ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.
i dont know y he was not given much importance.i think though was a real socialist,communist literals opposed him., for his aesthaticism.even nelloreans neglected him as he doesnt belong to reddy community. i love his poetry apart from mo s poetry.
దయచేసి ఫోటోలు rohiniprasadk AT yahoo DOT com కు పంపండి.
నడివయసులోనే కాలం చేసిన ఉత్తమ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావుగా రంటే మా నాన్నగారికి అభిమానం. ఆయన మా ఇంటికి రావడం నాకు గుర్తే. ఆయన శ్రీమతి (రాణి గారు) కూడా చనిపోయారని ఈమధ్యనే నవోదయ రామమోహనరావుగారు చెప్పగా విని బాధపడ్డాను. త్రిపురనేని గోపీచంద్ సోదరిగా, మద్రాసులోని అతి కొద్ది తెలుగు బుక్ షాపులలో ఒకదాని నిర్వాహకురాలిగా ఆమె మాకు తెలుసు.
చందమామ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు, సంతోషం.
కొకుగారు, తాపి వారు కలిసిఉన్న ఫొటొలున్నవి.
కావాలంటే ఏదైనా మైల్ ఐడి తెలియజేయండి, పంపుతాను.
కుటుంబరావు గారి ముందుమాటతో ఇక్కడ ఒక కధ ఉంది. వీలుంటే చూడండి.
కొనుక్కోవలసిన అవసరం ఉండేది కాదుగాని మా ఇంట్లో కూడా పిల్లల చందమామ కాపీలు ఎవరివి వారివే! చాలా విలువైనవిగా, ప్రాణప్రదంగా వాటిని దశాబ్దాల తరబడి దాచుకున్నాం.
రచయితల పేర్లు వగైరాల గురించిన పద్ధతులన్నీ చక్రపాణిగారివే – నాగిరెడ్డిగారివి కావు (శ్రీనివాస్ గారు పొరపాటున కె.వి. అన్నారు). ఎటొచ్చీ నాగిరెడ్డిగారి ఆర్థిక, ప్రెస్సు సహకారం చాలా ముఖ్యమైనవి. చక్రపాణిగారు పోయిన తరవాత రెడ్డిగారి రెండవ కుమారుడు విశ్వనాథరెడ్డిగారు (నేటిదాకా) సంపాదక బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆలోచన మాటకొస్తే రచయితల పేరు కన్నా పత్రిక పేరు ఎక్కువగా గుర్తుండిపోయిందనడంలో సందేహం లేదు. అయితే చక్రపాణిగారికి సినీ నిర్మాతగా ఎక్కువ పేరు రావడంతో ఆయనకు పత్రికా, సాహిత్య రంగాలతో ఉండిన ప్రమేయం గురించి ఇక్కడ కొంత చెప్పాలి.
చక్రపాణిగారు చందమామను మొదలుపెట్టడానికి స్ఫూర్తి బెంగాలీ (పిల్లల) పత్రికల ద్వారా లభించింది. బెంగాలీ సాహిత్యంతో ఆయనకుండిన పరిచయం దృష్ట్యా చందమామలో సర్కార్ (సీనియర్) ఇంద్రజాలం తదితర అంశాలు కనబడడం యాదృచ్ఛికం కాదు. తరవాతి కాలంలో మరొక సర్కార్ తన ఇంద్రజాలం ఆధారంగా రాసిన కథలు కూడా పడ్డాయి.
చందమామ పేజీల లేఅవుట్ దృష్ట్యా కథల సైజును మార్చడం తప్పనిసరి. ఈ ‘దర్జీ పని’లో కథ మారే తీరు ఒక్కొక్కప్పుడు రచయితకు నచ్చకపోవచ్చు. అందుచేత చందమామ కథలన్నీ పత్రిక స్వంత ఆస్తిగానే ఉండాలి!
