ప్రవాసాంధ్రులుగా వున్న వారికి ఇక్కడి అంశాలతో ఏం పని? దయచేసి మీ పని మీరు చూసుకోండి. దేశాన్నే వదిలేసిన వాళ్లకు మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. సముద్రాల అవతల చేరుకున్నా మీ బాసిజం అక్కడ చూపించండి. ఇక్కడ కాదు. ఇది మా మాట.
ఈమాట తెలుగు పత్రిక కదా కనీసం ఇక్కడైనా తెలుగులో చదువుకోవచ్చని ఇక్కడకి వస్తున్నాను. అయినా ఇంగ్లీషులో రాస్తున్నారు కొన్ని వ్యాఖ్యలన్నీ. కొంతమంది స్పానిష్ లోనూ అనుకుంటా. నాలాంటి తెలుగు మాత్రమే వచ్చిన – అనగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు రాని – వారికి ఏమీ అర్ధం కావడం లేదు ఏమి జరుగుతోందో. కాస్త తెలుగులో తర్జుమా చేయమని మనవి. ఈనాడు లో కూడా ‘వైరల్ అయింది’ ‘ట్రెండ్ అవుతోందీ’ అనే ఇంగ్లీషు రాస్తున్నారు. అదికూడా అర్ధం కాక అష్టకష్టాలు పడుతున్నాను. ఇలా అడుగుతున్నందుకు సంపాదకులు రచయిత/త్రులూ క్షమించాలి. ధన్యవాదాలు.
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]
‘సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం.’
మీ ఎడిటోరియల్ లో పైన ఉదహరించిన మొదటి వాక్యానికున్న అవగాహనను, తరవాత భాగం ఖండిస్తోంది. చాలా సంకుచితమైన వ్యక్తీకరణలు ఉన్నాయి.
మంచి లేదా ఉత్తమ సాహిత్యానికి మీ ప్రమాణాలు లేదా గీటురాళ్ళు ఏమిటో చెప్పకుండా చేసేవి ప్రకటనలుగా లేదా ఖండనలుగా మిగిలి పోతాయి.
మీ దృష్టిలో గొప్ప సాహిత్యంగా హైలైట్ చేయబడే వాటిలో కొన్నిటిని మీరు మీ ప్రమాణాలతో రివ్యూ చేయండి.
గతసాహిత్యాన్ని, గతకాలపు ప్రముఖ రచయితల గురించి ఎవరైనా అచారిత్రికంగా మాట్లాడితే వారి అభిప్రాయాల లోతుపాతుల్ని వివరించే వ్యాసం రాయమని అడగండి. చర్చను నిర్వహించండి.
[“పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల”గడం మంచి సాహిత్యపు మొట్టమొదటి ప్రమాణం (లేదా అవసరం) అని చాలాసార్లే చెప్పామండీ – సం.]
జూలై 2024 సంపాదకీయం చూడండి అన్నారు. చూశా. ఆ మాటలో విభేదించాల్సింది ఏఁవీ లేదు. ఇవాళ్టి ఈ మాటలో మాత్రం hegemonic స్వరం పొంగి పొర్లుతోంది. రెండూ పక్క పక్కన పెట్టి మీరే చూసుకోండి. సాహిత్యంలో మీకు నచ్చని పోకడల్ని ఖండించొచ్చు. కానీ అసహనంతో గొంతు పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.. ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని మీరెంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించలేరు. మీకు నచ్చని వారినీ మీ పంథాకి భిన్నమైన అభిప్రాయం ప్రకటించిన వారినీ ‘వెలివేయాలని ఫత్వాలు జారీ చేయడం ఎంతమాత్రం ఆమోదం కాదు. మీ మాటలు మరోసారి వెనక్కి తిరిగి చూసుకోండి. బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిన అంశాలు మీకే గోచరిస్తాయి. మరక మంచిది కాదు. దిద్దుబాటు తప్పు కాదు.
[“మీరు మాట్లాడింది మనుషుల గురించి. జీవితాల గురించి. అవి సాహిత్యంలోకి ఎక్కడం గురించి. ఇంకా ఆంక్షలు ఎందుకు పెడతారు?” అన్న మీ అభిప్రాయానికి బదులుగా మాకు అటువంటి ఉద్దేశ్యం ఏమీ లేదని, ‘మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం’ అనే మా అభిప్రాయం కూడా అని స్పష్టం చేయడం కోసం, ఆ ముందుమాట మిమ్మల్ని చదవమని కోరుకున్నది. అందువల్ల ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని ‘మేము’ ఎంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించడం అనే ఆరోపణకు ఆధారం లేదు. ఒకరిపై ఫత్వాలు జారీ చేసే అధికారం, అవసరం మాకు లేదు. సరళంగానో, కఠినంగానో సాహిత్యంపట్ల, సాహిత్యధోరణుల పట్ల మా అభిప్రాయం చెప్పగలం, అంతే. -సం.]
కీలకం అంతా ఇక్కడ ఉంది. మీవ్యాసంలోనూ, సమకాలీనసాహిత్యం విషయంలోనూ కీలకం అదేను.
ఒక మంచిరచనకు ఉండే ముఖ్యలక్షణాలలో మొదటిది చదివించగలగటం రెండవది ఆలోచన రేకెత్తించగలగటం. మూడవది దాని గురించి ఇతరులకు చెప్పాలని అనుకోవటం. ఈతూకపురాళ్ళు వేసి తూచండి.
సమకాలీనరచనలు ప్రజల మనస్సులకు ఎక్కుతున్న పక్షంలో వాటికి మంచి ఆదరణ ఉండి సాహిత్యరంగం కళకళలాడుతూ ఉండేది. ఆరచయితలకు కాసిని కాసుల గలగలలూ వినిపించేవి (వారూ బ్రతకాలిగా మరి). అలాంటిది స్వప్నంలో తప్ప వాస్తవజగత్తులో సాహిత్యకారులు చూడలేకుండా ఉన్నారే?
ఏవో అజెండాలతో బయలుదేరి రకరకాలవాదాల ప్రచారసాహిత్యం తయారీ ఫాక్టరీ కార్మికులలాగా రచయితలూ కవులూ కష్టపడి అచ్చుపోసి జనం మీద విసిరేసే చిన్న పెద్దా కరపత్రాల్లాంటి సో-కాల్డ్ ఆధునికసాహిత్యాన్ని పోగేసుకొని చదువుకొనే పాఠకులు ఎక్కువమంది ఉండటం కష్టమే.
ఏరంగు కళ్ళద్దంలో నుండి చూస్తే ఈ ప్రపంచం ఆరంగు పులుముకొని కనిపిస్తుందే కాని అది సత్యప్రపంచం కాదు కదా. ఈ ఇజాలూ వాదాల కళ్ళద్దాలను ప్రక్కనబెట్టి స్వఛ్చమనస్క్కులై తెలుగు రచయితలూ మంచి రచనలు చేయటం మొదలుపెట్టితే సాహిత్యరంగానికి మంచిరోజులు వస్తాయి. లేకుంటే లేదు.
పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivas అభిప్రాయం:
10/08/2024 9:33 am
విలువైన నిధిని చూపించినందుకు ధన్యవాదాలు.
కాలుష్యాష్టకం గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
10/08/2024 1:19 am
కం. ఏమో తెలియదు వృత్తం
బేమో నేనెరుగ గాని యేమేమో యీ
యేమో తెలియని ఛందము
లోమాన్యులు శర్మగారు రూపించిరిగా
కం. ఎడనెడ కందపు ధోరణి
కడు చక్కగ నమరుచుంట గని సంతసమున్
మిక్కిలి యైనది వారిక
నిక్కపు కందముల నల్ల నేర్చుట యొప్పున్
అక్టోబర్ 2024 గురించి అమరేంద్ర అభిప్రాయం:
10/07/2024 10:16 am
ఇది ఎంతో అభ్యంతరకరమైన హుంకరింపు.
ఈ ప్రవాసాంధ్రులలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహరాష్ట్ర, ఢిల్లీ, అండమాన్, మలేషియా, మారిషస్, జమైకా, దక్షిణమెరికా ఆంధ్రులూ ఉన్నారా? యూకే వారున్నారా? లేక కేవలం అమెరికనాంధ్రులేనా?
ఈ ప్రవాసాంధ్రుల్లో పండితరాయలు, మాలతీచెందూర్, ఆలూరి బైరాగి, శాంతసుందరి, వెల్చేరు లాంటి వాళ్ళున్నారా?
ఈ సంపాదకీయ వ్యాఖ్య నేపథ్యంలో ఇలా ఎన్నారై-స్థానిక అనవసరపు స్పర్థను వెలికి తీయడం అవాంఛనీయం.
అక్టోబర్ 2024 గురించి Nuka RamprasadReddy అభిప్రాయం:
10/06/2024 2:51 pm
ప్రవాసాంధ్రులుగా వున్న వారికి ఇక్కడి అంశాలతో ఏం పని? దయచేసి మీ పని మీరు చూసుకోండి. దేశాన్నే వదిలేసిన వాళ్లకు మమ్మల్ని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. సముద్రాల అవతల చేరుకున్నా మీ బాసిజం అక్కడ చూపించండి. ఇక్కడ కాదు. ఇది మా మాట.
అక్టోబర్ 2024 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
10/05/2024 7:37 pm
ఈమాట తెలుగు పత్రిక కదా కనీసం ఇక్కడైనా తెలుగులో చదువుకోవచ్చని ఇక్కడకి వస్తున్నాను. అయినా ఇంగ్లీషులో రాస్తున్నారు కొన్ని వ్యాఖ్యలన్నీ. కొంతమంది స్పానిష్ లోనూ అనుకుంటా. నాలాంటి తెలుగు మాత్రమే వచ్చిన – అనగా స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీషు రాని – వారికి ఏమీ అర్ధం కావడం లేదు ఏమి జరుగుతోందో. కాస్త తెలుగులో తర్జుమా చేయమని మనవి. ఈనాడు లో కూడా ‘వైరల్ అయింది’ ‘ట్రెండ్ అవుతోందీ’ అనే ఇంగ్లీషు రాస్తున్నారు. అదికూడా అర్ధం కాక అష్టకష్టాలు పడుతున్నాను. ఇలా అడుగుతున్నందుకు సంపాదకులు రచయిత/త్రులూ క్షమించాలి. ధన్యవాదాలు.
కథకుడి అంతర్మథనం గురించి హరి చరణ ప్రసాద్ అభిప్రాయం:
10/05/2024 8:11 am
చక్కని పుస్తక పరిచయం. ‘కొని’ చదవాలి అని నిర్ణయించుకున్నాను. 🙂 శ్యామ్ గారి వ్రాతలు, వాతలు, చురకలు, చమత్కారాలు నాకు భలే ఇష్టం.
అక్టోబర్ 2024 గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:
10/05/2024 3:57 am
సాహిత్యం వైయక్తిక ప్రక్రియ అనిపించినా అది సామూహిక సామాజిక ప్రక్రియ. మనిషికి సాహిత్యం కళలు ప్రాథమిక అవసరాలు కావు. ఏ సమూహానికైనా తిండి గుడ్డలాంటి అవసరాలు తీరాకే కళాసృజన సాధ్యం.
*
సాహిత్య ప్రయోజనాలు అనేకం: మానసోల్లాసం, మానసిక వికాసం, వ్యవస్థ స్థిరీకరణ, నిరసన ప్రకటన, ప్రతిఘటన, పోరాటం – చరిత్రలోకి వెళితే ఇలా ఎన్నో ప్రయోజనాలు సాధించబడి కనిపిస్తాయి. ఈ ప్రయోజనాల్లో కొన్ని యథాతథస్థితిని కాపాడేవి. కొన్ని గతవైభవం కోరేవి. కొన్ని గతాన్నీ వర్తమానాన్నీ ప్రశ్నించి రేపటి మార్పుకు దారి వేసేవి.
*
గతమూ యథాస్థితీ కోసం రాసేవారి వెనుక శతాబ్దాల సాధన ఉంది. వ్యవస్థ తోడ్పాటు తప్పక ఉంటుంది. వారి వస్తువు ఎలాంటిదైనా శైలి శిల్పం లాంటి సాహితీ విలువలు పుష్కలంగా ఉంటాయి.
రేపటి కోసం రాసేవారిది ఏనాడైనా ఎదురీత. రాయడం అప్పుడే నేర్చుకొంటోన్న బృందమిది. జీవితమే వీరి కథా వస్తువు. పోరాటమే వీరి శైలి. ధిక్కారమే వీరి శిల్పం.
