బైరాగి కథ చెప్పే తీరు విలక్షణంగా ఉంటుంది. ఎత్తుగడ ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కథాలోకంలోకి, నాయకుడి మనసులోకి మనల్ని తొందరగా తీసుకువెళతాడు. చిన్న చిన్న వాక్యాలతో కథ వడిగా నడుస్తుంది. కీలక సన్నివేశాలలో అతని అద్భుత పదవిన్యాసం మనల్ని మైకంలా కమ్మేస్తుంది.

చేయి తిరిగిన మగ్గం నేత పనివాడు సున్నితంగా జరీ పోగుల్ని చీరల్లో నేసినట్టు తన కథల్లో బ్రతుకుని గురించీ, మనుషుల గురించీ సున్నితమైన, నిగూఢమైన భాష్యాలు చేశారాయన.

1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.

ఇందు కిరణ మృదు మంద చరణముల
నందన వన మకరంద తుహినముల
గంధ శ్వసన స్వచ్ఛంద వ్యజనముల
ఏ ఆనందము జాలువారునో
అదే కాంతి కలిగించుము దేవా!

బైరాగి కవి, కథ రచయితగా ఒక గంట జీవితం కథలో మనిషి మనసు చేసే గారడీలను తెలియజేసాడు. అనుక్షణం మనసు స్పందనలు, ప్రతిస్పందనలు ఎలా మార్పు చెందేది ఈ కథలో మనకు చూపిస్తాడు.

బైరాగి కవిత్వోపాసకుల్లో బహుశా anthropophagic సహదేవుని అంశ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మరొక పోలిక చెప్పాలంటే, Ray Bradbury నవల ‘Fahrenheit 451’ లో ‘బుక్ పీపుల్’ ఉంటారు, తమని తాము పుస్తకాలుగా మార్చేసుకునే ఒక రహస్య కూటమి.

దివ్యభవనం పరిచయంలో బైరాగి అడుగడుగునా కన్పిస్తాడు. సామాజిక జీవన వ్యవస్థతోపాటు, మానవ మనస్తత్వ విశ్లేషణ ప్రతి కథలో కన్పిస్తుంది. అంతర్లీనంగా ప్రధాన పాత్రలో బైరాగి సాక్షాత్కరిస్తాడు.

రెండు ప్రత్యేకాంశాలు బైరాగి కవిత్వంలో కానవస్తాయి. ఒకటి, అతని పద — సమాస — వాక్య నిర్మాణ శైలి. రెండు, ఆశ్చర్యకరమైన కల్పనాశక్తి. భాషలోని శబ్దాలు తన వ్యక్తీకరణకి చాలనప్పుడు ప్రతి గొప్ప కవీ తన భాషాసంపద (diction) తాను సృష్టించుకుంటాడు. అందుకు బైరాగి కవితే ఉదాహరణ.

“నాకో నవల రాయాలనుంది, అందులో మన మేధావుల్నందర్నీ బట్టబయలు చెయ్యాల్నుంది,” అంటూ బైరాగి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. బైరాగితో చెప్పాను, “అందరి మీదా నీది పైచేయి కావాలంటే కవిత్వం రాయి. అంతేకానీ, అందరిలాగా నవలలూ, కథలూ తలపెట్టకు,” అని.

తన జీవితం గురించి, తన భవిష్యత్తు గురించి బైరాగికి ఎటువంటి బెంగాలేదు. తనకుతానుగా ఎటువంటి గుర్తింపు కోరుకోలేదు. సన్మానాలు, సత్కారాలకు పూర్తిగా దూరం. చదువుకోవటం, మనసుకు తోచినది రాయటం, రాసింది కూడా వేగంగా అందరికీ చేరాలన్న కోరిక తక్కువే.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

గత నూరు సంవత్సరాలుగా, మన ప్రాంతీయ భాషలు “ప్రేయసి మెల్లకన్ను మీద” బస్తాల కొద్దీ కవిత్వాన్ని ఉత్పత్తి చేశాయి తప్ప, ఆధునిక నాగరికత, విజ్ఞానాన్ని వివరించి చర్చించే విధంగా అభివృద్ధి చెందలేదు. ఇది శోచనీయం. అయినా నిజం.

ఆగస్టు 30, 2025 నాటికి, రచయిత, పండితుడు, హేతువాది, మూఢనమ్మకాలను నిర్మొహమాటంగా విమర్శించిన ఎం. ఎం. కల్బుర్గి (మల్లేశప్ప మడివాళప్ప కలబుర్గి) హత్య జరిగి […]