను ముట్టుకోడానికి పోటీలు పడ్డారు. దెయ్యాన్ని కాదని నిశ్చయించుకోడానికి కాబోలు! నా మీద పడి అంతా ముద్దులు కురిపించేసరికి ఊపిరాడలేదంటే నమ్ము! అది సరే కానీ, ఈ కుక్క పిల్లకెంత దాహమో చూడు! అసలు దీంతో పాటు ఒక నీళ్ళ టాంకరు తెచ్చుకోవాల్సింది మనం. ఈ ఎండలకిది ఇద్దరు మనుషుల నీళ్ళు తాగుతుంది.”
మరణ శిక్ష అంటే ఎవరో ఒకరు కత్తితో నేరస్తుణ్ణి నరకాలి. లేకపోతే ఉరి తీయాలి. అయితే ఎప్పట్నుంచో మొనాకోలో అసలు హత్యలూ నేరాలు లేవు కనక ఉరితీసే తలారీ ఎక్కడా లేడు దేశంలో. జూద గృహాల్ని మాత్రమే చూడ్డం అలవాటైపోయిన సైన్యంలో ఏ ఒక్కడూ దీన్ని తలకెత్తుకోవడానికి ముందుకి రాలేదు. నేరస్తుణ్ణి వదిలేస్తే దీన్ని చూసుకుని మరో హత్యా కలహాలు మొదలౌతాయ్. సరే తలారిని వెదికే లోపుల వీణ్ణి జైల్లో ఉంచుదాం అని తీర్మానం అయింది. మరి జైలే లేదు మొనాకోలో.
“దేవుడి ప్రమాణంగా నాకేమీ తెలియదు, నేను కాదు హత్య చేసింది” అని చెప్పేడు ఆక్సినోవ్ కానీ గొంతుకలోంచి మాట రావడం కష్టమౌతోంది, ఎప్పుడూ చూడని కష్టం ఎదురయ్యేసరికి. పోలీసులకు నమ్మబుద్ధి వేయలేదు ఈ సమాధానాలన్నీ. పెడరెక్కలు విరిచి కట్టి తీసుకెళ్ళిదగ్గిర్లో ఉన్న జైల్లో పెట్టేరు. మొత్తానికి తోటి ప్రయాణీకుణ్ణి హత్య చేసినందుకూ, అతని దగ్గిర్నుంచి ఇరవైవేల రూబుళ్ళు కొట్టేసినందుకూ పోలీసులు ఆక్సినోవ్ మీద కేసు తెచ్చారు.
అప్పుడు తలుపు తట్టింది అదృష్టం. అక్కడున్న వాళ్ళు మనిషికొక పాతిక ఎకరాలు ఇస్తారుట, కుటుంబానికి పాతిక కాదు. పాహోం ఎగిరి గంతేసేడు. అలా పాహోంకి వచ్చింది నూట పాతిక ఎకరాలు! తనకి మునుపున్న ఇరవై ఎకరాలు ఇప్పుడు చిన్న నాటుమడి కింద లెక్క! అన్నీ వదులుకుని వచ్చినవాడికి నూట పాతిక ఎకరాలు ఉత్తినే వస్తూంటే చేదా? అవి ముక్కలైతేనేం? పాహోం మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టేడు. వోల్గా నది నీళ్ళో మరేమో కానీ పాహోం పట్టిందల్లా బంగారమైంది పొలాల్లో.
“మీరు జ్ఞాన సంపన్నులని ఊళ్ళో వాళ్ళు చెప్తూంటే విని నాకున్న మూడు సందేహాలు మిమ్మల్ని అడుగుదామని వచ్చాను. ఏ పని చేయడానికైనా సరైన సమయం ఏదో తెలుసుకోవడం ఎలా? నాకు కావాల్సిన ముఖ్యమైన మనుషులెవరో గుర్తించడం ఎలా? నాకున్న పనుల్లో అతి ముఖ్యమైన పని ఏది? ఇవే నా ప్రశ్నలు. వీటిని ఎంతమందినో అడిగాను కానీ ఎవరూ సరిగ్గా సమాధానం చెప్పలేకపోయేరు. కొంతమంది చెప్పినా అవి నాకు నచ్చలేదు.”
ఎక్కడా ఆగకుండా సూర్యుడు పైకొచ్చేదాకా నడిచాక ఏలీషా ఒక చెట్టు కింద కూర్చుని సంచీ బయటకి తీసేడు. ఉన్న డబ్బులు లెక్కపెడితే పదిహేడు రూబుళ్ళ ఇరవై కొపెక్కులు మిగిలాయి. కూర్చున్న చోటునుంచి ఒకవైపు, జీవితాంతం వెళ్దామనుకున్న జెరూసలం రా రమ్మని పిలుస్తోంది. ఏలీషా ఆలోచనలు పరివిధాలా పోయేయి. చేతిలో డబ్బులు చూస్తే వీటితో జెరూసలం వరకూ వెళ్ళగలడం అసంభవం.
సాములూ సాములూ
గవర్మింట్టు సాములూ
సాలెగూడు తెంపేదానికి
చీటీ తీసుకొచ్చినేరా?
చీమని నలిపేదానికి
జీపెక్కొచ్చినేరా?
ఆరుగెజాలిల్లు కూలగొట్టను
ఆర్డరు తీసుకొచ్చినేరా?