*
ఈమాట ఎవరిది? ఎవరికోసం?
మనకు స్పష్టత అవసరం.
మానసోల్లాసం, వికాసమే లక్ష్యమనీ, రచనలో పరిణత నిర్దుష్టతే ప్రామాణికమనీ ఈమాట అనుకుంటే – సరే… అలానే కానిద్దాం.
కానీ సాహిత్యానికి వేరే ప్రయోజనాలకోసం దగ్గర అయ్యే పాఠకులూ రచయితలూ ఉంటారనీ, వారి రచనల్లో మనమనుకొనే ప్రామాణికత ఉండక పోవచ్చనీ, అంతమాత్రం చేత అవి అరత్నాలు అయిపోవనీ ఈమాట గ్రహించడం ప్రాథమిక అవసరం. అగ్రవర్ణ సాహిత్యమూ అణచబడినవారి సాహిత్యమూ ఒకే స్థాయిలో ఉండాలనకోడం సమంజసం కాదు. అలాంటి సాహిత్యాన్ని నిరసించడం తగదు.
*
ఈ విషయంలో ‘ఆక్టోబరు 2024’ రచనలో ఈమాట మాటలు తూలింది. ఆలోచనను ఆవేశానికి పణంగా పెట్టింది. తానేమిటో ఈమాట తేల్చుకోడానికీ, తేల్చుకున్నాక అడుగులు సవరించుకోడానికీ ఇప్పటి చర్చ సరైన అవకాశం కలిగిస్తోంది. వినియోగించుకుందాం.
అమరేంద్ర
5 అక్టోబర్ 2024
[ఈమాట ఏ రకమైన సాహిత్యానికీ వ్యతిరేకి కాదని, సాహిత్యానికి ఎటువంటి హద్దులు, ఆంక్షలు, నిర్వచనాలు ఉండవు, ఉండకూడదు అని మా నిశ్చితాభిప్రాయమని, మరొక్కసారి స్పష్టం చేయవలసి ఉంది. “పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగలిగినది ఏదైనా మంచి సాహిత్యమే” అన్నది ఒక్కటే ఈమాట మాట. అదే సాహిత్యప్రయోజనం. సాహిత్యానికి వేరే ప్రమాణాలు ఇంకేమీ లేవు. సాహిత్యంగా మలచబడలేని వస్తువు ఏదీ లేదు. ప్రతీ రచనకు ఒకే ఆశయం ఉంటుంది. అది – ఆవేశమైనా, ఆహ్లాదమైనా, అసహ్యమైనా, ఇంకే అనుభవమైనా – పాఠకులలో స్పందన కలిగించడం.
“సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినవి సాహిత్య రత్నాలు కావు” అని ముందుమాటలో మేము అనలేదు. “సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి ‘వ్రాసినంత మాత్రాన’ అవి సాహిత్య రత్నాలయిపోవు” అని మాత్రమే అన్నాం. మమ్మల్ని నిందించిన వారెవరూ ఈ రెండు వాక్యాల మధ్య ఉన్న అర్థభేదాన్ని గమనించలేదు – కారణాలు అనేకం. ఎవరికి తోచినట్టు వారు అర్థం చెప్పుకున్నారు. ఈ వాక్యానికి బదులు “బ్రాహ్మణుల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు” అని ఉదహరించి ఉంటే ఈ విపరీతార్థాలకు ఆస్కారం ఉండేది కాదని ఇప్పుడు కలిగిన అభిప్రాయం.
