లక్షల సంవత్సరాలపాటు తీపి వస్తువు అంటే విషవస్తువు కాదు అని ఎరిగిన మానవులు, ఈ మధ్య కాలంలో అసలు ఒక పదార్థం తియ్యగా ఉండటానికి కారణమైన వస్తువేదో కనుక్కున్నారు. దాన్నే తయారు చెయ్యడం నేర్చుకున్నారు. వంటకాల్లో అమితంగా వాడటం మొదలుపెట్టారు. మితిమీరి తిని, షుగర్ జబ్బు తెచ్చుకున్నారు.
Category Archive: వ్యాసాలు
కరుణశ్రీకి దక్కిన అరుదైన అదృష్టం ఘంటసాల తొలినాళ్ళలో కొన్ని ఖండికలని పాడి రికార్డులుగా విడుదల చెయ్యటం. అలా ఘంటసాల మధురగంభీర గళంలో ఉదయశ్రీ పద్యాలు తెలుగునాట మారుమోగాయి. ముఖ్యంగా పుష్పవిలాపం, కుంతీకుమారి, వినని తెలుగువారు అప్పట్లో లేరు. ఉదయశ్రీ పద్యాలు ఘంటసాలకి పేరు తెచ్చాయా, లేక ఘంటసాల గానం ఉదయశ్రీకి గుర్తింపు తెచ్చిందా అనేది సహేతుకమైన ప్రశ్న.
త్యాగరాజస్వామి సంగీతానికే ప్రాముఖ్యత ఇచ్చినట్లు చక్కగా సాక్ష్యం ఇస్తాయి ఇలాంటి కీర్తనలు. నేటి తెలుగు సంగీతవిద్వాంసులకు కొందరికి త్యాగరాజుకున్న కీర్తనాసాహిత్యమ్మీద ఆయనకంటే ఎక్కువ ప్రేమ! అది అరవవిద్వాంసుల నోటిలో నలిగిపోతూంటే వీరు పద్యాలు పాడినట్టు కీర్తనలు అనేసి సాహిత్యాన్ని చక్కగా రక్షిస్తున్నారు. కలవవు రెండు కళలు! సంగీతమూ, సాహిత్యమూ కూడా కలవవు. వింత యేమిటి? ఇవి ఆదిలో వేరుగా పుట్టేయి, భరతముని చేర్చికట్టినా, కాలక్రమ వికాసంలో వేరైపోతున్నాయి. అస్తు.
ఏళ్ళ క్రితం, నేనూ నా ఫ్రెండు మదరాసు నగరాన్ని ఒక చూపు చూద్దామని బయట వీధులెంట తిరుగుతుంటే పదిహేడు-పద్దెనిమిది ఏళ్ళ వయసు కుర్రవాడొకడు, ఇంకా తక్కువ వయసు కూడానేమో! ఒక గోడ మీద రాజకీయనాయకుడి పోర్ట్రయిట్ ఒకటి వేస్తూ కనపడ్డాడు. చాలా పెద్ద బొమ్మ అది. గోడ మీద, అదీనూ అంత పెద్ద గోడ మీద.
ఇండియాలో ఉన్న 1,500 మిలియన్ల జనాభాలో దరిదాపు 80 మిలియన్ల వయోజనులు అనగా (వయస్సు 20-79), నూరింట ఐదుగురు, మధుమేహం బారిన పడుతున్నారనిన్నీ, అందుకే ప్రపంచంలో ‘మధుమేహానికి ఇండియా ముఖ్యపట్నం’ అని ఇటీవల అనడం మొదలు పెట్టేరు! అతి రక్తపు పోటు విషయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది
భిక్షాటన, ముష్టి అనే ఈ రెండింటికి తేడా ఉంది. ప్రపంచంలో ఉన్నవన్నీ వదులుకుని, బతకడానికి కావాల్సినది మాత్రమే తీసుకునేది భిక్షాటన. ముష్టి అనేది ‘నాకింకా కావాలి’ అనుకుంటూ ఎంత ఉన్నా కూడబెట్టుకునేది. ముష్టివాడికి తన దగ్గిర డబ్బు ఉందా లేదా, అనేవన్నీ అనవసరం. ఆవురావుమని ఇచ్చినదంతా తీసుకోవడమే పని. ఈ ముష్టి ఎత్తేవాళ్ళు అత్యంత ధనవంతుల నుంచి అతి బీదవారి వరకూ ఉన్నారు. ముష్టి ఎత్తే సరుకు ఒకటే తేడా.
సంస్కృతములో మాఘునివలె, వేంకటాధ్వరివలె నొక ఆశ్వాసము నంతయు యమకాలంకారమయముగా చేసిన కవులు తెలుగులో నరుదుగా నున్నారు. అట్టివారిలో చంద్రికాపరిణయప్రబంధకర్త యగు సురభిమాధవరాయలు ముఖ్యుఁడు.ఇతఁడీ ప్రబంధములోని చతుర్థాశ్వాసమునంతయు యమకాలంకార మయము చేసినాడు.
