నిసి అతని ఆదుర్దా చూసి, ఎవరితని కంపానియన్స్? గ్రిజ్లీ బేర్స్‌ని గాని ఇతడు ఇన్వైట్ చెయ్యలేదు కదా, అనుకుంది. అంతకు ముందే ఆమె హోటల్ వారి వార్నింగులు చదువుకుంది. ఫోర్ సీజన్స్ బైటి రోడ్డు కొంత భాగం మూసివేసినట్టు, అటవీశాఖవారు ఒక ఎలుగుబంటి ఫామిలీ కోసం వెతుకుతున్నట్టు, బైట నడవొద్దని, బేర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమని, న్యూస్ రిలీజ్‌లు ఫాలో అవ్వమని సందేశం.

అర్ధరాత్రి దాటాక డ్యూటీ కాగానే తన గదికి వెళ్ళేవాడు. హోటల్ కేరేజీలో ఉన్న భోజనం తినేవాడు. నిద్రపోయేవాడు. కొన్ని రాత్రుళ్ళు ప్రెస్ క్లబ్‌కో, వేరే ఎక్కడికో వెళ్ళి బాగా తాగి ఏవేవో వాగేవాడు, పెద్దగా ఏవేవో పాడేవాడు. తన మనసు లోలోపల తనకే తెలీకుండా పేరుకున్న సున్నితమైన కోరికలను, ఆశలను మద్యంతో కడిగి బయటకు పంపుతున్నట్టు ఉండేది ఈ తాగుడు తంతు. కాని, శరీరాన్ని మోసం చెయ్యడం వీలయ్యేది కాదు.

హాప్కిన్స్ విక్టోరియాయుగపు వాడు. టెన్నిసన్, బ్రౌనింగ్, స్విన్‌బర్న్‌లకు సమకాలికుడు. కాని కవిగా వాళ్ళలో చేరడు. అతడు యిరవయ్యవ శతాబ్దపు ఆధునిక కవి. ఎలియట్ తన గురించి అన్నాడు: తాను ఆధునికుల్లో పురాతనుడు, పురాతనుల్లో ఆధునికుడు అని. హాప్కిన్స్ ఆంగ్లోశాక్సన్ మూసలోని ఆధునికుడు.

సూర్యోదయం మొదట్లో పొడవుగా సాగిన నీడ మధ్యాహ్నం సూర్యుడు నెత్తిమీదకు వచ్చే వేళకి చిన్నదవుతూ, మళ్ళీ పొడవుగా సాగుతుందన్న విషయం మనకు తెలుసు. కనుక నీడ పొడవును బట్టి, అది మధ్యాహ్నమైతే, ఇంకా సూర్యాస్తమయానికి 7 గడియల పొద్దు ఉందనీ, అదే ఉదయపు నీడ అయితే, సూర్యోదయం అయి 7 గడియల పొద్దు అయిందనీ తెలుసుకోవచ్చు.

త్రిభంగి అంటే మూడు భంగములు గలది. భంగము అంటే ఇక్కడ విఱుపు. అనగా పాదము స్పష్టముగా మూడు విఱుపులతో నుండాలి. ఈ విఱుపులకు అంత్యప్రాస కూడ ఉంచుట వాడుక. సామాన్యముగా మూడు అంత్యప్రాసలు ఉంటాయి. ఈ త్రిభంగి పుట్టు పూర్వోత్తరాలు సరిగా తెలియవు.

అప్పుడు నీ గర్భాన్ని
నా పసికాళ్ళతో తట్టినప్పుడు
నువ్వెన్ని పూలతోటలై నవ్వేవో
తెలీదు కానీ
ఇప్పుడు నీ జ్ఞాపకాలు
నా గుండెల్ని తడుతుంటే
కన్నీటి మేఘాన్నవుతున్నాను.

ఇలాగే ఇందుకే ఉన్నామనుకుంటూ
గుర్తులు చెక్కుకుంటూ
వత్తులు దిద్దుకుంటూ
వలయాల్లోని వలయంలోకి
విజయాల్లోని విలయంలోకి
ఒకింత మరి కాస్తంత కించిత్పూర్తిగా
విలుప్తమై వినీలంలో విలీనమైపోతూ

చీకటిని చీల్చుకొని వెలిగే మెరుపు తీగ
వేదనల వణుకును పోగొట్టే నెగడుగా
ఎప్పటికీ మారదు

తళుక్కున మెరిసిన ఇంద్రధనుస్సు
తెల్లని నవ్వై తేలిపోతుంది
అసలు రంగేదో నువ్వు గుర్తించేలోగానే

– మన పురాపారవశ్యాలు నీకు గుర్తుకు వస్తున్నాయా?
– నేనేమి గుర్తు ఉంచుకోవాలని నువ్వు ఆశించావు?

