“నువ్వు ఏమిటి తింటున్నావో చెప్పు, నువ్వు ఎవరివో చెబుతాను” అనే జనవాక్యం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు అని మనలో చాలామంది నమ్ముతాం.

షేక్స్పియర్ కన్నా బేకన్ ఆధునికుడు; బేకన్‌కి స్పష్టమైన చారిత్రక అవగాహన ఉంది; షేక్స్పియర్‌కి అది బొత్తిగా లేదు. పదిహేడో శతాబ్దంతో శాస్త్రీయ యుగం మొదలయిందని గ్రహించిన బేకన్, అరిస్టాటిల్ తాత్త్వికతని పూజించడానికి బదులు ప్రకృతిపై ప్రత్యక్షమైన పరిశోధనలు జరగాలని కోరాడు

భారతదేశంలో అసలు మతం ఉందా? ఈ ప్రశ్న ప్రధానంగా పాశ్చాత్య వలసవాద తాత్వికుల నుండి ఉద్భవించింది. భారతదేశానికి చరిత్ర, న్యాయం, చట్టం వంటి భావనలు ఉన్నాయా అని ప్రశ్నించిన క్రమంలోనే భారతీయులకు మతం ఉందా అనే ప్రశ్న మొదలైంది. అసలు భారతీయులు అంటూ ఉన్నారా, వారిని ఎలా నిర్వచించాలి అనే ప్రశ్న కూడా దీని అంతర్భాగమే.

రామారావు గారు ఒక పుష్కర కాలంలో భూనభోంతరాలు నిండిపోయేలా అనువాదాలు చేశారు – ఒకటా రెండా? తెలుగులోకి రాని భాష లేదు, ప్రాంతం లేదు, కేవలం అనువాదాలే లేదు – కవుల చుట్టూ, కవితల చుట్టూ ఉన్న భోగట్టాను పట్టుకొచ్చారు.

ప్రవాసంలో ఉండటం అనేది ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులు ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన వాస్తవికత. వారి హృదయాలు మాతృభూమి కోసం తహతహలాడుతున్న సమయంలో, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలనే వారంతా కోరుకుంటున్నారు. కానీ అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు.

కవిత్వసౌందర్యం గురించి ఎవరు ఎన్ని చెప్పినా, చెప్పడానికి ప్రయత్నించినా అది భాస్కరశతకకారుడు చెప్పినట్టు చేతి పాత్రతో నదీ ప్రవాహంలో నీటిని పట్టుకోవడం లాంటిది. పంచతంత్రంలో గుడ్డివాళ్ళు ఏనుగును నిర్వచించడంలాంటిది.

ఆ తరళ ఘనసౌందర్యపాత మడరి
తనను ముంచెత్త నిలువెల్ల తడిసి తడిసి
గొంతు తడియార, తడినిండ నంతరమున
మాట పెకలించె నెదనించి మౌనివరుడు.

కళ్లెదురుగానే వున్నా,
కొన్నిసార్లు ఊహించుకుంటాను నిన్ను.
నా ముందున్నప్పటికంటే మిక్కిలి సంతోషంగా వున్నట్టు.

ప్రతి పాత్ర రూపుఁ జూపునుఁ
బ్రతి మాటయుఁ బ్రతి తలపునుఁ బ్రతి కదలికయున్
బ్రతి నవ్వునుఁ బ్రతి యూరుపు
నతనికి సాక్షాత్కరించి యక్షర మయ్యెన్

నీరెండవేళ తేయాకు తోటలో రికామీగా తిరిగినట్టు,
సౌందర్యవతి ముఖాన్ని చంద్రోదయానికి అర్పించినట్టు,
చేప గగనాన్ని పలకరించి నదిలో మునిగినట్టు,
భూమి సారం పూలరేకుల్లా విప్పారి

గాయపడ్డ మాటలన్నింటినీ దాచుకుని
రెండు దోసిళ్ళలో నింపుకుని
మహానిశ్శబ్దాన్ని నిర్మించుకున్నాను

శాంతి మంత్రమేదో దొరికేంతలో
మళ్ళీ నువ్వు…

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.

‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు.

ఇవేం ఆలోచించలేదు. చేతిలోవన్నీ పడేసి నేను కూడా పడిపోయాను. ఒక ఐదు నిమిషాలు ఎదురుగా కనిపిస్తున్న కేదార పర్వత సమూహాన్ని, ఎండలో మెరుస్తున్న ఆ అద్భుతాన్ని… అక్కడక్కడ మంచుతో మాసిపోయి కనిపిస్తున్న ఆ దృశ్యాన్ని కన్నార్పకుండా చూస్తూ, చారబడితే ఎంత ఉపశమనం!

పురుగులూ పిట్టలూ ఆకులూ బస్సులూ మనుషులూ అన్నిటినీ- అలవాటైపోయిన కళ్ళు రసహీనంగా చూపించే ఈ రోజువారీ ప్రపంచాన్ని- మళ్ళీ కొత్తగా పరికించి చూడటం. ఆ సౌందర్య స్పృహతో, అది అందించిన సంతోషంతో తబ్బిబ్బవడం. ఈ “బంగారు తండ్రి” అట్లాంటి పొంగుని మళ్ళీ మన లోగిళ్ళలోకి తెచ్చే ముచ్చటైన పొత్తం.

చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివారు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో. మైదానం నవల ఆకర్షణ అంతటిది.

ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.

‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు.

చుట్టూ ఉన్న అశాంతినీ, విధ్వంసాన్నీ, బాధనూ చూపిస్తూనే వాటినుండి ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలని కలలు కంటాడు. వాక్య నిర్మాణం, నేపథ్య చిత్రన చాలా అందంగా కవిత్వంలా ఉంది. దాదాపు అన్ని కథల్లో చిన్న కథలు, ఫ్లాష్ బ్యాక్ కథలున్నాయి‌. అసలు కథకంటే అవి ఓ మెట్టు పైనే ఉన్నాయి. కొన్ని కథలు చదివినప్పుడు పక్కనే కూచుని ఎవరో కథ చెప్తున్నట్టే అనిపిస్తుంది. ఆ కథ చెప్పే ఒడుపు, దానికి అమరిన శైలి, జారిపోనీయకుండా పొదివిపట్టుకున్న ఆశావహమైన కలల వెలుగు, ఈ పుస్తకపు బలాలు.

సుమారు అన్ని కథల్లో జానపద గాథల సరళి, చిన్నపిల్లల ఊహల వైఖరి దర్శనమిస్తాయి. పిల్లలనూ పెద్దలనూ సమానంగా అలరించే కథలు ఇవి. అనువాదం అంత పరిపూర్ణంగా లేకపోయినా కథల బలం కారణంగా అంతగా అది ఇబ్బందిని కలిగించదు. బాలసాహిత్యాన్ని రాస్తున్న తెలుగు రచయితలు ఈ పుస్తకాన్ని చదవితే వారికి లాభం కలుగుతుందని ఈ సమీక్షకుని అభిప్రాయం. దీన్ని రాసిన పరేశ్ పట్నాయక్ అభినందనీయుడు.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: