నా కవిత్వం, ముఖ్యంగా ‘ఆకాశం’ మొదలుపెట్టి, నన్ను నేను కన్విన్స్ చేసుకునే ప్రయత్నం – జీవితాన్నీ, మనుషుల్నీ, నన్నూ ప్రేమించటానికి, మరింత లోతుగా గ్రహించటానికి. చాలాసార్లు జీవించి ఉండటానికి నన్ను నేను ఒప్పించుకునే ప్రయత్నం కూడా.
శీర్షికలు సంచికలు
అవసరాల అడ్వర్టైజ్మెంట్లలో పడి,
భావ దారిద్య్రపు టోపోగ్రఫీలో దాహంతో ఎండిపోయావు.
రియాలిటీ ఫిల్టర్ను కోల్పోయిన శూన్యంలో మిగిలిపోయావు.
ప్రపంచమంటే
సహాయకుల గుంపు
పనివాళ్ల వరుస
పటాల్లో గోడమీద
అతుక్కుపోయిన
దైవానుగ్రహం
పలుకునో, వివరణమునో, ప్రశ్ననో మ
లచి, ప్రియజిగీష విడుచుట ప్రణయమునకు
ప్రకటరూపము కాబోదు; లలితమైన
హృదయభూమిక స్పందించి కదలనపుడు.
ఫలితం ఏదైనా సరే, స్వేచ్ఛ బరువైతే అవ్వనీ.
అదొక యుద్ధం గెలిచిన గాయం.
పరాయి పట్టుపరుపుల మీద
సేదతీరడం కన్నా,
స్వయంకృత గాయాన్ని
గర్వంగా తాకడమే నాకు హాయి!
అయితే అందరూ తెలుగే మాట్లాడుతారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటానికి డిక్ష్నరీలు మోసుకెళ్ళక్కర లేదు. ఉచ్చారణకి ప్రమాణాలు వుండటం మంచిదేననుకోండి. కానీ అది కొండని తవ్వి ఎలుకను పట్టేటయితే, శుద్దదండగ.
ప్రకృతి శక్తులతో మానవమాత్రుల మల్లయుద్ధం మళ్ళా మొదలైంది! పరాజయాన్ని నిరసిస్తూ, ఇనుమడించిన సంకల్ప శుద్ధితో, సముద్రంతో, సుడిగాలిలో పది రోజులు నిరాఘాటంగా పోరాడారు.
ఖగోళం కచ్చితమైన శాస్త్రం. ప్రసంగవశాత్తుగానీ ఉద్దేశపూర్వకంగాగానీ కొన్ని ఖగోళవిషయాలను ప్రస్తావించినపుడు, లేదా నమోదు చేసినపుడు, ఆ ఖగోళవిషయాలు ఎప్పుడు జరిగేవన్నది, ఎక్కడ జరిగేవన్నది కచ్చితంగా కాలంలో వెనక్కి వెళ్ళి నిర్ణయించవచ్చు.
సరళ జీవనపు కల మంకుతిమ్మని మనసు
సరస ఋత సౌజన్య శాంతి శోభనము
సరసి తెరలేచి తుంపర చినుకులను చల్లి
మరల సరసిని జేరు – మంకుతిమ్మ
పూజ్యులైన డి.వి.గుండప్పగారి ఈ గ్రంథము ’మంకుతిమ్మని మిణుకు’ అనే ఆంధ్రానువాదానికి మూలమైన ’మంకుతిమ్మన కగ్గ’కు రెండవభాగము. ఈ రెండవ భాగం ప్రకటమైనది 1984లో, డి.వి.జి గారు గతించిన తొమ్మిది సంవత్సరాల తరువాత.
పదిహేనవ శతాబ్దంలోని పోతనకు కెమెరాల గురించి, డ్రోనుల గురించి తెలిసే అవకాశంలేదు. కానీ తన ఊహలను కవిత్వంలోకి తర్జుమా చేసేటప్పుడు, చాలా జాగ్రత్తగా ప్రతి చిన్న వివరాన్ని పద్యంలో ఇమిడ్చి, కవిగా తాను ఏమి భావనలు చేసాడో ఆ భావనలు పాఠక/శ్రోతల మనోనేత్రం ముందు సాక్షాత్కరించేలా పద్యాలను నిర్మించాడు. కవికి చెప్పదలచుకున్న అంశం ఎంత ముఖ్యమో, ఎలా చెప్పాలన్నది కూడా అంతే ముఖ్యం. అప్పుడే కావ్య ప్రయోజనం సిద్ధిస్తుంది.
ఇవన్నీ తెలిసిన పదాలే, తెలిసిన అర్థాలే. కానీ వాటిని సంయోజనం చేయడంలోనే ఉంది కవి ప్రత్యేకత. తెలిసిన పదాల సంయోజనంలోనే మాంత్రికత ఉంది. ఈ పదాల సంయోజనంలోనుండి చాలా శక్తిని తీసుకురావడం ప్రతిభావంతుడైన కవి చేయగలడు. అటువంటి అరుదైన కవి రవిశంకర్.
భార్గవి చెప్పిన తన చదువు కథలో కేవలం ఒక చదువరిగా మొదలైన ఆమె ప్రయాణం మాత్రమే కాక ఉత్తమ సాహిత్య ప్రేమికురాలిగా, విశ్లేషకురాలిగా ఎదిగిన క్రమాన్ని గమనించవచ్చు.
స్వర్గీయ పీచర సునీతారావు పేరుతో ఈ సంవత్సరం యథాక్రమంగా ఐదవ వార్షిక పురస్కారాలకోసం పీచర సునీతారావు ఫౌండేషన్ కవిత్వం, కథలు, విమర్శ అనే మూడు సాహితీ విభాగాలకు సంపుటులను ఆహ్వానిస్తున్నది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ!
కేంద్ర సాహిత్య అకాడమీ 2025 సంవత్సరానికిగాను, తెలుగులో బాలసాహిత్య పురస్కారాన్ని ప్రముఖ రచయిత గంగిశెట్టి శివకుమార్ గారి ‘కబుర్ల దేవత’ అనే కథా సంపుటికి […]
ప్రపంచ నలుమూలలకూ వెలుగునిచ్చిందీ, అనేక పరిశ్రమలకు ఆయువుపట్టు అయినదీ, ఆవిరి యంత్రాలతోనో మహాజలపాతాలతోనో ఘనమైన చక్రాలను తిప్పి పుట్టించే విద్యుత్తే. ఆ పుట్టుకకి ఆధారం ఫారడే కనుగొన్న డైనమో.
నన్ను వ్యక్తిగతంగా ‘నువ్వు ఏ ట్రెక్ను ఎక్కువగా ఇష్టపడ్డావు’ అని అడిగితే ఖచ్చితంగా ఇదీ అని చెప్పలేను. దేని ప్రత్యేకత దానిది. కానీ నాకు అన్నపూర్ణ ట్రెక్ను సమన్వయం చెయ్యడం ఎవరెస్ట్కన్నా పెద్ద సవాలుగా నిలిచిందని చెప్పుకోవాలి.
ఆ యిద్దరిలో ఒకరికి అదృష్టవశాత్తు మతిపోయింది, మరొకరు శాయశక్తులా ఆ పిచ్చిని కాపాడుతున్నారు. ఎవరికి పిచ్చి, ఆ పిచ్చిని పోషిస్తున్నది ఎవరు అని మాత్రం చెప్పడం దుస్సాధ్యం.
ఎప్పటికీ
వెలుగు చూడకుండా
రాత్రి రథం మీద
సూర్యుడుండని చోటుకి
వెళ్ళిపోవాలని ఉంది