ఈ నేపథ్యంలో రాసిన కథలు చదివినపుడు ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనవుతాం. అది ఒక మంచి కథ చదివిన సంతోషమా? కాదు. కథాంశంలోని దుఃఖమా? అదీకాదు. ప్రతీకథా చదివిన వెంటనే మరోకథ చదవలేము. కథ చదివిన తర్వాత కొంతసేపు కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోతాం.
రచయిత వివరాలు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
శీలా సుభద్రాదేవి రచనలు
పెళ్ళిళ్ళ నిర్ణయాలలోను, దాంపత్య జీవితాలలోను, పిల్లల పెంపకంలోనూ తరాల పరిక్రమణలో వచ్చే మార్పులు, భారతదేశంలో ఎలా వస్తున్నాయో విదేశాలలోని భారతీయ కుటుంబాలలోను అదేవిధంగా వస్తున్నాయనేది నిరూపించే ప్రయత్నం ఈ నవలలో రచయిత్రి చేసింది. కుటుంబపరమైనదే కాకుండా సాహిత్యంలో, సభలూ సమావేశాలలో, సాహితీవేత్తల మనోభావాలలోని మార్పుల్ని కూడా పట్టిచూపించే ప్రయత్నం ఉంది.
హాస్యం, వ్యంగ్యమే తన కతల్లో కూడా ప్రధాన రసాలైనా కరుణ, సానుభూతి, కదాచిత్తుగా ఎత్తిపొడుపు, సాహిత్యపరమైన విశ్లేషణ కూడా కనిపిస్తుంటాయి. రచయిత్రికి ఎవరిమీదైనా గాని, ఏ అంశం మీదైనా గానీ ఖచ్చితమైన అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడో, ఎదుటివారి అభిప్రాయాన్ని ఖండించవలసి వచ్చినప్పుడో గొంతు పెగలకపోతే సంద్రాలు పాత్ర హఠాత్తుగా ప్రత్యక్షమైపోతుంది. కుండబద్దలు కొట్టినట్లు దెబ్బలాడాలన్నా రచయిత్రికి సంద్రాలే దిక్కు.
శ్రీదేవి కథలలోని పాత్రలన్నీ సజీవ చైతన్యంతో ఉంటాయి. దృఢమైన వ్యక్తిత్వం కలిగివుండి, జీవితంపైన స్పష్టమైన అవగాహన కలిగివుంటాయి. వేసే ప్రతీ అడుగూ తడబడకుండా ఆచితూచి వేస్తాయి. పొరపాటున అడుగు పక్కకు తప్పినా దానికి మరొకరిపై నింద వేయవు. తమ తప్పిదాన్ని తామే తెలుసుకుని మేలుకుంటాయి.
అనుపమకు స్కూల్ ఫైనల్ చదువుతుండగా కళ్ళు మండుతుంటే వేడి చేసిందేమో అనుకుంటే ఒకకన్ను పోయి, మరో కన్ను కూడా మసకేసి క్రమంగా పోయే పరిస్థితి వస్తుంది అని తెలుస్తుంది. అన్నీ సక్రమంగా అమరివున్న వాళ్ళకే పెళ్ళిళ్ళు జరగటం కష్టమైన రోజుల్లో ఒకలోపం ఉన్నప్పుడు పెళ్ళికావటం కష్టం అనే పరిస్థితులు ఆనాడు. సహజంగానే అనుపమని చూసుకునేందుకు పెళ్ళిచూపులకు వచ్చిన పెళ్ళికొడుకులు ఆమె చెల్లిని చేసుకుంటాననే రోజులు కూడా ఆనాడు.
బతుకు గతుకుల్లో గట్టి దెబ్బ తగిలినప్పుడు అవి కరిగి బయటకు తేలతాయి. నమ్మిన వాళ్లకు దేవుడు ఒక ఆసరా. నాకు నేనే ఆసరా, మనసును స్వాధీన పరచుకోగలిగితే, కార్యకారణ సంబంధాలను హేతుబద్ధతతో వివేచించగలిగితే దారి స్పష్టమవుతుంది.