నా లెక్కన చక్రపాణిగారి మనసులో రచయితలకు పేరు రావడం కన్నా వారు రాసే శైలి గురించిన పట్టింపు ముఖ్యమనిపిస్తుంది. పేరు పొందిన రచయితలు తమ రచనలను మార్చనివ్వరు. చందమామలో పడే కథలన్నీ ఒకే (తనకు నచ్చిన) శైలిలో ఉండాలని చక్రపాణిగారి అభిమతం. చిన్నప్పటి నుంచీ తెనాలిలో స్వయంగా రచనలూ, అనువాదాలూ చేసిన ఆయనకు మా నాన్న రచనాశైలి గురించి తెలుసు కనకనూ, అది ఆయనకు ఇష్టం కనకనూ చందమామ బాధ్యతను అప్పగించారు. అందుకనే చందమామ చక్రపాణిగారి మానసపుత్రిక.
చందమామ మా నాన్నగారు కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
రానారె గారి కధ మీద దిలీప్ గారి అభిప్రాయం బావుంది.కధలా విస్తరించి హృదయాన్ని జాలిగా తాకింది.మాండలిక పదాల సోయగం తో అలరించింది.
కారణాంతరాలవల్ల నైనా కూడా ,రానారె గారి కధ ను ఇప్పటి దనకా miss అయినందుకు ఒకింత regret అయ్యాను.వెంటనే చదివాను.కడప మాండలిక భాషా సౌందర్యం తో,గుండెల్ని పిండే జాలితో కధలాగా కాక,అకస్మాత్తుగా ఎదురైన జీవితానుభవం లా సాగింది రానారె గారి రచన.రైతులకు ఎడ్లు ,వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలు,మూగజీవాలు మాత్రమే కాకుండా ,కుటుంబసభ్యులుగా వారి జీవితాలతో పరస్పర ప్రేమానుబంధం కలిగి ఉంటవి.రైతులకు ఎడ్లు బహిప్రాణాలుగా ఉండటం భారతీయ గ్రామీణ సంస్కృతి లో ఒక కమనీయమైన సత్యం.యాంత్రికపరమైన పురోగతిని తిరస్కరించలేకపోయినా ,హుందాగా నడుస్తూ పొలం దున్నే కోడెల సౌందర్యం ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా కనుమరుగైపోవటం మనసులో ఎక్కడో ఒకింత బాధాకరంగా ఉంటుంది.
రైతులకు ,ఎడ్లకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని రానారె గారు వారి కధ ద్వారా కండ్లు చెమ్మగిల్లేలా ,గుండె కుత్తుకలో పూడుకునిపోయినట్లుగా feel అయ్యే విధంగా చక్కగా చెప్పారు,చూపించారు.ఎద్దు చనిపోయిన తర్వాత కూడా తన
యజమానిని గురించి బాధ పడటంతో ,మనసు పై జాలి మేఘాలు ఆవరిస్తవి.
కాకపోతే ,ఇంతటి రసస్ఫోరక స్థితి ని పాఠకుడు చేరుకున్న తరవాత ,చనిపోయిన ఎద్దు చర్మం వల్ల వచ్చే డబ్బు కోసం యజమాని చేసే ప్రయత్నం కసుక్కున ముల్లులా గుచ్చుకుంటుంది.అది ఒక యదార్ధమైన విషయమే అయినా ,దానిని focus చెయ్యడం కధ సాధించిన రసానుభూతిని దెబ్బ తీస్తుంది.
మరొకవిషయం: జీవన్మరణ విషయాలమీద ఊర్ధ్వ లోకాలవైపు సాగించే మహాభినిష్క్రమణం లో ఎద్దు ఆత్మ అంత వేదాంత ధోరణి లో ఆలోచించటం కధ సాధించిన రసౌచితికి ప్రతీఘాతంగా ఉంటుందనుకుంటున్నాను.ఎద్దు ఆత్మ అయినంతమాత్రంచేత ఇలా అనడం లేదు:ఎద్దు ఆత్మ,ఆదిశంకరులవారి ఆత్మ,మనందరి ఆత్మ,విశ్వాత్మ అంతా ఒకటే అని మన వేదంతం ద్వారా మనందరికీ తెలుసు.కాకపోతే ,సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో బట్ట బయలుగా ప్రబోధపరంగా ఏమి చెప్పినా వాటి కళావైశిష్ట్యాన్ని అది దెబ్బతీస్తుంది.మెసేజ్ లేదా ప్రబోధం సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.కధలో సాధించిన రసజ్ఞతను మానవీయ విలువలను పదిలపరచుకుంటూనే ఏదైనా ఒక జనన మరణాతీతమైన విషయాన్ని ప్రదిపాదించదలచుకుంటే ఎద్దు ఆత్మను తీసుకపోవటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అర్ధవంతమైన మందహాసాన్ని చాలా క్లుప్తంగా,సజెస్టివ్ గా విశదీకరిస్తే సరిపోను.
