కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.

అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.

జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.

ఈమాట డిసెంబర్ 2021 ముందుమాట పుస్తకావిష్కరణల పోలిక అన్న ఒక కొత్త అంశాన్ని లేవనెత్తింది. ఈనాటి తెలుగు పుస్తకావిష్కరణల పద్ధతి ఒక ప్రహసనమే కావచ్చు. దానికి మార్పు కూడా అవసరమే కావచ్చు కానీ ‘పాశ్చాత్య పద్ధతి నవలంబించండి’ అన్న సూచన మాత్రం ఈనాటి తెలుగు రచయితల, ప్రచురణకర్తల, పుస్తకశాలల పరిస్థితిని ఏమాత్రం పరిగణన లోనికి తీసుకోలేదని అనిపించడానికి కారణాలు చాలా వున్నాయి.

బుజ్జాయిగారు అలా కాదు అమిత సింప్లీ ఆయన బొమ్మల బ్యూటీ. బుజ్జాయిగారి బొమ్మలతో పోల్చుకోదగిన అలతి రేఖల ఆర్టిస్ట్ అంత సులువుగా మరెవరూ కానరారు. అందువల్లనే ఒకానొక సమయంలో దేశంలోకెల్లా ప్రఖ్యాతి గాంచిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా పత్రికలో బుజ్జాయిగారి బొమ్మలు మాత్రమే ప్రచురితం అయ్యాయి. మరే తెలుగు చిత్రకారులు ఎంత ప్రయత్నించినా అందులో చోటు చేసుకోలేకపోయారు.

కావున నా సూచన ఏమనగా ఋ-కారమునకు యతి బహుళము చేయవలయునని. అనగా రి-కారము, రు-కారము రెండింటితో చెల్లించుటకు శాస్త్రబద్ధముగా అనుమతి నొసగవలెనని. ఈ శాస్త్రసమ్మతి విశ్వవిద్యాలయముల ద్వారా, భాషాశాస్త్రజ్ఞులద్వారా, పండితులద్వారా, ప్రభుత్వము ద్వారా జరుగవలయును. అంతేకాక విలోమ ఉపయోగమును కూడ బహిష్కరించవలెను.

కవులను, సాహిత్యకారులను దేశంనుంచి తరిమేయడంలో రష్యా ప్రతిభే వేరు. అలా స్వదేశం నుంచి పారిపోక తప్పని పరిస్థితి ఎదురైన ఒక రచయిత్రి కరొలీనా పావ్లోవా . ఆమె పారిపోవడానికి కారణం జార్ ప్రభువు కాదు. తోటి సాహితీవేత్తలు పెట్టిన మానసిక హింస. మగరచయితల బహిష్కరణకు రాజ్యం కారణమైతే, ఈ రచయిత్రి పారిపోవడానికి కారణం ఆ మగ రచయితలే. వినడానికి ఎంత దారుణంగా ఉన్నా అదే నిజం.

వికీర్ణం (radiation) అనేది ప్రాణాంతకమైన ప్రమాదాన్ని తీసుకొచ్చే ‘అమ్మవారు’ కాదని తెలుస్తున్నాది కదా! మనం అంతా బహుకొద్ది మోతాదులలో అసంకల్పంగా వికీర్ణం ప్రసారం చేస్తూనే ఉన్నాం, మన ఎముకలలో ఉండే అనిశ్చల పొటాసియం కారణంగా. మన వంటగదులలో నల్లసేనపురాయితో చేసిన తీనెలు కాని ఉంటే అవి కూడా కాసింత వికీర్ణాన్ని ప్రసారం చేస్తూనే ఉంటాయి.

వానలో తడవనివారు, కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి, తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు, ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని. చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడు. తన నలభయ్యవ ఏట.

సామాన్యముగా ఉదాహరణములలో ప్రతి విభక్తికి మొదటి పద్యము ఒక వృత్తము, తఱువాత కళికోత్కళికలుగా రగడ భేదములను వ్రాయవలెను. అంతములో ఒక సార్వ విభక్తిక పద్యముండును. కళికోత్కళికలు లేక కూడ ఉదాహరణములను కొందఱు కవులు వ్రాసిరి. దేవీనవరాత్రుల పండుగ సమయములో అలాటి ఉదాహరణమును ఒకదానిని నేను వ్రాసినాను. దేవికి ఆర్య అని కూడ పేరు, కావున ఈ పద్యములను ఆర్యాభేదములలో వ్రాసినాను. కావున ఇది ఆర్యోదాహరణము!

నమీరూ అతని భార్యా చక్కని ఆతిథ్యమిచ్చే మనుషులు. ఆ రియాద్ వాళ్ళిద్దరి చిన్నపాటి సుందర ప్రపంచం. ప్రపంచపు నలుమూలలనుంచీ వచ్చే అతిథులతో దాన్ని పంచుకోవడం వారికి ప్రీతిపాత్రమైన విషయం. ఫెజ్ నగరంతో స్నేహ సామరస్యాలు సాధించడంలో నమీర్ నాకు ఎంతో సాయంచేశాడు. చక్కని సలహాలూ సూచనలూ ఇచ్చాడు.

