సీతాకోకచిలుక పురుగునుండి బయటపడడంతో కథ పూర్తి కాదు. వచ్చిన రెక్కలతో ఎగరగలగాలి. త్యాగము ప్రేమ నిండిన జీవితం కోరుకోవడం, అభ్యుదయభావాలను నిరసించి నిశ్శేయసం వైపు రావడం, పోరాటంలో సగభాగమే. పోరాటం కేవలం బయటి ప్రపంచంతో కాదు, తన లోపల నిలిచిపోయిన ఊహలతో కూడా.
మార్చ్ 2025

తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకోవలసి వచ్చినప్పుడల్లా ముఖ్యంగా ముందుకు వచ్చేవి అవే అంశాలు – సాహిత్య సభ్యత, సంస్కృతి, విమర్శ లేమి. అయితే, ఈమధ్యన తెలుగు సాహిత్యంలో విమర్శ అనే పదం వినిపిస్తుండడం ఒక పరిణామం. అది మంచికనుకునేలోపే కాకుండా పోవడమూ ఇంకో పరిణామం. కన్నుమూసి తెరిచేంతలో పుస్తకంపై విమర్శ కాస్తా, వ్యక్తిగత స్పందనలు, ప్రతిస్పందనలు, ఆపైన దూషణలుగా మారడం ఇప్పుడు కనిపిస్తున్న విమర్శాలోకపు వాతావరణం. విమర్శ అంటే మంచినైనా చెడునైనా, పొగడ్తనైనా తెగడ్తనైనా ఒక సభ్యమైన భాషతో ఇవ్వగలగాలి; ఒకవేళ విమర్శలో సభ్యత కొంత లోపించినా కవిరచయితలు ఒక మెట్టు పైనే ఉండి ఆ అభిప్రాయాలను స్థితప్రజ్ఞతతో తీసుకోగలగాలి. నిజానికి, పుస్తకం కాని ఒక రచన కాని ప్రచురించినాక, పాఠకుల లోకంలో రచయితలు ఎక్కడా ఉండకూడదు. దురదృష్టవశాత్తు మన తెలుగు కవిరచయితలు అక్కడే తచ్చట్లాడుతుంటారు అందరి ముఖాలూ ఆశగా చూస్తూ, ఎవరు ఏమన్నా వెంటనే దబాయిస్తూనో, కృతజ్ఞతలు కురిపిస్తూనో. రచయితల స్పందనలను పక్కన పెడితే, ఈ సదరు విమర్శకులకు కూడా వాక్యం మీద కొంత అవగాహన, పట్టు ఉండటం ఎంత అవసరమో ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేరు. విమర్శ కూడా సాహిత్యంలో ఒక భాగం అని, మిగతా సాహిత్య ప్రక్రియల్లాగే విమర్శకి కూడా సాధన తప్పనిసరి అని చెప్పేవాళ్ళు కనపడటం లేదు. పాఠకులుగా అయినా సరే ఒకరు సాహిత్యాన్ని చదివినా, విశ్లేషించినా దాని గుణగణాలు ఎంచవలసింది తమ ఇష్టాయిష్టాల సరిహద్దులకు ఆవలగానే. ఒక రచన పాఠకులలో ఆహ్లాదం కలిగించినా, ఏహ్యత కలిగించినా సాహిత్య దృక్కోణంలో అవి ఒకే నాణ్యత, విలువ కలిగినవి. అనుభూతి లక్షణం కాదు, ఆ అనుభూతి స్థాయి లేదా తీవ్రత మాత్రమే ఆ నాణ్యతను నిర్ణయిస్తుంది. సాహిత్య సద్విమర్శ ఇది అర్థం చేసుకుంటే తప్ప సాధ్యం కాదు. కళను కళగానే సమీపించాలి. సాహిత్యాన్ని సాహిత్యపరిధిలోనే విమర్శించాలి. పికాసో, గొగాఁ, దలీ తదితరుల చిత్రాలను విశ్లేషిస్తున్నప్పుడు వారి వైయక్తికజీవితాన్ని విమర్శకులు పట్టించుకోరు. తమ దృక్పథపు కళ్ళగంతలనుంచి మాత్రమే సాహిత్యాన్ని సమీపించే తెలుగుసాహిత్యసమాజానికి ఇది అర్థమూ కాదు, సాధ్యమూ కాదు. అందువల్ల విమర్శ ఎంత పేలవంగా మిగిలిపోతున్నదో, కవిరచయితల, వారి అనుయూయుల డాంబికపు సమర్థింపూ అంత బలంగా ఉంటున్నది. అందుకే, మనకి ఇప్పుడు