ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.
చంద్ర మోహన్
చంద్ర మోహన్ రచనలు
వెదురుపొదలే కంచెలుగా, ఎక్కడ
పనసచెట్ల వేర్లపై పళ్ళు విరగ కాస్తాయో
ఆ కొండవాలు ప్రాంతపు యువకుడా, నువ్వు సరైన పని చేయి!
ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొండవాలున
చెట్టు సన్నని కొమ్మకు వేలాడే పెద్ద పనసపండు లాగ,
ఆ పిల్లది చిన్ని ప్రాణం! ఐతే నీపై ఆమెకున్న ప్రేమయో? ఎంతో పెద్దది!
సంగ సాహిత్యం మనకు ఒక విషయం గుర్తుచేస్తుంది –- కాలం మారినా, మనిషి హృదయం మారదు. దాని సంవేదనలు మారవు. ప్రేమ, బాధ, ధైర్యం, దయ, కరుణ – ఇవన్నీ శాశ్వతమైనవి. ఈ కారణంగానే, రెండువేల ఏళ్ల తరువాత కూడా, సంగ కవిత్వం మనల్ని కదిలిస్తుంది.
“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”
వచ్చే అతిథులు అసమాన ధీరులైన కురువీరులు. అంతే కాదు, వారికంటూ ప్రత్యేకమైన రుచులు కూడా ఉన్నాయి. అందువల్ల పాకశాసనుడు పాకశాలాధిపతిని పిలిపించి పాండవకౌరవాదులలో ఎవరెవరికి ఏయే వంటకాలు వడ్డించాలో ఎవరికేది వడ్డించకూడదో చాలా వివరంగా చెప్పాడు. ఏమైనా తేడాలు వస్తే నరకానికి పంపేస్తానని హెచ్చరించాడు కూడా. అన్నీ జాగ్రత్తగా విన్న వంటపెద్దకి బెంగ పట్టుకుంది. ఇంద్రుడు చెప్పిన వివరాలన్నీ గుర్తుపెట్టుకొనడం ఎలా?