తన 17వ యేటే తన డైరీలో రాసుకున్న వాక్యాలను చూస్తే ఆమె తదనంతర జీవితం, సాహిత్యం ఎలా ఉంటాయో తెలుస్తుంది. ‘పిరికివాళ్ళంటే నాకిష్టం లేదు. వివాహం విషయంలో నాకో అనుమానం. నిజంగా భర్త తెలివైనవాడైతే తన భార్య భీరువుగా ఉంటే సహించగలడా?’ అంటుంది. భయం, సంకోచం స్త్రీల లక్షణం అనే భావజాలాన్ని చాలా చిన్నతనం నుంచే ఆమె వ్యతిరేకించేది.

నవలా రచయితగా సుబ్రహ్మణ్య శాస్త్రిగారి గురించి చెప్పుకోవలసిన అంశాలలో ప్రధానమైనది భాష. భాష విషయంలో ఆయనలో క్రమక్రమంగా వచ్చిన మార్పుకు ఈ నవలలు దర్పణాలు. మొదటి రెండు నవలల్లోనూ పండిత లోకం శిరసున ధరించే వరమ ప్రామాణికమైన గ్రాంథిక భాష. వర్ణనాత్మకమయిన శైలీ విన్యాసంతో అలరారిన భాష. నవల మొదలుపెడితే ఆపకుండా చదివించగల ధారాప్రవాహం లాంటి సారళ్యతను ఆ గ్రాంథిక రచనలో కూడా సాధించగలగడం శాస్త్రిగారి విశేష ప్రజ్ఞ.

అతీతవాహకత్వం ఇంకా ప్రయోగశాలలకే పరిమితం కానీ అర్ధవాహకాలు (semiconductors) మన దైనందిన జీవితాన్నే పూర్తిగా మార్చివేశాయి! ఈ రోజుల్లో ట్రాన్సిస్టర్లు, చిప్పులు (chips), కంప్యూటర్లు, సెల్ ఫోనులు, లేసర్లు, వగైరాలు లేకుండా మనకి రోజు గడవదు కదా!

అందువలన భారతదేశప్రభుత్వము బ్రిటీషువారి చేతులలో నుండి భారతీయుల చేతులలోనికి ఎంత త్వరితముగమారిన నంత మంచిది అనుభావము వ్యాపించెను. అయితే ఈ భావము ఇంగ్లాండులోనెంత తీవ్రముగ వ్యాపించియున్నదో భారతదేశీయులెరుగరు. బ్రిటిషువారు చెప్పు మాటలను భారతీయులు విశ్వసింపరైరి. లూయీఫిషరుగారి గాంధీజీ జీవితములో ఈ సంగతిని చెప్పియున్నారు.

ఒకసారి చదివి వదిలేసే నవలగాదు. అలా చేస్తే ఆ అనుభవం ‘కష్టాల కొలిమి’ అనిపించే అవకాశం ఉంది. రెండోసారీ మూడోసారీ చదవడం, అనువాదం కోసం ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్నీ మథించడం – ఏ నవల విషయంలో అయినా ఇవి ఒక సమగ్ర అవగాహనకు రహదారి అవుతాయి. ఈ నవల విషయంలోనూ అదే జరిగింది.

కొన్నాళ్ళకి నక్షత్రాలన్నీ చల్లారిపోయి, విశ్వం చైతన్యరహితంగా తిమిరాంధకారంలో ములిగిపోతుంది. ఇందుకేనా సృష్టి జరిగింది? చీదేసిన సిసింద్రీలా కాసింతసేపు హడావిడి చేసి చివరికి ఇలా ఒక మూల తొంగుంటుందంటే ఎవరు మాత్రం సహించగలరు? ఈ జగన్నాటకానికి మరొక అంకం ఉంటే బాగుంటుంది కదా!

మనిషి మనసు ఒక మహాసముద్రమని, దాన్ని అర్థం చేసుకోవడం కష్టసాధ్యమనీ, మానవ హృదయంలో అతనికే తెలీని ప్రేరణలు, ఆలోచనలు ఉంటాయనీ మనస్తత్వ శాస్త్రం నిరూపించిన తర్వాత, అవేవీ తెలియకుండా ఇంత లోతైన మనస్తత్వాలను చిత్రించిన ఎమిలీ బ్రాంటీ ఒక గొప్ప రచయిత్రిగా గుర్తింపు పొందింది.

తిరువాన్కూరు మొదట చేసిన నిశ్చయమును మార్చుకొని భారతీయ సమితిలో చేరదలచెను. హిందూప్రజలును మహమ్మదీయ పరిపాలకుడును గలిగిన నిజాము రాజ్యము మాత్రము భారతదేశ క్రొత్త అధినివేశముల రెండింటితోనూ సంధి యేర్పాటుల ద్వారా రాజ్యాంగబంధమును కలిగుయుండుటకు నిశ్చయించెను.

ఉరి ఉచ్చు గట్టిగా బిగించే తాడు వెతకలేదు.
బలమైన కొమ్మలతో ఎత్తైన చెట్టు వెతకలేదు.
ఉన్నట్టుండి వేలాడపడే చావు బరువుని
తట్టుకోగలిగే చేపుగా పెరిగిన చెట్టును వెతికి పట్టుకోలేదు.