జార్జ్ బూల్ బీజగణితాన్ని తర్కశాస్త్రానికి అన్వయించి కొత్త గణిత శాస్త్రానికి పునాది వేశాడు. ఆ కొత్త గణితాన్ని ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ కి అన్వయించి కంప్యూటర్ విప్లవానికి నాంది పలికాడు క్లాడ్ షానన్.

మానసికమైన వృద్ధాప్యం సోకకుండా కాలం గడిపేవారిలో ఒక లక్షణం కనబడుతుంది; వారు బాహ్యప్రేరణలకు పాజిటివ్‌గా స్పందిస్తూ ఉంటారు. ఎప్పుడో పంకజ్ మల్లిక్ తదితరుల ప్రభావంతో మొదలైన రజనీగారి సంగీతప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఈ వ్యాసపు ముఖ్యాశయం వాడుక భాషలో తెలుగు కవిత్వం ఎలా మెల్లమెల్లగా వికసించి నేటి స్థితికి వచ్చిందన్న విషయాన్ని సోదాహరణంగా వివరించడమే. వ్యాసం కొద్దిగా పొడవైనా ఈ ఉదాహరణలు పాఠకుల ఆసక్తిని ఎక్కువ చేస్తాయని నా నమ్మకం.

కాబట్టి జ్యోతిషం ఫాల్సిఫయబిలిటీ పరిధిలోకే వస్తుంది అనుకోవచ్చు. అందుచేత అది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం, సైన్సు కానక్కరలేదు అని వదిలెయ్యవలసిన అవసరం లేదు.

తను ఎంచుకున్న దారి తప్పైనా ఒక ఆదర్శం కోసం ఎంచుకున్నట్టుగా హీరో యొక్క సామాజిక విలువల్ని చూపి హీరోయిజాన్ని నిలబెట్టాడన్నమాట. అంతేకాక ముగింపుని అలా ప్రేక్షకుల ఆలోచనకే వదిలేసి, హీరో స్థాయిని నిలబెట్టాడు.

ఆ వంట వాసనలకి స్వర్గం ఇంట్లో, ముఖ్యంగా వంటిట్లోనే వుందని నమ్మాడు సుబ్బారావు. “ఏంటోయి ఇవాళ వంట?” అని అడిగాడు హాస్యంగా, అన్నీ కనబడుతూ వున్నా.

నండూరి వారు “ఎంకి”ని సృష్టించి ఎనభై ఏండ్లు నిండాయి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే. ఎప్పటికీ నిండు జవ్వని ఎంకి. […]

మగత మగత నిద్రలో జోగుతున్న కోటిగాడు గబుక్కున లేచి కూర్చున్నాడు ‘కొట్టకండి, కొట్టకండి, అమ్మా నన్ను కొట్టడానికి మళ్ళీ ఒచ్చేరే, నేనేం చేసేనే?వద్దని చెప్పవే’ అంటూ…

సెన్సారుషిప్పు సంగతి దేవుడెరుగు, వాటిపై గూండాలదాడి జరుగుతుంటే చిద్విలాసపు చిరునవ్వుల్లో అంతా ఈశ్వరేచ్చ అనే ప్రభుత్వాన్ని చూస్తే ఏ ప్రజాస్వామ్యికవాది గుండెలుప్పొంగవూ?

ఇంతటి మహత్తర కోశాన్ని సంకలనం చేసిన శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తిగారికీ, ఆ పని వారికే అప్ప చెప్పి ఓపికతో చేయించుకొని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారిని మరొకమారు అభినందిస్తున్నాను. మరొకమారు చాలదు. పిదప వేరొక మారు, ఆ తరువాత ఇంకొకమారు అభినందించాలి.

తెలుగులో ఆలోచనా రంగం బలంగా ఏర్పడటానికి కృషి చేసిన వారిలో కృష్ణమూర్తిగారు చాలా పెద్దవారు. ఆయన వేసిన ప్రణాళికలూ, చేసిన ఆలోచనలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తయారు చేసిన శిష్యులూ, తెలుగు భాషని ఒక్కసారిగా కొన్ని శతాబ్దాలు ముందుకు తీసుకొచ్చి ఇరవయ్యో శతాబ్దిలో పెట్టాయి.

సందర్భం వచ్చింది గనుక వారిని కొత్త తరానికి స్థూలంగా పరిచయం చేయడం, అంతర్జాతీయ భాషాశాస్త్ర రంగంలో అగ్రగామి భాషా శాస్త్రవేత్త గా గుర్తింపు రావడానికి కారణమైన వారి కృషిని వివరించడం అవసరం అనుకుంటాను.

పరిషత్తు వారు చాలా ధనము కర్చుపెట్టి చాలా శ్రమపడి వ్యావహారిక భాషాభ్యాసమువల్ల సారస్వతము నశించి దేశమునకు ఉపద్రవము కలుగుతుందని ప్రజలను, ప్రభుత్వమువారిని, విద్యాధికారులను నమ్మించుటకై చెప్పిన మాటలన్నీ యధార్థమైనవి కావనిన్నీ, దురభిమానముచేత తాము మోసపోయి లోకమును మోసపుచ్చినారనిన్నీ ఈ వ్యాసము నందు ఋజువు చేస్తాను.

వాడుకలో నున్న భాషను తృణీకరించి ప్రాచీన భాషను ఆదరించడము బ్రతికియున్నవారికి తిండిపెట్టక చచ్చిన వారికోసము సంతర్పణ చేసినట్టు కాదా? ఆదికవులకు ఇట్టి దురభిమానముంటే తెలుగులో గ్రంథములే లేకపోవును గదా?