అయినా రానారె గారిది నిస్సందేహంగా మంచి కధ,గొప్ప కధ,ఎప్పటికీ గుర్తుండే కధ.
అభినందనలు.
C.S.Rao
ఆ రోజులు గురించి mohanraokotari అభిప్రాయం:
08/14/2007 9:10 pm
ఎందుకో మేధావులంతా రసాస్వాదన మాని కవితా కన్యకని surgery చేస్తారు. వలువలూడదీసి శల్య పరీక్ష చేస్తారు. కవి మనసుతో కలవరించి పలువరించకుండా. మరచి పోలేని ఆనాటి సాహస కృత్యాలు మరువలేని వారితో మనసు కలపి ఆలోకంలోకి మనుమూ వెల్లితే పోలా.
గ్రహ బలాబలాలు గురించి mohanraokotari అభిప్రాయం:
08/14/2007 8:58 pm
బాగుంది. surrealistic కవిత నాలాంటి సామాన్యులకి అందనిది. అసామాన్యమైన కవితా రచయిత్రికి అభినందనం.
పువ్వులు.. పువ్వులు.. పువ్వులు .. గురించి mohanraokotari అభిప్రాయం:
08/14/2007 8:53 pm
i dont know y he was not given much importance.i think though was a real socialist,communist literals opposed him., for his aesthaticism.even nelloreans neglected him as he doesnt belong to reddy community. i love his poetry apart from mo s poetry.
రెండు కవితలు గురించి mohanraokotari అభిప్రాయం:
08/14/2007 8:46 pm
expression of love with experience it seems, an in depth one.
“చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
08/13/2007 12:16 pm
అనిల్ గారూ,
దయచేసి ఫోటోలు rohiniprasadk AT yahoo DOT com కు పంపండి.
నడివయసులోనే కాలం చేసిన ఉత్తమ రచయిత అట్లూరి పిచ్చేశ్వరరావుగా రంటే మా నాన్నగారికి అభిమానం. ఆయన మా ఇంటికి రావడం నాకు గుర్తే. ఆయన శ్రీమతి (రాణి గారు) కూడా చనిపోయారని ఈమధ్యనే నవోదయ రామమోహనరావుగారు చెప్పగా విని బాధపడ్డాను. త్రిపురనేని గోపీచంద్ సోదరిగా, మద్రాసులోని అతి కొద్ది తెలుగు బుక్ షాపులలో ఒకదాని నిర్వాహకురాలిగా ఆమె మాకు తెలుసు.
“చందమామ” జ్ఞాపకాలు గురించి anil atluri అభిప్రాయం:
08/12/2007 5:57 am
చందమామ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పారు, సంతోషం.
కొకుగారు, తాపి వారు కలిసిఉన్న ఫొటొలున్నవి.
కావాలంటే ఏదైనా మైల్ ఐడి తెలియజేయండి, పంపుతాను.
కుటుంబరావు గారి ముందుమాటతో ఇక్కడ ఒక కధ ఉంది. వీలుంటే చూడండి.
“చందమామ” జ్ఞాపకాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
08/11/2007 4:28 am
కొనుక్కోవలసిన అవసరం ఉండేది కాదుగాని మా ఇంట్లో కూడా పిల్లల చందమామ కాపీలు ఎవరివి వారివే! చాలా విలువైనవిగా, ప్రాణప్రదంగా వాటిని దశాబ్దాల తరబడి దాచుకున్నాం.
రచయితల పేర్లు వగైరాల గురించిన పద్ధతులన్నీ చక్రపాణిగారివే – నాగిరెడ్డిగారివి కావు (శ్రీనివాస్ గారు పొరపాటున కె.వి. అన్నారు). ఎటొచ్చీ నాగిరెడ్డిగారి ఆర్థిక, ప్రెస్సు సహకారం చాలా ముఖ్యమైనవి. చక్రపాణిగారు పోయిన తరవాత రెడ్డిగారి రెండవ కుమారుడు విశ్వనాథరెడ్డిగారు (నేటిదాకా) సంపాదక బాధ్యతలు చేపట్టారు.
