ఈ ట్రిబొనాచ్చి సంఖ్యలను మొట్టమొదట అగ్రనోమోఫ్ అను శాస్త్రజ్ఞుడు 1914లో ప్రస్తావించెను. కాని అంతకుముందే ఏనుగుల జనసంఖ్యను వివరించుటకై ఛాల్స్ డార్విన్ తన కొడుకైన జార్జ్ హోవర్డ్ డార్విన్ ప్రతిపాదించిన సిద్ధాంతమును గ్రహించెను. ఇది ఒక మేధోప్రహేళిక.

కామం పాశ్చాత్యులు ‘కనిపెట్టారు’ అన్న భావం మనలో చాలామందికి ప్రబలంగా ఉంది. భారతీయసంస్కృతి అందుకు విరుద్ధమని, పాశ్చాత్య సంస్కృతులతో పోలిస్తే మన సంస్కృతి చాలా స్వచ్ఛము పవిత్రము అన్న భావం కూడా చాలామందిలో ఉంది. ఈ చర్చ కావ్యవిమర్శలో రాకుండా ఉండదు. నిజమే, కాని అది ప్రధానం కాదు.

నేడు తెలుగులో వందకుపైన గౙల్ రచయితలు ఉన్నారని అంచనా. కాని ఆ గౙలులలో గౙల్ ఛందస్సు మాత్రము మృగతృష్ణగా మిగిలినది. ఈ పరిస్థితి ఎందుకు తెలుగు గౙలులకు అనే ప్రశ్నకు గౙల్ ఛందస్సు విదేశీయము, మన తెలుగు భాషకు సరిపోదు అన్నది ఒక ముఖ్య వాదము. ఇందులో ఇసుమంత కూడ సత్యము లేదు. అసలు ఈవాదమును లేవనెత్తినవారు గౙల్ ఛందములను చదివినారా అనే సందేహము కలుగుతుంది.

జీవితాలు వ్యర్ధంగా గడిచిపోతున్నాయి, త్వరపడండి, సార్థకం చేసుకోండి, అన్న హెచ్చరిక. ‘ఎ గేమ్ అఫ్‌ కోర్స్‌’ ప్రారంభదృశ్యం లోని సంపన్నస్త్రీ అయినా, ముగింపుదృశ్యం లోని లిల్ అయినా జీవితాల ముగింపు ఒకటే. క్లియోపాత్ర లాగానో ఒఫీలియా లాగానో కథ విషాదాంతమే – మరణమో, సదృశమైన జడజీవనమో. కాని జీవితచదరంగం యిద్దరికీ సామాన్యమే.

నడీన్ గోర్డిమర్ కంటే చాలా ముందే దక్షిణాఫ్రికాలో తెల్ల, నల్ల జాతుల గురించి వ్యాసాలను, అక్కడి స్త్రీల జీవితాల గురించి ఒక నవలనూ రచించిన 19వ శతాబ్ది రచయిత్రి ఆలివ్ ష్రైనర్ ఎక్కువమంది పరిశోధకులకు కూడా అపరిచితురాలే. ఈ రచయిత్రి మన గాంధీజీని కలుసుకుందని, ఆయన అభిప్రాయాలను గౌరవించిందనీ చదివినపుడు కలిగే ఉత్సాహం వేరు.

ఇంతకూ ఎలియట్ ఈ దృశ్యంలో వర్ణించిన స్త్రీ ఎవరు? ఆయన మొదటి భార్య వివియన్ అని కొందరి ఊహ. ఆయన వర్ణించింది ఒక స్త్రీని కాదు, స్త్రీని. స్త్రీకి ఎన్ని ముఖాలుంటాయో అన్నీ కరిగించి పోసిన పోత. మసి అయిపోయేది స్త్రీయే, మసి చేసేది స్త్రీయే. ఈ దృశ్యంలో వస్తువు స్త్రీ మాత్రమే కాదు. కృత్రిమత్వంలో బుద్ధి నశించిన మనిషి.

