ఇపుడు మేము నడుస్తున్నది దిగువ హిమాలయాలలోని అడవులలో… మర్సియాంగ్దీ నదీలోయలోని పర్వతాల సానువుల్లో ఉన్న అరణ్యాలలో.. ఆ లోయకు అటూ ఇటూ ఎగసి నిలచిన పచ్చని పర్వతచరియల్ని చూస్తోంటే ప్రకృతి తన కళాత్మకతనంతా ఇక్కడే పొందుపరచిందా అనిపించింది. పచ్చని అడవులు, వరి పొలాలు, జలపాతాలు – అన్నీ చక్కగా అమరిపోయి ఉన్న ఆ సుందరసీమ ప్రకృతి గీసిన బృహత్తర వర్ణ చిత్రం కాదూ?!
శీర్షికలు వ్యాసాలు
పిసపిసలాడే మాంసపు ముద్దలని, చీము, నెత్తురులని కనబడకుండా కప్పెట్టి మన కొక బాహ్య సౌందర్యాన్ని కల్పించి, మనకి ఒక ఆకర్షణని, వ్యక్తిత్వాన్ని ఇస్తుంది చర్మం. మన స్పర్శ జ్ఞానానికి మూలాధారం చర్మం.
1752 జూన్ నెల వానా కాలం. కొడుకుని తీసుకొని ఫ్రాంక్లిన్ మైదానానికి వెళ్ళాడు. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. గాలికి పటం అటూ ఇటూ కొట్టుకుంటూ ఎగురుతూ మిన్నంటుకున్నది. ఓ మబ్బు గాలిపటాన్ని రాసుకుంటూ వెళ్ళింది కాని ఏమీ జరగలేదు. ప్రయోగం విఫలమైందని విచారిస్తుండగా మరో మబ్బు పటాన్ని తాకింది. దారానికి గల పోగులు రోమాల్లా నిక్కబొడుచుకున్నాయి – ఒకదానికొకటి దూరంగా, అవన్నీ విద్యుద్వాహకమైన తీగె మీద ఉన్నట్లుగా. ఫ్రాంక్లిన్ తాళం చెవిని మెటికతో తాకాడు. స్పార్క్ వచ్చి షాక్ కొట్టింది. ప్రయోగం సఫలమైంది.
గిడుగు నుంచి గురజాడ వరకు అందరూ వ్యావహారికాన్ని శిష్టతతో ముడివేశారు. ఆంగ్లేయులు, అగ్రవర్ణములవారు, ఇంగ్లీషు దొరలు పాలించే అభివృద్ధి చెందిన ప్రాంతాల నగరీకరణ చెందిన ప్రజలు వ్యావహారిక భాషకు మూలస్థంబాలు ఈ సంస్కర్తల దృష్టిలో. తెలుగు దళితవాదం కూడా వలసవాద భక్తి, ఆంగ్ల పాశ్చాత్య అనురక్తి అనే ఆధునిక అగ్రవర్ణ వలయంలోనే తిరుగుతోంది.
తిలక్ చేయి తిరిగిన కథకుడు కావడం మూలాన తన కవిత్వం మరింత ఆకర్షణీయంగా తయారైంది. అలాగే కవిగా తిలక్ లోని భావుకత్వం, ఊహాశక్తి తన కథల స్థాయిని పెంచింది. వెరసి తిలక్లో మెరిసే వ్యంగ్యం – బిగుసుకు పోయిన మనిషికి సైతం జీవం ప్రసాదించ గలదు.
రాష్ట్ర విభజన జరిగింది కానీ, సాహిత్యచరిత్ర విభజన లో చాలా సమస్యలున్నాయి. విడివిడి సాహిత్య ప్రయాణం ఉన్నది నిజమే కానీ, ఆ దారులు అనేక కూడళ్లలో ఒకదానినొకటి కలవకుండా లేవు. కొంత దూరం కలసి నడవకుండానూ లేవు. ఒకే సమీకరణలోకి రెండు సాహిత్యాలను బలవంతంగా చేర్చడం అనవసరం. అట్లాగని, ఒకరి సాహిత్యం మరొకరికి పూర్తి పరాయిది కూడా కాదు. నన్నయ, శ్రీనాథుడు తెలంగాణకు అవసరం లేనివారు కాదు, సోమన, పోతన లేకుండా ఆంధ్రవారికి గడుస్తుందనీ లేదు.