నా పేరు వినగానే నీ హృదయం ఇంకా స్పందిస్తుందా?
ఇప్పటికీ కలలో నీకు నా మనసు ఊసు వినిపిస్తుందా? – లేదు!

ఈ క్షణమొకసారి పిల్లకాలువ
తేలికగా ప్రవహిస్తూ పోతుంది
ఒక్క గెంతులో దానిని దాటగలుగుతావు
మరొకసారి మహాసముద్రం
దానిలో మునిగిపోకుండా నిలబడటానికి
నీ శక్తులన్నీ ఒడ్డుతావు

ఒకసారొక చినుకు
గుర్తించేలోపు పలకరించి మాయమౌతుంది

తెలుగులో ఈ సమాసాలకు సంబంధించిన అవగాహనంతా సంస్కృతం నుండి తెచ్చుకున్నదే. అందువల్ల పాఠశాల స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకూ సమాసాల కన్నా వాటి సాంకేతికపదాల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడుతూండటం గమనార్హం. కేతన ఇచ్చిన నిర్వచనం చిన్నయసూరి పై నిర్వచనం కన్నా సులభంగా అర్థమవుతూందన్నది ఎవరైనా నిర్వివాదంగా అంగీకరించాల్సిందే.

[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

క్రితం సంచికలోని గడినుడి-55కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేడు మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.

గడి నుడి-55 సమాధానాలు.

అడ్డం కింకిణి నూతనంగా మొదలెట్టిన ఇల్లు (4) సమాధానం: నూపురము ఏడిస్తే వచ్చేదానితోపాటే ఉండే సముద్రం (3) సమాధానం: మున్నీరు ఒళ్ళు కడగడం అంటే […]

ప్రతీ మనిషికీ కొన్ని అభిరుచులుంటాయి. వీటిలో చాలామటుకు ఏ ప్రయత్నాన్ని, పరిశ్రమని కోరనివి. సహజాతమైనవి. వినోదం, కాలక్షేపం వీటి ప్రధాన లక్షణాలు. కొందరు వీటినే శ్రద్ధగా గమనించుకుంటారు. అదనపు సమయాన్ని వెచ్చించి, ఈ అభిరుచులకు పదునుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా కొద్దిమంది మాత్రం మరొక్క అడుగు ముందుకువేస్తారు. సహజాతమైన అభిరుచులతో తృప్తిపడకుండా, తమకు అలవాటు లేని, నేర్చుకునేందుకు తేలిక కాని అభిరుచులను ప్రయత్న పూర్వకంగా అభివృద్ధి చేసుకుంటారు. ఈ స్థాయిలలో హెచ్చుతగ్గులు లేవు. కాని, వినగానే, చూడగానే స్వభావసిద్ధంగా సహజంగా నచ్చే వాటి మీదే శ్రద్ధ చూపేవారు మేధోశ్రమ లేకుండా దొరికే తాత్కాలికమైన, ఉపరితలానుభవంతో తృప్తి పడతారు. అక్కడ ఆలోచనకు తావు లేదు. ప్రయత్నంతో సాధించుకొనే అభిరుచి అలా కాదు. ముందు దానిని పరిశీలించాలి. ఆసక్తి సడలకుండా నిలకడగా అభ్యసించాలి. దానిలోని ఆకర్షణ ఏమిటో, ప్రత్యేకత ఏమిటో వెతికి సాధించుకోవాలి. ఏ అభిరుచి అయినా ఇలాంటి పరిశ్రమతో ఏర్పడినప్పుడు, అందులో నైపుణ్యం సిద్ధించడంతో పాటు, సహజాతమైన అభిరుచులు కూడా పదునెక్కి, వాటితో ముడిపడ్డ ఏ అనుభవమైనా ఉపరితలాన్ని దాటి ఒక లోతైన అనుభవంగా మిగుల్చుకోవడానికి కావలసిన పరిశీలనాజ్ఞానం పెంపొందుతుంది. విశ్లేషణాత్మక సాహిత్యపఠనం ఇలాంటి ప్రయత్నపూర్వక అభిరుచి. అలా చదవడం వల్ల సాహిత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగల శక్తి వస్తుంది. వాక్యాల సొగసు, పదాల ఆడంబరాన్ని దాటుకొని సంపూర్ణ పఠనానుభవం పాఠకులకు దొరుకుతుంది. సాహిత్యాభిమానులు, రచయితలూ చాలామంది ఈ ప్రయత్నపూర్వక శ్రమను పక్కకు నెట్టుకుంటూ పైపై మెరుగులతోటే తృప్తి పడడం వల్లనే మన సాహిత్యపు స్థాయి నానాటికీ పతనమవుతూ వస్తోంది. కళలో నైపుణ్యం సాధించడానికైనా, కళను ఒక నిండు అనుభవంగా ఆస్వాదించడానికైనా, సాహిత్యకారుడికైనా సాహిత్యాభిమానికైనా ఇలాంటి ఒక మెలకువతో కూడిన పరిశ్రమ తప్పనిసరి. అందుకని రచయితలు, ప్రత్యేకించి తెలుగు రచయితలు, అభ్యుదయమని పొరబడుతూ నెత్తికెత్తుకున్న కొత్తొక వింత పాతొక రోత స్వభావాన్ని, పరిశ్రమ చేయలేని తమ అలక్ష్యాన్ని వదిలి ప్రపంచసాహిత్యాన్ని, అంతకంటే ముఖ్యంగా మనకు సాహిత్య వారసత్వంగా అబ్బిన తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని, అభ్యాసంలా చదవడాన్ని అలవరచుకోవాలి. కూలంకషంగా, విమర్శనాత్మకంగా, కథాకథనవ్యాకరణ పద్ధతులను పరిశీలిస్తూ చదవాలి. అప్పుడు, నిజమైన సాహిత్యమంటే ఏమిటో బేరీజు వేసుకోవడానికి ఒక బలమైన కొలమానం దొరుకుతుంది. అలా, వ్యక్తిగత అభిరుచుల స్థాయి బలపడేకొద్దీ, భాషా సాహిత్యం కూడా బలోపేతమవుతూ ఉంటుంది. అలాకాని చోట ఆముదపు చెట్లనే మహావృక్షాలనుకునే భ్రమలో సాహిత్యలోకం మిగిలిపోతుంది.