ఇక ఆలోచన మాటకొస్తే రచయితల పేరు కన్నా పత్రిక పేరు ఎక్కువగా గుర్తుండిపోయిందనడంలో సందేహం లేదు. అయితే చక్రపాణిగారికి సినీ నిర్మాతగా ఎక్కువ పేరు రావడంతో ఆయనకు పత్రికా, సాహిత్య రంగాలతో ఉండిన ప్రమేయం గురించి ఇక్కడ కొంత చెప్పాలి.
చక్రపాణిగారు చందమామను మొదలుపెట్టడానికి స్ఫూర్తి బెంగాలీ (పిల్లల) పత్రికల ద్వారా లభించింది. బెంగాలీ సాహిత్యంతో ఆయనకుండిన పరిచయం దృష్ట్యా చందమామలో సర్కార్ (సీనియర్) ఇంద్రజాలం తదితర అంశాలు కనబడడం యాదృచ్ఛికం కాదు. తరవాతి కాలంలో మరొక సర్కార్ తన ఇంద్రజాలం ఆధారంగా రాసిన కథలు కూడా పడ్డాయి.
చందమామ పేజీల లేఅవుట్ దృష్ట్యా కథల సైజును మార్చడం తప్పనిసరి. ఈ ‘దర్జీ పని’లో కథ మారే తీరు ఒక్కొక్కప్పుడు రచయితకు నచ్చకపోవచ్చు. అందుచేత చందమామ కథలన్నీ పత్రిక స్వంత ఆస్తిగానే ఉండాలి!
నా లెక్కన చక్రపాణిగారి మనసులో రచయితలకు పేరు రావడం కన్నా వారు రాసే శైలి గురించిన పట్టింపు ముఖ్యమనిపిస్తుంది. పేరు పొందిన రచయితలు తమ రచనలను మార్చనివ్వరు. చందమామలో పడే కథలన్నీ ఒకే (తనకు నచ్చిన) శైలిలో ఉండాలని చక్రపాణిగారి అభిమతం. చిన్నప్పటి నుంచీ తెనాలిలో స్వయంగా రచనలూ, అనువాదాలూ చేసిన ఆయనకు మా నాన్న రచనాశైలి గురించి తెలుసు కనకనూ, అది ఆయనకు ఇష్టం కనకనూ చందమామ బాధ్యతను అప్పగించారు. అందుకనే చందమామ చక్రపాణిగారి మానసపుత్రిక.
“చందమామ” జ్ఞాపకాలు గురించి శ్రీనివాస్ అభిప్రాయం:
08/10/2007 6:44 pm
చందమామ మా నాన్నగారు కొని తెచ్చేరోజున దాన్ని మొదట చదవటానికి మా ఇంట్లో మేమంటే మేమని కొట్టుకొన్న రోజులున్నాయి. ఆ పత్రిక పిల్లలకు మంచి బుధ్ధులు నేర్పే మరో ఉపాధ్యాయుడితో సమానం. పత్రికను గురించిన మాకు తెలియని చాలా విషయాలు చెప్పారు. కృతజ్ఞతలు. కాని కే.వి.రెడ్డి మరియు చక్రపాణి లాంటి వారు అసలు రచయిత పేరు లేకుండా కథలు రాయించేవారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
A Poem at the Right Moment: An Introduction గురించి ముక్కు శ్రీ రాఘవ కిరణ్ అభిప్రాయం:
08/09/2007 5:24 am
నాకు తెలిసి కూడా “జానక్యాః కమలామలాంజలి పుటేయాః” అన్న శ్లోకం ఆదిశంకరుని శ్రీరామకర్ణామృతంలోనిదే.
న త్వం శోచితుమర్హసి గురించి C.S.Rao అభిప్రాయం:
08/08/2007 6:28 pm
రానారె గారి కధ మీద దిలీప్ గారి అభిప్రాయం బావుంది.కధలా విస్తరించి హృదయాన్ని జాలిగా తాకింది.మాండలిక పదాల సోయగం తో అలరించింది.
