మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..
మే 2025
ఈమాట సంపాదక వర్గానికి మాధవ్ మాచవరం పేరు గత కొన్నేళ్ళుగా సమానార్థకంగా స్థిరపడింది. 1998లో స్థాపించబడిన ఈమాట పత్రికకు తొలినాళ్ళ నుండి ఎందరో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తమ సేవలు అందిస్తూ ఉన్నా, 2008లో సంపాదక వర్గంలో సభ్యునిగా చేరిన మాధవ్, అనతికాలంలోనే ప్రధాన సంపాదకునిగా మారి ఈ పత్రిక పూర్తి బాధ్యతలను తన తలకెత్తుకొని గత కొన్నేళ్ళుగా ఈమాటను దాదాపు ఒంటిచేత్తో నడిపిపించాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తన ఈ పదిహేడేళ్ళ సేవలకు స్వల్ప విరామాన్ని ప్రకటిస్తూ, మాధవ్ మార్చి సంచిక తరువాత నుండి ఈమాట సంపాదకవర్గం నుండి పక్కకు తప్పుకున్నారు. కొత్త రచయితలను ప్రోత్సహించి రాయించడం దగ్గర నుండీ, వాళ్ళతో రచనకు సంబంధించి సుదీర్ఘమైన చర్చలు చేస్తూ వాళ్ళ ఆలోచనల్లో స్పష్టత తీసుకొచ్చే దాకా; కొత్త శీర్షికలకు ఆలోచన చెయ్యడం నుండి, ప్రత్యేక సంచికలు తీసుకు రావడంలో చొరవ చూపడం దాకా మాధవ్ ఈమాటకు అందించిన తోడ్పాటు అమూల్యమైనది. ఎందరో రచయితలు తమ తమ రచనల పట్ల మాధవ్ చూపిన శ్రద్ధకి, మొదలెట్టిన చర్చకి, ఆ రచన మీద నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాలకి ప్రభావితమయి మళ్ళీ మళ్ళీ ఈమాటకే రచనలు పంపడం, ఎడిటర్గా మాధవ్ శ్రద్ధను, పత్రిక మీద, రచనల మీద వెచ్చించిన సమయాన్ని తేటతెల్లం చేస్తాయి. మరీ ముఖ్యంగా, ప్రచురణలో ఈస్తటిక్స్ విషయంలోను, పత్రిక విడుదలకు సంబంధించిన సమయపాలన విషయంలోను, మాధవ్ చూపిన క్రమశిక్షణే ఈమాట పత్రికను మిగతా ఆన్లైన్ పత్రికల నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది. రచయితకు చెప్పదలచుకున్న విషయంపై పూర్తి అవగాహన, స్పష్టత ఉండాలని; అవి రచనలో కనిపించేలా, రాసిన రచనను అక్షరం అక్షరం సరిదిద్దుకుంటూ మెరుగు పర్చుకోవాలని బలంగా నమ్మటమే కాకుండా సంపాదకునిగా ఈ విషయంపై పలు రచయితలను ఒప్పించి, వారి రచనలను పరిష్కరించడానికి ఎంతో ఓపికతో వారితో కలిసి పనిచేసి ప్రచురించడంలో మాధవ్ చూపిన పట్టుదల అనితరసాధ్యమైనది. ఈమాటకు రచనలు పంపాలంటే ఒక స్థాయి ఉండాలి అన్న మాటల నుండి, ఈమాట సంపాదకుల విమర్శ కఠినంగా ఉంటుందనే మాట దాకా, ఈమాట మీద వచ్చిన ఎన్నో ప్రశంసలకు, విమర్శలకు కూడా ఒకరకంగా మాధవ్ పనితీరే కారణం. సంపాదకుడిగానే గాక, మాధవ్ తన రచనలతోనూ ఎన్నో ఈమాట సంచికలను సుసంపన్నం చేశారు. సునిశితమైన విమర్శా వ్యాసాలను, వ్యంగ్య రచనలను, అనువాద కథలను మాధవ్ ఈమాటలో ప్రచురించారు. గత కొన్నేళ్ళుగా ఈమాటలో ముందుమాటల ద్వారా, సంపాదకీయాల ద్వారా సాహిత్య ప్రపంచాన్ని తనదైన గొంతుతో విశ్లేషిస్తూ, విమర్శిస్తూ ఆ ప్రపంచపు పోకడలను, అక్కడి లోపాలను, మెరుగుపరుచుకునే మార్గాలను చర్చకు తెస్తూనే ఉన్నారు. తన అవిరామ కృషిని మనస్పూర్తిగా అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ విరామం స్వల్ప వ్యవధికే పరిమితం కావాలని, త్వరలోనే మాధవ్ తిరిగి సంపాదకత్వం చేపట్టాలని ఈమాట తరఫున కోరుకుంటున్నాం.