దాశరథి తెలుగుదేశంలో ఒక భాగమైన స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించాడు. తాను ఉద్యమంలో వీరుడుగా పాల్గొని కష్టనష్టాలకు గురి అయ్యాడు. ప్రజాశక్తులతో కలిసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్యరంగంలో దూకించాడు. విశాలాంధ్రచరిత్రలో తెలంగాణా విషాద గాథను, విప్లవచరిత్రను కలసి చదువుకున్నప్పుడే సమగ్రత వచ్చేది. తెలుగు దేశంలో మూడవవంతు తెలంగాణం, దానిని మేల్కొల్పి యావందార్థంతో చెలిమి కలిపిన కవికిశోరం దాశరథి.
“నువ్వు ఏమిటి తింటున్నావో చెప్పు, నువ్వు ఎవరివో చెబుతాను” అనే జనవాక్యం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. మంచి ఆహారం మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టు అని మనలో చాలామంది నమ్ముతాం.
షేక్స్పియర్ కన్నా బేకన్ ఆధునికుడు; బేకన్కి స్పష్టమైన చారిత్రక అవగాహన ఉంది; షేక్స్పియర్కి అది బొత్తిగా లేదు. పదిహేడో శతాబ్దంతో శాస్త్రీయ యుగం మొదలయిందని గ్రహించిన బేకన్, అరిస్టాటిల్ తాత్త్వికతని పూజించడానికి బదులు ప్రకృతిపై ప్రత్యక్షమైన పరిశోధనలు జరగాలని కోరాడు
భారతదేశంలో అసలు మతం ఉందా? ఈ ప్రశ్న ప్రధానంగా పాశ్చాత్య వలసవాద తాత్వికుల నుండి ఉద్భవించింది. భారతదేశానికి చరిత్ర, న్యాయం, చట్టం వంటి భావనలు ఉన్నాయా అని ప్రశ్నించిన క్రమంలోనే భారతీయులకు మతం ఉందా అనే ప్రశ్న మొదలైంది. అసలు భారతీయులు అంటూ ఉన్నారా, వారిని ఎలా నిర్వచించాలి అనే ప్రశ్న కూడా దీని అంతర్భాగమే.
రామారావు గారు ఒక పుష్కర కాలంలో భూనభోంతరాలు నిండిపోయేలా అనువాదాలు చేశారు – ఒకటా రెండా? తెలుగులోకి రాని భాష లేదు, ప్రాంతం లేదు, కేవలం అనువాదాలే లేదు – కవుల చుట్టూ, కవితల చుట్టూ ఉన్న భోగట్టాను పట్టుకొచ్చారు.
ప్రవాసంలో ఉండటం అనేది ప్రవాసంలో ఉన్న టిబెట్ వాసులు ఎదుర్కొంటున్న అత్యంత శక్తివంతమైన వాస్తవికత. వారి హృదయాలు మాతృభూమి కోసం తహతహలాడుతున్న సమయంలో, వారు తెలియని దేశాలలో జీవితాన్ని నిర్మించుకునే సవాలును ఎదుర్కొంటున్నారు. మతం పురాణాల ద్వారా మాత్రమే తెలిసిన భూమికి తిరిగి పోవాలనే వారంతా కోరుకుంటున్నారు. కానీ అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు.
కవిత్వసౌందర్యం గురించి ఎవరు ఎన్ని చెప్పినా, చెప్పడానికి ప్రయత్నించినా అది భాస్కరశతకకారుడు చెప్పినట్టు చేతి పాత్రతో నదీ ప్రవాహంలో నీటిని పట్టుకోవడం లాంటిది. పంచతంత్రంలో గుడ్డివాళ్ళు ఏనుగును నిర్వచించడంలాంటిది.
ఇంగ్లీషు విద్య చదివిన మన యువకులు తమకు తెలుగురాదనీ, తెలుగు చదవమనీ చెప్పుకోవటం గర్వం. ఇందులో గర్వించటానికేమీలేదు.
‘మరి మీ కుటుంబంలో ఎవరైనా భిక్షువులయ్యారా?’ అన్నది మా తదుపరి ప్రశ్న. నవ్వేశాడు పిసాంగ్. ‘నేను పదేళ్ళ వయసులో భిక్షువునయ్యాను. ఇరవై ఏడేళ్ళదాకా కొనసాగాను. రెండేళ్ళ క్రితమే మళ్ళా మామూలు ప్రపంచంలో పడ్డాను,’ అని సమాధానం చెప్పాడు.
చలాన్ని దూషణ భూషణ తిరస్కరణలు చేసేవాళ్లంతా కూడా మైదానం నవల చదివారు, ఇక ముందు కూడా చదువుతారు. పూర్వం పడకగదుల్లో దిండు కింద దాచుకుని ఎవరికీ తెలియకుండా కూడా చదివేవారట. ఇప్పటికీ నేమో. మైదానం నవల ఆకర్షణ అంతటిది.
ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.
‘ఆరుగురు గుడ్డివాళ్ళు – ఏనుగు’ అన్న కథలో లాగ చలాన్ని రకరకాలుగా అర్థాలో, అపార్థాలో మనవాళ్ళు చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. నేను రెండు మూడు సార్లు చలంగారు వుండగా తిరువణ్ణామలై వెళ్ళాను. ఆంధ్ర దేశం నుండి ప్రేయసీ ప్రియులు పెళ్ళి చేసుకుందామనుకునేవారు తిరువణ్ణామలై వచ్చి చలంగారి ఎదురుగా దండలు మార్చుకునేవారు. నాకు ఆశ్చర్యం వేసింది. చలంగారేమో నవ్వుతున్నారు. ఎందుకంటే చలంగారికి వివాహ వ్యవస్థ మీద మొట్టమొదటి నుండి ఏవగింపు.
మా దగ్గరకొచ్చేకొలదీ అతని శరీరం త్వరత్వరగా పెరగసాగింది. అలా పెరిగే క్రమంలో నేను అతని అనేక రూపాలని చూశాను: టెలెస్కోప్ని ఆకాశం వైపు తిప్పడం, పైనుండి క్రిందకి పడే రాయి వేగాన్ని లోలకంతో లెక్కకట్టడం, పాదరసం ఉన్న గొట్టంతో పీడన కొలవడం. అతని రూపం బ్రహ్మాండమైంది: తల ఆకాశాన్ని అంటింది; కాళ్ళు పాతాళం లోతులని చూశాయి; చేతులు రెండు దిశలనీ తాకాయి. అతని చేతిలోని దీపం ఆకాశం అంతటా, అగాధాలలో, నేల నలు మూలలా, వెలుగు ప్రసరించింది. ఎవరీ మహాకాయుడని అడిగాను. ప్లేటో ప్రత్యక్షమయి, ‘ప్రయోగం’ అని సమాధానమిచ్చి..
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హెలెన్ కెల్లర్ 19 నెలల పసిగుడ్డుగా ఉన్న బాల్యంలోనే జబ్బుపడి వినికిడి శక్తిని, చూపుని పోగొట్టుకుంది. తనకి ప్రాప్తించిన గుడ్డితనం కంటే వినికిడిని పోగొట్టుకోవడం వల్ల కలిగిన బలహీనత, ఒంటరితనం, బాధ, ఎన్నో రెట్లు ఎక్కువ అని చెప్పుకుని ఆమె బాధ పడింది.