సరంగు ఈ లంకలో ఆగడం ఎంత ప్రమాదమో, ఎందుకు వద్దో అన్నీ పాస్టర్కి చెప్పి ఆయన్ని అక్కడకి వెళ్ళకుండా ఆపుదామని చూశాడు కాని పాస్టర్ మంకుపట్టూ, ఆయన పాస్టర్ అనే గౌరవం వల్లా ఏదీ కుదర్లేదు. ఓ అరగంటలో చకచకా పడవ దింపడం, పాస్టర్ గారూ ఇంకో ఇద్దరు పడవ నడిపే బెస్తవాళ్ళూ దిగడం అయింది.
కాని ఆ రాత్రి ఫైరింగ్ ఆగనే లేదు. రాత్రంతా ఎదురుకాల్పులు కొనసాగుతునే ఉన్నాయి. మధ్య మధ్యలో రెండు వైపుల నుంచి బాంబుల వర్షం కురుస్తోంది. ఆ రాత్రి ఎవరికీ కంటి మీద కునుకు లేదు. చెవులు పగిలిపోతాయా అనిపించేంత చప్పుళ్ళు. మేము, కుల్జీత్ మామ కుటుంబం రాత్రంతా ఆ కందకంలోనే దాక్కుని ఉన్నాం.
పని ఉన్నప్పుడు ఎక్కడా ఆపకుండా పనిచేయడం, పనిలేనప్పుడు మౌనంగా ఆకాశం కేసి చూడడం, ఇవే మైకేల్ నిత్య కృత్యాలు. మొదటిసారి ఇంటికి తీసుకొచ్చినప్పుడు, మాట్రియోనా సైమన్తో అసహ్యంగా దెబ్బలాడి, తర్వాత మనసు మార్చుకుని మైకేల్ కి భోజనం పెట్టినప్పుడు మైకేల్ చిన్నగా నవ్వడం తప్ప, ఆ తర్వాతెప్పుడూ మైకేల్ని నవ్వు మొహంతో చూసినట్టూ సైమన్కి గుర్తు లేదు.
కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క
కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.
తను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, వారానికోసారి శని వారం రోజు ఇంగ్లీషు సినిమా చూడటం అలవాటు అట. మా అన్నయ్య సినిమాకి వెళ్ళనే వెళ్ళడు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో వెళ్ళినా ఏ చిరంజీవి సినిమాకో వెళ్తాడు. అందు వల్ల నేను, మా వదిన కలిసి కొన్ని సార్లు శని వారాలు ఇంగ్లీషు సినిమాకి వెళ్ళడం అలవాటయ్యింది.
నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూవుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!
మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.
వలస పాలన సమయంలొ రచించినప్పటికీ, ఫకీర్ మోహన్ సేనాపతి నవల ఛ మన అఠ గుంట అన్యాపదేశ ప్రస్తావనల ద్వారా, వ్యంగ్యం ద్వారా ఆనాటి భారతీయ సమాజాన్ని, సంస్కృతిని, విశ్లేషణాపూరితంగా వర్ణిస్తుంది. అందువలన, ఫకీర్ మోహన్ సేనాపతి వాస్తవిక ధోరణిలో వ్రాసినప్పటికీ ఆయనను ఒక ఉత్తరాధునిక రచయితగా కూడా చూడవచ్చును.
ఏదో పెద్ద ఆఫీసర్ లాగ స్కూలుకు తనకి ఇష్టం ఉంటే వస్తుంది. అలా వచ్చినప్పుడైనా స్టూడెంట్ లాగా వస్తోందా? ఛ!ఛ! నా నోటితో ఎలా చెప్పను? సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట?
శైలీలక్షణం అనేది కేవలం పదాలు, వాక్యాల అర్థం తెలుసుకున్నంత మాత్రాన బోధపడదు. ఒక రచనని పుట్టించిన సాహిత్య సంప్రదాయంతో సహజమైన సంబంధం ఉన్నప్పుడే ఇది సాధ్యం. అలా అని, ఇది అర్థం చేసుకోలేని అమూర్త భావన కాదు.
ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ కుమార రాముని కథ. ఈ కథ ఎప్పటిదో మనకు తెలియదు. ఈ కథ కుమార రాముడనే వీరుడు, అతన్ని ముమ్మూర్తులా పోలివున్న పోలిక రాముడనే అతని సోదరుడి, పరాక్రమాల గురించిన కథ.
చరిత్రకారులు కొన్ని కొన్నిసార్లు అబద్ధాలు ఆడుతునే ఉంటారు. కాని ఆ అబద్ధాలు చెప్పే పద్ధతిలో తేడా వుంటుంది. మేము పదే పదే ప్రస్తావిస్తున్నట్టు, జాగ్రత్తగా అంచనా వేసి నిర్ధారించవలసిన అంశాలకు ఆస్కారమిచ్చే కొన్ని వ్యక్తావ్యక్త నియమాలు చరిత్ర రచనలో ఉంటాయి. చరిత్ర గూర్చి తాను చేసే వ్యాఖ్యానానికి పూర్తిగా బద్ధుడై ఉంటాడు చరిత్రకారుడు.
చరిత్రకారుడు చెప్పే సత్యం, చారిత్రక సత్యాల (కనీసం చారిత్రక వాస్తవాల) పూర్ణ స్వరూపం ఎప్పుడూ కాదు. అయితే, తానెనున్నుకున్న రచనాస్వరూప నియమాల పరిధిలో, ఆ సత్యం యుక్తియుక్తము సమగ్రమూ అయి ఉంటుంది.