ఎవరయినా పెద్ద ఆర్టిస్ట్ చనిపోగానే తెల్లారి కాగితపు పేపర్లకు కార్టూనిస్టులు వేసే బొమ్మలలో ఆ సదరు చిత్రకారుడు ఒక సంచి తగిలించుకుని మేఘాల మధ్య స్వర్గమో ఇంకే శ్రాద్ధమో అనే ఒక పిండాకూడు ద్వారం దగ్గరికి వెడుతుంటాడు కదా, అటువంటి బొమ్మలని చూసినపుడల్లా మాకిరువురికి ఎక్కడ కాలాలో అక్కడ కాలేది.

బోద్‌లేర్ అసాధారణకవి. అతడికి ఖ్యాతి అపఖ్యాతి కూడా అమితంగా లభించాయి. అపఖ్యాతిలో కొంత అతడు కోరి తెచ్చుకున్నదే. అతని అపఖ్యాతికి ప్రధానకారణం అతడి అద్భుత కవితా శిల్పాన్ని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయకపోవడం వల్లనే. ఆ రచనా శిల్పాన్ని కొంతైనా ఆవిష్కరించే ప్రయత్నమే యీ వ్యాఖ్య.

మేరీ ఉల్‌స్టన్‌క్రాఫ్ట్ నవలల కంటే ముందు రాసిన నాలుగు గ్రంథాలూ స్త్రీల విద్యకు పెద్ద పీట వెయ్యడంతో పాటు, సామాజిక, రాజకీయ వ్యవస్థల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించేవే. వ్యక్తి స్వాతంత్ర్యాన్నీ, సమానత్వాన్నీ సమర్ధించేవే. ఒక్క ఫ్రెంచి విప్లవం నేపథ్యంగా ఆమె రాసిన మూడు రచనలూ పెద్ద ప్రకంపనలకు దారి తీశాయి.

ఈ కవర్ నా ముందు లేకపోతే అతను నా జీవితంలో ఉన్నాడని గుర్తులేనట్లు గడిపేదాన్ని. అది బావుండేది. ఆ కవర్ గుడారంలోకి తలదూర్చిన ఒంటెలా టేబుల్ మీద వెక్కిరిస్తుంది. వచ్చి వారమైంది. చిరాగ్గా ఉంది. ఏడేళ్ళ తరువాత రామలక్ష్మి రాసిన ఉత్తరం. ‘మధూ, నా పరిస్థితేమి బాగాలేదు. నీతో మాట్లాడాలి. ఇప్పుడు స్థిరంగా నమ్మగలిగే వ్యక్తులు ఎవరూ లేరిక్కడ. ఒక్కసారి రా.’