ప్రత్యేక కంఠస్వరం ఆలూరి బైరాగిది. అది దేనికీ అనుకరణప్రాయం కాదు. ఆత్మవేదనను, ప్రపంచ బాధను సమానంగా పలికించిన కంఠస్వరం. ఆశ, నిరాశల అపురూప సమ్మేళనం. నిష్కల్మషమైన, ఆర్ద్రమైన, ప్రేమపూర్వకమైన, గాద్గదికమైన గొంతు.
పాపినేని శివశంకర్
జీవిత విశేషాలు
పాపినేని శివశంకర్ ఆధునిక తెలుగు కవిత్వ ప్రపంచంలోని అగ్రశ్రేణి కవులలో ఒకరు. ఆయన కథకులు, విమర్శకులు కూడా. సాహితీ త్రిముఖుడుగా ప్రసిద్ధిగాంచారు. పాపినేని శివశంకర్ 6 నవంబర్ 1953న గుంటూరు జిల్లా నెక్కల్లులో జన్మించారు. రెండు కథాసంపుటాలు, ఐదు కవితా సంకలనాలు, మూడు వ్యాససంపుటాలు, ఒక పరిశోధనా గ్రంథం, తల్లీ నిన్ను దలంచి పద్యపరిచయ గ్రంథం ప్రచురించారు. రజనీగంధ కవితాసంపుటానికి 2016లో కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణ చేసి గుంటూరులో నివాసం చేస్తున్నారు. ఆలోచనల, అనుభూతుల మేళవింపు శివశంకర్ కవిత్వం. అందులోని తాత్త్వికమైన లోతులు చదువరులను ఆలోచింపజేస్తాయి.
పాపినేని శివశంకర్ రచనలు
రెండు ప్రత్యేకాంశాలు బైరాగి కవిత్వంలో కానవస్తాయి. ఒకటి, అతని పద — సమాస — వాక్య నిర్మాణ శైలి. రెండు, ఆశ్చర్యకరమైన కల్పనాశక్తి. భాషలోని శబ్దాలు తన వ్యక్తీకరణకి చాలనప్పుడు ప్రతి గొప్ప కవీ తన భాషాసంపద (diction) తాను సృష్టించుకుంటాడు. అందుకు బైరాగి కవితే ఉదాహరణ.
ఏది రాశాడో అదే చలం. ఏది నమ్మాడో అదే అతను రాశాడు. ఏది రాశాడో అదే అతను చెప్పాడు. అంటే ఏ దశలో గానీ, ఏది రాశాడో దానినుంచి ముఖ్యంగా వైమనస్యం గానీ, వైముఖ్యం గానీ, చలానికి సంబంధించినంత వరకు ఏదీ మనకు కనపడదు. వర్తమాన కాలంలో తద్విరుద్ధమైన రచయితలు చాలామంది ఉంటారు. ఆ తీరుగా చలం ‘ఆత్మలోకంలో దివాలా’ తీయలేదు.
అతడు తనువంతా అశ్రుకణమయ్యాడు
విలపించాడు విలవిల్లాడాడు
చిగురుటాకులా కంపించిపోయాడు
వేయి దేవుళ్ళను వేడుకొన్నాడు
అదే ప్రేమతో అదే ఇష్టంతో
ఆమె చేతిని తాకాడు
నది ఒడ్డునే నువ్వు పరిగెత్తి పరిగెత్తి
రొప్పుతూ ఆగిపోతావు
ప్రాణం కడగట్టుతుంది
అందీ అందకుండా అది సాగిపోతుంది
దాహం తీరదు
తపన ఆగదు
సాహిత్యం జీవితాన్ని ఉన్నతీకరిస్తుంది. విమర్శ సాహిత్యాన్ని ఉన్నతీకరిస్తుంది. పొరలు పొరలుగా, గజిబిజిగా, గందరగోళంగా, సంక్లిష్టంగా ఉన్న మానవజీవితాన్ని సాహిత్యం వడకట్టి, దాని సారాంశం తేటతెల్లం చేస్తుంది. అటువంటి సాహిత్యాన్ని పరిశీలించి, శోధించి, తాలు తప్ప వేరు చేసి, విలువ కట్టి, అందులో ఉత్తమమైనదేదో వెలికితీస్తుంది విమర్శ. (డీటీఎల్సీవారు ప్రచురించిన తెలుగు విమర్శ: కొన్ని ఆలోచనలు అన్న సంకలనం నుంచి పునర్ముద్రణ.)
మేఘం మనిషైతే ఎంత బాగుండును
నాలుగు మాటలు చల్లగా విన్పించేది
మనిషైనా మేఘమైతే బాగుండును
వేచిన ఏ మనసుపైనో పన్నీటి జల్లు కురిసేది
అమూర్తత సినారె కవిత్వంలో ప్రధాన లక్షణం. నిర్దిష్ట సంఘటనలకి, ఉద్యమాలకి ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు అరుదు. నిర్దిష్టతను గుర్తించి స్పందించాల్సిన సందర్భాల్లోనూ ఆయన అమూర్త వ్యక్తీకరణనే ఆశ్రయించాడు. భావ సంయమనం పాటించాడు. ఆయనది పెద్దమనిషి తరహా కవిత్వం. ఆయన కవుల్లో లౌక్యుడు. లౌక్యుల్లో కవి.
ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?