ఆంగ్ల సాహిత్యంలో ఫ్రాన్సిస్ థామ్సన్కు ఎంత ప్రత్యేక ప్రాముఖ్యం ఉందో బైరాగికి మన సాహిత్యంలో అంత ప్రాముఖ్యమూ ఉంది. “స్వర్గ భైరవం” (Hound of Heaven) గొప్ప గీతం అంటారు. ఆ స్వర్గ భైరవాన్నే నేను బైరాగిలో చూస్తాను.
శీర్షికలు సంచికలు
బైరాగిపై బెంగాలీ కవి జీవనానంద్ దాస్ ప్రభావం ఉందని అంటారు. ప్రభావం అన్నది చాలా పెద్ద మాట. కానీ, స్వంత గొంతుక బైరాగికి ఉంది. ఆయన బాణీ ఎవరినీ అనుకరించినదీ, అనుసరించినదీ కాదని ఆయన కవిత్వంతో పరిచయం ఉన్నవారికి ఇట్టే తెలుస్తుంది.
అతడు ఆదిమ మానవుడి నుండి అత్యాధునిక మనీషి పర్యంతం మధ్య కాలంలో మానవాళిని వెంట తరుముతున్న నిరవధిక భ్రంశాన్ని సమగ్రంగా చిత్రీకరించాడు. అందువల్లనే అతడు కవులకు కవి. పూర్ణకవి.
ప్రత్యేక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అది దేనికీ అనుకరణప్రాయం కాదు. ఆత్మవేదనను, ప్రపంచ బాధను సమానంగా పలికించిన కంఠస్వరం. ఆశ, నిరాశల అపురూప సమ్మేళనం. నిష్కల్మషమైన, ఆర్ద్రమైన, ప్రేమపూర్వకమైన, గాద్గదికమైన గొంతు.
సాంప్రదాయిక కవిత నుండి వచన కవితా వసుంధర మీదకు వచ్చిన బైరాగి అన్ని దారులూ చూపి, బ్రతుకులో నుంచి బ్రతుకుకు పరిస్థితులను మానవీయం చేయాలన్న తనదైన బాటనే తొక్కాడు.
బైరాగి కవిత్వం పార్శ్వాలను తడిమి చూడడం, ఆయనలోని సామాజిక, రాజకీయ, తాత్విక కోణాలను పరిశీలించడం, మరీ ముఖ్యంగా ఆయన ఉపయోగించిన పదబంధాలు, భాషా సౌరభాలు ఆస్వాదించడం, తాదాత్మ్యం చెందడం దాదాపు నాకు ఒక నిరంతర ప్రక్రియ. ఎప్పుడు ఆయన కవిత్వం తీసి చదివినా కొత్త దృశ్యాలు మనోఫలకం మీద ఆవిష్కృతమవుతాయి.
బైరాగి కథ చెప్పే తీరు విలక్షణంగా ఉంటుంది. ఎత్తుగడ ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కథాలోకంలోకి, నాయకుడి మనసులోకి మనల్ని తొందరగా తీసుకువెళతాడు. చిన్న చిన్న వాక్యాలతో కథ వడిగా నడుస్తుంది. కీలక సన్నివేశాలలో అతని అద్భుత పదవిన్యాసం మనల్ని మైకంలా కమ్మేస్తుంది.
చేయి తిరిగిన మగ్గం నేత పనివాడు సున్నితంగా జరీ పోగుల్ని చీరల్లో నేసినట్టు తన కథల్లో బ్రతుకుని గురించీ, మనుషుల గురించీ సున్నితమైన, నిగూఢమైన భాష్యాలు చేశారాయన.
1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.
లోయల లోతుల్లోకి
తదేకంగా చూస్తూ…
ఒంటరి పిట్ట
బైరాగి సర్వాత్మనా కవి. అతని ఇంటి పేరు కవిత్వం. సశక్త, సముజ్జ్వల వాగ్విలాసుడు బైరాగి!
ఇందు కిరణ మృదు మంద చరణముల
నందన వన మకరంద తుహినముల
గంధ శ్వసన స్వచ్ఛంద వ్యజనముల
ఏ ఆనందము జాలువారునో
అదే కాంతి కలిగించుము దేవా!
జన జీవన జననీ! ప్రియ ధరణీ!
ధరణీ! జననీ!
గోపీచంద్, బైరాగి ఇద్దరూ హేతువును ప్రశ్నించారు. కానీ గోపీచంద్ ఆధ్యాత్మికతలో ముగిశాడు. బైరాగికి మాత్రం ఫుల్స్టాప్ లేదు.
బైరాగి కవి, కథ రచయితగా ఒక గంట జీవితం కథలో మనిషి మనసు చేసే గారడీలను తెలియజేసాడు. అనుక్షణం మనసు స్పందనలు, ప్రతిస్పందనలు ఎలా మార్పు చెందేది ఈ కథలో మనకు చూపిస్తాడు.
బైరాగి కవిత్వోపాసకుల్లో బహుశా anthropophagic సహదేవుని అంశ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మరొక పోలిక చెప్పాలంటే, Ray Bradbury నవల ‘Fahrenheit 451’ లో ‘బుక్ పీపుల్’ ఉంటారు, తమని తాము పుస్తకాలుగా మార్చేసుకునే ఒక రహస్య కూటమి.
దివ్యభవనం పరిచయంలో బైరాగి అడుగడుగునా కన్పిస్తాడు. సామాజిక జీవన వ్యవస్థతోపాటు, మానవ మనస్తత్వ విశ్లేషణ ప్రతి కథలో కన్పిస్తుంది. అంతర్లీనంగా ప్రధాన పాత్రలో బైరాగి సాక్షాత్కరిస్తాడు.
రెండు ప్రత్యేకాంశాలు బైరాగి కవిత్వంలో కానవస్తాయి. ఒకటి, అతని పద — సమాస — వాక్య నిర్మాణ శైలి. రెండు, ఆశ్చర్యకరమైన కల్పనాశక్తి. భాషలోని శబ్దాలు తన వ్యక్తీకరణకి చాలనప్పుడు ప్రతి గొప్ప కవీ తన భాషాసంపద (diction) తాను సృష్టించుకుంటాడు. అందుకు బైరాగి కవితే ఉదాహరణ.
చీకటి పడినది తల్లీ దీపం చూపవేలనే!
మాకై దీపం చూపవేలనే?
“నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావుల్నందర్నీ బట్టబయలు చెయ్యాల్నుంది,” అంటూ బైరాగి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. బైరాగితో చెప్పాను, “అందరి మీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకానీ, అందరిలాగా నవలలూ, కథలూ తలపెట్టకు,” అని.