విమర్శలో మనుషుల పేర్లు, వారిపట్ల విమర్శలు తప్ప, నిజమైన సాహిత్య చర్చ కనుమరుగు అవుతోంది. ఎప్పుడైతే చర్చ మనుషుల మీదకు మళ్ళుతుందో అప్పుడు సాహిత్యం తప్ప అన్నీ వివాదంలోకి నెట్టబడతాయి. ఒక సినీమా నచ్చనివారు అందులో లోపాలు ఏమిటో విశ్లేషించకుండా ఆ దర్శకుడినో, నటులనో దూషించడం వంటి అపరిపక్వ ప్రవర్తన ఇది. ఎంత బలమైన ప్రతికూలత మనలో కలిగించినా, భిన్న దృక్పథాలకు అంతే విలువ ఇస్తూ, కేవలం వస్తుచర్చ ద్వారా వాటిని ఖండించడం పరిణతి చెందిన ప్రజాస్వామ్యసమాజంలో కనిపించే/చవలసిన లక్షణం. జాతీయ నాయకులనుంచి, ప్రాంతీయ సేవకులదాకా ఇది ఏ రంగంలోనూ, ఎవరిలోనూ మనదేశంలో కనిపించదు. సాహిత్యసమాజంగా సభ్యత బైట ప్రపంచానికి నేర్పుదామా, వారినుంచి నేర్చుకుందామా అన్న ప్రశ్నకు సాహిత్యకారులు సమాధానం నిర్ణయించుకున్నట్టే ఉన్నారు. అందుకని, ఇక మాట్లాడుకోవలసింది ఇవి ప్రచురిస్తున్న వేదికలు, వాటి నిర్వాహకుల గురించి…
ధైర్య సాహసాలు, మొక్కవోని పట్టుదలలూ ఉన్న ఎందరో అనుభవజ్ఞులు హిమాలయాల్లో ప్రాణాలు కోల్పోయారన్నది కఠోర వాస్తవం. వారి కథలు తలచుకుంటే ప్రకృతి ముందు ఎంతటివారైనా తల వంచవలసిందేగదా అనిపిస్తుంది. ‘ఎంత అనుభవం ఉన్నా ప్రతి యాత్రా ఒక నూతన ప్రయత్నం. ప్రమాదభూయిష్టం.
అద్దం ఎదుట నిలబడి ఒకసారి చూసుకొండి! ఏమిటి కనిపించింది? రెండు కళ్ళతో సూటిగా ఎదుటికి చూస్తూన్న ఒక భోక్త విగ్రహం! దరిదాపుగా భోక్తలన్నిటికి రెండు కళ్ళు, ముఖానికి మధ్యస్థంగా ఉండి, ఎట్టఎదుటకు సూటిగా చూస్తూ ఉంటాయి; తద్వారా వాటి ద్విచక్షు దృష్టిని ఉపయోగించి అవి భోజ్యాన్ని వేటాడి తినగలవు!
మల్లేస్వరి వరసగా నాల్రోజులు స్కూలుకి రాపొయ్యేసరికి సారు కొట్టిన దెబ్బలకే అనుకున్నారు అబ్బాయిలంతా. అమ్మాయిలం మాత్రం తలా రెండ్రూపాయిలు యేసుకుని ఒక చిన్న గిఫ్టు కొన్నాం. పదకొండోరోజు మద్యానం పర్మిషనడిగి లంచి టైమ్లో యెల్లి గిఫ్టిచ్చి ఫోటో కూడా దిగాం. మల్లేస్వరి చీర కట్టుకుని కుర్చీలో కూచుంటే మా చిన్నప్పుడూ వాళ్ళ అమ్మ ఉన్నట్టే కనపడింది. తలనిండా కనకాంబరం పూలు పెట్టారు.
“అపచారం! అపచారం! అమ్మ గుడి తగలడిపోతోoదొరేయ్!” గుండెలు బాదుకుంటా వీధిగుమ్మంలోనే సొమ్మసిల్లి పడిపోయింది గణికమ్మ. గణికమ్మ ఇంట్లో కరెంటుబల్బు ఠక్కున వెలిగింది. ఇంట్లో జనం వీధిలోకొచ్చేరు. అందరూ గుడివైపు చూసి గుండెలమీద చరుసుకుంటూ పెడబొబ్బలు పెట్టారు. ఆ అరుపులకు ఊరు ఊరంతా లేచింది. వీధిమొగలో వేణుగోపాలస్వామి గుడిని అనుకుని ఉన్న పుంతరేవమ్మ గుడి వైపు పరుగులు పెట్టారు ఊరిజనం.
చిటచిట నిప్పులు రేగిన
నా ఆకలి తీర్చుట కనుకొందును!
పెళపెళ మొయిళ్ళు కురిసిన
నా స్నానము కొరకే ననుకొందును!
తొటదొట రాళ్ళే పైబడిన
రాలిన పుష్పములనుకొందును!
