నాకు తెలిసేనాటికే ఆయన కవిత్వంలో సువర్ణమేరుశిఖరాన్ని అధిరోహించి, యుగనేతగా గౌరవపదాన్ని అలంకరించినవారు. అప్పటికే గొంతు మూగపోయింది. రవీంద్రుని 1927లో కలుసుకొన్ననాటి అనుభూతులను పదేపదే నెమరువేసుకొనేవారు. కాళిదాసు, భవభూతి, షెల్లీ, కీట్సు, బైరన్, తమ తండ్రి పినతండ్రులు, రాయప్రోలు, అబ్బూరి అంటే ఉపాసనతో కూడిన ఆరాధనాభావం ఉండేది.
శీర్షికలు వ్యాసాలు
ఇవన్నీ నన్నయ్యకన్న ముందు ఆవిర్భవించినవే. ఇక మిగిలినది చమత్కార మొక్కటే. అది తెలుగువారికి దక్కింది. ‘చమత్కారచంద్రిక ద్వారా విశ్వేశ్వరుడు దానిని సాధించి మనముందు నిలిపాడు. పరిణామక్రమంలో ప్రకృతవ్యాసంలో మనం అలంకారశాస్త్రానికి తమదైన వరివస్యను అందించిన తెలుగువారి గురించి-తెలుగువారి గ్రంథాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆచార్యులవద్ద విద్యనేర్వడం స్వాతంత్ర్యానికిభంగం అందువల్ల నాకు యేవిద్యావద్దు అని అనడం అనర్థహేతువు. అజ్ఞానాపాదకం గనుక అది స్వాతంత్ర్యం గాదు.
కృష్ణశాస్త్రి కవిత్వంలో ప్రధానంగా కనిపించే భావధారలు రెండే. మాధుర్యం, దుఃఖం.
ఆ విధంగా అతడి దాంపత్యజీవితం అపహాస్యం పాలై, దుఃఖాంతమయింది. ఆమె దూరం కావడం పిరాండెలోకు జీవితకాలమంతా దుర్భరమైంది. ఆమె జ్ఞాపకాలను దూరంచేసుకోవడానికి, అతడు ఆ ఊరు కూడా వదిలి మరో చోటికి కదిలిపోయాడు.
స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాం.
పర్వ రాసిన అనుభవం నాలో ఒక కొత్తభావాన్ని కలిగించింది. నాకొక కొత్త జన్మనిచ్చింది. మన అనేక విశ్వాసాలకు మూలం రూఢే, పరంపరే, సంప్రదాయమే. వీటన్నిటిని వదిలి జీవితం చివరిలోని చావు దృష్టితో జీవితాన్ని చూస్తే కొత్త అవగాహన, జ్ఞానం పుట్టవచ్చు అనే భావం పెరిగింది.
ఇది మహాభారతాన్ని మరోసారి తమ మాటల్లో, ఆధునిక వచన రూపంలో, చెప్పడం కాదు. మహాభారతంలోని ఎన్నో సమస్యలకు హేతుబద్ధంగా సమాధానాలను వెదికి, సృజనాత్మకంగా మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేసే ప్రయత్నం ఇది. మహాభారతంలోని పౌరాణిక కల్పన (మిథ్)ను వాస్తవాన్ని విడదీసి, ఆనాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందు పునర్నిర్మించిన విద్వత్ ప్రయత్నం ఇది.
ఈ పద్యంలో భావాన్ని భారతీయతకు మరింత దగ్గరగా తేవాలంటే. “స్వర్గం” బదులు “కైలాసం” అనవచ్చు. మంచుకొండపై నేర్చిన నర్తకుడు కదా నటరాజు! ఈ పద్యంలో భావమేమిటి? అభద్రతలో స్వేచ్ఛ ఉంది. ఆనందం ఉంది. శివుని భిక్షాపాత్ర ఆహార అభద్రతకు ప్రతీక. జారుడు మంచుకొండపై నటరాజు నృత్యం, జీవితంలో అభద్రత అంతర్భాగమని సంకేతిస్తుంది. రిక్తభిక్షాపాత్రలో స్వేచ్ఛ ఉంది. జారుడుమంచుపై నృత్యంలో ఆనందం ఉంది. రవీంద్రభారతిరంగస్థలంపై దొరకని ఆనందం.
భైరప్పగారి వ్యక్తిగత అభిప్రాయాలను తీవ్రంగా విమర్శించేవారు కూడా ఆయన సృజన శక్తిని, విషయాలను లోతుగా పరిశీలించే ప్రామాణికతను, పాత్రలను విశ్లేషణాత్మకంగా చూచే విధానాన్ని కాదనలేరు. చెప్పదలచుకున్న దాన్ని ప్రామాణికంగా చెప్పే గుణం ఆయనది.
భిత్తి ఆత్మ చరిత్ర కష్టాలలో కడతేరిన వ్యక్తి సంకల్ప సిద్ధిని నిరూపిస్తుంది. “ఒక రచయితకు కలిగిన కష్టాలు ఆయనను ఒక మహోన్నత రచయితగా రూపొందించడంలో ఎంతగానో సహకరించాయి” అన్న విషయాన్ని నిరూపిస్తుంది. భిత్తి ఆత్మ కథనంగా మాత్రమే కాక అపురూపమైన కథనంతో కూడిన నవలగా అనిపిస్తుంది.
మహాభారతం అంటే దాయాదుల యుద్ధం, రాజ్యాధికారం కోసం జరిగిన యుద్ధం అనుకొంటారు. కాని, హేతుబద్ధమైన ఆలోచనలతో ఈ నవల రాసి, కొన్ని ఊహించని సత్యాల్ని వెలికి తీశారు. ఆయన వెలికి తీసిన ఎన్నో సత్యాల్లో… ప్రధానమైన ‘స్త్రీల మానసిక క్షోభ. ఆనాడు స్త్రీలు మౌనంగా ఎంతటి దుఃఖాన్ని దిగమింగుకున్నారు.
చెరువుతోనే సరిపెట్టకుండా అందరం దగ్గర్లో ఉన్న ఛోంగ్కోర్ వ్యూపాయింట్ దాకా ఎక్కాం… కానీ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. ఆ వ్యూ పాయింట్ నుంచి దూరాన గంగపూర్ణ శిఖరం, అన్నపూర్ణ 2, 3, 4 శిఖరాలు, తిలిచో శిఖరం – అన్నీ ఒకేసారి కొలువుదీరి మనసుకు పరవశం కలిగించాయి… చక్కని తేనీరు సేవిస్తూ చుట్టూ పరచుకుని ఉన్న శిఖరాలతో కబుర్లాడటం – అనూహ్యమైన అనుభవమది.
అప్పటివరకు వినోదకరమైన ప్రయోగాలకీ, భయంకరమైన పిడుగులకీ, విద్యుత్తుతో ఏదో సంబంధం ఉందనుకున్నారు కాని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో గురుత్వాకర్షణ శక్తి లాగా విద్యుత్తు కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని డేవీ నిరూపించాడు.
చలం మాట ఎత్తగానే, కొన్ని ఏనుగులు వచ్చి నుంచుంటాయి. గదంతా నిండిపోతాయి. అడ్డదిడ్డంగా. వీటిలో కనిపించేవి కొన్నైనా, కనిపించనివి ఎన్నో. ఇప్పుడీ వేదిక ముందూ ఉండే ఉంటాయి ఏనుగుల గుంపులు. ఆ ఏనుగులేమిటో మీకూ కనబడే ఉంటాయి. అవి మీ లోలోనికి చొరబడే ఉండొచ్చు. ఆ ఏనుగులు ఏమిటో మీరీపాటికి గ్రహించే ఉంటారు. పడికట్టు అభిప్రాయాలు. బిగదీసుకున్న ఛీత్కారాలు. నిగడదన్నుకున్న నిర్ధారణలు. విశృంఖలత, విచ్చలవిడితనం, చెడగొట్టే రాతలు, చెడిపోయిన పాత్రలు, ఎగుడు దిగుడు మైదానాలు.
వీరు ఒకరి సిద్ధాంతాలను మరొకరు విమర్శించి, తమ తమ సిద్ధాంతాలను సమర్థించుకున్నారు. ఇది కేవలం సైద్ధాంతిక వైరుధ్యమే తప్ప, వ్యక్తిగత దూషణ కాదు. ఈ విమర్శల ఫలితంగానే భారతీయ తత్వశాస్త్రం మరింత సుసంపన్నమైంది.
రాత్రి అనే పల్లె పడుచు వెన్నెలనే మజ్జిగని చిలికి నప్పుడు చల్ల పైన తేలిన తునకలతో చేసిన వెన్నముద్దే ఆకాశం మధ్యలో వెలిగి పోతున్న చంద్రుడట. వెన్నముద్ద కాకుండా చుట్టుపక్కల చెల్లాచెదరై మిగిలిపోయిన తుంపరలే నక్షత్రాలట.
వ్యాసుడు విషయానికి ప్రాధాన్యతనిచ్చి, మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడాన్ని మూడు శ్లోకాలలో ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్న చందంగా తేల్చేసాడు. సన్నివేశ చిత్రీకరణ ఇక్కడ జరగలేదు. పాఠకులకు లేదా శ్రోతలకు, ఈ సన్నివేశంలో ఏమి జరిగిందో తెలుస్తుంది తప్ప వారి ఊహలకు ఊతమిచ్చే వర్ణనలు, వివరాలు ఈ శ్లోకాలలో లేవు.
సమాజ సంస్కరణకు, సామాజిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసే ఊహలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇక్కడ గమనించాలి. వీరేశలింగం, గురజాడ వంటి సంస్కర్తలు వ్యవస్థలోని రుగ్మతలను సరిదిద్దాలని ప్రయత్నిస్తే, చలం ఆ వ్యవస్థ పునాదులనే ప్రశ్నించే తీవ్రమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.
బైరాగి ఆధునిక ఆర్షకవి. ఆధునికులలో ప్రాచీనుడు, ప్రాచీనులలో ఆధునికుడు. బైరాగి ఉపనిషత్తులు లోతుగా చదివాడు. కేవలం చదవడంకాదు అవి అతడి భావనలో భాగమయిపోయాయి.