ఇవన్నీ ఎప్పుడో ఉన్న కవులకి కాని ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి వర్తించే చట్రాలు కావని అనిపించొచ్చు కాని, నిజం కాదు. పందొమ్మిదో శతాబ్దంలో కొత్త రకం పాఠకులు వచ్చారు, మరికొన్ని కొత్త మూసలు తయారుచేశారు. ఈ కొత్త పాఠకులకి దారి చూపించి, తెలుగు సాహిత్య చరిత్రలో పెనుమార్పులకు కారకుడైన విశిష్టవ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఈయన ప్రభావం బహుశః అద్వితీయం.

సాహిత్యం సమాజంలో మార్పులకు దోహదం చెయ్యాలి అని ఆశించడం, ఆ సాహిత్యంలోనూ భాష, వాస్తవికతల పరంగా మౌలికమైన మార్పులు ఆశించడం, తీసుకురావడం – ఆ ప్రక్రియలో ఆధునిక సాహిత్యానికి గురజాడ మూల పురుషుడవడం వివినమూర్తిని బాగా ఆకట్టుకున్న విషయం, వాటికన్నా ఎక్కువగా మూర్తిని ఆకర్షించింది గురజాడలోని వివేచన.

మొక్కలు నాటడం విన్నాం, శవాలు నాటడం! ఆ ప్రేతానికి రెండువేల సంవత్సరాలు గడిచినా, క్రిందటి ఏడాదే అనుకుంటున్నాడు. పోయిన ఏడాది నీ పెరట్లో శవాన్ని నాటావు కదా? అది మొలిచిందా? అని అడుగుతున్నాడు! అసలు వాళ్ళు ప్రేతాలేనా? ప్రేతప్రాయులైన ప్రాణులా? అతడు మాట్లాడుతున్నది, ప్యూనిక్ యుద్ధం గురించేనా, లేక గత ఏడాది జరిగిన ప్రపంచయుద్ధమా?

విశ్వసాహిత్యంలో నల్లజాతి మహిళల నవలా రచన ఎప్పుడు ప్రారంభమైంది? అన్న విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూ, తొలి నవలను తేల్చలేకపోతున్నారు. ఆ ప్రయత్నాలు అలా కొనసాగుతూండగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన 19వ శతాబ్దిలోని ఇద్దరు నల్లజాతి మహిళల నవలలు వేర్వేరు కారణాలవల్ల ప్రాచుర్యం పొందలేదు.

జాతకాలు చెప్పేవాళ్ళు రెండు విధాలు. కొందరు, జాతకచక్రం చేతిలోకి తీసుకొంటూనే, ‘ఓహో! ఆహా! మహజ్జాతకం! ఆరు నెలలలో అమెరికా వెళ్ళి పోతావు. వచ్చేటపుడు ఒక ఐ-ప్యాడ్ తెస్తావుగా నాకోసం’ అంటాడు. మరొకాయన, చక్రం చూస్తూనే ముఖం చిట్లిస్తాడు. ‘ఈ పిల్లకు కుజదోషం’ అని మొదలుపెట్టి, కట్టకముందే తాళి తెంపేస్తాడు.

గొప్ప పాట! గొప్ప భావన! సీతమ్మ శోకం లోకానికంతటికీ తెలిసేది, జలధితరంగాల లాగా. రామయ్య బాధ లోకానికి తెలిసేది కాదు. ఆ శోకం ఆయన మదిలో భద్రం. ఇది అర్థానికి ఒక పొర. ఈ తెర తొలగిస్తే మరో గాఢార్థం. కనుకట్టులో కనువిప్పును దాచిన మహాకవి వేటూరి! కనుకట్టు: సీతారాముల వియోగం; కనువిప్పు: సముద్రము తరంగము, రెంటికీ వియోగమా?

తొలి నవల పాఠకుల ఆదరణ దృష్ట్యా విజయవంతమైనా, ఆ తర్వాత విమర్శకులు కత్తిగట్టడంతో 19వ శతాబ్ది రచయిత్రుల జాబితానుంచి పక్కకి తొలగిన రచయిత్రి ఎలిజబెత్ గాస్కెల్. విమర్శకులు కత్తిగట్టడానికి కారణమేమిటి? ‘మగవాడిలా కార్మికులు, పేదల గురించి రాయడానికి ప్రయత్నించడం, పారిశ్రామిక విప్లవం ఫలితాలను చర్చించడం!’

