ఏ కళైతే మనిషిని తేలికపరుస్తుందనుకుంటామో అదే మళ్ళీ నెత్తిన బరువు కూడా మోపుతోంది. ఏ నీటివల్లయితే బురద అవుతున్నదో అదే నీటివల్ల అది శుభ్రమూ అవుతుందన్నాడు వేమన్న. దీనికి విరుద్ధంగా ఏ కళ అయితే శుభ్రం చేస్తుందనుకుంటున్నామో అదే కళ ఆ కళాకారుడిని మురికిలోకి కూడా జారుస్తోంది. మరి దీనికి ఉన్న మార్గం ఏమిటి?
Category Archive: సంచికలు
యుద్ధం మొదలైన తొలి రోజుల్లో తన ప్రేమ కరీమ్తో యూనివర్సిటీలో ఎలా మొదలైందో నాకు గుర్తుంది. ఆ రోజుల్లో ఇబ్తిసామ్ ఎంతగా మారిపోయిందంటే, ఈ కొత్త పిల్ల అప్పుడే నా కళ్ళ ముందే పుట్టి పెరిగిందనిపించేది. ఆమె కళ్ళు, స్వరం, శరీరం పూర్తిగా స్త్రీత్వాన్ని సంతరించుకున్నాయి. నీలి రంగు జీన్స్ మీద, తెల్ల షర్టు, భుజాల మీదుగా వేలాడేసుకున్న నల్ల కార్డిగన్ వేసుకుని తిరిగే ఇబ్తిసామ్ నాకింకా కళ్ళ ముందే మెదులుతోంది.
కథ చదివేప్పుడు పాఠకుడికి ట్రెజర్ హంట్ లాంటి అనుభవం కలిగిస్తాడు రచయిత. కొన్ని క్లూలు అక్కడక్కడా ఉంటాయి. వాటిని వెతికి పట్టుకోవటం పాఠకుడి పని. పట్టుకున్నాక వాటితో కథను మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సి వస్తుంది. కొందరికది ఇష్టమయితే మరికొందరికి కష్టం.
అనుబంధం 1 Number of Stars in each Star (cluster) according to different writers. నక్షత్రం తైత్తిరీయ శృతి నక్షత్ర కల్ప […]
దప్పిగొన్నప్పటి ఫోటో వేళ్ళాడేస్కుని
దీనంగా ఆవులించినా
కంటి చివర్ల నుంచి చూస్తూ
పట్టాలని బెదిరించడం తప్ప
రైలేనాడేనా ఎక్కించుకుందా
నిన్ను దక్కించుకుందా!
వరరుచి అన్న పేరు నన్ను ఎప్పటి నుండో వెన్నాడుతోంది. ముఖ్యంగా పగటిపూట సూర్యుడున్నప్పుడు మననీడ ప్రమాణాన్ని బట్టి, రాత్రిపూట నడి నెత్తిన ఉన్న నక్షత్రాన్ని బట్టీ సమయాన్ని తెలుసుకుందుకు అతను కొన్ని గణితవాక్యాలు చెప్పాడని తెలుసుకున్న దగ్గరనుండీ ఈ వరరుచి మీద మరింత కుతూహలం కలిగింది.
ప్రతి మనిషీ
రెండు దుఃఖసంద్రాలమధ్య
ఒక నావికుడిగానో
ఒక యాత్రికుడిగానో
ఒక అన్వేషకుడిగానో సాగిపోవడం చూశాక
తేల్చుకున్నాను
దుఃఖమే పరమ సత్యమని.
సందర్భమేమైనా కానీ
ఇష్టమైన ద్రవమేదో ప్రతిబిందువూ త్రాగినట్టు
దానిని ఆస్వాదించినపుడు,
హాయినిచ్చే సంగీతం విన్నట్లు
శ్రద్ధగా దానిలోకి మునిగినపుడు,
ప్రియమైన వ్యక్తి స్పర్శలోకి నిన్ను కోల్పోయినట్లు
దానిలో ఊరట పొందినపుడు
వ్యాకరణ రచనల్లో సంజ్ఞ (వర్ణాక్షరాల, పదాల పరిచయం), సంధి తర్వాత చెప్పే అంశం ‘విభక్తి’, ‘విభక్తి’ నామాలకు సంబంధించింది. వాక్యాలలో అర్థం బోధపడేందుకై పదాల మధ్య సంబంధాన్ని తెలుపుతూ దోహదపడేవి విభక్తులు.
గాలి కొన్ని పొదలను
చిన్నగా కదిలిస్తుంది
కాసేపటికి అంతా సద్దుమణుగుతుంది
తలెత్తి పైకి ఎగసి
తనను తాను మర్చిపోతూ
నిలబడ్డ కెరటం
తన పనిలో మళ్ళీ నిమగ్నమవుతూ
తీరం వైపు పరుగులు తీస్తుంది
ఈలోపు ఘాజీయుద్దీనుగారు ఢిల్లీ దర్బారు చక్రవర్తిగారి వజీరు మొదలయినవారి వలన దక్కనుసుబేదారీకి తానొక అధికారపత్రమును సంపాదించి తరలివచ్చుచున్నారని వార్తయొకటి వ్యాపించెను. అంతట సలాబతుజంగుగారు గోలకొండనుండి తక్షణమే బయలుదేరి ఔరంగాబాదు నగరమునకు పోయి అక్కడనుండుటకు నిశ్చయించిరి.
ప్రతి వృత్తమునకు ఒక విలోమ వృత్తము గలదు. అవి రెండు ఆ ఛందపు సంపూర్ణత్వమును సూచిస్తాయి. సంస్కృతములో పద్యపు పాదము గుర్వంతము. కాని ద్రావిడ భాషలలో దేశి ఛందస్సులో పాదములు ఎక్కువగా లఘ్వంతములు. ఇది విలోమ గీతులలో ప్రస్ఫుటము.
మనకు వాస్తవంలో వీలుకాని విషయాలు కాల్పనిక జగత్తులో సాధ్యపడతాయి. సత్యానికీ, సౌందర్యానికీ మధ్య ఎంపిక తలెత్తినప్పుడు కవి మరో ఆలోచన లేకుండా సత్యాన్ని త్యజించి సౌందర్యం వైపు మొగ్గు చూపుతాడు. విషాదాన్నీ గతపు చేదునీ మనిషి తన జ్ఞాపకాల్లోంచి చెరిపెయ్యడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాడు.
విప్పారిన కళ్ళతో, వికసించిన మనసుతో, శ్రుతి అయిన సర్వాంగాలతో అడవిని తమలోకి ఆవాహన చేసుకొని కాలపు ప్రమేయమూ స్పృహా లేకుండా ఏనాడో వదిలివచ్చిన మనల్ని మనం వెదుక్కుంటూ, తిరిగి ఆవిష్కరించుకొంటూ తిరుగాడే వ్యక్తులు అత్యంత అరుదు.
అడ్డం తెలుగుకోడలుపిల్లేదేశపుకోకిల (7) సమాధానం: సరోజినీనాయుడు పూజ్యులకింకో గౌరవం ఎక్కువిచ్చినా తప్పులేదు (7) సమాధానం: మహారాజరాజశ్రీ తిరిగి పోలీసుదగ్గరకే (3) సమాధానం: రిమాండు ఎదురు […]
క్రితం సంచికలోని గడినుడి-54కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-54 సమాధానాలు.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ప్రతీభాషా తనదైన కొన్ని మహాకావ్యాలను తయారుచేసుకుంటుంది. తరాలు మారినా తరగని సజీవచైతన్యాన్ని తమలో నింపుకుని, చదివిన ప్రతిసారీ నూత్నమైన అనుభవాన్ని మిగులుస్తాయవి. నిత్యనూతనమైన ఆ కావ్యాలే కాలక్రమేణా క్లాసిక్స్ అని పిలవబడి ఆ భాషాసంస్కృతులలో, ఆ జాతి సంపదలో భాగమవుతాయి. ఆయా సమాజాలు ఈ సాహిత్యకావ్యసంపదను ఎలా కాపాడుకుంటున్నాయో ఎలా చదువుతున్నాయో వాటిని ఎలా తరువాతి తరాలకు అందిస్తున్నాయో గమనిస్తే, ఆ సమాజపు సాహిత్యసంస్కారం తేటతెల్లమవుతుంది. తమ తమ భాషలలోని ప్రాచీన మహాకావ్యాలను తాము నిరంతరంగా భిన్న దృక్కోణాల నుండి అధ్యయనం చేయడమే గాక ఇతరభాషలలోకి కూడా అనువదించి వాటిని విశ్వవ్యాప్తంగా సజీవంగా నిలుపుకుంటున్న సమాజాలతో పోలిస్తే, ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజపు అచేతనాస్థితి అర్థమవుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం అన్న పేరు వినపడగానే కాలం చెల్లిన సంగతులేవో చెవిన పడుతున్నట్టు చూసేవారే మన చుట్టూ ఉన్నారిప్పుడు. మూఢభక్తి లాంటి భాషాభిమానమే తప్ప ప్రాచీన సాహిత్యం చదివి సమకాలీనులు తెలుసుకోదగినదీ, నేర్చుకోదగినదీ ఏమీ ఉండదన్న నమ్మకమే చాలామందిలో స్థిరపడిపోయి ఉంది. ప్రాచీనసాహిత్యాన్ని చదవడం భాషాభిమానాన్ని నిరూపించుకోవడానికో సమకాలీన సమాజపు పోకడలకు ఆకాలం ఎంత ఎడంగా ఉందో నిరూపించడానికో అయితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండబోదు. ఆవేశపూరితంగా, తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తూ, ఆలోచనారహితమైన అభిప్రాయప్రకటనగా మిగిలిపోతున్న సమకాలీన సాహిత్యాన్ని గమనించే కొద్దీ, స్పష్టమైన ప్రణాళికతో చిరస్థాయిగా నిలబడగల రసానుభూతితో కళాత్మకంగా సాగే మహాకావ్యాల ప్రాధాన్యం అవగతమవుతుంది. వాటి వైపు వేసే ఒక్కో అడుగూ, మన ఆలోచనలు స్పష్టమయ్యేందుకు తగిన వ్యవధినిచ్చేంత సహనపూరితమైన పఠనానుభవం దొరకనుందన్న హామీనిస్తుంది. ఒక్కో అధ్యాయాన్ని, ఒక్కో అంకాన్ని, ఒక్కో వాక్యాన్నీ శ్రద్ధగా గమనించే కొద్దీ, కథాకథనపద్ధతులు గుణదోషాలతో సహా అర్థమవుతూ ఒక కళగా సాహిత్యాన్ని ఆనందించడాన్ని, విశ్లేషించడాన్ని నేర్పిస్తాయి. విస్తారమైన, సంపూర్ణమైన పఠనానుభవం అందించే మానసికోల్లాసం ఎలాగూ దక్కుతుంది. ఒక వాక్యమో, సన్నివేశమో ఇలాగే ఎందుకు రాశారన్నది గమనించే కొద్దీ, రాతలో కొత్త మెళకువలు తెలుస్తాయి. క్లాసిక్స్ని చదవడం దానికదే ఒక అభ్యాసము, మన అభిరుచిని పెంపొందించుకునే మార్గమూ కనుక సాహిత్యంలో పొల్లునూ గింజనూ విడదీసి చూడటం అబ్బుతుంది. అంటే, పాఠకులుగా, రచయితలుగా మన స్థాయిని, మన భాషాసాహిత్య స్థాయినీ కూడా ఒక మెట్టు పైకెక్కించే అభ్యాసమిది. ఇట్లాంటి అవకాశం, అభ్యాసం, పరిశ్రమ పూర్తిగా మృగ్యమై సాహిత్యం పట్ల కనీస అవగాహన లేని సాహిత్యకారులు చుట్టూ మర్రిమానుల్లా పాతుకుపోతున్నారు. ఇప్పటికైనా మహాకావ్యాలు చదవడమెందుకో మనం గుర్తించలేకపోతే, సమకాలీన తెలుగుసాహిత్యం ముందుతరాలకు క్లాసిక్స్ ఏవీ సృష్టించలేదన్నది కళ్ళకు కడుతున్న నిజం.
సాహిత్యంలో ప్రగతి ఉండదు, విజ్ఞానశాస్త్రంలో వలె. కవికి సమాజం పట్ల ప్రత్యక్ష బాధ్యత ఉండదు, అంటాడు ఎలియట్. అతని బాధ్యత భాషకే. తన సాటివారి భాషను స్వీకరించి, దానిని శుద్ధిచేసి, కావ్యయోగ్యంగా తీర్చి దిద్దడమే ప్రజల పట్ల కవి పరోక్షబాధ్యత.
నేను ప్రతిరోజూ
రెండు పూటలా
ఒక ఆడపిల్లల కాలేజ్లో
ఫిజిక్స్ పాఠాలు చెబుతాను
తీరిక వేళల్లో – అంటే
కాలేజ్కి శలవులప్పుడూ
వాళ్ళు బుద్ధిగా
పరీక్షలు రాస్తున్నప్పుడూ
నేను కవిత్వం రాస్తాను.