కవిత్వభాషకీ, వ్యావహారిక భాషకీ మధ్యనున్న తేడాలు, భాషలో ఉన్న వివిధ ప్రత్యేకాంశాలు కవిత్వంలో సాధించే ప్రయోజనము గూర్చి యీ వ్యాసంలో నాకు తెలిసినంతలో విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.

భాష స్వభావం తెలుసుకోకుండా గ్రంధస్థ భాష లో వున్న ప్రత్యయాలకి మాత్రమే ఆ గౌరవం కలిపిస్తే, దానివలన భాషకి చాలా నష్టం ఉంది. పిల్లలకి అటువంటి భాష నేర్పరాదు. ఆ భాష తగినంత జీవం గల భాష అయి ఉండాలి. నిర్జీవమైతే గ్రాంధిక భాష అయినా పిల్లలకు నేర్పకూడదు.

వ్యవహారములో ననేక రూపము లిట్లే కాలక్రమమున మార్పు జెందినవి. ఇట్టి వ్యావహారిక భాషారూపము లనేకములు నేడు పలువురువ్రాయు వ్యాసములలో గానవచ్చుచు ప్రామాణికత్వమును బడయగలిగిన స్థితిని బొందుచున్నవి. శిష్టవ్యవహారమే ప్రామాణికత్వమునకు మూలముగదా.

గిడుగు, గురజాడలు సమకాల విశ్వసారస్వత స్థితిగతులను పరిశీలించిన వాళ్ళు. వారి ప్రతికక్షులకు ఏ విధమైన విశాల దృక్పథంగాని ఇరుగు పొరుగుల అనుభవాలను గమనించటంగాని అలవాటు లేదు. ఇదే తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది. దృష్టి భేదాలు అనుభవ భేదాలూ ఘర్షణకు దిగాయి.

భద్రిరాజు గారి అశీతితమ జన్మదిన సందర్భంగా ఆయన గురించి చేకూరి రామారావు, వెల్చేరు నారాయణ రావు, కె. కె. రంగనాథాచార్యులు, ఆరుద్ర, బూదరాజు రాధకృష్ణ గార్లు రాసిన వ్యాసాలను ఈ సంచికలో చివరి విడతగా మీకు అందజేస్తున్నాము. సమయాభావం వల్ల, ఈ ప్రత్యేక సంచికకోసం మాకు పంపించిన కొత్త రచనలన్నింటిని ప్రచురించలేక పోయాము. మిగిలిన రచనలను జులై సంచికలో తగుమాత్రంగా సమీక్షించి ప్రచురిస్తాము. ఈ సంచికకోసం పాత వ్యాసాలను సేకరించడంలో మాకు ఎంతగానో సహాయ పడ్డ వాడపల్లి శేషతల్పశాయి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

జనులు వాఙ్మయము నర్థము చేసికొనలేక పోయినచో వారలకుఁదమ పూర్వ వృత్తాంతము, పూర్వ మర్యాదలు తెలియక పోవును. తమ పూర్వ వృత్తాంతము మఱచిపోవుట కంటె ఘోరతరమైన విపత్తేజాతివారికిని దటస్థింపఁబోదుకదా!

ఏమార్పులు చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చల విడిగా నుండరాదు. ఇట్టి మార్పులు భాషాభివృద్ధికి దోడ్పడవు.

భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.

వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది.

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.

  • – ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు
  • – ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు
  • – “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు

పూర్తి వివరాలు»

“‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు.ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా. “పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.

“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”

అమెరికాలో దిగడి ముప్పై ఏళ్ళు దాటుతోంది.. గత ఇరవై యేళ్ళలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను

ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది.