చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్‌కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం… కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి… చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది.

అప్పటివరకు వినోదకరమైన ప్రయోగాలకీ, భయంకరమైన పిడుగులకీ, విద్యుత్తుతో ఏదో సంబంధం ఉందనుకున్నారు కాని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో గురుత్వాకర్షణ శక్తి లాగా విద్యుత్తు కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని డేవీ నిరూపించాడు.

చలం మాట ఎత్తగానే, కొన్ని ఏనుగులు వచ్చి నుంచుంటాయి. గదంతా నిండిపోతాయి. అడ్డదిడ్డంగా. వీటిలో కనిపించేవి కొన్నైనా, కనిపించనివి ఎన్నో. ఇప్పుడీ వేదిక ముందూ ఉండే ఉంటాయి ఏనుగుల గుంపులు. ఆ ఏనుగులేమిటో మీకూ కనబడే ఉంటాయి. అవి మీ లోలోనికి చొరబడే ఉండొచ్చు. ఆ ఏనుగులు ఏమిటో మీరీపాటికి గ్రహించే ఉంటారు. పడికట్టు అభిప్రాయాలు. బిగదీసుకున్న ఛీత్కారాలు. నిగడదన్నుకున్న నిర్ధారణలు. విశృంఖలత, విచ్చలవిడితనం, చెడగొట్టే రాతలు, చెడిపోయిన పాత్రలు, ఎగుడు దిగుడు మైదానాలు.

వీరు ఒకరి సిద్ధాంతాలను మరొకరు విమర్శించి, తమ తమ సిద్ధాంతాలను సమర్థించుకున్నారు. ఇది కేవలం సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప, వ్యక్తిగత దూషణ కాదు. ఈ విమర్శల ఫలితంగానే భారతీయ తత్వశాస్త్రం మరింత సుసంపన్నమైంది.

రాత్రి అనే పల్లె పడుచు వెన్నెలనే మజ్జిగని చిలికి నప్పుడు చల్ల పైన తేలిన తునకలతో చేసిన వెన్నముద్దే ఆకాశం మధ్యలో వెలిగి పోతున్న చంద్రుడట. వెన్నముద్ద కాకుండా చుట్టుపక్కల చెల్లాచెదరై మిగిలిపోయిన తుంపరలే నక్షత్రాలట.

వ్యాసుడు విషయానికి ప్రాధాన్యతనిచ్చి, మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడాన్ని మూడు శ్లోకాలలో ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న చందంగా తేల్చేసాడు. సన్నివేశ చిత్రీకరణ ఇక్కడ జరగలేదు. పాఠకులకు లేదా శ్రోతలకు, ఈ సన్నివేశంలో ఏమి జరిగిందో తెలుస్తుంది తప్ప వారి ఊహలకు ఊతమిచ్చే వర్ణనలు, వివరాలు ఈ శ్లోకాలలో లేవు.

సమాజ సంస్కరణకు, సామాజిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసే ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. వీరేశలింగం, గురజాడ వంటి సంస్కర్తలు వ్యవస్థలోని రుగ్మతలను సరిదిద్దాలని ప్రయత్నిస్తే, చలం ఆ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

బైరాగి ఆధునిక ఆర్షకవి. ఆధునికులలో ప్రాచీనుడు, ప్రాచీనులలో ఆధునికుడు. బైరాగి ఉపనిషత్తులు లోతుగా చదివాడు. కేవలం చదవడంకాదు అవి అతడి భావనలో భాగమయిపోయాయి.

ఒక భాష ఏళ్ళ తరబడి, శతాబ్దాల తరబడి చేసిన తపస్సు వల్ల బైరాగి వంటి కవి పుడతాడు. ఈ మాట మా మాష్టారు పోతన్న గురించి అన్నారు. నేను బైరాగి గురించి అంటున్నాను. బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.

ఏ పదిహేడేళ్ల వయసులో బైరాగి పుస్తకం ముట్టుకున్నానో కానీ, ఇన్నేళ్ళుగా నాతో బైరాగి ప్రయాణిస్తూనే ఉన్నాడు. కవిత్వంలో ఉద్వేగంతో మునకలేస్తున్న రోజులనుంచీ, నిర్వేదంతో వదిలి వేసినప్పటి నుంచీ, ప్రపంచంలో నా స్థానం వెతుక్కుంటున్న రోజుల్లోనూ, కొన్ని సార్లు మరీ ముఖం కొట్టవచ్చినట్లు, మరికొన్ని సార్లు క్రీగంట కనిపిస్తూ, బైరాగి నా వెంటనే ఉన్నాడు. అమెరికాలో తెలుగు మనుషుల మధ్య ఉన్నా తెలుగులో ఆలోచన లేని రోజుల్లో కూడా బైరాగి తలపులోకి వచ్చేవాడు. తెలుగుకి అతీతంగా, విశ్వ మానవ గళంతో బైరాగి నా తోడుగా, నాకు తోడుగా ఉన్నాడు.