కథావస్తువు జీవితం అయినా, భ్రమ అయినా చదివించలేని సాహిత్యానికి ఏ ప్రయోజనం ఉంటుంది? అంటే కేవలం వస్తుబలం వల్లనే సాహిత్యప్రయోజనం చేకూరదు. అందువల్లే, వాక్యంపై శ్రద్ధ పెట్టండి, చదివించగలిగేలా వ్రాయండి అని పదేపదే చెప్తున్నాం. సాహితీ విలువలు పట్టుపడేదాకా వ్రాయకండి అని అనటం లేదు. వ్రాయండి, మీ ఇష్టానుసారం వ్రాయండి. కాని, వస్తువు వల్లనే మీ రచనకు విలువ వస్తుందన్న (సాహిత్య ప్రయోజనం చేకూరుతుందన్న) భ్రమలో ఉండకండి. వ్రాయండి, వ్రాసినది ఒకటికి పదిసార్లు చదువుకోండి. వ్రాసినది దిద్దుకోండి – అనే మేము అంటున్నది. వాక్యానికి శక్తి ఉంది. దానిని సరిగ్గా వినియోగించుకోవాలంటే వాక్య లక్షణం తెలియాలి. రచయితకు ఆవేశం మాత్రమే సరిపోదు, ఆలోచన కూడా అవసరం. నిర్జనమైన ఎడారిలో ఎంత బలంగా మీరు ధిక్కారస్వరం వినిపించినా ఏం ప్రయోజనం? ఎవరూ పూర్తిగా చదవలేని, చదివినా ఆ వస్తువుతో మమేకం కాలేని రచనతో ఏ సాహిత్యప్రయోజనం? రేపటికోసం రాస్తున్నవారు, ధిక్కారపోరాటాలే శైలీశిల్పాలయినవారు నిజంగా తమ సాహిత్యంతో సమాజంలో మార్పు తేగలగితే అంతకంటే కోరుకునేది ఎవరికీ ఏమీ ఉండదు, మాకంటే సంతోషించేవారు, ప్రోత్సహించేవారు ఇంకొకరు ఉండరు. ఏ గొంతుతో చెప్పినా, ఏ భాషలో చెప్పినా మేము ఎప్పుడూ చెప్తున్నది ఒకటే: సాహిత్యం కూడా ఒక కళ. దానికీ అభ్యాసం, పరిశ్రమ అవసరం. రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ ఉండాలన్నదే మా కోరిక, మా నమ్మకం. – సం.
తాక: అక్టోబరు 2024′ రచనలో ఈమాట మాటలు ‘తూలింది’ – ఈ విషయంలో కాదని; మనసాహిత్య వారసత్వసంపద అప్రస్తుతం, ఇప్పుడు చదవడం అనవసరం అని ప్రబలుతున్న ఒక ధోరణి పట్ల మాత్రమేనని గమనించమని విన్నపం.]
అక్టోబర్ 2024 గురించి B. Rama Naidu అభిప్రాయం:
10/04/2024 4:46 pm
‘సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం.’
మీ ఎడిటోరియల్ లో పైన ఉదహరించిన మొదటి వాక్యానికున్న అవగాహనను, తరవాత భాగం ఖండిస్తోంది. చాలా సంకుచితమైన వ్యక్తీకరణలు ఉన్నాయి.
మంచి లేదా ఉత్తమ సాహిత్యానికి మీ ప్రమాణాలు లేదా గీటురాళ్ళు ఏమిటో చెప్పకుండా చేసేవి ప్రకటనలుగా లేదా ఖండనలుగా మిగిలి పోతాయి.
మీ దృష్టిలో గొప్ప సాహిత్యంగా హైలైట్ చేయబడే వాటిలో కొన్నిటిని మీరు మీ ప్రమాణాలతో రివ్యూ చేయండి.
గతసాహిత్యాన్ని, గతకాలపు ప్రముఖ రచయితల గురించి ఎవరైనా అచారిత్రికంగా మాట్లాడితే వారి అభిప్రాయాల లోతుపాతుల్ని వివరించే వ్యాసం రాయమని అడగండి. చర్చను నిర్వహించండి.
[“పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల”గడం మంచి సాహిత్యపు మొట్టమొదటి ప్రమాణం (లేదా అవసరం) అని చాలాసార్లే చెప్పామండీ – సం.]
