పాదములోని మాత్రల విఱుపు, పదముల విఱుపు పద్యములకు ఒక క్రొత్త విధమైన అందమైన అద్భుతమైన నడకను ప్రసాదిస్తుంది. లేకపోతే పద్యమనే చట్రములో పదాడంబరముతో వచనమును వ్రాసినట్లు ఉంటుంది. ఛందస్సు శారదాదేవి రెండు స్వరూపములైన సంగీత సాహిత్యములకు ప్రతీక. సంగీతము లేని సాహిత్యము బధిరత్వమే, సాహిత్యము లేని సంగీతము అంధత్వమే. అప్పుడే ఛందస్సు పాత్ర సార్థకమవుతుంది.

మాద్రిద్ విశ్వవిద్యాలయంలో ఆమె పేరిట ఒక పీఠం ఏర్పడడం ఎంతో అరుదుగా స్త్రీలకు లభించే గౌరవం. అయితే, మేధావులకోసం స్థాపించిన స్పానిష్ రాయల్ అకాడెమీలో తనకు స్థానం లభించాలన్న ఆమె ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఆ అకాడెమీ కేవలం మగవాళ్ళకేనని తేల్చి చెప్పారు పండితులు!

అయితే రంగారావుగారికంటే ముందు ఇలాంటి విశ్లేషకులు లేరా? ఇకముందు రారా? ఏమిటీ ఆయన గొప్పతనం? అంటే – ఆయనకు ముందు ఇలాంటి వారున్నారేమో తెలీదు కాని, ఆయనంత నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిస్పక్షపాతంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేవారు మాత్రం లేరు.

స్తన్యాన్ని వదిలి ఆహారాన్ని కోరే మూడు నోళ్ళు. సమాజం పట్ల ప్రతిస్పందనలతో మార్గదర్శకత్వం కోసం ఆరాటపడే మూడు జతల కళ్ళు. జంటగా మోయవలసిన భారం ఒంటరి భుజాలపై పడింది. అప్పుడు ఆమెది జీవితంతో పోరాటం. వాస్తవమైన పని ఆరంభమయింది. ఆహారం ఇచ్చింది. ఆలోచనలు ఇచ్చింది. ఉన్నంతలో ఆనందాన్ని పంచటం మప్పింది.

చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు.

కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు.

జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.

మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.

శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు.

కమ్యూనిజంలో ఉన్నప్పుడు అది సోవియట్ యూనియన్ కావచ్చు, తూర్పు ఐరోపా కూటమిలో ఉన్న దేశం కావచ్చు, అక్కడి మనుషుల అంతరంగాన్నీ బాహ్య జీవితాన్నీ ఒక వింత ఒత్తిడి విడతీసి వేరు చేసేస్తుంది. రష్యనులు ‘స్లోజ్న’ అని పిలుచుకునే ఈ స్థితి, ఈ విడతీత ‘క్లిష్టమైనది’. మాస్కోలో చదువుతో ముడిబడ్డ ఉద్యోగాలు కమ్యూనిస్టు పార్టీతో సత్సంబంధాలుండిన వారికే దక్కేవి.

సంస్కృత వృత్తములను ఏవిధముగా ఎనిమిది త్రిక గణములతో, నాలుగు రెండక్షరముల గణములతో, రెండు ఏకాక్షరపు గణములతో వివరించగలమో, అదే విధముగా దేశి ఛందపు వృత్తములను కూడ బ్రహ్మ, విష్ణు గణములతో, ఒక గురువు, రెండు లఘువులతో వివరించ వీలగును.

కాని నేను ఫలానా ఛందస్సులో వ్రాయాలని సంకల్పించను. భావం ఛందస్సులో నిముడాలనే బదులు ఛందస్సు భావంలో నిముడాలనే అభిప్రాయం గల వాణ్ణి నేను. అట్లని పద్యాలలో వ్యర్థ పదాలు చోటు చేసికొనరాదు. అందుచేత నొక అపూర్వమైన ఛందస్సు భావంలో స్ఫురించినప్పుడు కాదనక దానినట్లే స్వీకరించినాను. అందుచేత అనేకనూతనవృత్తాలను, ఖండ, చతురశ్ర, మిశ్ర, త్ర్యస్రగతులలో సాగే అనేకమాత్రాపద్యభేదాలను వివరించుటయే ఈ వ్యాసంయొక్క లక్ష్యం.

ఈ భూమిపై ఎందరో పిల్లలు ఆకలితో చనిపోతుంటే అంగారక గ్రహ యాత్ర కోసం బిలియన్ల డాలర్ల ఖర్చును నేను ఎలా సూచించగలుగుతున్నానని మీ లేఖలో అడిగారు. అయ్యో! ఆకలితో చనిపోతున్న పిల్లలున్నారని నాకు తెలీదు, ఇప్పటినుంచి మానవాళి ఈ సమస్యను పరిష్కరించే వరకు నేను అన్ని అంతరిక్ష పరిశోధనల నుంచి విరమించుకుంటాను వంటి సమాధానాలు మీరు ఆశించరని నాకు తెలుసు.

ఈ కథ – సృష్టికి, సృష్టికర్తకూ ఉన్న సంబంధం గురించి; మానవీయతకు, అమానవీయతకూ ఉన్న సంబంధం గురించి; వికారానికి, అందానికీ ఉన్న సంబంధం గురించి; మేధకు, ఉద్వేగానికీ ఉన్న సంబంధం గురించి; శాస్త్రజ్ఞానానికి, యథార్థానికీ ఉన్న సంబంధం గురించి; ప్రకృతికి, మనిషికీ ఉన్న సంబంధం గురించి సరికొత్త వ్యాఖ్యానం.

దామెర్ల రామారావు జీవితకాలంలోనే ఇంతటి ప్రశంసలను అందుకున్నారు. కానీ ఈరోజు భారతదేశంలో రామారావును ఎరిగినవారు ఎవరూ లేరనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అరకొర జ్ఞాపకాలే మిగిలాయి. ఆంధ్రదేశ వీరగణంలో అస్పష్టమూర్తిగానే రామారావు నిలిచారు. జాతీయ ఆధునిక చిత్రకళ గ్యాలరీలో దామెర్ల చిత్రాలు మచ్చుకు ఒక్కటైనా కనిపించవు.

‘ఈ గొప్ప చిత్రకారుడు దామెర్ల రామారావు ఇరవై ఎనిమిదేళ్ళ చిన్న వయసులోనే కాలం చెందారు గానీ, ఆయన కనక పూర్ణాయుష్కులు అయి ఉంటే…’ అని కొందరు పెద్దమనుషులు సభా సంప్రదాయాలననుసరించి ఊపిరి పొడుగ్గా వదులుతారు గానీ పూర్ణాయుష్కులు అయి ఉంటే మాత్రం ఏమవుతుంది?

ఇందులో ఉన్నది క్రమాలంకారం. వరుస క్రమంలో ఒకదానిపై మరొకటివైరంతో ఉన్నట్లుగా వర్ణన. అంటే, తుమ్మెదలు సంపంగి పూలపై వాలవు, కానీ సీత అలకలు అంటే ముంగురుల కిందనే సంపంగి వంటి ముక్కు ఉంది. అందువల్ల తుమ్మెదల పై సంపెంగలదాడి వలె ఉంది. అట్లాగే తామర పూలకు చంద్రునికి వైరం. కానీ ఇక్కడ ఆమె చేతులు పద్మాల వలె ఉంటే వాటితో ముఖమనే చంద్రుణ్ణి మన్మథుడు వైరిగా ఏర్పరచాడు.

కూల్డ్రే దొర కూడా కలోనియల్ బ్రిటిష్ చిత్రకళానైపుణ్యానికి అవతల నిలబడలేదు-ఆయనదీ అదే నేత. కానీ దారితెన్ను, అతీగతీ లేని చిత్రకళాపథంలో నాటికి ఆ ప్రాంతాల్లో ఆయన కాటన్ దొర వంటి పనే చేసేరు – మంచి పంటకు మొలకలెత్తించారు నారు పోసేరు. ఆ సరసన దామెర్ల రామారావు, ఆయన సాటి కళాకారులు, మిత్రులు అతి కొద్దిమంది గొప్ప చిత్రకారులుగా మిగిలారు-ఇక్కడ.

అన్నాచెల్లెళ్ళను గురించి ఇలాంటి వస్తువు అంతకుముందు ఇంగ్లీషు నవలల్లో ఎవ్వరూ చిత్రించలేదు. ఒకరకంగా ఇది జార్జి ఎలియట్ ఆత్మకథాత్మక నవల అనీ, ఆమెకు అన్న పట్ల అమితమైన ప్రేమ ఉండేదనీ విమర్శకులంటారు. ఇప్పటి విమర్శకులు ఫ్రాయిడియన్ సిద్ధాంతాలతో వ్యాఖ్యానించడానికి పుష్కలంగా అవకాశం ఉన్న నవల ఇది.

జావాలో సంస్కృత పదములతో కూడుకొన్న ప్రాచీన జావాభాషలో కావ్యములను వ్రాసినారు అక్కడి కవులు. వీటిని కాకవిన్ అంటారు. కాకవిన్ రామాయణము మొట్టమొదట వెలువడినది. అది సంస్కృత ఛందములలో వ్రాయబడినది. అంతే కాదు, అక్కడి కవులు, లాక్షణికులు క్రొత్త ఛందములను కూడ కల్పించినారు.