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.
ఈ సంవత్సరం జ్ఞానపీఠ్ అవార్డ్ ఛత్తీస్ఘడ్కు చెందిన వినోద్కుమార్ శుక్లాకు లభించింది. ఈ సందర్భంగా ఆయన రాసిన ‘దీవార్ పర్ ఏక్ ఖిడికీ రహతీ థీ’ అనే హిందీ నవల గురించి భారతీయ నవలా దర్శనం అన్న పుస్తకంలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు రాసిన వ్యాసాన్ని ఈమాట పాఠకులకోసం పునర్ముద్రిస్తున్నాం.
పిచ్చివాడు వాళ్ళమధ్యకు దూకి, వాళ్ళను తీక్షణంగా చూశాడు. “ఎక్కడికెళ్ళాడు దేవుడు?”, అని అరిచాడు; నే చెబుతా. మనం చంపేశాం, నీవూ, నేనూ. మనమంతా ఆయన హంతకులం. కాని, ఎలా చంపాం? సముద్రాన్ని ఎలా తాగగలిగాం? ఆయన ఆనవాళ్ళు లేకుండా దిగంతాలను ఏ తడిగుడ్డతో తుడిచేశాం? సంకెళ్ళు తెగగొట్టి యీ భూగోళాన్ని సూర్యుడినుండి విడిపించినపుడు, మనం ఏం చేస్తున్నామో తెలిసే చేశామా? తెగిన భూగోళం ఎటు వెళుతున్నది? మనం ఎటువైపు వెళుతున్నాం? ఆదిత్యులనుండి దూరదూరంగా?
మహాయాన బౌద్ధానికి చెందినదీ టిబెటియన్ బుద్ధిజం. జాతకకథల్లో చెప్పినట్టు బుద్ధుడు అనేక అవతారాలు ఎత్తిన మహనీయుడు అని వీరు నమ్ముతారు. అందులో కొన్ని జంతురూపపు అవతారాలు కూడానట. వాటి వాటి గుణధర్మాలు సామాన్యులు గ్రహించి అనుసరించాలన్నది ఆ అవతారాల ఉద్దేశ్యమట.
స్వచ్ఛమైన గాలీ, నీరు ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో చాలావరకూ ఆరోగ్యంగా వుంటారేమో. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు ఆనందంగా కూడా వుంటారనుకుంటాను. అందుకేనేమో భూటాన్ను ఆనందమయదేశం అంటారు.
రాత్రికి రాత్రే సముద్రం రణరంగంగా మారిపోయింది. గాలి భీకరంగా వీచింది. నీరు నిలువెల్లా ఉప్పొంగిపోయింది. ఆకాశం చిమ్మచీకటిగా మారింది. వేటయన్ ఊహించిన విధంగా సముద్రం తన నిజరూపాన్ని చూపిస్తున్నదని గ్రహించాడు. అలలు పడగెత్తి, ఒడ్డుకు ఉరికి పడుతూ, ప్రతీదానికంటే మరొకటి మరింత గర్జనతో ముందుకొచ్చాయి. వేటకు వెళ్లిన బోట్లలో ఒక్కటీ తిరిగి రాలేదు
ఈ ఆధునిక సిద్ధాంతాలను చూసినప్పుడు, కుమారిల భట్టు కంటే శంకరాచార్యులు, బౌద్ధులు సత్యానికి ఎక్కువగా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. బౌద్ధులు, శంకరాచార్యులు కూడా స్థల-కాలాలు మనోనిర్మితాలని, మనం చూసే దృశ్యాలు దేహ పరిమితుల నుంచి పుట్టాయని చెప్పారు. ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా దాదాపు ఇటువంటి సిద్ధాంతాన్నే ప్రతిపాదించడం ఆబ్బురపరిచే విషయం.
మధ్య జీవితాన్ని వదిలేస్తే
పుట్టుకకి, మరణానికి
విషచషకం
మతమొక్కటే
లాల్గుడి జయరామన్ చిన్నగా నవ్వి “నేను వాయించటానికి నువ్వు ఏమి అట్టేపెట్టావు నాకు? నువ్వు కాఫీ రాగం సంపూర్ణంగా పాడేసావు. అంచేత నాకేమీ మిగల్లేదు. అప్పుడు నేను ఇంక వాయిస్తే బాగుండదు. అందుకనే పాడేయమన్నాను” అన్నారు.
“ఇవాళ మేడే!”
“అంటే?”
“అమెరికాలో, చికాగో నగరంలో కార్మికులు తమ ప్రాణాలనొడ్డి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారు.”
“ఎవర్నువ్వు?”
“దేవుడిని. నీతో చిన్న పనుంది.”
“ఓహో… నేను అమితాబ్ బచ్చన్ని! నాకు నీతో పనేం లేదు. పోయి ఇంకెక్కడైనా పని చూసుకో.”
ఎటు పొంచియున్నాడొ యెక్కుపెట్టిన యమ్ము
కటునిషాదుం, డెంత కఠినమా హృదయమ్ము
త్రుటిలోన నేసె నాతురముగా గురి చూసి
చటుకునన్ మగపక్షిఁ జంపె గుండెను దూసి
వేదశాస్త్ర ఆగమ పురాణములెల్ల
తవుడు నూకల దంపుడే సుమీ!
దంచుటెందుకు? చెరుగుటెందుకు?
చెదిరే మనసును నిలుపగలిగిన
అంతా బట్టబయలు చెన్నమల్లికార్జునా!
నీ ప్రియుని రహస్య భాషణ
నువు మాత్రమే వినవలసి ఉంది
తయారుగా ఉన్నావా, లేదా
తనతో ఏకాంత సమాగమానికి
కాలం మాయాపసరు-
గాయాన్ని మచ్చగా, మచ్చని జ్ఞాపకంగా
జ్ఞాపకాన్ని శిలాజంగా పదిలం చేస్తుంది
ఆ లేఖలన్నీ చేరినప్పుడే కదా,
మన చుట్టూ అడవులు విస్తరించేది
అందరికీ నాలుగు వేళ్లూ నోట్లోకి పోయేది!
మనది పరిశుభ్రత అంటే చాలా పట్టింపు గల వంశం అన్నమాట. అన్నిటినీ శుద్ధి చేసే ఆ అగ్నిదేవుడే కానీ, మనింటోకి రావాలంటే చన్నీళ్ళు స్నానం చేస్తేగానీ రావడానికి వీల్లేదని అర్థం.
సంధ్య కొమ్మల మీద
సన్నాయి పాటలు
ఊపందుకున్నాయి
మంచు తెరల చాటుగా
మబ్బుల కళ్లు
తొంగి చూస్తున్నాయి
మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది
వలసతో ఏం కోల్పోతున్నామో అందరికీ తెలుసు.. కానీ వేరే దేశానికైనా, పట్టణానికైనా మన వలసలు తప్పట్లేదు. ఎక్కడ ఆపాలో తెలుసుకోగలిగే శక్తి మనిషి మెదడు నుండే పుట్టాలి. ఈ కథలు అట్లాంటి మెదడుకు మేత.
రఘు శబ్దాల రంగూ రుచీ వాసనా పూర్తిగా తెలిసిన కవి. కనుక ఏ మండేన్ (mundane) విషయమైనా ఈ కవి తన టెక్నిక్ సంచిలో ముంచి తియ్యగానే, ఆ విషయం మురిపెంగా మనను ముద్దాడుతుంది. ఇంతకు మించి ఏ కవీ సాధించలేడు.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.