ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
శీర్షికలు సంచికలు
తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ
ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.
‘ఉ’ పోతే, ఉద్భటుడంత వాడుత్తుత్తి భటుడవుతాడు. ఉపచారి పచారీ కొట్లో గుమస్తాగా చేరతాడు. మనకిక ఉగాదులూ ఉషస్సులూ ఉండవు. ఉపమానం, ఉత్ప్రేక్షలూ మాయమై, మొత్తం కవిత్వం సున్న అవుతుంది. ఉదారం దారంగా మిగులుతుంది.
వంగపండు పాటంటే వెంటనే గుర్తొచ్చేది “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా”పాట.
ఈ పాటలో “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా!” అని అడుగుతాడు కవి. ఎక్కడికీ? అంటే “శ్రీకాకుళంలో సీమకొండకి” అంటాడు. అపుడు ఎందుకూ? అనే ప్రశ్న వస్తుంది. “సిలకలు కత్తులు దులపరిస్తయట” అని అక్కడ జరుతున్న పోరాటాలను సింబాలిక్గా చెపుతాడు. శ్రీకాకుళ గిరిజన రైతుల పోరాట నేపధ్యంలో మంచి నిర్వహణ దక్షతతో రాసిన ఈ పాట తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసింది, ఉర్రుతలూగించింది.
ఈ విధంగా ఉర్దూ/హిందీ ప్రణయ భావార్ద్ర కవితలను అనువదించడం వల్ల, స్వతంత్రంగా తెలుగులో అభ్యుదయ కవులకు లేని అవకాశాన్ని పూరించుకోవడమే కాదు, ఈ కవిమల్లుడు తన కడప కత్తికి రెండువైపులా పదునేనని తన కలాన్ని కదను తొక్కించారు.
తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది.
కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి: తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు: ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని; చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడని.
ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.
కావ్య సాహిత్యం నుంచి ప్రబంధ సాహిత్యం వరకు, కాలక్రమేణా తెలుగు భాష అభివృద్ధి చెందే క్రమంలో కవులు కావ్యాలలో దృశ్యీకరణలకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. ఆదికవి నన్నయ మహాభారతం నుంచి ప్రబంధ కవి పింగళి సూరన కళాపూర్ణోదయం వరకూ, ఆ పిదప వచ్చిన కావ్యాలను గమనిస్తే ‘కథలను చెప్పే ధోరణి నుంచి, కథలను చూపించే పద్ధతి’ని కవులు ఆచరించారనిపిస్తుంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
తెల్లాపూర్లోని ఫూలే అంబేద్కర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్లో ఫిబ్రవరి 7- 8 తేదీలలో 50 మంది కొత్త తరం కవుల ‘మిలన్: వర్క్షాప్’ జరుగుతుంది.
“All History is Revisionist History” చరిత్ర అంతా పునర్-లిఖిత కథనాలేనని ఎవరో మహానుభావుడు వాక్రుచ్చాడు. నిజమే కదా? గతం అంటే ఒకప్పుడు జరిగిపోయిన […]
విస్తార గ్రహాంతర నక్షత్రాంతర ప్రాంతాలను ఇకపై విశ్వంలోని పనికిరాని ఖాళీ ప్రదేశాలుగా పరిగణించలేము; సృష్టికర్త వాటిని తన చిహ్నమైన ఏ వస్తువుతోనూ నింపలేదని అనుకోలేము. ఆ ప్రాంతాలన్నీ ఒక అద్భుతమైన మాధ్యమంతో (medium) నిండి ఉన్నాయి. జ్యేష్టానక్షత్రంలో (dog-star) ఓ అణువు కంపిస్తే, ఆ కంపనాలని ఈ మాధ్యమం తనలో మూడేళ్ళపాటు ఉంచుకొని వాటినన్నిటినీ క్రమం తప్పకుండా భూమ్మీద స్పెక్ట్రోస్కోప్కి చేరవేస్తుంది.
అంతు దొరక్క గిలగిలా కొట్టుకోవడం అన్నది మానవ మాత్రులుగా మన ఆఖరి ప్రతిస్పందన. అప్పుడు దేవుడు మందహాసం చేస్తాడు. ఒక చిన్న క్లూ విసిరి చూస్తాడు. వీడు దీన్ని పట్టుకోగలుగుతాడా అని సరదాగా పైనుండి వేడుక చూస్తాడు.
ప్రతీ ఒక్క మనిషీ తనకి ప్రతీ ఒక్క విషయమూ సరిగానే అర్ధం అయిపోతోంది అని అనుకుంటాడు. అది కరెక్టా, కాదా అనే విషయం రాబోయే కాలం మాత్రమే చెబుతుంది. అనుకున్న సమయంలో మాత్రం ఎటువంటి రుజువులూ దొరకవు. కానీ, ఆ మనిషి అర్ధం చేసుకునేది ఎప్పుడూ, ఆ మనిషి చైతన్య స్థాయి మీదే ఆధారపడి వుంటుంది.
రొండేళ్లగా నా బుర్రలో తిరగతా వుండాడు గూనోడు. వోణ్ణి కతగా మార్చాలని ఆరేడు నెల్లగా తపన పడతా వుండా. కుదరడం ల్యా. … అయినా నా పిచ్చిగానీ, వోడి బతుకులో కై గట్టాల్సినంత కతేడ వుండాది… దోసిడు కన్నీళ్ళు దప్ప!
హిమాలయాలు మరోసారి పిలుస్తున్నట్టు అనిపించసాగింది. ‘పద, ఇంకోసారి వెళ్ళివద్దాం’ అంటూ మనసు తట్టి లేపసాగింది. బుద్ధి కూడా ‘మనసు చెప్పిన మాట విను’ అని హితవు పలకసాగింది.
సంగ సాహిత్యం మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది –- కాలం మారినా, మనిషి హృదయం మారదు. దాని సంవేదనలు మారవు. ప్రేమ, బాధ, ధైర్యం, దయ, కరుణ – ఇవన్నీ శాశ్వతమైనవి. ఈ కారణంగానే, రెండువేల ఏళ్ల తరువాత కూడా, సంగ కవిత్వం మనల్ని కదిలిస్తుంది.
జీవితంలో నిజానిజాలుగాని, తప్పొప్పులుగాని ఋజువు చేయగలిగినవి కావు. ప్రేమ ఎప్పుడు ప్రేమ, ఎప్పుడు హింస కూడా ఋజువుకాదు. అంతేకాదు, ఋజువు చేయవలసినవి కూడా కావు. అనుమానపిశాచాలను తరిమేసి, స్వార్ధం కొంత మానుకుని బతకడం సరైన మార్గం.