స్త్రీపురుష సంబంధాల్లో భావోద్వేగాల కంటే ఇంగితజ్ఞానానికి, ప్రణయవేగం కంటే పరస్పరగౌరవానికి, ఆర్ధిక సమానతల కంటే బౌద్ధిక సమానతలకూ ప్రాధాన్యం ఇచ్చిన రచయిత్రి జేన్. ఆమె నవలల్లో స్త్రీపురుషులిద్దరూ విలువల్లో, జీవన విధానంలో, ప్రాపంచిక దృక్పథంలో సమవుజ్జీలుగా ఉన్నపుడే ‘ప్రేమ’ అనే పదానికి అర్థం ఉంటుంది.

“మీ ఈ తర్కం తప్పు. గురుదేవులు ఇలాంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వద్దని చెప్పారు. ఎవరూ నా ప్రశ్నకి సరైన సమాధానం ఇవ్వడమే లేదు. భార్యని అడిగాను నేనెవర్ని? అని. ఆమె బదులిచ్చింది, నువ్వు నా భర్తవి. పెద్ద కొడుకుని అడిగాను నేనెవర్ని? అని వాడు బదులిచ్చాడు, నువ్వు నాన్నవి. ఆఫీసులో మా మేనేజర్‌ని అడిగాను సార్ నేనెవర్ని? అని. నువ్వు పిచ్చివాడివి, అని ఆయన జవాబు.”

కట్టిన పుట్టమేమి, కనకాంబరమా? కరితోలు! నెత్తిపై
బెట్టినదేమి, మత్త శిఖిపింఛమ? ఉమ్మెత గడ్డిపువ్వు, మై
దట్టిన దేమి, చందన కదంబరమా? తెలి బూది! నిన్ను జే
పట్టిన రాచ పట్టి చలువన్ పరమేశ్వరుడైతి ధూర్జటీ!

వెచ్చని సముద్రతలం మీద
చేపల చాపల కోసం
పడవ ప్రయాణం
లంగరేస్తే బట్ట నిలువదు
సహస్రాక్షుడి సహపంక్తి భోజనం
వేదాలు, హాలాహలము
మోసానికి మొదటి పాఠాలు

నీడల్ని పెకలించుకుని
శూన్యం ఊడ
ఇళ్ళల్లోకి ఎప్పుడు దిగబడిందో తెలీదు
బయటకి ఇళ్ళన్నీ ప్రశాంతంగా కనబడుతున్నా
లోపల గదులు గదులుగా శూన్యం
ఎప్పుడు విస్తరించిందో తెలీదు

బిడ్డకొచ్చిన కష్టంతో కుంగిపోయి వున్న కమలాంబాళ్ తనేం చేస్తున్నాననే స్పృహ లేకుండా, యింటి ముందుకెళ్ళి, ఆ మందులోడితో తన గోడు వెల్లబోసుకుంది. వాడు ఆమెకు కొంచెం విబూతి, కొన్ని మందు ఆకులు యిస్తూ చెప్పాడు. “విబూతి నుదుటిన రాయి. ఆకుపసురు చేతికి పూయి. కనికట్టు వేసినట్టు అంతా మాయమయిపోతుంది. కలత చెందకు అమ్మన్నీ, పళని స్వామి నిన్ను పరిరక్షిస్తాడు.”

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

కళ్ళనో గుండెనో మెత్తగా తాకే క్షణాలైనా
సరదా సరాగాల చెలిమి సమయాలైనా
బంధాలు బంధనాల వంతెనపై
బహిరాంతర్లోకాల నడుమ
నిరంతర వాత్సల్య చలనాలవుతాయి
గుట్టలుగా రాలిపోతున్న క్షణాల మధ్య
బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాల రాశులవుతాయి.

కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతలు కన్నీరు పెడుతుంటే
బరువును తూచలేని త్రాసుతో
విలువ తూలిపడుతుంటే

మళ్ళీ నల్ల కోట్ల
తెల్లని నటన
ఎర్రని వాదన

చక్కటి తెలుగు పదం ‘దీవెన’ అని కేతన వాడినా దీనిని సంస్కృతీకరించి ‘ఆశీరర్థకం’ అని వాడటం వల్ల తర్వాతి కాలంలో ఇంతకుముందే చెప్పినట్లు వ్యాకరణ పరిభాషలో క్లిష్టత ఏర్పడి సామాన్యులకు అర్థం కాకుండా పోయింది. తేలికైన మాటలలో, సులభమైన శైలిలో వ్యాకరణం ఎలా రాయవచ్చో కేతనను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.

బడిలో చదువుకొనేటప్పుడు మనము ఉత్పలమాలకు గణములు భ/ర/న/భ/భ/ర/వ, శార్దూలవిక్రీడితమునకు గణములు మ/స/జ/స/త/త/గ, ఇలా చదువుకొని జ్ఞాపకములో పెట్టుకొనేవాళ్ళము. ఒక్కొక్కప్పుడు అనిపించేది మఱేదైనా సులభ మార్గము ఉంటే బాగుంటుందని. సార్థకనామ గణాక్షర వృత్తములలో ఈ ఇబ్బంది ఉండదు. గణముల పేరులు వృత్తముల పేరులో ఉంటాయి.

ఈ పదిహేనేళ్ళలో సేకరించిన సమాచారం/పాటల-లో ‘చల్ మోహనరంగా’ అన్న నిడివైన పాట ఒకటి ముఖ్యమైనది. ఈ సంచికలో కేవలం ఆ పాట ఆధారంగా తయారయిన ఒక లఘు చిత్రం గురించిన వివరాలు చూద్దాం. దీన్ని వాలి సుబ్బారావు, పుష్పవల్లి పైన చిత్రీకరించారు.