అసలు కవిత్వమూ, గానమూ వేర్వేరు కళలు. పద్యమూ, రాగమూ ఈ వేర్వేరు కళలకి సంబంధించినవి కాబట్టి అవీ వేర్వేరే గాని చేరిక గలవి కావు. “సంగీతమపి సాహిత్యం సరస్వత్వాః కుచద్వయం” అంటే రెండూ ఎప్పుడూ కలిసే వుండాలి అనే అర్థము కాదేమో అంటాను. రాగానికి సాహిత్యం లేదు, మిలిటరీ బ్యాండుకి లేదు, శ్రీకృష్ణుని వేణుగానానికీ లేదు. అలాగే గద్యలో రాగం లేదు. ఏకవీర, మాలపల్లి నవలల్లో గొప్ప కవిత్వము ఉంది. రాగము లేదు.
రవీంద్ర సాహిత్యంలో అడుగడుగడునా పిల్లల లోకంలోని అభూతకల్పనలు, అద్భుత సాహసాలు కనబడతాయి. ప్రాచీన గాథలెన్నో సరికొత్త రూపురేఖలతో పలకరిస్తాయి. రాకుమారులు, రాకుమార్తెలు, ఇచ్ఛాపూరణ్ ఠాకురాణీలు, నిద్రాదేవతలు, అప్సరసలు, యక్షులకు కొదవలేదు. కుట్రలు కుతంత్రాలు మంత్రాంగాలు, గూడు పుఠాణీలు, వాటిని భగ్నం చేసే చాతుర్యం కలిగిన కథానాయకుల ప్రస్తావన సంగతి సరేసరి.
2019లో ఒక అభిప్రాయవేదికని నిర్వహించిన అమెరికన్ పాత్రికేయుడు బ్రెట్ స్టీవెన్, విలా కేథర్ని డానల్డ్ ట్రంప్కు ఆంటీడోట్గా పేర్కొన్నాడు. అమెరికాను గొప్ప దేశంగా చేసే లక్షణాలేమిటో విలా నవలలు చెబుతాయని విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా ట్రంప్ విధానాలు విలా కేథర్ని చదవాలను గుర్తుచేశాయని అన్నా తప్పులేదు.
కీర్తనల్ని వాగ్గేయకారులు పాడుతూనే రచిస్తున్నారు. త్యాగరాజు, క్షేత్రయ్య, రామదాసూ తమ కీర్తనల్ని పాడేశారు గాని, సాహిత్యం ముందు కట్టుకుని స్వరములు వేరే కట్టుకోలేదు. అంటే, కీర్తనలోని రాగం అసలుతో చేరే బయటపడుతోందని నా అభిప్రాయం. కీర్తనలోని రాగం పుట్టుకతోనే ఉంది. అల్లాగే పద్యాలతో చేరి రాగాలు రావడము లేదు. వివరంగా మనవి చేస్తున్నా. ఒక్కొక్క కవి ఒక్కొక్క రాగంలో పద్యాల్ని పాడుకున్నట్లు చెప్పేను.
నేను నిశ్చయత కోరుకున్నది గణితంలో మాత్రమే కాదు. రెనె డెకార్ట్ లాగా నాక్కూడా బయటి ప్రపంచమంతా ఒక కల కావచ్చునని అనిపించేది. ఒకవేళ అది నిజంగా కలే అయినా, ఆ కలను కనడం నిజం కాబట్టి, ఆ కలను నేను అనుభూతి చెందుతున్నది నిస్సందేహమైన వాస్తవం కాబట్టి నా ఉనికి అనుమానించలేనిదని నాకు అనిపించింది.
ఏప్రిల్ 2024 ఈమాట లోని మూడు రచనలపై నా స్పందన ఇది. నా ఈ విమర్శ అవసరమా అని ఎవరయినా ప్రశ్నిస్తే దానికి తిరుగు ప్రశ్న, ఆ వ్యాసాలు ప్రచురించడం ఎందుకు అవసరం? అని. సంపాదకీయంలో ప్రస్తావించబడ్డాయి గనుక – అని జవాబు. ఆ సంపాదకీయానికి అవసరం? ఒక గాయకుడికి ప్రకటించిన పురస్కారం లేపిన దుమారం. కారణం, త్యాగయ్య మీద ఆ గాయకుడి వ్యాఖ్యలని కొందరు అనుచితాలనడం.
ఇది మతధర్మము, కుల ధర్మము, జాతి ధర్మము కాని కాదు. మఱి మానవధర్మం. వివిధ భేదాలతో అడ్డగోడలతో ఉద్రేకాలు పెరిగి అనాహుతాలపాలై పోతూవుండే మన దేశంలో త్యాగయ్యగారి యీ గానకళను పరస్పరస్నేహ సౌహార్దాలకు సాధనంగా ఉపయోగించి మనం ధన్యులం కావలసి ఉన్నాము.
మన తెలుగువారికి త్యాగరాజు తెలుగుదనముతోనేగాని ఆయన కీర్తనా సంగీతంతో నిమిత్తం లేదు. త్యాగరాజు తన కీర్తనలను సంగీతంలో మూర్తీభవించినాడుగాని తెలుగులో మూర్తీభవించలేదు. దక్షిణాదివారు పాపం తెలుగు ఏమీ రాకపోయినా, కీర్తనల సంగీతం కోసం వాటిని వల్లించుకున్నారు. వారితో సంగీతవిద్యలో పోటీ చెయ్యలేక, త్యాగరాజు కీర్తనాసాహిత్యాన్ని అరవలు పాడుచేస్తున్నారూ, మేముద్ధరిస్తున్నామని మనము బోరవిరచి ఉపన్యాసాలిస్తున్నాము. కీర్తనలో సంగీతమే ప్రధానము గనుక సాహిత్యానికి జరిగే ఈ ‘అపచారాన్ని’ గురించి నేటి కాలపు ఆంధ్రాభిమానులు తప్ప త్యాగరాజుగాని, ఆయన శిష్యులుగాని బాధపడియుండినట్టు లేదు.
హిందూ వివాహవ్యవస్థలోని బోలుతనం, ఆధిపత్య భావజాలం, కోడంట్రికం, ఇంటి కోడలి సహనం, పతివ్రతాలక్షణం – నవలలో ప్రధానాంశాలు. అయితే కమలను అంతమాత్రంగానే చిత్రించివుంటే ఈ నవలలో చెప్పుకోదగ్గ విషయం ఉండేది కాదు. కమలలో ఈ ‘పవిత్ర భారతనారి’ లక్షణాలెన్ని ఉన్నా, ఆమెలో ప్రత్యేకతలున్నాయి.
మానవ జీవితం వన్ వే ట్రాఫిక్. ఒకవైపుకే మన ప్రయాణం. మనం అందరం చివరగా వెళ్ళేది ఒక చోటుకే. దార్లో ఎంతోమంది స్నేహితులూ మిత్రులూ కలుస్తారు, వస్తారు, మధ్యమార్గంలో మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ‘జీవితం అంటే ఏమిటి?’ అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే వదిలిపోయే స్నేహాలు, సహచరులు, మారిపోయే ప్రాధాన్యతలు, అనుబంధాలు… ఇదే జీవితమేమో అనిపిస్తుంది. ఇలాంటి జీవితంలో ఒంటరిగా మనం.
గ్రహణాలు అతి ప్రాచీనమైనవి, మనిషి భూమిమీద అంతరించిపోయిన తర్వాత కూడా కొనసాగేవీ. ఖగోళశాస్త్రంలో గణనీయమైన చరిత్ర ఉన్న మనం ఆ క్షేత్రంలో జరుగుతున్న పరిశోధనలను జాగ్రత్తగా గమనిస్తూ, మానవజాతి పురోగతిలో మనవంతు పాత్ర పోషించడానికి తగిన కృషిచెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇలా ఆదివారం అబిడ్స్లో పాత ఎర్రబారిన, దుమ్ముపట్టిపోయిన మార్ట్ డ్రకర్ బొమ్మల పేజీలు కాకుండా, ఒకసారి మార్కెట్లోకి మార్ట్ డ్రకర్: ఫైవ్ డికేడ్స్ ఆఫ్ హిస్ కెరీర్ అనే పేద్ద పుస్తకం వచ్చింది. బ్లాక్లో మరీ వైట్ మనీ పెట్టి ఆ పుస్తకం కొన్నా. పుస్తకం పేజీ తిప్పగానే మార్ట్ డ్రకర్ ఇంటర్యూ ఉంది. ఇలా…
అన్ని సూత్రాలనూ తుంగలో తొక్కుతున్నవి మాత్రం మొదటినుంచీ ఉల్లిగడ్డలు, టమోటాలు. వాటి ధరల్ని రాసిపెట్టడంలో కూడా అర్థం లేదు. నా జాబితా ప్రకారం వీటి ధరలు: టమోటా 2003లో 8. 2013లో 40. అంటే, రూపాయికి కిలో దాకా కిందికి పడిపోయి మళ్ళీ ఒక దశలో స్థిరపడిన ధరలు ఇవి. ఇప్పుడు వందకు మూడు కిలోలు. ట్రాలీల్లో తెచ్చేవాళ్ళయితే నాలుగు కిలోలు కూడా ఇస్తున్నారు. ఆమధ్య 20కి కూడా కిలో వచ్చింది.