అక్టోబర్ 2024 గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:
10/04/2024 3:08 pm
జూలై 2024 సంపాదకీయం చూడండి అన్నారు. చూశా. ఆ మాటలో విభేదించాల్సింది ఏఁవీ లేదు. ఇవాళ్టి ఈ మాటలో మాత్రం hegemonic స్వరం పొంగి పొర్లుతోంది. రెండూ పక్క పక్కన పెట్టి మీరే చూసుకోండి. సాహిత్యంలో మీకు నచ్చని పోకడల్ని ఖండించొచ్చు. కానీ అసహనంతో గొంతు పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.. ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని మీరెంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించలేరు. మీకు నచ్చని వారినీ మీ పంథాకి భిన్నమైన అభిప్రాయం ప్రకటించిన వారినీ ‘వెలివేయాలని ఫత్వాలు జారీ చేయడం ఎంతమాత్రం ఆమోదం కాదు. మీ మాటలు మరోసారి వెనక్కి తిరిగి చూసుకోండి. బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిన అంశాలు మీకే గోచరిస్తాయి. మరక మంచిది కాదు. దిద్దుబాటు తప్పు కాదు.
[“మీరు మాట్లాడింది మనుషుల గురించి. జీవితాల గురించి. అవి సాహిత్యంలోకి ఎక్కడం గురించి. ఇంకా ఆంక్షలు ఎందుకు పెడతారు?” అన్న మీ అభిప్రాయానికి బదులుగా మాకు అటువంటి ఉద్దేశ్యం ఏమీ లేదని, ‘మారుతున్న సమాజపు పోకడలను ఇలా తెలుగు సాహిత్యంలోకి యువరచయితలు తేవడం తప్పకుండా అవసరం, అభిలషణీయం’ అనే మా అభిప్రాయం కూడా అని స్పష్టం చేయడం కోసం, ఆ ముందుమాట మిమ్మల్ని చదవమని కోరుకున్నది. అందువల్ల ‘సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసిన’ సాహిత్యాన్ని ‘మేము’ ఎంచుకున్న ప్రమాణాల మీద తిరస్కరించడం అనే ఆరోపణకు ఆధారం లేదు. ఒకరిపై ఫత్వాలు జారీ చేసే అధికారం, అవసరం మాకు లేదు. సరళంగానో, కఠినంగానో సాహిత్యంపట్ల, సాహిత్యధోరణుల పట్ల మా అభిప్రాయం చెప్పగలం, అంతే. -సం.]
అక్టోబర్ 2024 గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:
10/04/2024 2:24 pm
కీలకం అంతా ఇక్కడ ఉంది. మీవ్యాసంలోనూ, సమకాలీనసాహిత్యం విషయంలోనూ కీలకం అదేను.
ఒక మంచిరచనకు ఉండే ముఖ్యలక్షణాలలో మొదటిది చదివించగలగటం రెండవది ఆలోచన రేకెత్తించగలగటం. మూడవది దాని గురించి ఇతరులకు చెప్పాలని అనుకోవటం. ఈతూకపురాళ్ళు వేసి తూచండి.
సమకాలీనరచనలు ప్రజల మనస్సులకు ఎక్కుతున్న పక్షంలో వాటికి మంచి ఆదరణ ఉండి సాహిత్యరంగం కళకళలాడుతూ ఉండేది. ఆరచయితలకు కాసిని కాసుల గలగలలూ వినిపించేవి (వారూ బ్రతకాలిగా మరి). అలాంటిది స్వప్నంలో తప్ప వాస్తవజగత్తులో సాహిత్యకారులు చూడలేకుండా ఉన్నారే?
ఏవో అజెండాలతో బయలుదేరి రకరకాలవాదాల ప్రచారసాహిత్యం తయారీ ఫాక్టరీ కార్మికులలాగా రచయితలూ కవులూ కష్టపడి అచ్చుపోసి జనం మీద విసిరేసే చిన్న పెద్దా కరపత్రాల్లాంటి సో-కాల్డ్ ఆధునికసాహిత్యాన్ని పోగేసుకొని చదువుకొనే పాఠకులు ఎక్కువమంది ఉండటం కష్టమే.
ఏరంగు కళ్ళద్దంలో నుండి చూస్తే ఈ ప్రపంచం ఆరంగు పులుముకొని కనిపిస్తుందే కాని అది సత్యప్రపంచం కాదు కదా. ఈ ఇజాలూ వాదాల కళ్ళద్దాలను ప్రక్కనబెట్టి స్వఛ్చమనస్క్కులై తెలుగు రచయితలూ మంచి రచనలు చేయటం మొదలుపెట్టితే సాహిత్యరంగానికి మంచిరోజులు వస్తాయి. లేకుంటే లేదు.