eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
పాఠకుల అభిప్రాయాలు
Total Comments: 16392
ఛందోధర్మము
గురించి Raja Shankar Kasinadhuni అభిప్రాయం:
11/02/2006
3:35 pm
కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.
కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!
ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.
దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!
బహుశా ఇది కూడా మాయేమో?
వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,
దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!
వక్త్రతుండ మహాకాయ
సూర్యకోటిసమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.
ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!
రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!
చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.
–ప్రసాద్ http://blog.charasala.com
ఇంత బాగా చెప్పగలిగారు ఇక మీ భాషకేమయిందండి? 🙂
“వేసుకుందామంటే ఏచొక్కా
నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
పెంకితనమే నా భాష కొచ్చింది.”
ఇప్పటి వచ్చీరాని భాష గురించి చక్కగా చెప్పారిందులో.
ఛందోధర్మము గురించి Raja Shankar Kasinadhuni అభిప్రాయం:
11/02/2006 3:35 pm
కృష్ణదేశికాచార్యులగారి వ్యాసం చాలా బాగుంది. మంచి పద్యం చదివినప్పుడు, యతి ప్రాసల నియమాలని పాటిస్తూ కూడా ఈ కవి ఎంత చక్కని పద్యం వ్రాయగలిగాడని అనుకునేవాడిని. అయితే, యతి ప్రాసలు పదదారిద్ర్యంతో బాధపడే కవులకు సంకెళ్ళైతే, సత్కవులకు తమ భావాన్ని మరింత బాగా వ్యక్తం చేయడానికి దోహదం చేసే సాధనాలనే ఆలోచన ఈ వ్యాసం చదివేదాకా కలగలేదు. ఇంత చక్కని వ్యాసం వ్రాసిన రచయతకూ, ప్రచురించిన ఈమాట సంపాదకులకూ ధన్యవాదాలు.
కాశీనాథుని రాజాశంకర్
గణపతి బప్పా మోరియా! గురించి aananda అభిప్రాయం:
11/02/2006 11:24 am
కథ చాలా బాగుంది, సావిత్రిగారూ!
ఇది ఉత్తరాది వినాయకుడి కథ కాబోలు.
దక్షిణాది వినాయకుడు బ్రహ్మచారి గదా!
బహుశా ఇది కూడా మాయేమో?
వారి తమ్ముడేమో ఉత్తరాదిలో బ్రహ్మచారి,
దక్షిణంలో ఇద్దరు భార్యలకు భర్త!
వక్త్రతుండ మహాకాయ
సూర్యకోటిసమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వకార్యేషు సర్వదా
నవ్వి నవ్వి నా బొజ్జ పేలదు గదా!
– ఆనంద
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి Sai Brahamanandam Gorti అభిప్రాయం:
11/02/2006 11:17 am
వేలూరి గారు,
మా కోనసీమలో ఇటువంటి కధే ప్రచారంలో ఉండేది. అందులో అంతవరకూ రాముడి విల్లంబులు, ధనస్సు మోసే లక్ష్మణుడు కాస్తా గోదావరి దాటి కోనసీమలో ప్రవేశించగానే – “ఛీ ! నా చేత నీ విల్లంబులు మోయిస్తూ, నన్ను సోదరుడిలా కాకుండా నన్ను ఒక పనివాడిగా చూస్తున్నావు.” అంటూ ధనస్సు క్రింద పారేస్తాడు. సీత కూడా యధాలాపంగా రాముడ్ని తూలనాడుతుంది. తీరా గోదావరి దాటి గానే రాముడి చేతిలో విల్లంబులు చూసి అదేమిటి అన్నగారి చేతిలో ధనస్సు చూసి క్షమించమని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తమ వింత ప్రవర్తన కి కారణం అడిగితే – ఆ నేల మహత్యం అంటాడు రాముడు. ఇదొక కథ.
ఇంకొక కథ ఉంది. అది మీ కథ కి కొనసాగింపు కథ!
రావణ సంహారం అయ్యాక పుష్పక విమానంలో హనుమంతుడు అందరితో కలసి వానరులు కూడా ఎక్కుతారు.అంతవరకూ ఎంతో వినయ విధేయతల్తో ఉన్న హనుమంతుడు హఠాత్తుగా కోతి చేష్టలు చేస్తూ అందరీ గిల్లుతూ రక్కుతాడు. గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు. దాంతో వానర మూక రెచ్చిపోతారు. విభీష ణుడు, లక్ష్మణుడు అందరూ రాముడితో మొర పెట్టుకుంటారు. రాముడు కాస్త ఓరిమి వహించమని వారికి చెబుతూ, మనం ప్రస్తుతం గోదావరీ తీరాన ఉన్న కోనసీమ పైన ఉన్నాం ! ఇదంతా ఈ నేల గాలి ప్రభావం ! కంగారు పడనవసరం లేదని చెబుతాడు. గోదావరి దాట గానే మరలా హనుమంతుడు బుద్ధిగా ఉంటాడు. కోనసీమ నేల గాలి ప్రభావం అంతగా ఉంటుందని చెప్పే ఓ కల్పిత పిట్ట కథ!
ఇటువంటి కథలు మా కోనసీమ లో చాలా ఉన్నాయి.
– సాయి బ్రహ్మానందం గొర్తి
ప్రతీకగా శరీరం గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
11/02/2006 4:41 am
చక్కని వ్యాసం. మీరు అనువదించిన కవిత అద్భుతంగా ఉంది.
ఈ-మెయిలు గురించి K.Reddeppa అభిప్రాయం:
11/02/2006 3:12 am
చానా బాగుంది. చాలా సంతోషంగా వుంది తెలుగులో మంచి సైటును ఏర్పాటు చేసినందుకు.
ధన్యవాదాలతో
కె.రెడ్డెప్ప
రామసముద్రము
చిత్తూరు జిల్లా
ఆంద్రప్రదేశ్
బస్సెడు దూరం గురించి radhika అభిప్రాయం:
11/01/2006 2:19 pm
ఈ ఆర్టికల్ చాలా బాగుంది.
ఉద్యోగం గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/01/2006 2:09 pm
చాలా బాగుంది. మీరు డాక్టరై వుండాలి. ఇలాంటి వుద్యోగంలో సంక్షోభాల్ని దగ్గరుండి చూసినట్లుగా రాశారు. AIMS లో వేణుగోపాల్ గుర్తుకొచ్చారు.
–ప్రసాద్
http://blog.charasala.com
ఆ నేల, ఆ నీరు, ఆ గాలి గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/01/2006 1:44 pm
బహు చక్కగా ప్రస్తుత రగడకు పూర్వపు ఇతిహాసానికి లంకె కట్టారు. భలే నవ్వు వచ్చింది.
–ప్రసాద్
http://blog.charasala.com
ఈ-మెయిలు గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/01/2006 1:34 pm
ఈమెయిలు అని చూడగానే ఈమెయిలు సాంప్రదాయిక వుత్తరాలను ఎలా నాశనం చేసిందో చెప్తున్నారేమొ ననుకున్నా!
చాలా బాగుంది.
–ప్రసాద్
http://blog.charasala.com
అన్నీ చెప్పగల భాష గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/01/2006 1:30 pm
ఇంత బాగా చెప్పగలిగారు ఇక మీ భాషకేమయిందండి? 🙂
“వేసుకుందామంటే ఏచొక్కా
నచ్చని ఐదేళ్ళ నా కొడుకు
పెంకితనమే నా భాష కొచ్చింది.”
ఇప్పటి వచ్చీరాని భాష గురించి చక్కగా చెప్పారిందులో.
–ప్రసాద్
http://blog.charasala.com