కారణాంతరాలవల్ల నైనా కూడా ,రానారె గారి కధ ను ఇప్పటి దనకా miss అయినందుకు ఒకింత regret అయ్యాను.వెంటనే చదివాను.కడప మాండలిక భాషా సౌందర్యం తో,గుండెల్ని పిండే జాలితో కధలాగా కాక,అకస్మాత్తుగా ఎదురైన జీవితానుభవం లా సాగింది రానారె గారి రచన.రైతులకు ఎడ్లు ,వ్యవసాయానికి ఉపయోగపడే సాధనాలు,మూగజీవాలు మాత్రమే కాకుండా ,కుటుంబసభ్యులుగా వారి జీవితాలతో పరస్పర ప్రేమానుబంధం కలిగి ఉంటవి.రైతులకు ఎడ్లు బహిప్రాణాలుగా ఉండటం భారతీయ గ్రామీణ సంస్కృతి లో ఒక కమనీయమైన సత్యం.యాంత్రికపరమైన పురోగతిని తిరస్కరించలేకపోయినా ,హుందాగా నడుస్తూ పొలం దున్నే కోడెల సౌందర్యం ట్రాక్టర్ల రాకతో క్రమక్రమంగా కనుమరుగైపోవటం మనసులో ఎక్కడో ఒకింత బాధాకరంగా ఉంటుంది.
రైతులకు ,ఎడ్లకు మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని రానారె గారు వారి కధ ద్వారా కండ్లు చెమ్మగిల్లేలా ,గుండె కుత్తుకలో పూడుకునిపోయినట్లుగా feel అయ్యే విధంగా చక్కగా చెప్పారు,చూపించారు.ఎద్దు చనిపోయిన తర్వాత కూడా తన
యజమానిని గురించి బాధ పడటంతో ,మనసు పై జాలి మేఘాలు ఆవరిస్తవి.
కాకపోతే ,ఇంతటి రసస్ఫోరక స్థితి ని పాఠకుడు చేరుకున్న తరవాత ,చనిపోయిన ఎద్దు చర్మం వల్ల వచ్చే డబ్బు కోసం యజమాని చేసే ప్రయత్నం కసుక్కున ముల్లులా గుచ్చుకుంటుంది.అది ఒక యదార్ధమైన విషయమే అయినా ,దానిని focus చెయ్యడం కధ సాధించిన రసానుభూతిని దెబ్బ తీస్తుంది.
మరొకవిషయం: జీవన్మరణ విషయాలమీద ఊర్ధ్వ లోకాలవైపు సాగించే మహాభినిష్క్రమణం లో ఎద్దు ఆత్మ అంత వేదాంత ధోరణి లో ఆలోచించటం కధ సాధించిన రసౌచితికి ప్రతీఘాతంగా ఉంటుందనుకుంటున్నాను.ఎద్దు ఆత్మ అయినంతమాత్రంచేత ఇలా అనడం లేదు:ఎద్దు ఆత్మ,ఆదిశంకరులవారి ఆత్మ,మనందరి ఆత్మ,విశ్వాత్మ అంతా ఒకటే అని మన వేదంతం ద్వారా మనందరికీ తెలుసు.కాకపోతే ,సృజనాత్మక సాహితీ ప్రక్రియలలో బట్ట బయలుగా ప్రబోధపరంగా ఏమి చెప్పినా వాటి కళావైశిష్ట్యాన్ని అది దెబ్బతీస్తుంది.మెసేజ్ లేదా ప్రబోధం సాహిత్యప్రక్రియ కలిగించే రసానుభూతి లో అంతర్లీనమై పాఠకుడి ఉపచైతన్య స్థితి లోకి లేదా చైతన్యస్థితి లోకి మెల్లగా ప్రవేశించాలి.కధలో సాధించిన రసజ్ఞతను మానవీయ విలువలను పదిలపరచుకుంటూనే ఏదైనా ఒక జనన మరణాతీతమైన విషయాన్ని ప్రదిపాదించదలచుకుంటే ఎద్దు ఆత్మను తీసుకపోవటానికి వచ్చిన ఇద్దరు వ్యక్తుల అర్ధవంతమైన మందహాసాన్ని చాలా క్లుప్తంగా,సజెస్టివ్ గా విశదీకరిస్తే సరిపోను.
అయినా రానారె గారిది నిస్సందేహంగా మంచి కధ,గొప్ప కధ,ఎప్పటికీ గుర్తుండే కధ.
అభినందనలు.
C.S.Rao