అరబ్బీ, పారసీక కవిత్వములో ముఖ్యమైన ప్రక్రియలు నాలుగు: అవి గజల్, ఖసీదా, మస్నవీ, రుబాయి. చాలమందికి గజల్, రుబాయీలు పరిచయమే. వీటిలో ఒక పాదమును మిస్రా అంటారు; రెండు పాదములను శేర్ అంటారు. రెండు శేర్‌లు ఒక రుబాయీ. అనగా రుబాయీ ఒక చతుష్పది. అరబ్ భాషలో అర్బా అంటే నాలుగు అని అర్థము.

వేస్డ్‌ లాండ్‌లో ఏ గొంతు ఎవరిది అని అడుగడుగునా అడుగుతూ చదవాలి. మరి ఆ మొదటి మాటలు ఎవరివి? ఎనిమిదో పాదంలో మరీ అనే ఒక స్త్రీ పాత్ర ప్రవేశిస్తుంది. ఆ మరీయే, మొదటి ఏడు పాదాల నాందీ పద్యం కూడా చదివిందనుకోవాలా? అలా అనిపించదు. మరి, ఎవరి మాటలు?

ఈ కవితను ఎలా చదవాలి? అడగవలసిన ప్రశ్న: ఎలా చదవకూడదు? ఇది చదవకూడని కవిత. సరిగమలు చదివితే సంగీతమవుతుందా? వేస్ట్‌ లాండ్‍ లోని పదాల, పదార్థాల స్వరాలకు సంగీతరచన చేసుకొని, చెవులు మూసుకొని వినాలి. అర్థం చేసుకోవలసినది కూడా కాదు.

నెలీ పాత్రికేయవృత్తిలో ఉన్నందువల్లనేమో, శైలి చాలా పఠనీయంగా, సంభాషణలు పటిష్టంగా ఉంటాయి. ఉద్వేగభరితమైన శైలి నవలకు అందాన్నిస్తుంది. ఒక్క నెలలో రాసేసిన ఈ నవల బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తించిన ‘ఖూన్ భరీ మాంగ్’ నుంచి ‘సాత్ ఖూన్ మాఫ్’ వరకు, ఎన్నో సినిమాలకు ప్రొటోటైపా అన్నట్టుంటుంది.

ఒకటి నుండి 26 అక్షరముల వఱకు 184217726 వృత్తములు సాధ్యము. అందులో కొన్ని వృత్తములకు ఒకే గణము పదేపదే వచ్చునట్లు అమరికలు ఉంటాయి. అన్ని మ-గణములతో విద్యున్మాల, య-గణములతో భుజంగప్రయాతము, ర-గణములతో స్రగ్విణి, స-గణములతో దుర్మిల, తగణములతో పద్మనాభ, జ-గణములతో మౌక్తికదామ, భ-గణములతో మానిని, నగణములతో చంద్రమాల వంటి వృత్తములు ఉన్నాయి.

ఆమె దృష్టిలో తను పెళ్ళికి, పిల్లల్ని పెంచడానికీ పుట్టిన స్త్రీ కాదు. తనకు ఇంకా ఏదో కావాలి. అదేమిటో ఆమెకీ తెలీదు. భర్తను వివాహం చేసుకున్నపుడు అతనితో ప్రేమగానే ఉంది. కానీ అది తన కర్తవ్యంలో భాగం. అందులో ఎలాంటి ఉద్వేగం లేదు. తన సంచలనం ఆమెకు అర్థం కాకపోయినా తనలో ఏదో మార్పు వచ్చిందని గ్రహిస్తుంది.

ఈమాటలో అక్టోబర్ 2017 సంచికలో, సి. ఎస్. రావ్ కవి తిలక్‍పై రాసిన వ్యాసం గ్రంథచౌర్యానికి లోనయింది. యోగి వేమన విశ్వవిద్యాలయం తరపున తిలక్ శతజయంతి సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాల సంకలనం తిలక్ సాహిత్యం – సందేశంలో, ఎస్. పి. యూసుఫ్, ఎం. సి. జె. అన్న రచయిత ఈమాటలో వచ్చిన వ్యాసాన్ని కొన్ని మార్పుచేర్పులు చేసి ప్రకటించారు.