“అందీ అందని నీ చేలాంచలముల విసరుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా,” అని శ్రీశ్రీ కవితని స్మరిస్తే, బైరాగి, “కవి సమస్య,” లో అనేకానేక హేమ్లెట్లు, రాస్కల్నికోవ్ ల బాధని “విశ్వవ్యధా వారినిధి తటాన బహుభంగుల ఫేనోజ్వల, రుదనాకుల, క్షుభితోచ్చల తరంగాళి” గా ఆలాపించడానికి యత్నించి, “శబ్దాల అసమర్థత” ఎదురయి “కవితాకామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమవడాన్ని” అనుభవిస్తాడు.

బైరాగి తలుపులు తెరుచుకుంటున్నది నరకంలోకి కాదు. అవేదనావృత జీవన వాస్తవికతలోంచి ఆశాస్వప్నసౌధానికి అతను ఆడుగులు కదుపుతుంటాడు. తుఫాను హోరులోంచి చావుబతుకు పోరులోంచి వెనుదిరగక మున్ముందుకు సాగే ధీరోదాత్తుల అడుగు జాడలను అన్వేషిస్తాడు.

బైరాగి కవిత్వ తత్త్వం కథల్లో కూడా ప్రతిబింబిస్తుంది. ఒక రకంగా అది ఆయన సాహిత్య తత్త్వం. తీవ్రమైన భావావేశం, మార్మిక పద చిత్రణ, ఆశానిరాశల ఊగిసలాట, మృత్యు స్పర్శ నీడలో దాక్కునే వాక్యాలు, అర్థమై కానట్లుండే కొన్ని ఇతివృత్తాలూ వెరసి బైరాగి కథలు.

లోకం నిరాశా నిస్పృహల్లో మునిగివున్నా కవి నిరాశావాది కాదు. వాటినుంచి ఎలా బయటపడాలో ఉద్బోధించగలడు, స్పష్టంగా ప్రకటించగలడు. అయితే అతని బాటని పాటించటానికి సాహసం కావాలి.

బైరాగి మూడు పదులు నిండక ముందు రాసిన ‘నూతిలో గొంతుకలు’, రిల్కే చివరి రోజుల్లో రాసిన ‘Sonnets to Orpheus’ — ఈ రెండు కావ్యాల్లో భావ తీవ్రత, తాత్విక గాఢత పెనవేసుకుపోయాయి. రిల్కే కావ్యానికి వచ్చిన అనువాదాలు అన్నీ ఇన్నీ కావు. అమెరికా సాహిత్య ప్రియుల్లో రిల్కే పేరు తెలియనివారు లేరు. మన బైరాగి పేరు తెలుగు ఎల్లలు దాటలేదు.

బైరాగిని తలచుకుంటే ‘నూతిలో గొంతుకలు’ వినిపిస్తాయి. చుట్టపు చూపుగా వచ్చి, అట్టేసేపు వుండని ‘ధూమకేతువు’ కనిపిస్తుంది. “రాయప్రోలు, విశ్వనాథ వంటి ధ్రువతారలేకాదు, శిష్ట్లా, నారాయణబాబు, బైరాగి వంటి నక్షత్రాలు కూడా సాహిత్య రోదసికి అలంకారాలే” అన్నాడు శ్రీశ్రీ.

బైరాగిది కవితాశిల్పం కాదు. రచనాశిల్పం, కవితాశిల్పం ఏకదేశ పర్యాప్తమైన ఉక్తివైచిత్రిలో అంతర్లయిస్తుంది. రచనాశిల్పం ఆద్యంత హేలగా ఉండే కూర్పు. వాగర్థ సంపృక్త భావ బంధురమైన తీర్పు. దానికి కడలికెరటంలా ఆటుపోటులుండవు; ఆవిచ్ఛిన తైలధారగా ప్రవహించే సమతానిర్ఝరి అది. ఇందుకు ఆయన రచనలన్నీ ప్రత్యక్షరసాక్ష్యాలే.

అతని గొంతుక నూతిలోనుంచి కాదు, హేతిలోనుంచి వినబడింది. భీతిలేనివాడు, ఖ్యాతికోరనివాడు, నేతలను నమ్మనివాడు, భూతలాన్ని అకాలంలో వదిలేసి వెళ్ళగలిగినవాడు బైరాగి.

తానెందుకు రాసాడో, ఏమి రాసాడో, ఎవరి గురించి రాసాడో, తన సంశయాలేమిటో, తన తాత్త్విక భూమిక, తన విచారధార, అన్నింటినీ స్థిరంగా తెలిసినవాడు బైరాగి. జీవితకాలమంతా తన రచనల్లో ప్రస్ఫుటించినవాడు బైరాగి. భాషని, శైలిని, సంవిధానాన్ని నిర్దేశిత భావాల ప్రకటనకు సమర్థంగా ప్రయోగించినవాడు బైరాగి.

మహోజ్వలమైన కావ్యకాంతులు వెదజల్లిన దీపశిఖ అతను. అన్నిటా ఉన్నా దేన్నీ అంటని విరాగి. విషాద విషాన్ని పుక్కిట పట్టిన విశ్వయోగి బైరాగి. మానవతకు మకుటమైంది అతని కవిత! కవిగా బైరాగి చరితార్థుడు!