శ్రీశ్రీ రాతలతో పరిచయం వున్నవారికి ‘హరీన్‌ చటో, గిరాం మూర్తి ఇటీవల మా ఇన్స్పిరేషన్’ అన్న శ్రీశ్రీ మాట తెలుసు. శ్రీశ్రీ సప్తతి ఉత్సవాలు కాకినాడలో జరిపినప్పుడు హరీన్ చటోని ఆహ్వానించారు. ఈ సప్తతి సభకి ఆయనే అధ్యక్షుడు. మంచి నటుడు, గాయకుడు, హార్మోనియం బాగా వాయించేవాడు.

అడ్డం వెలికి వచ్చిన చిలిపి మెతక హరిణము సమాధానం: పిరికిమెకము సముద్రపుటల వేగం వల్ల బడలిక చెప్పతరంగాకున్నది సమాధానం: కడలితరంగం నచ్చనిది మరిచి మత్స్యమైనది […]

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

తెలుగు సాహిత్యచరిత్రలో కొద్ది కథలు మాత్రమే రాసి అతి గొప్ప పేరు సంపాదించుకున్న రచయితలు కొందరున్నారు. వారందరిలోనూ కారా మాష్టారుగా సుపరిచితులైన కాళీపట్నం రామారావుగారు అగ్రగణ్యులుగా నిలుస్తారు. ఆయన కథల గొప్పతనాన్ని ఎందరో ప్రశంసించారు. మరెందరో తమను తాము కారా అభిమానులుగా ప్రకటించుకున్నారు. ఏ బహుకొద్దిమందో విమర్శించారు. కాని, ఆ కథల పూర్తి విస్తృతిని, వాటి లోతులను, అవి సూచించే ఐతిహ్యాలను గుర్తించి చర్చించిన పాఠకులే కాదు, రచయితలూ ఎక్కువమంది కనపడరు. కారా మాష్టారి కథలు నలుపు తెలుపుల్లో సమాజరుగ్మతలను ఎత్తిచూపి వాటికి కథలోనే ఒక పరిష్కారాన్ని చూపేవి కావు. అవి సమాజపు సంక్లిష్టతను, మానవ జీవన సంఘర్షణలను అంతే క్లిష్టంగా ప్రదర్శించేవి. వాక్యం వాక్యం చదివి లోతులను అందుకోవాల్సిన ఈ లక్షణమే, ఆ కథలను క్లాసిక్స్ స్థాయికి చేర్చింది. క్లాసిక్స్ కోరుకునే సహనాన్ని, సునిశిత దృష్టినీ కోరినందుకేనేమో బహుశా, ఎందరో పాఠకులు ఆ కథలు ఆవిష్కరించిన సమస్యల అసలు రూపాన్ని పట్టుకోలేకపోయారు. జరగవలసినంత కాకున్నా ఈ కథలపైన చర్చ కొంతైనా జరగడం, వాటిని విశ్లేషించ ప్రయత్నించడం ఆశావహంగా కనిపిస్తున్నా, బలహీనపడివున్న వర్తమాన సాహిత్యచిత్రం కూడా కళ్ళ ముందుకొచ్చి నిరాశ కమ్ముకోక తప్పదు. కథ చదవడం పాఠకులకే కాదు రచయితలకూ రావటల్లేదన్న నిజం, ఇప్పటి సాహిత్యం మీద ఒక అంచనానివ్వక మానదు. ఒక వాక్యం ప్రతిభవంతంగా వాడినప్పుడు అది ఎంత బలమైన ఆయుధం అవుతుందో రచయితలకు తెలియందే కథ బలోపేతం కాలేదు. వాక్యం గురించి, కథనం గురించి చర్చలు జరగందే, రచనను అర్థం చేసుకోవడానికి పడవలసిన శ్రమ మీద ఎవరూ దృష్టి పెట్టరు. బహుముఖీనమైన సాహిత్యాన్ని కేవలం పైపైన చదవడం కాదు, దాని అంతరంగాన్ని కూలంకషంగా తెలుసుకోవాలంటే, సాధన, శ్రమ తప్పవు. వ్యక్తిగత నమ్మకాలకు, రాజకీయ దృక్పథాలకు అతీతంగా, సాహిత్యకారులకు తమదైన ప్రాచీన ఆధునిక సాహిత్యంతో పరిచయం ఉండాలి. సర్వకాలీనమైన క్లాసిక్స్ అనబడే సాహిత్యాన్ని ఏ కాలానికా కాలం, ఏ తరానికా తరం సృష్టించుకోవడం ఒక సాహిత్యావసరం. అలాంటి సాహిత్యాన్ని గుర్తించడం, శ్రద్ధగా గమనించడం, చర్చించడం తరువాతి తరానికి సాహిత్యవారసత్వాన్ని అందివ్వడానికి దారులు. వాటిని మూసేసుకుంటున్న నేటి తరానికి నేర్పించేదెవ్వరు?

రామారావుగారి కథలు చదివించవని చాలామంది అంటే, అలా తప్ప మరోలా రాయలేక పోయానని ఆయన వినయంగా అన్నారు. ఆ మాటలకీ, ఆ వినయానికీ అర్థమేమిటంటే, ఆ కథలు అలానే రాయాలి అని. నాకు తెలిసిన ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పేవాళ్ళు ఎంతోమంది లేరు.

పిన్ని కూతురు రేవతికి పన్నుమీద పన్ను ఎక్కింది. దొంతర పన్ను అంటారట! అది నవ్వితే భలే అందంగా ఉంటుంది. నిజానికి అందంగా కనబడకూడదుగా! అందరూ ఒకలాగ ఉండి ఒకళ్ళు వేరేగా కనబడితే దాన్ని గొప్పగా బాగుందనుకుంటాం కాబోలు! అది నవ్వితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది!

కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు.