ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.

సాంఘికంగా మార్పు చెందుతున్న స్త్రీ రూపం మనలో ఒక రకమైన అవ్యవస్థని సృష్టించింది. ఒక సమస్యతో జీవిస్తున్నంత కాలం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం మానవ సహజం. కాని, నిజం చెప్పాలంటే, మనలో ఎవ్వరికీ — భర్తలుగా, భార్యలుగా, ప్రేమికులుగా, చిత్రకారులుగా, విమర్శకులుగా — ఈ విషయాలపై సంపూర్ణ జ్ఞానం లేదు అని ఒప్పుకోవటం కష్టం.

బ్రౌన్ తెలుగు ప్రజలతో కలిసిమెలిసి తిరిగి రాతప్రతులని వాళ్ళు ఇళ్ళల్లో భద్రపరిచే తీరు, చదివే తీరు, అందులో తేడాలు, అన్నీ గ్రహించి వుంటే తెలుగు గ్రంథ ప్రపంచాన్ని గురించి ఆయనకు కొంత అవగాహన వచ్చేది. కానీ ఆ ఆలోచన ఆయనకి రాలేదు. తెలుగు గ్రంథసంస్కృతి యూరోపు దేశాల గ్రంథసంస్కృతికన్నా భిన్నమైనదేమో అన్న సందేహం కించిత్తయినా కలగలేదు కూడా.

చుక్కలను తాకకుండ వాటి చుట్టు ముగ్గుపొడితో, తడి పిండితో చిత్రవిచిత్రములైన ఆకారములను సృష్టించుటకు వీలవుతుంది. వీటిని మెలిక ముగ్గులు లేక మువ్వల ముగ్గులు అంటారు. వీటిని జాగ్రత్తగా వేసినప్పుడు ఇందులో ముడులు కనబడుతాయి. ఇవి త్రాటితో లేక త్రాళ్ళతో నేసిన తివాచీలలా కూడ ఉంటాయి. ఇవియే నిజమైన మెలిక ముగ్గులు.

ఇంతటి విజ్ఞానాన్ని పదిమందికీ తెలియపరచటం ఎంతో కష్టమైన పని. వీఎన్నార్‌ను కేవలం తెలుగు భాషలో ఒక మూల పడున్న సాహిత్యాన్ని తర్జుమా చేసేవాడుగా తీసిపారేయడం, ప్రత్యేకించి పాశ్చాత్య విద్యాసంస్థలలో, ఎంతో సులభంగా జరిగే పని.

భారత సాహిత్యంలో చారిత్రక రచన ఏ ఒక్క సాహిత్యవర్గానికో పరిమితమై ఉండలేదు. అటువంటి విభజనలకి అతీతంగా పద్య మహాకావ్యం నుంచి తెలుగు వచన చారిత్రము దాకా సాహిత్యంలో ఎన్నో రూపాలలో అది విస్తరించింది. ఈ సాహిత్య రూపాలేవీ కూడా స్వతస్సిద్ధంగా చారిత్రక రచనలు కావు; ఆ రకంగా అవి ఎప్పుడూ ఆ సమాజంలో చూడబడలేదు.

నేను అతిశయోక్తిగా చెప్పడం కాదిది. కానీ మేధావులు పుట్టడమే ప్రత్యేకంగా పుడతారు. ఎంతో దూరం నుంచి చూస్తున్న నాకు, 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యావరణంలో ముగ్గురంటే ముగ్గురే అందరికంటే ఉన్నతంగా కనిపిస్తారు. వారు గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ, వెల్చేరు నారాయణ రావు.

మన సమాజానికి వైవిధ్యపు అవసరం మీద, మన భవిష్యత్తు మీద మనకు సరైన అవగాహన ఎందుకు లేకుండా పోయిందన్న ప్రశ్నకు, 2009లో నారాయణ రావు గారు, పరుచూరి శ్రీనివాస్, నేను మ్యూనిక్‌లో పెయింటింగ్ గాలరీలు చూసి వచ్చి బైట నిలబడి మాట్లాడుకుంటున్నప్పుడు, నారాయణ రావు గారు చెప్పిన సమాధానం ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటుంది.