ఆశిష్ నంది ఆధునిక ఇండియాని అమెరికా పాశ్చాత్య దేశాల నకలుగా భావించారు. మొదట్లో అమెరికా ఒక ఒకే ఒక దేశంగా ఎదుగుతున్న క్రమంలో సివిక్ మిషన్ – ఒక పౌరుడు ఒక జాతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేయడం – ప్రధానంగా భావించబడింది. ఉత్పత్తి పెంచడం, రవాణా విస్తరించటం వాటికవే లక్ష్యాలు కాదు. ఒక జాతి భావనను కూడా అధిగమించి, పౌరుడు అనే ఉమ్మడి కమ్యూనిటీ వైపు ప్రయాణం ప్రధానంగా భావించబడింది.
తెలుగు సాహిత్యం రాసే వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ. పతంజలిగారు ఎంత బాగా రాస్తారో అంతకు కొన్ని వేలరెట్లు బాగా బాగా చదువుకున్న మనిషి. అదీ ఇదని మాత్రమే కాదు, చదవదగ్గది అనుకున్న ప్రతీదిని ఆయన ఎంత చదువుకున్నాడో లెక్కేయడానికి లెక్కేలేదు.
కకావికలై దారితప్పిన మిత్రులనూ;
రెక్కలు తెగిన ఆప్తులనూ;
మళ్ళీ కలుస్తానో లేదోనన్న బెంగ
కంటి గోళాల్లో ప్రతిఫలిస్తోంటే…
నిన్నటినుంచీ ద్వారం మీద
నిశ్చలంగా వాలినది వాలినట్టే
తెరిచిన పుస్తకంలో
కళ్ళు మూసిన అక్షరాలు
అక్షరాల మధ్య
గగుర్పొడుస్తున్న అర్ధవిన్యాసం
కంఠంలో ఇరుక్కున్న విషం
విషాద మేఘాల కంట తడి
అప్పటి వరకు ఎక్కడో కాపేసిన పిలగాళ్ళు
భయపడుతూనే చుట్టూ చేరతారు
వాళ్లేం మాటలు విసురుతారో-
ఫౌంటేన్లోంచి నీళ్ళు చిమ్మినట్టు
చివాల్న ఒకటే నవ్వుతుంది
ఆ పిల్ల, చేయడ్డెట్టుకుని.
ఈ గాజుసముద్రం
నన్ను నా నుండి వేరు చేసింది
సమస్త భూమండలాన్ని
లోనికి లాగేసింది
మానవ స్పర్శను విడదీసి
ఎడారిగా మిగిల్చింది
నా కవితా వ్యాసంగం మా ఊళ్ళో వాళ్ళకు తెలిసింది. వాళ్ళు నేనేదో మహాకవినై పోయినట్లు గౌరవించేవాళ్ళు. దాంతో నాకు ప్రోత్సాహం కలిగింది. ప్రతిదినం ఏటి ఒడ్డుకు పోయి కూర్చుండి నీళ్ళకు వచ్చే వాళ్ళను, పశువులను కడిగేవాళ్ళను, పాత్రలు తోముకునే వాళ్ళను చూస్తూ రకరకాల పద్యాలు రాసేవాణ్ణి.
ఏ ప్రక్రియలో ఐనా ప్రాథమిక అంశాలు కీలకమైనవి. శాస్త్రీయ సంగీతంలో ముందు సరళీస్వరాల మీద సంపూర్ణమైన పట్టును సంపాదించేందుకు చాలా కృషి చేయాలి. హిందుస్తానీ శైలిలో ఐతే కేవలం ‘ఆ’కార్ గాయనంలో నైపుణ్యం సంపాదించేందుకు సంవత్సరాల తరబడి సాధన చేస్తారు! సాహిత్యమూ అంతే. కవులు, రచయితలు కాదల్చుకున్నవారికి మొదట ప్రాథమిక అంశాలలో ప్రావీణ్యం ఉండటం అవసరం.
ఈ నేపథ్యంలో రాసిన కథలు చదివినపుడు ఎన్నడూ ఎరగని అనుభూతికి లోనవుతాం. అది ఒక మంచి కథ చదివిన సంతోషమా? కాదు. కథాంశంలోని దుఃఖమా? అదీకాదు. ప్రతీకథా చదివిన వెంటనే మరోకథ చదవలేము. కథ చదివిన తర్వాత కొంతసేపు కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోతాం.
విజయ కథలన్నీ దాదాపు నగరాలకు సంబంధించిన మహిళల కథలు. అవి అన్ని తరగతులకు, వర్గాలకు చెందిన స్త్రీల జీవితాలకు ప్రతిబింబాలు. అసమానతలు, వివక్షలు, ఆంక్షలు, సమస్యల మధ్య సతమతమవుతున్న అతివల చిత్రాలు. పితృస్వామ్య ఆధిపత్యాలపై ప్రశ్నలు లేవనెత్తిన అభ్యుదయ రూపాలు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: