తన జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి బైరాగికి ఎటువంటి బెంగాలేదు. తనకుతానుగా ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. సన్మానాలు, సత్కారాలకు పూర్తిగా దూరం. చదువుకోవటం, మనసుకు తోచినది రాయటం, రాసింది కూడా వేగంగా అందరికీ చేరాలన్న కోరిక తక్కువే.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

గత నూరు సంవత్సరాలుగా, మన ప్రాంతీయ భాషలు “ప్రేయసి మెల్లకన్ను మీద” బస్తాల కొద్దీ కవిత్వాన్ని ఉత్పత్తి చేశాయి తప్ప, ఆధునిక నాగరికత, విజ్ఞానాన్ని వివరించి చర్చించే విధంగా అభివృద్ధి చెందలేదు. ఇది శోచనీయం. అయినా నిజం.

ఆగస్టు 30, 2025 నాటికి, రచయిత, పండితుడు, హేతువాది, మూఢనమ్మకాలను నిర్మొహమాటంగా విమర్శించిన ఎం. ఎం. కల్బుర్గి (మల్లేశప్ప మడివాళప్ప కలబుర్గి) హత్య జరిగి […]

నిన్నంతా కురిసి కురిసి వాన అలసిపోయిందేమో – ఆ ఉదయాన వాన ఛాయలు వెదుకుదామన్నా కనిపించలేదు. గొప్ప ఉపశమనం. సంతోషం. అప్పటిదాకా మొహం చాటేసిన సూర్యుడు కూడా తన పూర్ణస్వరూపం చూపించడానికి తొందరపడసాగాడు. గొప్ప వాతావరణం. వెచ్చని ఎండలో, చక్కని వెలుగులో హిమశిఖరాల మధ్య ట్రెకింగ్ చెయ్యడమంటే స్వర్గసమానమే.

ఆకలిగొన్న మంటలా నన్ను నేను తింటూ వెలుగుతాను.
నేను పట్టుకున్న ప్రతిదీ వెలుగు. నేను వదిలిన ప్రతిదీ బూడిద.
నిశ్చయంగా నేను నిప్పు

ఒక పద్యములో మఱియొక పద్యము ఇమిడేటట్లు ఉండే పద్య గర్భకవిత్వము మనకు పరిచితమే. కాని ఒక వృత్తపు పాదములో మఱియొక వృత్తపు పాదము ఇమిడేటట్లు ఉండే పాద గర్భ కవిత్వమును మొట్టమొదటిసారిగా పరిచయము చేసినాను. ఇది అమరికల ఆవృత్తి వలన జనించిన ఆవృత్త వృత్తములవలన సాధ్యమైనది.

వోల్టా కప్ప మీదనేకాక తన మీద కూడా ప్రయోగం చేసుకున్నాడు. నాలుక చివరన తగరపు ముక్కని పెట్టి, నాలుక మధ్యలో వెండి నాణాన్ని ఉంచి, నాలుకతో తగరాన్ని వెండి తో కలిపితే, నాలుక నరంలో విద్యుత్తు ప్రవహించి, నాలుకకి లోహపు రుచి కాకుండా ఓ ఆమ్ల రుచి తెలుస్తుందన్నాడు.

నీకేమీ కాని, నీతో అంత దగ్గరితనమూ లేని
ఓ పెద్దాయన విషయాలు తరచి తరచి అడుగుతూ
నువ్వు చేసిన ఒకానొక పనికి తల్లడిల్లి
ఆ పని తన కొడుకో, కూతురో చేసినట్టు
నిన్ను గట్టిగా మందలించాక

తలుపు చాటున నక్కిన భావం
మధుపాత్రలో దూకి చచ్చిపోయింది.
వీధికుక్క అరుపులకు భయపడి,
పల్లకిలో ఊరేగుతున్న ఆశయాలు
ముద్దగా వాకిలిలో కూలబడ్డాయి.

పన్నెండవశతాబ్దికి చెందిన సంఘసంస్కర్త, కవి అయిన బసవణ్ణ, కులవ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించాడు. శ్రమైకజీవనమే పూజ అని నమ్మిన కులరహిత సమాజ నిర్మాణానికి ఆయన కృషి చేశాడు. బ్రాహ్మణీయ వర్ణవ్యవస్థపై తిరుగుబాటు చేసి, ‘తక్కువకులస్థుల’తో మమేకమయ్యాడు. ఒక ‘వచనం’లో ఆయన, తను మదర చెన్నయ్య సేవకుడికీ, కాకయ్యవద్ద చర్మకారవృత్తిచేసే పనిపిల్లకు పుట్టినవాడినని చెప్పుకునేంతగా సాహసించాడు.

ప్రసిద్ధ తమిళ నవలా రచయిత జయమోహన్ రాసిన వెళ్ళైయానై అన్న తమిళ నవలకు తెలుగు అనువాదం అయిన ‘తెల్ల ఏనుగు’ ఆగస్టు 9న విడుదల అవుతోంది. ఆ సందర్భంగా ఆయన ఈమాటకు ఇచ్చిన ఇంటర్యూ.