నారాయణ రావు ఒక సిద్ధాంతానికి, ఒక కాలానికీ పరిమితమై పోయేవాడు కాడు. గొప్ప రచయితలకి సిద్ధాంతాల చట్రాలు పట్టవు అని గుర్తు చేసుకోవడం ఎంతైనా అవసరం. దక్షిణ భారత సాహితీ సంస్కృతి, చరిత్ర అవగాహనలో ఒక విప్లవం తీసుకొని వచ్చిన నారాయణ రావు వంటి సాహిత్య మేధావి విషయంలో మరీ మరీ అవసరం.

నారాయణ రావు (నారా) తెలుగు సాహిత్య విమర్శ రచనల్తో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని వాటన్నిటిని విహంగవీక్షణంతో చూస్తూ కొంత విశ్లేషణ అందిస్తున్నా. గుణాగుణాల్ని గుర్తించి కొన్ని మౌలిక భావాల్ని ఎత్తిచూపటానికి స్థూల ప్రయత్నం చేస్తున్నా. చివరగా పాఠకులం ఏం చెయ్యొచ్చునో ఉచిత సలహాలు, నారాతో నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని, జత చేస్తున్నా.

పిల్లవాడిని వదిలి బరువు గుండెలతో వెళ్ళే కారుణ్యమూర్తి అయిన గౌతమ బుద్ధుడు, అయోధ్య నగర అంతఃపురాల్లో నుంచి దండకారణ్య పర్ణకుటిలో తన జీవిత సౌభాగ్యాన్ని వెతికే ఊర్మిళాదేవి ఉత్కంఠ, గంగానది గట్టు మీద నిలిచి నిర్ఘాంతపోయి ఏటి కెరటాలలో ఎక్కడకో కొట్టుకుపోయే కొడుకు వైపు నిశ్చల నిరీహ నేత్రాలతో చూచే కుంతీకుమారి గుండెల చప్పుడు – ఇతివృత్తాలు.

మొట్టమొదటగా పికాసో చిత్రాలను చూచి సంభ్రమాశ్చర్యాలను పొందాడు బ్రాక్. తాను ఇంతవరకు చూడని క్రొత్త పద్ధతి, పికాసో యొక్క చిత్రకళా విధానం ఇతన్ని కలవరపరిచినై. తాను చేసే ఫావిౙమ్ పద్ధతితో ఇక లాభం లేదు, ఏదో మార్పు తేవాలి తన చిత్రాలలో అనుకున్నాడు. అందుకే ద్విగుణీకృత నిశ్చయంతో చిత్రాలను వెయ్యడం ప్రారంభించాడు.

ఎమర్జన్సీ సడలించిన తరువాత 1977లో గౌతమరావు లోక్‌సభకి జనతా పార్టీ నుండి పాత మిత్రుల ప్రోద్బలంతో బలవంతంగా పోటీ చేశారు. రాజకీయంగా ఆయనని ప్రభావితం చేసింది జయప్రకాశ్ నారాయణ్. ఆ ఎన్నికలప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం హృదయాన్ని కదిలించి వేసిందని ఎంతో మంది ఎన్నో ఏళ్ళు చెప్పుకోగా నేను విన్నాను.

ఆగస్టు నెలలో తెలుగుదేశం పలువురు ప్రముఖుల్ని కోల్పోయింది. అందరి గురించి తెలుగు పత్రికలు నిడివైన వార్తలనే అందించాయి, వారి వారి అభిమానులు, శిష్యులు ఘనంగా నివాళులర్పిస్తూ వివరంగానే వ్యాసాలు రాశారు, ఒక్క కమలా చంద్రబాబు గారి విషయంలో తప్ప.