అక్షరాలు చిన్నవిగా ఉండి చదువుకోడానికి ఇబ్బంది పెడుతున్నాయి. కాస్త అక్షర పరిమాణం పెంచితే బాగుంటుంది. లేదా అక్షర పరిమాణం పెంచుకునే ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. పరిశీలించగలరు.
బాగుందండీ కథనం… కథ నేపథ్యంగా కొన్ని స్పష్టం చేసారు. “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను” ఇది నిజం… Self promotion ఇటీవల రచయితల్లో ఎక్కూవ అయ్యింది.
Editorial is harsh – not good one
Living in USA is not a big deal — do not act like a police officer
Chemchalu — batrajulu — are in USA and India
Too much politics – groupism — in telugu sahithi Lokam
USA- India — some writers play congress politics
They feel
They think
They act like MEDHAVULU — too much ego ????
=======reddy
ప్రవాసాంధ్రులుగా వున్న వారికి ఇక్కడి అంశాలతో ఏం పని? దయచేసి మీ పని మీరు చూసుకోండి. దేశాన్నే వదిలేసిన వాళ్లకు మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. సముద్రాల అవతల చేరుకున్నా మీ బాసిజం అక్కడ చూపించండి. ఇక్కడ కాదు. ఇది మా మాట.
ఈమాట తెలుగు పత్రిక కదా కనీసం ఇక్కడైనా తెలుగులో చదువుకోవచ్చని ఇక్కడకి వస్తున్నాను. అయినా ఇంగ్లీషులో రాస్తున్నారు కొన్ని వ్యాఖ్యలన్నీ. కొంతమంది స్పానిష్ లోనూ అనుకుంటా. నాలాంటి తెలుగు మాత్రమే వచ్చిన – అనగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు రాని – వారికి ఏమీ అర్ధం కావడం లేదు ఏమి జరుగుతోందో. కాస్త తెలుగులో తర్జుమా చేయమని మనవి. ఈనాడు లో కూడా ‘వైరల్ అయింది’ ‘ట్రెండ్ అవుతోందీ’ అనే ఇంగ్లీషు రాస్తున్నారు. అదికూడా అర్ధం కాక అష్టకష్టాలు పడుతున్నాను. ఇలా అడుగుతున్నందుకు సంపాదకులు రచయిత/త్రులూ క్షమించాలి. ధన్యవాదాలు.
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]
అజ్ఞాతవాసి గురించి మహేష్ కుమార్ పి. అభిప్రాయం:
10/09/2024 12:36 am
అక్షరాలు చిన్నవిగా ఉండి చదువుకోడానికి ఇబ్బంది పెడుతున్నాయి. కాస్త అక్షర పరిమాణం పెంచితే బాగుంటుంది. లేదా అక్షర పరిమాణం పెంచుకునే ఆప్షన్ ఇస్తే సరిపోతుంది. పరిశీలించగలరు.
అజ్ఞాతవాసి గురించి రమేశ్ బాఋ అభిప్రాయం:
10/08/2024 10:14 pm
బాగుందండీ కథనం… కథ నేపథ్యంగా కొన్ని స్పష్టం చేసారు. “రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను” ఇది నిజం… Self promotion ఇటీవల రచయితల్లో ఎక్కూవ అయ్యింది.
అక్టోబర్ 2024 గురించి Buchireddy gangula అభిప్రాయం:
10/08/2024 6:22 pm
Editorial is harsh – not good one
Living in USA is not a big deal — do not act like a police officer
Chemchalu — batrajulu — are in USA and India
Too much politics – groupism — in telugu sahithi Lokam
USA- India — some writers play congress politics
They feel
They think
They act like MEDHAVULU — too much ego ????
=======reddy
పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivas అభిప్రాయం:
10/08/2024 9:33 am
విలువైన నిధిని చూపించినందుకు ధన్యవాదాలు.
కాలుష్యాష్టకం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
10/08/2024 1:19 am
కం. ఏమో తెలియదు వృత్తం
బేమో నేనెరుగ గాని యేమేమో యీ
యేమో తెలియని ఛందము
లోమాన్యులు శర్మగారు రూపించిరిగా
కం. ఎడనెడ కందపు ధోరణి
కడు చక్కగ నమరుచుంట గని సంతసమున్
మిక్కిలి యైనది వారిక
నిక్కపు కందముల నల్ల నేర్చుట యొప్పున్
అక్టోబర్ 2024 గురించి అమరేంద్ర అభిప్రాయం:
10/07/2024 10:16 am
ఇది ఎంతో అభ్యంతరకరమైన హుంకరింపు.
ఈ ప్రవాసాంధ్రులలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర, ఢిల్లీ, అండమాన్, మలేషియా, మారిషస్, జమైకా, దక్షిణమెరికా ఆంధ్రులూ ఉన్నారా? యూకే వారున్నారా? లేక కేవలం అమెరికనాంధ్రులేనా?
ఈ ప్రవాసాంధ్రుల్లో పండితరాయలు, మాలతీచెందూర్, ఆలూరి బైరాగి, శాంతసుందరి, వెల్చేరు లాంటి వాళ్ళున్నారా?
ఈ సంపాదకీయ వ్యాఖ్య నేపథ్యంలో ఇలా ఎన్నారై-స్థానిక అనవసరపు స్పర్థను వెలికి తీయడం అవాంఛనీయం.
అక్టోబర్ 2024 గురించి Nuka RamprasadReddy అభిప్రాయం:
10/06/2024 2:51 pm
ప్రవాసాంధ్రులుగా వున్న వారికి ఇక్కడి అంశాలతో ఏం పని? దయచేసి మీ పని మీరు చూసుకోండి. దేశాన్నే వదిలేసిన వాళ్లకు మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. సముద్రాల అవతల చేరుకున్నా మీ బాసిజం అక్కడ చూపించండి. ఇక్కడ కాదు. ఇది మా మాట.
అక్టోబర్ 2024 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
10/05/2024 7:37 pm
ఈమాట తెలుగు పత్రిక కదా కనీసం ఇక్కడైనా తెలుగులో చదువుకోవచ్చని ఇక్కడకి వస్తున్నాను. అయినా ఇంగ్లీషులో రాస్తున్నారు కొన్ని వ్యాఖ్యలన్నీ. కొంతమంది స్పానిష్ లోనూ అనుకుంటా. నాలాంటి తెలుగు మాత్రమే వచ్చిన – అనగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు రాని – వారికి ఏమీ అర్ధం కావడం లేదు ఏమి జరుగుతోందో. కాస్త తెలుగులో తర్జుమా చేయమని మనవి. ఈనాడు లో కూడా ‘వైరల్ అయింది’ ‘ట్రెండ్ అవుతోందీ’ అనే ఇంగ్లీషు రాస్తున్నారు. అదికూడా అర్ధం కాక అష్టకష్టాలు పడుతున్నాను. ఇలా అడుగుతున్నందుకు సంపాదకులు రచయిత/త్రులూ క్షమించాలి. ధన్యవాదాలు.
కథకుడి అంతర్మథనం గురించి హరి చరణ ప్రసాద్ అభిప్రాయం:
10/05/2024 8:11 am
చక్కని పుస్తక పరిచయం. ‘కొని’ చదవాలి అని నిర్ణయించుకున్నాను. 🙂 శ్యామ్ గారి వ్రాతలు, వాతలు, చురకలు, చమత్కారాలు నాకు భలే ఇష్టం.
అక్టోబర్ 2024 గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:
10/05/2024 3:57 am
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]